breaking news
-
మాధవీలత ఓడిపోలేదు.. చిత్తుగా ఓడించిందెవరు?
లోక్సభ ఎన్నికల్లో తెలంగాణపై ఢిల్లీ పెద్దలు పెట్టిన ఫోకస్ మొత్తానికి ఫలించింది. 17 లోక్సభ స్థానాల్లో బీజేపీ ఎనిమిది సీట్లలో గెలుపొంది తన విజయం శాతాన్ని మెరుగుపర్చుకుంది. అయితే గెలుపు సంగతి పక్కనపెడితే హాట్ టాపిక్గా మారిన హైదరాబాద్ ఎంపీ సీటులో మాత్రం ఘోర ఓటమిని చవిచూసింది.ఎంఐఎం కంచుకోట అయిన హైదరాబాద్ పార్లమెంట్ స్థానాన్ని దక్కించుకునేందుకు బీజేపీ పెద్ద ప్లానే చేసింది. హైదరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి బీజేపీ అభ్యర్థిగా కొంపెళ్ల మాధవీలతను ఎంచుకుంది. తద్వారా ఎంఐఎం అడ్డాలో నారీశక్తిని అస్త్రంగా ప్రయోగించినట్లు సంకేతాలు పంపింది. కానీ, ఆ వ్యూహం కాషాయ పార్టీకి ప్రతికూలంగా మారరి బెడిసి కొట్టింది. విరించి హాస్పిటల్స్ ఛైర్ పర్సన్గా ఉన్న మాధవీలత.. హిందుత్వ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటారు. హిందుత్వం, భారతీయ సంస్కృతిపై అనర్గళంగా మాట్లాడగలిగే మాధవీలత.. రెండేళ్లుగా పాతబస్తీ వేదికగా గోశాలతో పాటు భారీ యజ్ఞశాల ఏర్పాటు చేసి హిందూ వైదిక కార్యక్రమాలు సైతం నిర్వహించారు. వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుని.. పాతబస్తీలో కాషాయ జెండా ఎగరేయాలన్న లక్ష్యంతో మాధవీలతను బీజేపీ అధిష్ఠానం బరిలోకి దింపింది.ఇక అభ్యర్థిగా ప్రకటించిన నాటి నుంచే మాధవీలత మీడియాకు ఎక్కడం ప్రారంభించారు. పతంగి పార్టీని లక్ష్యంగా చేసుకుని ఆమె చిత్రవిచిత్రమైన చేష్టలకు దిగారు. ఆ విన్యాసాలతో సోషల్ మీడియాకు ఎక్కిన ఆమెపై విపరీతమైన ట్రోలింగ్ కూడా నడిచింది. ఇదంతా ఓటర్లకు చిరాకు తెప్పించింది. ఇదంతా ఒక ఎత్తు అయితే హిందుత్వ ఎజెండాతో సాగిన ఆమె ప్రచారంలో నగరంలోని ఏకైక బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ను భాగం చేయకపోవడమూ పెద్ద మైనస్గా మారింది. మరోవైపు పోలింగ్ టైంలో హిజాబ్లు తొలగించి మరీ ఓటర్లను పరిశీలించడం జాతీయ మీడియాకు ఎక్కి.. వివాదాస్పదంగా మారింది కూడా.కర్ణుడి చావుకి సవాలక్ష కారణాలు అన్నట్లు.. మొత్తంగా ఎన్నికల వేళ ఆమె చేసిన హడావుడి ఏమాత్రం సహకరించకపోగా, బీజేపీ అభ్యర్థి హోదాతో నవ్వుల పాలు అయ్యిందనేది విశ్లేషకుల మాట.హైదరాబాద్ ఎంపీగా ఎంఐఎం అధినేత, అసదుద్దీన్ ఒవైసీ 3.35 లక్షల భారీ మెజారిటీతో మాధవీలతపై ఘనవిజయం సాధించారు. -
మల్కాజిగిరిలో ఈటల ఘన విజయం
మల్కాజిగిరి: మల్కాజిగిరిలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్.. కాంగ్రెస్ అభ్యర్థి సునితా మహేందర్రెడ్డిపై 3.86 ఓట్ల మెజార్టీతో ఘన విజయం సాధించారు. మొదటి రౌండ్ నుంచి ఈటల స్పష్టమైన ఆధిక్యం కనబరిచారు. దీంతో కాంగ్రెస్ పార్టీ.. సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింంది. గత ఎన్నికల్లో స్థానంలో ప్రస్తుతం సీఎం రేవంత్ రెడ్డి గెలుపొందిన విషయం తెలిసిందే. -
మహబూబ్నగర్: హోరా హోరీ లెక్కింపులో డీకే అరుణ విజయం
మహబూబ్నగర్: హోరా హోరీగా సాగిన ఓట్ల లెక్కింపులో మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. అధికారికంగా ఫలితాలు వెలువడవలసి ఉంది. ఇక్కడ గెలుపునకు సీఎం రేవంత్రెడ్డి ప్రతిష్టాత్మంగా తీసుకుని చల్లా వంశీచంద్రెడ్డిని కాంగ్రెస్ తరఫున బరిలో దించారు. అయితే లెక్కింపు సమయంలో డీకే. అరుణ, వంశీచంద్ మధ్య విజయం దోబూచులాడింది. ఈవీఎం లెక్కింపుల్లో ఆమె కేవలం 1800 ఓట్ల ముందంజలో ఉన్నారు. అనంతరం పోస్టల్ బ్యాలెట్ ఓట్లు 8000 లెక్కింపునకు ఉండేసరికి బీజేపీ శ్రేణుల్లో కొంత టెన్షన్ నెలకొంది. ఎట్టకేలకు హోరాహోరీగా సాగిన లెక్కింపులో 3636 ఓట్ల మెజార్టీతో డీకే అరుణను విజయం వరించింది. -
జీరో బీఆర్ఎస్.. ఆ మూడు అంశాలే దెబ్బ కొట్టినయా?
