హైదరాబాద్: సీఎం కేసీఆర్ ప్రభుత్వ వైఫల్యాలపై త్వరలో పాదయాత్ర చేస్తానని నల్గొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వెల్లడించారు. పీసీసీకి సంబంధం లేకుండా కాంగ్రెస్ నేత హోదాలోనే పాదయాత్ర చేపడుతానని స్పష్టం చేశారు. ఏఐసీసీ నుంచి అనుమతి వచ్చిన వెంటనే యాత్ర ప్రారంభిస్తానని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వానికి ముందు చూపు లేదని, ఈ విషయంలో సీఎం కేసీఆర్ సిగ్గు పడాలని ఎమ్మెల్యే కోమటి రెడ్డి వ్యాఖ్యానించారు. సుమారు 540 గ్రామాలకు మంచి నీరందించే ఉదయసముద్రం ఎండిపోతోందని అధికారులకు, మంత్రి హరీష్రావుకు చెప్పినా పట్టించుకోవటం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
తాగు నీరందక ప్రజలు రోడ్డెక్కితే ప్రభుత్వమే బాధ్యత వహించాలని ఆయన అన్నారు. జిల్లాకు ఫ్లోరైడ్ నీరందిస్తున్న ఘనత సీఎందేనని ఎద్దేవా చేశారు. మంచినీరందించే విషయంలో కృష్ణా బోర్డును కూడా సీఎం ఒప్పించలేకకపోతున్నారని విమర్శించారు. గ్రామ పంచాయతీలకు వచ్చే కేంద్ర నిధులను తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం జీవో విడుదల చేసిందని, సర్పంచులు తిరగబడకముందే ఆ జీవోను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. సర్కారు కులాల వారీగా రాష్ట్రాన్ని విడగొడుతోందని ఆరోపించారు. నల్గొండ జిల్లాకు మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉన్నా లేనట్లేనని ఎద్దేవా చేశారు.
‘పీసీసీకి సంబంధం లేకుండా పాదయాత్ర చేస్తా’
Published Wed, Jul 12 2017 2:29 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement