దేవేందర్‌గౌడ్‌కు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆహ్వానం

Bhatti Vikramarka Meet Devender Goud In Rangareddy - Sakshi

సాక్షి, రంగారెడ్డి : టీడీపీ సీనియర్‌ నేత తూళ్ల దేవేందర్‌గౌడ్‌కు కాంగ్రెస్‌ పార్టీ నుంచి ఆహ్వానం అందింది. సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మేడ్చల్‌ మాజీ ఎమ్మెల్యే కిచ్చన్నగారి లక్ష్మారెడ్డి ఆయనను నగరంలోని తన నివాసంలో కలిశారు. తాజా రాజకీయ పరిస్థితులపై వారు సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ పార్టీలోకి రావాలంటూ దేవేందర్‌గౌడ్‌ను భట్టి ఆహ్వానించారు. కాగా, ఇప్పటికే బీజేపీ వైపు చూస్తున్న దేవేందర్‌గౌడ్‌.. వారి ఆహ్వానంపై ఎటూ తేల్చుకోలేదని విశ్వసనీయ సమాచారం. 

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top