మూడు ఎనిమిది అయ్యింది. నాలుగు రెట్టింపయ్యింది. తెలంగాణ లోక్సభ ఫలితాల్లో 8 సీట్లు కైవసం చేసుకుని కాంగ్రెస్ సత్తా చాటింది. మరోవైపు బీజేపీ అనూహ్యంగా పుంజుకుని ఏకంగా ఎనిమిది స్థానాలను కైవసం చేసుకుంది. ఫలితాల్లో ఆద్యంతం అధికార కాంగ్రెస్తోనే కాషాయం పార్టీకి పోటీ నడిచింది. ఈ క్రమంలో ప్రతిపక్ష బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితమైంది.తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీది ఘోరమైన పరిస్థితి. మెదక్ సీటులో.. అదీ కొద్దిసేపు మాత్రమే ఆ పార్టీ అభ్యర్థి ఆధిక్యంలో దూసుకుపోయినట్లు కనిపించినా ఓటమి తప్పలేదు. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో దక్కిన విజయం స్ఫూర్తితో.. లోక్సభ ఎన్నికల్లోనూ కాంగ్రెస్ పార్టీ సత్తా చాటింది. గత ఎన్నికల్లో మూడు స్థానాలను మాత్రమే గెల్చుకున్న హస్తం పార్టీ.. ఈసారి ఏకంగా ఎనిమిది స్థానాల్లో, అదీ భారీ మెజారిటీతో అభ్యర్థుల్ని గెలిపించుకోలిగింది. ఇక గులాబీ పార్టీ తొమ్మిది నుంచి జీరోకి పడిపోయి ఘోరమైన ఫలితం చవిచూసింది. బీఆర్ఎస్ నుంచి ఐదు స్థానాలను కాంగ్రెస్ గెల్చుకోగా.. మిగిలిన నాలిగింటిని బీజేపీ దక్కించుకుంది. ఎంఐఎం హైదరాబాద్ సీటును నిలబెట్టుకుంది.👉 అసెంబ్లీ ఎన్నికల ఓటమి తర్వాత.. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఆ సమయంలో గులాబీ పార్టీలో నాయకత్వ లోపం కనిపించింది. కాంగ్రెస్ను టార్గెట్ చేసుకుని విమర్శల పర్వమే కొనసాగింది తప్ప కేడర్ను బలపర్చుకోవాలనే ప్రయత్నమూ కనిపించలేదు.👉 లోక్సభ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్పైనే బీఆర్ఎస్ విమర్శలు కనిపించాయి. బీజేపీపై అసలు విమర్శలు గుప్పించకపోవడం కూడా మైనస్ అయ్యింది. లిక్కర్ కేసులో కవిత అరెస్ట్.. తదనంతర పరిణామాల నడుమ లోపాయికారి ఒప్పందంలో భాగంగానే బీఆర్ఎస్ ఇలా చేస్తోందని కాంగ్రెస్ ఆరోపణలకు దిగింది. అంతేకాదు దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలోనూ కాంగ్రెస్ సక్సెస్ అయ్యింది.👉 సరిగ్గా ఎన్నికల ముందే బీఆర్ఎస్కు జంప్ జిలానీలు తలపోటుగా పరిణమించారు. దీంతో.. బీఆర్ఎస్కు సరైన అభ్యర్థితత్వమే లేకుండా పోయింది. ఇటు కాంగ్రెస్కు, అటు బీజేపీకి ఈ అంశం బాగా కలిసొచ్చాయి.లోక్సభ ఎన్నికల్లో పడిపోయిన బీఆర్ఎస్ ఓట్ల శాతంబీఆర్ఎస్కు 16.70 శాతం ఓట్లుకాంగ్రెస్కు 40.11 శాతం ఓట్లుబీజేపీకి 35.01 శాతం ఓట్లుబీజేపీ కన్నా ఐదు శాతం ఎక్కువ ఓట్లు సాధించిన కాంగ్రెస్ -
లోక్సభ ఫలితాలపై కేటీఆర్ రియాక్షన్.. ‘ఎదురుదెబ్బ ఖచ్చితంగా నిరాశే’
హైదరాబాద్:లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ దారుణమైన ఓటమిని మూటగట్టుకుంది. తెలంగాణలోని 17 స్థానాలో ఒక్కస్థానంలో కూడా ఇప్పటివరకు వెలువడిన ఫలితాల్లో విజయం సాధించలేదు. ఫలితాల్లో బీజేపీ-కాంగ్రెస్ నువ్వా- నేనా అని పోటీపడుతుంటే బీఆర్ఎస్ చాలా చోట్ల మూడో స్థానానికి పరిమితమైంది. లోక్సభ ఎన్నికల ఫలితాలపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా స్పందించారు.‘‘ టీఆర్ఎస్ స్థాపించిన 24 ఏళ్లలో అన్నీ చూశాం. విజయాలు, అనేక ఎదురుదెబ్బలు ఎన్నో చూశాం. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు మన అతిపెద్ద విజయంగా మిగిలిపోతుంది. ప్రాంతీయ పార్టీ కావడంతో వరుసగా రెండు రాష్ట్ర ఎన్నికల్లో మంచి మెజారిటీతో విజయం సాధించింది. 2014లో 63/119 స్థానాలు, 2018లో 88/119 స్థానాలు, ప్రస్తుతం, ప్రధాన ప్రతిపక్షం 1/3వ స్థానాలతో 39/119 ( 2023లో అసెంబ్లీ ఎన్నికలు) నేటి ఎన్నికల ఎదురుదెబ్బ ఖచ్చితంగా చాలా నిరాశపరిచింది. కానీ మేము శ్రమిస్తూనే ఉంటాము. ఫీనిక్స్ లాగా మళ్ళీ పైకి లేస్తాము’’ అని కేటీఆర్ అన్నారు. -
మెదక్లో బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఘన విజయం
మెదక్: మెదక్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ విజయం సాధించింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు గెలుపొందారు. ఇక్కడ బీఆర్ఎస్ నుంచి పరిపాటి వెంకట్రామిరెడ్డి, కాంగ్రెస్ నుంచి నీలం మధు బరిలోకి దిగిన ఓటమిపాలయ్యారు. -
హైదరాబాద్లో అసదుద్దీన్ ఘన విజయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో ఎంఐఎం మరోసారి ఘన విజయం సాధించింది. 3.38 లక్షలకు పైగా ఓట్ల మెజార్టీతో మాధవీ లతపై గెలుపొందారు. దీంతో ఆయన ఈ స్థానంలో 5వసారి విజయం సాధించారు. ఇక్కడ బీజేపీ నుంచి పోటీచేసిన కొంపెల్లి మాధవీలత, బీఆర్ఎస్ పార్టీ నుంచి గడ్డం శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ మహ్మద్ వలీవుల్లా సమీర్ ఓటమిపాలు అయ్యారు. -
నిజామాబాద్లో ధర్మపురి అర్వింద్ విజయం
నిజామాబాద్: నిజామాబాద్లో బీజేపీ విజయం సాధించించింది. బీజేపీ తన సిట్టింగ్ స్థానాన్ని తిరిగి నిలుపుకుంది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ 1,25,369 వేల ఓట్ల మెజారిటీతో ఘనవిజయం సాధించారు. ఇక్కడ కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన టీ. జీవన్రెడ్డి, బీఆర్ఎస్ నుంచి బాజీరెడ్డి గోవర్థన్ ఓటమిపాలయ్యారు. -
తెలంగాణలో తొలి విజయం: ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి భారీ గెలుపు
ఖమ్మం: తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి విజయం నమోదైంది. ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ విజయం సాధించారు. సుమారు 4,67,847 ఓట్ల మెజార్టీతో ఆయన గెలుపొందారు.కాంగ్రెస్ గెలుపుతో బీఆర్ఎస్ తన సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. రఘురాంరెడ్డి గెలుపు కోసం ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని ముగ్గురు మంత్రులు బాధ్యతలు తీసుకొని ప్రచారం చేశారు. ఈ స్థానం ఇన్చార్జీ పొంగులేటి శ్రీనివాస్ అన్నీ తానై వ్యహరించి రఘురాంరెడ్డి గెలుపులో కీలకం అయ్యారు. సీనియర్ నేత రామసహాయం సురేందర్ రెడ్డి కుమారుడే రఘురాంరెడ్డి. మంత్రి పొంగులేటికి వియ్యంకుడు అవుతారు.కాంగ్రెస్: 759603బీఆర్ఎస్: 297592బీజేపీ: 117075పోస్టల్ బ్యాలెట్ ఓట్లు...కాంగ్రెస్: 7326బీఆర్ఎస్: 1490బీజేపీ: 1561 -
నల్గొండ: కాంగ్రెస్ అభ్యర్తి రఘువీర్ రెడ్డి అత్యధిక మెజార్టీతో విజయం
