స్కార్పియో బోల్తా : ఒకరి మృతి | 1 died in road accident at bhuvanagiri | Sakshi
Sakshi News home page

స్కార్పియో బోల్తా : ఒకరి మృతి

May 13 2015 9:16 AM | Updated on Aug 30 2018 3:56 PM

నల్గొండ జిల్లా భువనగిరి శివారులోని పఠాన్‌చెరు స్పిన్నింగ్ మిల్లువద్ద స్కార్పియో బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందాడు.

నల్గొండ: నల్గొండ జిల్లా భువనగిరి శివారులోని పఠాన్‌చెరు స్పిన్నింగ్ మిల్లువద్ద స్కార్పియో బోల్తాపడి ఓ యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన బుధవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలు...వరంగల్ నుంచి హైదరాబాద్ వెళుతున్న స్కార్పియో బోల్తాపడి అందులో ప్రయాణిస్తున్న హైదరాబాద్ టోలీచౌకీకి చెందిన దస్తగిరి (30) అనే యువకుడు అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ప్రమాదంతో మరో ఇద్దరు గాయపడ్డారు. భువనగిరి పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, కేసు దర్యాప్తు చేస్తున్నారు.
(భువనగిరి అర్బన్)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement