'ఆకుల లలిత గెలుపు ఖాయం' | Sakshi
Sakshi News home page

'ఆకుల లలిత గెలుపు ఖాయం'

Published Fri, May 29 2015 12:02 PM

'ఆకుల లలిత గెలుపు ఖాయం' - Sakshi

హైదరాబాద్ : కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీగా ఆకుల లలిత గెలవడం ఖాయమని టీపీసీసీ చీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి జోస్యం చెప్పారు. శుక్రవారంఉత్తమ్ కుమార్ రెడ్డి హైదరాబాద్లో మాట్లాడుతూ... టీఆర్ఎస్ ప్రభుత్వం మహిళలను గౌరవించడం లేదని ఆరోపించారు. అందుకు కేసీఆర్ మంత్రి వర్గంలో ఒక్క మహిళ కూడా లేక పోవడమే అందుకు నిదర్శనమన్నారు. డ్వాక్రా మహిళల గ్రూపులను కూడా కేసీఆర్ సర్కార్ పట్టించుకోవడం లేదని ఉత్తమ్ కుమార్ ఈ సందర్భంగా గుర్తు చేశారు.
 

Advertisement
Advertisement