సాక్షి,నల్గొండ: నల్లగొండ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి కందూరు రఘవీర్రెడ్డి విజయం సాధించారు. కౌంటింగ్ పూర్తి కాగా.. 5,52,659 ఓట్లతో భారీ ఆధిక్యంతో రఘువీర్ గెలుపొందారు. బీజేపీ అభ్యర్థి శానంపుడి సైదిరెడ్డికి ఇప్పటివరకు 1,59,864 పైగా ఓట్లు వచ్చాయి. దీంతో ఆయన కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయారు.మరో పార్టీ బీఆర్ఎస్ అభ్యర్తి కంచర్ల కృష్ణారెడ్డికి 219605 ఓట్లు వచ్చాయి. తండ్రి జానా రెడ్డి అండదండలతో బరిలో దిగిన రఘువీర్ రెడ్డి తొలి ఎన్నికల పోటీలోనే భారీ మెజార్టీతో విజయం సాధించారు. నల్గొండ కాంగ్రెస్ కార్యకర్తలు సంబరాలు చేసుకుంటున్నారు. ఇప్పటి వరకు అత్యధిక మెజార్టీతో భారి గెలుపును నమోదు చేయటం గమనార్హం. -
మల్కాజిగిరిలో దూసుకెళ్తున్న ఈటల.. లక్షకు పైగా ఆధిక్యం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో బీజేపీ హవా కొనసాగుతుంది. రాష్ట్రంలో మొత్తం 17 స్థానాలు ఉండగా..వాటిల్లో అత్యధిక స్థానాల్లో బీజీపీ ముందంజలో ఉంది. కిషన్రెడ్డి (హైదరాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), బండి సంజయ్ (కరీంనగర్), ధర్మపురి అర్వింద్ (నిజామాబాద్), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), భరత్ ప్రసాద్ (నాగర్ కర్నూల్) ముందంజలో ఉన్నారు. ఇక దేశంలోనే అతిపెద్ద పార్లమెంట్ స్థానమైన మల్కాజిగిరిలోనూ బీజేపీ దూసుకెళ్లోంది. ఆ పార్టీ అభ్యర్థి ఈటల రాజేందర్ నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి లక్షకు పైగా ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ప్రస్తుతం ఉన్న ట్రెండ్ని బట్టి చూస్తే..ఈటల అత్యధిక మెజారిటీతో గెలవడం ఖాయమని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.మల్కాజిగిరి పార్లమెంట్ స్థానాన్ని అధికార కాంగ్రెస్ పార్టీతో పాటు బీఆర్ఎస్, బీజేపీ మూడూ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి.ఇక్కడ నుంచి 2019 ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున రేవంత్ రెడ్డి పోటీ చేసి విజయం సాధించారు.2023లో ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తర్వాత రేవంత్ రెడ్డి ఈ స్థానానికి రాజీనామా చేశారు.ఎలాగైన సిట్టింగ్ స్థానాన్ని గెలుచుకోవాలని కాంగ్రెస్ ప్రయత్నించింది. కాంగ్రెస్ తరపున పట్నం సునీతా మహేందర్ రెడ్డి బరిలోకి తిప్పి భారీగా ప్రచారం చేసింది. ఇక బీఆర్ఎస్ నుంచి రాగిడి లక్ష్మారెడ్డి బరిలో నిలిచారు. మల్కాజిగిరిలో కాంగ్రెస్, బీజేపీ మధ్యే పోటీ ఉంటుందని అంతా భావించారు. ఇద్దరిలో ఎవరు గెలిచినా తక్కువ మెజారిటినే వస్తుందని అంచనా వేశారు. కానీ అంచనాలకు మించి ఈటల అత్యధిక మెజారిటీతో దూసుకెళ్తున్నాడు. మే 13న ఇక్కడ ఓటింగ్ జరగ్గా..50.78 శాతం పోలింగ్ నమోదైంది. -
కేసీఆర్ రికార్డు బ్రేక్.. కరీంనగర్లో బండి సంజయ్ భారీ మెజార్టీ
సాక్షి, కరీంనగర్: కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ ఆల్ టైం రికార్డ్ మెజారిటీతో విజయం సాధించారు. మాజీ సీఎం కేసీఆర్, మాజీ ఎంపీ వినోద్ కుమార్ పేరిట ఉన్న అత్యధిక రికార్డును బ్రేక్ చేశారు. 2006 ఉపఎన్నికలో 2 లక్షల 1వేయి 582 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ విజయం సాధించారు. 2014లో వినోద్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు. ఇంకా తుది ఫలితం వెలువడకముందే 2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో బండి సంజయ్ రికార్డు కొల్లగొట్టారు.ఇక.. మంగళవారం లోక్సభ ఎన్నికల కౌంటింగ్ ప్రారంభమైన మొదటి రౌండ్ నుంచి బీజేపీ స్పష్టమైన మెజార్టీ కనబరుస్తోంది. ఇక.. కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్, బీఆర్ఎస్ అభ్యర్థి బి. వినోద్ కుమార్ వెనకంజలో ఉన్నారు. ఈ ట్రెండ్ చూస్తే.. బండి సంజయ్ రెండోసారి కరీంనగర్ పార్లమెంట్ భారీ మెజార్టీతో విజయం సాధించనున్నట్లు తెలుస్తోంది. -
TG: కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ హోరాహోరీ
తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ మధ్యే టఫ్ ఫైట్ కనిపిస్తోంది. ఇప్పటివరకు జరిగిన ఓట్ల లెక్కింపులో ఈ రెండు పార్టీలే ముందంజలో ఉన్నాయి. ఫలితాల పట్టికలో బీఆర్ఎస్ మూడో స్థానానికి పడిపోయింది. మొత్తం 17 లోక్సభ స్థానాల్లో బీఆర్ఎస్ ఒక్క మెదక్లో మాత్రమే ఆధిక్యంలో కనిపించింది. అది కూడా కేవలం వందల ఓట్లతో మాత్రమే లీడ్లో ఉంది. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రావు, కమలం పార్టీ అభ్యర్థి రఘునందన్రావుకు గట్టి పోటీనిస్తున్నారు.బీజేపీ తరపున పోటీ చేసిన బండి సంజయ్ (కరీంనగర్), ఈటల రాజేందర్ (మల్కాజ్గిరి), కొండా విశ్వేశ్వర్ రెడ్డి (చేవెళ్ల), డీకే అరుణ (మహబూబ్ నగర్), ధర్మపురి అర్వింద్(నిజామాబాద్), గోడం నగేశ్ (ఆదిలాబాద్), కిషన్ రెడ్డి (సికింద్రాబాద్) ఆధిక్యంలో ఉన్నారు.కాంగ్రెస్ తరపున పోటీ చేసిన బలరాం నాయక్ (మహబూబాబాద్), రామసహాయం (ఖమ్మం), గడ్డం వంశీ కృష్ణ (పెద్దపల్లి), సురేశ్ షెట్కార్ (జహీరాబాద్), రఘువీర్ రెడ్డి (నల్గొండ), కావ్య కడియం (వరంగల్), చామల కిరణ్ కుమార్ రెడ్డి (భువనగిరి), మల్లు రవి (నాగర్ కర్నూల్) ఆధిక్యం ప్రదర్శిస్తున్నారు. హైదరాబాద్లో అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) ఆధిక్యంలో కొనసాగుతున్నారు.చదవండి: తెలంగాణ లోక్సభ ఎన్నికలు: కొనసాగుతున్న కౌంటింగ్ -
కంటోన్మెంట్ కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ విజయం
updates... సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ విజయం13206 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేశ్ గెలుపొందారు.బీజేపీ అభ్యర్థికి 40,445 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ 34462 ఓట్లు వచ్చాయి.బీఆర్ఎస్ సిట్టింగ్ స్థానాన్ని కోల్పోయింది. కాంటోన్మెంట్ ఉప ఎన్నికల కౌంటింగ్లో కాంగ్రెస్ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి శ్రీగణేష్ 8779 ఓట్లతో లీడింగ్బీజేపీ 22887 ఓట్లుబీఆర్ఎస్-21489 ఓట్లు కంటోన్మెంట్ ఉప్ప ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ ముందంజలో ఉన్నారు. బీఆర్ఎస్ అభ్యర్ధి నివేదిత సాయన్న రెండోస్థానంలో కొనసాగుతున్నారు..