సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో వివిధ వృత్తి, సాంకేతిక విద్యాకోర్సుల్లో చేరే విద్యార్థులకు మరింత సౌలభ్యం కల్పించేందుకు సాంకేతిక విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇప్పటివరకు విద్యార్థులు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం తమ ర్యాంకు ప్రకారం కేటాయించిన హెల్ప్లైన్ కేంద్రానికి వెళ్లి చేయించుకోవాల్సి వచ్చేది. ఇందుకోసం ఒక్కోసారి ఎక్కువ దూరం వెళ్లాల్సి వచ్చేది. ఇకపై అలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు చేపట్టాలని సాంకేతిక విద్యాశాఖ నిర్ణయించింది. విద్యార్థులు తమకు అందుబాటులో ఉన్న హెల్ప్లైన్ కేంద్రానికి వెళ్లి, తమకు నచ్చిన తేదీల్లో, వీలైన సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకునేలా చర్యలు చేపట్టింది. ఇందుకు స్లాట్ బుకింగ్ విధానం అమల్లోకి తేనుంది. శుక్రవారం సాంకేతిక విద్యా కమిషనర్ నవీన్ మిట్టల్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఈ నిర్ణయం తీసుకుంది.
ఈ విధానాన్ని అన్ని వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ల్లో అమలు చేయాలని నిర్ణయించింది. ప్రవేశాల షెడ్యూల్ ప్రకటించాక నిర్ణీత తేదీల్లో ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ నిర్వహిస్తారు. అయితే ఇందులో ప్రతి గంటను ఒక స్లాట్గా విభజిస్తారు. విద్యార్థులు అందులో ఏదో ఒక రోజులో వీలైన ఏదో ఒక సమ యాన్ని ఫీజు చెల్లించాక స్లాట్ బుక్ చేసుకోవాలి. ఈ క్రమంలో విద్యార్థి ఆన్లైన్లో హెల్ప్లైన్ కేంద్రాన్ని, సమయాన్ని ఎంచుకోవాలి. అలా స్లాట్ బుక్ చేసు కున్న విద్యార్థి సంబంధిత హెల్ప్లైన్ సెంటర్కు నిర్ణీత సమయంలో వెళ్లి తమ వెరిఫికేషన్ చేయించుకోవాలి. ఆ తర్వాత వెబ్ ఆప్షన్లు ఇచ్చుకోవాలి.
పాలిసెట్ కౌన్సెలింగ్ నుంచి ప్రారంభం
ఈ నెల 14 నుంచి ప్రారంభం కానున్న పాలిటెక్నిక్ కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ నుంచి దీనిని అమల్లోకి తీసుకువస్తోంది. విద్యార్థి ఒకవేళ నిర్ణీత సమయంలో సర్టిఫికెట్ల వెరిఫికేషన్కు హాజరుకాని పరిస్థితి ఉంటే ప్రవేశాల కమిటీకి మెయిల్ ఐడీకి మెయిల్ చేస్తే అతనికి తర్వాత వెరిఫికేషన్ చేపట్టేలా ఏర్పాట్లు చేస్తామని ప్రవేశాల క్యాంపు అధికారి శ్రీనివాస్ తెలిపారు. దీన్ని పాలిసెట్కే కాకుండా ఎంసెట్, ఈసెట్ వంటి ఇతర వృత్తి, సాంకేతిక విద్యా కోర్సుల ప్రవేశాల కౌన్సెలింగ్ల్లోనూ అమలు చేయనున్నట్లు వివరించారు.
కోరుకున్న చోట సర్టిఫికెట్ల వెరిఫికేషన్
Published Sat, May 11 2019 1:44 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోలవరంపై అమిత్ షాకు సజ్జల స్ట్రాంగ్ కౌంటర్
'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
రాణించిన జడేజా.. పంజాబ్ కింగ్స్ టార్గెట్ ఎంతంటే?
బీజేపీ ‘ప్యూన్’ విమర్శలు.. కిశోరి లాల్ శర్మ కౌంటర్
అలాంటి కార్లను ఇష్టపడే వ్యక్తుల్లో శాడిజం ఎక్కువగా ఉంటుందట!
వరల్డ్కప్ సెలక్టయ్యాడు.. వరుసగా రెండో మ్యాచ్లో గోల్డెన్ డక్
Best Pictures Of The Day : ఈ రోజు ఉత్తమ చిత్రాలు (05-05-2024)
సైబర్ మోసం.. తెలిసి మరీ లక్షలు పోగొట్టుకున్న నటుడి భార్య
స్కూల్లో బెత్తం దెబ్బలు తిన్నా: సుప్రీం చీఫ్ జస్టిస్
చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
తప్పక చదవండి
- 'ఆ ఒక్కటి అడక్కు' రెండో రోజు వసూళ్లు.. మొత్తం ఎంతంటే?
- చీర కామెంట్స్... సీఎం రేవంత్కు కేటీఆర్ స్ట్రాంగ్ కౌంటర్
- ప్రపంచంలోనే అత్యంత కఠినమైన వంటకం! ఎలా చేస్తారంటే..?
- పేరుకు స్వతంత్రులు.. టీడీపీతో చెట్టాపట్టాలు!
- ప్రియుడితో బ్రేకప్ చేసుకున్న లైగర్ భామ!
- ల్యాండ్ టైట్లింగ్ యాక్ట్: టీడీపీపై బీజేపీ నేత కీలక వ్యాఖ్యలు
- IPL 2024 GT VS RCB: విరాట్ ఖాతాలో భారీ రికార్డులు.. తొలి భారత క్రికెటర్గా..!
- వెన్నులో వణుకు పుట్టించే 'ది కంజూరింగ్'..!
- బ్రెజిల్ భారీ వర్షాల్లో 57కు మృతుల సంఖ్య.. 67 మంది గల్లంతు!
- ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
Advertisement