కాంగ్రెస్- శ్రీగణేష్ -18140బీఆర్ఎస్-నివేదిత- 11739బీజేపీ-వంశీ తిలక్-9160కాంగ్రెస్ అభ్యర్ధి 6401 ఓట్ల ఆధిక్యంలో కొనసాగున్నారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నిక మొదటి రౌండ్ ఫలితాలుమొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 855 ఓట్ల మెజారిటీకాంగ్రెస్ అభ్యర్థి శ్రీ గణేష్ 3995టిఆర్ఎస్ అభ్యర్థి నివేధిత 3140 బిజెపి అభ్యర్థి తిలక్ 2666 సికింద్రాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి శ్రీ గణేష్ ముందంజసాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 17 లోక్సభ స్థానాలతో పాటు సికింద్రాబాద్ కంటోన్మెంట్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితం కూడా మరికొద్ది గంటల్లో రానుంది. ఈ రోజు ఉదయం 8 గంటలకే కౌంటింగ్ ప్రారంభం అయింది. మొత్తం 17 రౌండ్లలో ఓట్లు లెక్కింపులో భాగంగా 14 టేబుళ్లు ఈసీ ఏర్పాటు చేసింది. అయితే లోక్సభ ఫలితాల కంటే ముందే కంటోన్మెంట్ ఉపఎన్నికల ఫలితం వెలువడే అవకాశం ఉంది. మధ్యాహ్నం 3 గంటలల్లోపు కంటోన్మెంట్ విజేత ఎవరనే విషయం తెలిసే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు.బీఆర్ఎస్ ఎమ్మెల్యే మృతితో ఉపఎన్నికకంటోన్మెంట్ ఎమ్మెల్యే సాయన్న మృతితో 2023లో జరిగిన ఎన్నికల్లో ఆయన కుమార్తె లాస్య నందిత బీఆర్ఎస్ తరుఫున పోటీ చేసి విజయం సాధించారు. అయితే కొన్ని నెలలకే ఆమె రోడ్డు ప్రమాదంలో మృతి చెందడంతో ఈ ఉప ఎన్నిక జరిగింది. బీఆర్ఎస్ తరఫున సాయన్న చిన్న కుమార్తె నివేదిత బరిలో నిలిచింది. అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి స్వల్వ తేడాతో ఓడిన శ్రీగణేష్ ఈ సారి కాంగ్రెస్ నుంచి రంగంలోకి దిగారు. బీజేపీ తరపున వంశతిలక్ పోటీ చేశాడు. వీరితో మరో 12 మంది ఈ ఉప ఎన్నికలో పోటీ చేశారు. మే 13న ఎన్నికలు జరిగాయి. అసెంబ్లీ నియోజకవర్గంలో మొత్తం 2,53,706 మంది ఓటర్లు ఉంటే 1,30,929 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. బోణీ కొట్టాలని కాంగ్రెస్.. పట్టు కోల్పోవద్దని బీఆర్ఎస్కంటోన్మెంట్ ఉప ఎన్నికను అటు అధికార పార్టీ కాంగ్రెస్తో ఆటు ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అలాగే బీజేపీ కూడా ఈ స్థానాన్ని కైవసం చేసుకునేందుకు తీవ్రంగా కృషి చేసింది. అధికార కాంగ్రెస్కి గ్రేటర్ హైదరాబాద్లో ఒక్క ఎమ్మెల్యే కూడా లేరు. 2023లో జరిగిన శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన వారు ఒక్కరు కూడా గెలవలేదు. ఈ ఉప ఎన్నికలో గెలిచి బోణీ కొట్టాలని కాంగ్రెస్ భావించింది. ఆ దిశగానే విస్తృత ప్రచారం చేసింది. సీఎం రేవంత్ రెడ్డి సుడిగాలి పర్యటనతో పాటు అనేక హామీలు గుప్పించారు. పట్టు కోల్పోరాదని బీఆర్ఎస్ తీవ్రంగా ప్రయత్నించింది. దేశవ్యాప్తంగా భాజపా గాలి వీస్తుందనే సంకేతాలతో ఆ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసింది. మరి కంటోన్మెంట్ ప్రజలు ఎవరికి అధికారం కట్టబెట్టారనేది మరికొద్ది గంటల్లో తేలనుంది. -
గెలిచేది మేమే.. ‘హైదరాబాద్’కు న్యాయం చేస్తాం : మాధవీలత
ఈ లోక్ సభ ఎన్నికల్లో తెలుగు రాష్ట్రల్లోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చలో నిలిచిన పార్లమెంట్ స్థానం హైదరాబాద్. ఆల్ ఇండియా మజ్లిస్ ఇ ఇత్తెదుల్ ముస్లిమీన్ (ఏఐఎంఐఎం) పార్టీ బలంగా ఉన్న పార్లమెంట్ స్థానం అది. దశాబ్దాలుగా అసదుద్దీన్ ఓవైసి హైదరాబాద్ ఎంపీగా కొనసాగుతూ వస్తున్నారు. ప్రతిసారి అక్కడ ఇతర పార్టీలు నామమాత్రంగా తమ అభ్యర్థులను బరిలో నిలిపేవారు. కానీ ఈ సారి ఈ పార్లమెంట్ స్థానాన్ని బీజేపీ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఆ పార్టీ అభ్యర్థి మాధవీలత చాలా సీరియస్గా ప్రచారం చేసింది. పాతబస్తీలోని హిందూవులనంతా ఒక్కతాటిపైకి తీసుకురావడంలో సక్సెస్ అయింది. బీజేపీ అధిష్టానం కూడా మాధవీలతకు చాలా సపోర్ట్గా నిలిచింది. అందుకే ఈ ఎన్నికల్లో ఆమె గట్టిపోటీ ఇచ్చింది. అయితే ఎగ్జిట్ పోల్స్ ఎక్కువగా అసదుద్దీన్ ఓవైసి గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పినా.. మాధవీలత మాత్రం హైదరాబాద్ పార్లమెంట్ స్థానంలో బీజేపీ జెండా ఎగరబోతుందని బలంగా చెబుతోంది. ఎన్నికల కౌంటింగ్కి కొద్ది గంటల ముందు ఓ జాతీయ మీడియా సంస్థతో ఆమె మాట్లాడుతూ..‘ఫలితాల కోసం నేను చాలా ఉత్సాహంగా ఉన్నాను. బీజేపీ సానుభూతిపరులతో పాటు దేశం మొత్తం హైదరాబాద్ పార్లమెంట్ స్థానం ఎన్నికల ఫలితంపై ఆసక్తికరంగా ఎదురుచూస్తున్నారు. మేము(బీజేపీ) గెలిచి హైదరాబాద్కు న్యాయం చేస్తాం. రెండు పర్యాయాలు గెలిచిన నరేంద్రమోదీ దేశ అభివృద్ధి కోసం ఎంత కృషి చేశారో అందరికి తెలుసు. దేశం మొత్తం మళ్లీ ఆయనే అధికారంలోకి రావాలని కోరుకుంటున్నారు. ఈ సారి హైదారాబాద్తో పాటు 400 స్థానాల్లో బీజేపీ గెలవాలని దేశం మొత్తం కోరుకుంటుంది. అదే జరగబోతుంది’అని మాధవీలత అన్నారు. -
తెలంగాణ లోక్సభ ఎన్నికలు.. ఘన విజయం సాధించినవారు వీరే..
Updates తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో మొత్తం 17 లోక్సభ స్థానాలకు కాంగ్రెస్-8, బీజేపీ-8, ఎంఐఎం-1 స్థానాల్లో విజయం సాధించాయి. వరంగల్ పార్లమెంట్ సభ్యులురాలిగా ఎన్నికైన కాంగ్రెస్ అభ్యర్థిని డాక్టర్ కడియం కావ్యకు ధ్రువీకరణ పత్రం అందచేస్తున్న రిటర్నింగ్ అధికారి, జిల్లా కలెక్టర్ పి. ప్రావీణ్యపాల్గొన్న మంత్రి కొండా సురేఖ, నగర మేయర్ గుండు సుధారాణి, ఎమ్మెల్యే లు కడియం శ్రీహరి, రేవురి ప్రకాష్ రెడ్డి,నాయిని రాజేందర్ రెడ్డి, గండ్ర సత్యనారాయణ కెఆర్ నాగరాజు, తదితరులు మహబూబాబాద్లో కాంగ్రెస్ గెలుపుకాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 3.24లక్షల మెజార్టీతో ఘన విజయం నాగర్కర్నూలులో కాంగ్రెస్ గెలుపుకాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి 85వేలకు పైగా మెజార్టీతో విజయంపెద్దపల్లిలో కాంగ్రెస్ గెలుపుకాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 1.31లక్షలకు పైగా మెజార్టీతో విజయం భువనగిరిలో కాంగ్రెస్ గెలుపులోక్సభ ఎంపీగా కాంగ్రెస్ పార్టీకి చెందిన చామల కిరణ్ కుమార్ రెడ్డి 2,10,000 మెజార్టీతో విజయం సాధించారు. పోస్టల్ బ్యాలెట్ ఓట్లను అధికారులు లెక్కిస్తున్నారు. అధికారికంగా ఫలితాన్ని ప్రకటించాల్సి ఉంది. కరీంగనగర్లో బండి సంజయ్ విజయంబండి సంజయ్ కు సర్టిఫికెట్ అందజేతకరీంనగర్ ఎంపీగా భారీ మెజార్టీతో బండి సంజయ్ విజయం సాధించారు. ఈ మేరకు మంగళవారం సాయంత్రం కరీంనగర్ ఎస్ ఆర్ ఆర్ కాలేజీలో జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి సర్టిఫికెట్ ను బండి సంజయ్ కు అందజేశారు.మల్కాజిగిరిలో బీజేపీ గెలుపుమల్కాజిగిరిలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయంవరంగల్లో కాంగ్రెస్ గెలుపువరంగల్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య విజయంజహీరాబాద్ కాంగ్రెస్ విజయంజహీరాబాద్ పార్లమెంట్ స్థానం నుంచి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ విజయం సాధించారు. సుమారు 51 వేల కోట్ల మెజారిటీతో బిజెపి అభ్యర్థి, సిట్టింగ్ ఎంపీ బీబీ పాటిల్ పై గెలుపొందారు. టిఆర్ఎస్ మూడో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది.మహబూబ్నగర్లో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ విజయం హోరా హోరీగా సాగిన మహబూబ్ నగర్ పార్లమెంట్ ఎన్నికల్లో బిజెపి అభ్యర్థి డీకే అరుణ విజయం సాధించారు. అధికారికంగా ఫలితాలు వెలువడవలసి ఉంది.మహబూబ్నగర్ లోకసభ నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి డీకే అరుణ 5,059 మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి చల్లా వంశీచంద్ రెడ్డిపై విజయం మెదక్ పార్లమెంట్లో బీజేపీ గెలుపుబీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు విజయం సాధించారు. కరీంనగర్ పార్లమెంట్లో బండి సంజయ్ ఆల్ టైం రికార్డ్ మెజారిటీకేసీఆర్, వినోద్ కుమార్ పేరిట ఉన్న అత్యధిక రికార్డును బ్రేక్ చేసిన బీజేపీ ఎంపీ బండి సంజయ్..2006 ఉపఎన్నికలో 2 లక్షల 1వేయి 582 ఓట్ల ఆధిక్యంతో కేసీఆర్ విజయం..2014లో వినోద్ కు 2 లక్షల 5 వేల 7 ఓట్ల మెజారిటీ..ఇంకా తుది ఫలితం వెలువడకముందే 2 లక్షల 10 వేల 322 ఓట్ల మెజారిటీతో రికార్డ్ బద్ధలు కొట్టిన సంజయ్.మహబూబ్నగర్ పార్లమెంట్లో టెన్షన్ నెలకొందిఈవీఎం లెక్కింపుల్లో డీకే అరుణ కేవలం 1800 మెజార్టీలో ముందంజలో ఉంది.ప్రస్తుతం పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు జరుగుతోంది.పోస్ట్ బ్యాలెట్ ఓట్లు 8000 వేలు ఉన్నాయి. ఆదిలాబాద్లో బీజేపీ గెలుపుఆదిలాబాద్లో బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ ఘన విజయంకాంగ్రెస్ అభ్యర్థిపై 90 వేల 932 ఓట్ల మెజార్టీతో ఘన విజయంనిజామాబాద్లో బీజేపీ గెలుపునిజామాబాద్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ విజయం1,09,241 ఓట్ల మెజారిటీలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ సమీప కాంగ్రెస్ అభ్యర్ధి జీవన్ రెడ్డి మీద విజయం సాధించారు నిజామాబాద్ పార్లమెంట్ స్థానానికి పూర్తి అయిన కౌంటింగ్లక్ష 20 వేల ఓట్ల అధిక్యంలో బీజేపీ అభ్యర్థి అర్వింద్అధికారిక ప్రకటనే తరువాయికొనసాగుతున్న పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ బీజేపీ ఎంపీ అరవింద్ కామెంట్స్ఇది మోదీ కుటుంబ సభ్యుల విజయంఇది ప్రజల విజయంనా గెలుపు కోసం కష్ట పడ్డ కార్యకర్తలకు ధన్య వాదాలుమూడో సారి ప్రధాని అవుతున్న మోదీ నేతృత్వంలో దేశం మరింత అభివృద్ధి పురోగతి సాధిస్తుంది.పెద్దపల్లి పార్లమెంట్:రామగిరి జేఎన్టీయూ పెద్దపల్లి పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణసుమారు లక్షకుపైగా ఓట్ల ఆధిక్యంతో ముందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణగత పది సంవత్సరాల కాలంలో పెద్దపెల్లి పార్లమెంటు అభివృద్ధిలో వెనుకబడిపోయిందిపెద్దపల్లి పార్లమెంటు పరిధిలో అభివృద్ధికి కృషి చేస్తాతన గెలుపుకు కృషి చేసిన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు, మంత్రి శ్రీధర్ బాబుకు, ఎమ్మెల్యేలకు కృతజ్ఞతలు తెలిపిన వంశీకృష్ణనల్లగొండ పార్లమెంట్రికార్డ్ మెజార్టీతో గెలుపు దిశగా కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి23వ రౌండ్ ముగిసేసరికి 5,51,168 ఓట్ల ఆధిక్యం లో రఘువీర్ రెడ్డికాంగ్రెస్ రఘువీర్ రెడ్డి - 7,70,512రెండవ స్థానం - బిజెపి - శానంపూడి సైదిరెడ్డి - 2,19,344మూడవ స్థానం - బీఆర్ఎస్ - కంచర్ల కృష్ణారెడ్డి - 2,16,050 నాగర్ కర్నూల్ పార్లమెంట్ (రౌండ్ 14)కాంగ్రెస్ 24,427బీజేపీ 21,814బీఆర్ఎస్ 14,099కాంగ్రెస్ మొత్తం లీడ్ 49,986భువనగిరి పార్లమెంట్(రౌండ్: 12)బీజేపీ: 22292కాంగ్రెస్: 31512బీఆర్ ఎస్: 13380రౌండ్ లీడ్: 9220మొత్తం లీడ్ 117308ఖమ్మం పార్లమెంట్ఖమ్మం లోక్సభలో 4, 48, 209 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్కాంగ్రెస్-735697బీఆర్ఎస్-287488బీజేపీ-114957మెదక్ పార్లమెంట్12వ రౌండ్. పూర్తి అయ్యే సరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 29,300 ఓట్ల ఆధిక్యంకాంగ్రెస్ 2,45,089బీజేపీ =2,74,389బీఆర్ఎస్- 2,24,831 మెదక్ పార్లమెంట్10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు 19739 ఓట్ల ఆధిక్యంకాంగ్రెస్ 203632బిజెపి 223371బి ఆర్ ఎస్ 192533చేవెళ్ల పార్లమెంట్ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వెళ్లిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం రంజిత్ఓటమిని అంగీకరిస్తూ.. కొండ విశ్వేశ్వర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపిన గడ్డం రంజిత్ రెడ్డిప్రజలు ఏకధాటిగా వెళ్లిన విషయంపై ఆశ్చర్యానికి గురైనట్లు తెలిపిన రంజిత్ రెడ్డి నల్లగొండ పార్లమెంట్రికార్డ్ మెజార్టీ దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి5 లక్షల 18 వేల ఓట్ల ఆధిక్యంలో విజయం దిశగా రఘువీర్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్పెద్దపల్లి పార్లమెంటు నియోజవర్గ ఎన్నికల కౌంటింగ్ కేంద్రం సందర్శించిన కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీమల్కాజిగిరి పార్లమెంట్ బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 2 లక్షల ఓట్ల ఆధిక్యంజహీరాబాద్ పార్లమెంటు ఆధిక్యంలో కొనసాగుతున్న కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ ( 31, 236 ఓట్ల లీడ్) కాంగ్రెస్ - 416927బీజేపీ.. బీబీ పాటిల్- 385301బీఆర్ఎస్... గాలి అనిల్ - 140006కాంగ్రెస్ తొలి విజయంతెలంగాణ లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తొలి విజయం నమోదైంది.ఖమ్మం పార్లమెంట్ నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసిన రామసహాయం రఘురామిరెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. కరీంనగర్ పార్లమెంట్ 11 రౌండ్లు లెక్కింపు పూర్తయ్యే సరికి బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ 1,25,575 ఓట్ల ఆధిక్యతబిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 3,02,109కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 1,76,623బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 1,44,541 నల్లగొండ పార్లమెంట్నల్లగొండలో విజయం దిశగా కాంగ్రెస్ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి24 వ రౌండ్ ముగిసే సమయానికి 3,55,674 ఓట్లతో రఘువీర్ రెడ్డి అధిక్యం నిజామాబాద్ పార్లమెంట్10వ రౌండ్ ముగిసే సరికి 60,000 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్అధిక్యంలో దూసుకెళ్తున్న బీజేపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్ఆర్మూర్, బాల్కొండ, నిజామాబాద్ రూరల్, కోరుట్లలో బీజేపీ ఆధిక్యం.జగిత్యాల, బోధన్, నిజామాబాద్ అర్బన్లో కాంగ్రెస్ అభ్యర్థి జీవన్ రెడ్డికి స్వల్ప ఆధిక్యం ఆదిలాబాద్ పార్లమెంట్బీజేపీ అభ్యర్థి గోడెం నగేష్ 50,913 లీడింగ్బీజేపీ: 2, 81, 004కాంగ్రెస్ : 2,30,091బిఆర్ఎస్ : 68, 43111 రౌండ్ల కౌంటింగ్ పూర్తిమహబూబ్ నగర్ పార్లమెంటుబీజేపీ అభ్యర్థి డీకే అరుణ 15, 571 ఓట్ల ఆధిక్యంబీజేపీ 2,58,932కాంగ్రెస్ 2,43,361బీఆర్ఎస్ 86,86810 రౌండ్ల ఓట్ల లెక్కింపు పూర్తి పెద్దపల్లి పార్లమెంట్63,507 ఓట్ల ఆదిక్యంతో గడ్డం వంశీకృష్ణ ముందంజబీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ కు (95,959).కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు (2,51,127).బిజెపి అభ్యర్థి గోమాసే శ్రీనివాస్ కు (1,87,620).10వ రౌండ్ల కౌంటింగ్ పూర్తి ఖమ్మం పార్లమెంట్3,06,090 ఓట్ల కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి భారీ ఆధిక్యంలో ఉన్నారు.కాంగ్రెస్: 510057భారాస: 203967భాజపా: 80562నల్లగొండ పార్లమెంట్నల్లగొండ పార్లమెంట్ 22వ రౌండ్ ఫలితాలు3,28,534 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.కాంగ్రెస్ 4,82,305బీజేపీ 1,53,771బీఆర్ఎస్ 1,36,268భువనగిరి పార్లమెంట్1,01,814 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 2,97,419బీజేపీ 1,95,605బీఆర్ఎస్ 1,29,07117వ రౌండ్ల కౌంటింగ్ పూర్తి నల్గొండ పార్లమెంట్20వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 3,03,645 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ - 4,48,198బీజేపీ... 1,44,553బీఆర్ఎస్... 1,24,247 వరంగల్ పార్లమెంట్10 రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 85,193 లీడ్బీజేపీ: 1,51,212కాంగ్రెస్: 2,36,405బీఆర్ఎస్: 96,839 ఆదిలాబాద్.. గోడం నగేశ్ (భాజపా) 47,301 లీడ్చేవెళ్ల.. కొండా విశ్వేశ్వర్ రెడ్డి (భాజపా) 61,783 లీడ్హైదరాబాద్.. అసదుద్దీన్ ఓవైసీ (ఎంఐఎం) 38,424 ఓట్ల ఆధిక్యంకరీంనగర్.. బండి సంజయ్ (భాజపా) 92,350 ఆధిక్యంఖమ్మం.. రామసహాయం రఘురామ్ రెడ్డి (కాంగ్రెస్) 2,56,407 లీడ్మహబూబాబాద్.. బలరాం నాయక్ (కాంగ్రెస్) 1,42,229 లీడ్సికింద్రాబాద్.. జి కిషన్ రెడ్డి (భాజపా) 43,569 ఓట్ల లీడ్మహబూబ్ నగర్.. డీకే అరుణ (భాజపా) 10,714 లీడ్మల్కాజిగిరి.. ఈటల రాజేందర్ (భాజపా) 1, 47,229 లీడ్నాగర్ కర్నూల్.. మల్లు రవి (కాంగ్రెస్) 24,274 లీడ్నిజామాబాద్.. ధర్మపురి అర్వింద్ (భాజపా) 28,969 లీడ్మెదక్.. రఘునందన్ రావు (భాజపా) 10,714 లీడ్పెద్దపల్లి.. గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) 37,171 లీడ్వరంగల్.. కడియం కావ్య (కాంగ్రెస్) 77,094 ఓట్ల లీడ్జహీరాబాద్.. సురేశ్ షెట్కార్ (కాంగ్రెస్) 12,574 ఓట్ల లీడ్ పెద్దపల్లి పార్లమెంట్ఏడు రౌండ్లు ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ 37,481 ఆధిక్యంకాంగ్రెస్... 174522బీజేపీ... 137041బీఅర్ఎస్... 67435నల్లగొండ పార్లమెంట్16వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 2,56,293 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 3,75,969బీజేపీ 1,19,676బీఆర్ఎస్ 103717భువనగిరి పార్లమెంట్12 రౌండ్లు పూర్తి ఆయ్యేసరికి 84,013 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 2,38,118బీజేపీ 1,54,105బీఆర్ఎస్ 1,02,155నల్లగొండ పార్లమెంట్14వ రౌండ్లు పూర్తి అయ్యేసరికి 2,44,952 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యంకాంగ్రెస్ 3,59,298బీజేపీ 1,14,346బీఆర్ఎస్ 98,295తెలంగాణలోని 17 పార్లమెంటు నియోజకవర్గం ఫలితాల వివరాలు...నాలుగు రౌండ్లు పూర్తయ్యేసరికి పార్లమెంట్ నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థుల లీడ్.37వేల ఆధిక్యంలో కొనసాగుతున్న ఆదిలాబాద్ బిజెపి అభ్యర్థి గోదాం నగేష్.59 వేల మెజారిటీతో కొనసాగుతున్న భువనగిరి కాంగ్రెస్ అభ్యర్థి శ్యామల కిరణ్.33000 ఆదిత్యంలో కొనసాగుతున్న చేవెళ్ల బిజెపి పార్లమెంట్ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి.ముప్పై నాలుగువేల ఆధిక్యంలో కొనసాగుతున్న హైదరాబాద్ పార్లమెంట్ ఎంఐఎం అభ్యర్థి ఓవైసీ.72,000 ఆదిత్యంలో కొనసాగుతున్న కరీంనగర్ బిజెపి అభ్యర్థి బండి సంజయ్ఒక లక్ష 74 వేల ఆదిత్యంలో కొనసాగుతున్న ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాంరెడ్డి.లక్ష ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న మహబూబాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్.9000 ఓట్ల ఆదిత్యంలో కొనసాగుతున్న మహబూబ్నగర్ బిజెపి అభ్యర్థి డీకే అరుణ.ఒక లక్ష తొమ్మిది వేల ఆదిత్యంలో కొనసాగుతున్న మల్కాజిగిరి బిజెపి అభ్యర్థి ఈటెల రాజేందర్.3000 ఓట్ల ఆదిత్యంతో కొనసాగుతున్న మెదక్ బి ఆర్ ఎస్ అభ్యర్థి వెంకటరామిరెడ్డి.21 వేల ఓట్ల ఆదిత్యంతో కొనసాగుతున్న నాగర్కర్నూల్ కాంగ్రెస్ అభ్యర్థి మల్లు రవి.1,98,000 ఆదిక్యంలో కొనసాగుతున్న నల్గొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్.16 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న నిజామాబాద్ బిజెపి అభ్యర్థి ధర్మపురి అరవింద్.32వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న పెద్దపల్లి కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ.43 వేల ఓట్ల ఆదిత్యంలో కొనసాగుతున్న సికింద్రాబాద్ బిజెపి అభ్యర్థి కిషన్ రెడ్డి.56 వేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య.పదివేల ఓట్ల ఆధిక్యంలో కొనసాగుతున్న జహీరాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ శెట్టికారి.ఆదిలాబాద్ పార్లమెంట్గోడెం నగేశ్ (బీజేపీ) 38,283 ఓట్ల ఆధిక్యంచేవెళ్ల పార్లమెంట్బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి 33,086 ఓట్ల లీడ్మల్కాజిగిరి పార్లమెంట్ ఈటా రాజేందర్ (బీజేపీ) 1, 05,472 లీడ్ హైదరాబాద్ పార్లమెంట్34,125 ఓట్ల లీడింగ్లో ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్ ఒవైసీ ఖమ్మం పార్లమెంట్ 10 వ రౌండ్ ముగిసేసరికి 1,68,922 ఆధిక్యంలో కాంగ్రెస్కాంగ్రెస్.. 2, 85905బీఆర్ఎస్.. 118983బీజేపీ.. 39105నల్లగొండ పార్లమెంట్1,70,783 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి అధిక్యం.కాంగ్రెస్...2,47,930బీజేపీ....77,147బీఆర్ఎస్... 71,984నల్లగొండ లోక్సభ ఆరు రౌండ్లు పూర్తిమహబూబ్ నగర్: మూడో రౌండ్ ముగిసేసరికి బీజేపీ అభ్యర్థి డీ. కే. అరుణకు 6,984 ఓట్ల ఆధిక్యతమెదక్ పార్లమెంట్బీఆర్ఎస్ ముందంజబీఆర్ఎస్ అభ్యర్థి పరిపాటి వెంకట్రామిరెడ్డి 109931 ఓట్ల ఆధిక్యంపెద్దపల్లి పార్లమెంట్:నాలుగు రౌండ్లు పూర్తి అయ్యేసరికి కాంగ్రెస్ 24511 లీడ్లో కొనసాగుతోందికాంగ్రెస్:103344బీజేపీ:78833బీఆర్ఎస్:39145 భువనగిరి పార్లమెంట్భువనగిరి పార్లమెంట్ ఆరో రౌండ్ పూర్తి అయ్యేసరికి 48,622 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి అధిక్యం.కాంగ్రెస్ 1,43,167బీజేపీ 94,545బీఆర్ఎస్ 64,241సీపీఐఎం 11,772 పెద్దపెల్లి పార్లమెంట్3వ రౌండ్ తర్వాత ముందంజలో కాంగ్రెస్12700 ఓట్ల మెజారిటీలో గడ్డం వంశీకృష్ణ కరీంనగర్ పార్లమెంట్4 రౌండ్ పూర్తయ్యే సరికి బిజెపి అభ్యర్థి బండి సంజయ్ 51,770 ఓట్ల ఆధిక్యతబిజెపి అభ్యర్థి బండి సంజయ్ కి 11,4779కాంగ్రెస్ అభ్యర్థి రాజేందర్ రావు 63,009బిఆర్ఎస్ అభ్యర్థి వినోద్ కుమార్ 52,432 ఆదిలాబాద్ పార్లమెంట్ : నాలుగొవ రౌండ్ పూర్తి అయ్యేసరికి బీజేపీ 31965 లీడ్బీజేపీ:- 1,09,766కాంగ్రెస్ : 77801బిఆర్ఎస్ : 25198 ఖమ్మం పార్లమెంట్కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన బీజేపీ అభ్యర్థి తాండ్ర వినోద్ రావు ఖమ్మం పార్లమెంట్6వ రౌండ్ పూర్తి అయ్యేసరికి 1,26,000 ఓట్ల మెజారిటీలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రామసాహాయం రఘురాం రెడ్డి వరంగల్ పార్లమెంట్మూడు రౌండ్లు ముగిసేసరికి వరంగల్ కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 34,522 లీడ్నిజామాబాద్ పార్లమెంట్మొదటి రౌండ్ ముగిసేసరికి జగిత్యాల్ తప్ప మిగిలిన ఆరు నియోజకవర్గాల్లో బీజేపీ అభ్యర్థి అర్వింద్ ఆదిక్యత మొత్తం 11606 ఓట్ల ఆదిక్యంలో బీజేపీఖమ్మం పార్లమెంట్కాంగ్రెస్ లీడ్ : 24130 ( 3వ రౌండ్ )బీఆర్ఎస్ : 18206కాంగ్రెస్ : 42336బీజీపీ : 4841 ఖమ్మం పార్లమెంట్6వ రౌండ్ వరకు 1,25,360 ఓట్లతో కాంగ్రెస్ అభ్యర్ధి మెజారిటీ నల్లగొండ జిల్లాకౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయిన నల్లగొండ బీజేపీ అభ్యర్థి సైదిరెడ్డికరీంనగర్ పార్లమెంట్ 26 వేల 208 ఓట్లతో ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ కుమార్2 రౌండ్లు పూర్తి నాగర్ కర్నూల్లో బీజేపీ అభ్యర్థి భరత్ ప్రసాద్ ఆధిక్యంమహబూబ్నగర్లో డీకే ఆరుణ (బీజేపీ) ముందంజపెద్దపల్లిలో గడ్డం వంశీ కృష్ణ (కాంగ్రెస్) ముందంజజహీరాబాద్లో సురేష్ షెట్కార్ (కాంగ్రెస్) ఆధిక్యంభువనగిరిలో చామల కిరణ్ కుమార్ రెడ్డి( కాంగ్రెస్) ముందంజ వరంగల్లో కడియం కవ్య (కాంగ్రెస్) ఆధిక్యం సికింద్రాబాద్ పార్లమెంట్ 7113 ఓట్ల ఆదిక్యoలో కొనసాగుతున్న బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డిజహీరాబాద్ పార్లమెంట్కాంగ్రెస్ అభ్యర్తి సురేష్ షెట్కార్ లీడ్ 7,501రెండో రౌండ్ లెక్కింపు పూర్తికాంగ్రెస్ 27,508 బీబీ పాటిల్ - బిజెపి 23,350 గాలి అనిల్కుమార్ టిఆర్ఎస్ - 8,363 వరంగల్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య 2009 ఓట్ల ఆధక్యతనిజామాబాద్ పార్లమెంట్బీజేపీ అభ్యర్థి అరవింద్ ఆధిక్యంరెండో రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తి14156 ఓట్ల ఆధిక్యంలో బీజేపీ అభ్యర్థి అరవింద్.కనీస పోటీ ఇవ్వలేక పోతున్న బీఆర్ఎస్కౌంటింగ్ కేంద్రం నుంచి బయటకు వెళ్ళిపోతున్న బీఆర్ఎస్ ఏజెంట్లుజహీరాబాద్ పార్లమెంట్ రెండో రౌండ్ ముగిసే సరికి కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షెట్కార్ 7,501 ఓట్ల ఆదిత్యం చేవెళ్ల పార్లమెంట్రెండు రౌండ్లు ముగిసే సరికి 14169 ఓట్లతో బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి ముందంజనల్లగొండ పార్లమెంట్భారీ ఆధిక్యం దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిఐదో రౌండ్ ముగిసేసరికి 91 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి భువనగిరి పార్లమెంట్భువనగిరి లోక్ సభ 4వ రౌండ్ ముగిసేసరికి 20 వేలకుపైగా ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి చామల కిరణ్ కుమార్ రెడ్డి పెద్దపల్లి పార్లమెంట్కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ కృష్ణ 5094 లీడ్పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ఓట్ల లెక్కింపులో 1వ రౌండ్ పూర్తి.గోమాస్ శ్రీనివాస్ బీజేపి:- 18401గడ్డం వంశీ కృష్ణ కాంగ్రెస్:- 23495కొప్పుల ఈశ్వర్ బీఆర్ఎస్:- 9312 నల్లగొండ జిల్లాభారీ ఆధిక్యం దిశగా నల్లగొండ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డిమూడో రౌండ్ ముగిసేసరికి 70 వేల పైచిలుకు ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్ధి కుందూరు రఘువీర్ రెడ్డి ఆదిలాబాద్ పార్లమెంట్ మొదటి రౌండ్లో బిజెపి అభ్యర్థి గోడం నగేష్ 8806 ఓట్లతో ఆధిక్యంబీజేపీ :- 28429కాంగ్రెస్ : 19623బిఆర్ఎస్ : 5660 మహబూబ్ నగర్ మొదటి రౌండ్ 874 ఓట్ల ఆదిక్యంలో బీజేపీ బీజేపీ - డీకే అరుణ దేవరకద్రలో పోలైన ఓట్లు 4648కాంగ్రెస్ - చల్లా వంశీచంద్ రెడ్డి దేవరకద్రలో పోలైన ఓట్లు 3774బీఆర్ఎస్ - మన్నె శ్రీనివాస్ రెడ్డి దేవరకద్ర లో పోలైన ఓట్లు 1700. నల్లగొండ జిల్లానల్లగొండ, భువనగిరి రెండు స్థానాల్లోనూ కాంగ్రెస్ అభ్యర్థుల ముందంజ మెదక్ పార్లమెంట్బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావు ఆధిక్యం నిజామాబాద్నిజామాబాద్ లోక్ సభలో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఏడు వేల ఓట్ల ఆధిక్యం వరంగల్ పార్లమెంట్మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి కడియం కావ్య అధిక్యంకాంగ్రెస్: 30123బీజేపీ: 21719బీఆర్ఎస్: 14683లీడ్: 8404 (కాంగ్రెస్) మెదక్ పార్లమెంట్ ఫస్ట్ రౌండ్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధు ఆధిక్యంనీలం మధు కాంగ్రెస్ 3888రఘునందన్ రావు బీజేపీ 1538వెంకటరామిరెడ్డి టిఆర్ఎస్ 2213 నిజామాబాద్, సికింద్రాబాద్, మల్కాజిగిరిలో బీజేపీ ఆధిక్యం ఖమ్మం పార్లమెంట్కాంగ్రెస్ అభ్యర్థి రామసహాయం రఘురాం రెడ్డి ఆధిక్యం2వ రౌండ్ (కాంగ్రెస్ లీడ్ : 26008)బీఆర్ఎస్ : 20041కాంగ్రెస్ : 46049బీజీపీ : 5216రెండు రౌండ్లు పూర్తి అయేసరికి 42,710 లీడ్ యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి రెండో రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి లీడ్ భువనగిరి రెండో రౌండ్ ముగిసేసరికి కాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4000కు పైగా ఓట్ల ముందంజమహబూబ్ నగర్ బీజేపీ లీడ్ 874ఖమ్మంలో నామా ఔట్..!కౌంటింగ్ కేంద్రం నుంచి ఇంటికి వెళ్లిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వర్ రావు నల్గొండలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డి ఆధిక్యం నల్లగొండ మొదటి రౌండ్ లో కాంగ్రెస్ ఆధిక్యం2777 ఓట్ల ఆధిక్యంలో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికాంగ్రెస్-6001భాజపా-3224బీఆర్ఎస్ -1264యాదాద్రి భువనగిరి జిల్లామొదటి రౌండ్లో కాంగ్రెస్ ఆధిక్యంకాంగ్రెస్ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 4204 ఆధిక్యత భువనగిరిలో బీజేపీ అభ్యర్థి బూర నర్సయ్యగౌడ్ ఆధిక్యం కరీంనగర్లో బీజేపీ అభ్యర్థి బండి సంజయ్ లీడ్ మహబూబాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో 14, 526 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ పార్టీ ముందుంజ ఆదిలాబాద్ పార్లమెంట్ముధోల్ నియోజకవర్గంమొదటి రౌండ్లీడ్ : 3091(బీజేపీ)కాంగ్రెస్: 2363బిజెపి : 5464బిఆర్ఎస్ : 715 నల్లగొండమొదటి రౌండ్లో కాంగ్రెస్ 2777 మెజారిటీకాంగ్రెస్ ... 6001బిజెపి .... 3224టిఆర్ఎస్.... 1264 మహబూబాబాద్ పార్లమెంటు ఓట్ల లెక్కింపులో 11406 ఓట్ల మెజార్టీ మహబూబ్ నగర్లో పోస్టల్ బ్యాలెట్లలో డీకే అరుణ లీడ్నాగర్ కర్నూల్ పార్లమెంట్ పరిధిలో బీజేపీ లీడ్కరీంనగర్ పార్లమెంట్లో బీజేపీ ఆధిక్యంమొదటి రౌండ్లో 1400 ఓట్లు ఆధిక్యంలో బండి సంజయ్ మహబూబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ 10283 ఓట్ల మెజార్టీ మహబూబాబాద్ పార్లమెంట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి 5644 ఓట్ల మెజార్టీ ఆదిలాబాద్ పార్లమెంట్: లీడ్ (బిజెపి): 1168నిర్మల్ నియోజకవర్గ: మొదటి రౌండ్ : బిజెపి 3872కాంగ్రెస్ 2643బీఆర్ఎస్ 585నిజామాబాద్ పార్లమెంటుపోస్టల్ బ్యాలెట్ ఓట్లలో బీజేపీ ఆధిక్యం వరంగల్ పార్లమెంట్ ( 1వ రౌండ్)బిజెపి లీడ్ : 240బీఆర్ఎస్ : 3870కాంగ్రెస్ :6494బీజీపీ : 6726మహబుబాబాద్నర్సంపేట నియోజకవర్గంలో మొదటి రౌండ్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బలరాం నాయక్ 1083 ఓట్ల ఆధిక్యం ఖమ్మం పార్లమెంట్ (1వ రౌండ్)కాంగ్రెస్ లీడ్ : 16702బీఆర్ఎస్ : 18794కాంగ్రెస్ :35496బీజీపీ :4351 మహబూబాబాద్లో కాంగ్రెస్ అభ్యర్థి బలరాం నాయక్ ఆధిక్యం భువనగిరిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి 2000 పైచిలుకు ముందంజ నల్లగొండ మొదటి రౌండ్లో కాంగ్రెస్ ముందంజ జహీరాబాద్: తొలి రౌండులో ఆదిత్యంలో కాంగ్రెస్ అభ్యర్థి సురేష్ షట్కార్ కరీంనగర్లో బండి సంజయ్ ఆధిక్యం యాదాద్రి భువనగిరిభువనగిరి సెగ్మెంట్లో మొదటి రౌండ్లో బూర నర్సయ్య గౌడ్ లీడ్తొలి రౌండ్ లో 117ఓట్ల ఆధిక్యంలో బీజేపీబీజేపీ 3976కాంగ్రెస్ 3859బీఆర్ఎస్ 2681 వరంగల్లో కడియం కావ్య ఆధిక్యం కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్లో ప్రారంభమైన ఈవీఎం కౌంటింగ్ ప్రక్రియఆదిలాబాద్ పార్లమెంట్: ఖానాపూర్ నియోజకవర్గం:మొదటి రౌండ్: కాంగ్రెస్: 3,297బిజెపి : 3902బిఆర్ఎస్ : 859లీడ్ : 605(బీజేపీ) సికింద్రాబాద్లో కిషన్రెడ్డి ఆధిక్యం నల్లగొండ జిల్లానల్లగొండ లోక్ సభ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపులో కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి ఆధిక్యం ఖమ్మంఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లో మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి రాఘురం రెడ్డి ముందంజ ముషీరాబాద్ నియోజకవర్గం AV కాలేజీ లో మొదటి రౌండ్ ఓట్ల లెక్కింపు పూర్తిబీజేపీ 4733 కాంగ్రెస్ 1318బీఆర్ఎస్ 10973325 ఓట్ల లీడ్ లో బీజేపీ పెద్దపల్లి పార్లమెంట్లో మొదటి రౌండ్లో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వంశీ లీడ్816 ఓట్ల తో ముందంజ మహబూబ్ నగర్లో డీకే అరుణ ఆధిక్యంఖమ్మంలో కాంగ్రెస్ ఆధిక్యంమల్కాజిగిరిమల్కాజిగిరి పార్లమెంట్ పరిధి ఎల్బీనగర్ అసెంబ్లీ సెగ్మెట్లో మొదటి రౌండ్లో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ 6330 ఓట్లతో ఆధిక్యంబీజేపీ :-8811కాంగ్రెస్ :2581బిఆర్ఎస్ :1418కరీంనగర్ జిల్లా: బీజేపీ ముందంజమొత్తం పోస్టల్ బ్యాలెట్: 108479287 (ఎంప్లాయిస్ + సర్వీస్ ఓటర్లు)1560 (హోం ఓటింగ్) యాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి పట్టణ పరిధిలో అరోరా ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైంన కౌంటింగ్ ప్రక్రియ ఖమ్మంలోని కిట్స్ కాలేజీలో ప్రారంభమైన కౌంటింగ్మంచిర్యాల జిల్లాలో ఐజ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రారంభమైన కౌంటింగ్ ప్రక్రియ పెద్దపెల్లి జిల్లా :ప్రారంభమైన పెద్ద పెల్లి పార్లమెంట్ ఎన్నికల ఓట్ల లెక్కింపు.పోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బంది,పోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపునిజామాబాద్నిజామాబాద్ లోక్ సభ కౌంటింగ్ ప్రారంభంకౌంటింగ్ సెంటర్లో అపశ్రుతికౌంటింగ్ సూపర్ వైజర్కు అస్వస్థతకళ్ళుతిరిగి పడిపోవడంతో అంబులెన్స్లో ఆసుపత్రికి తరలింపు నల్లగొండ జిల్లాలో మొదలైన కౌంటింగ్ ప్రక్రియనల్లగొండ పార్లమెంటుకు సంబంధించి దుప్పలపల్లిలోనే వేర్ హౌసింగ్ గోదాముల్లో కొనసాగుతున్న ఓట్ల లెక్కింపుమొదట పోస్టల్ ఓట్ల లెక్కింపు ప్రారంభించి ఆ తర్వాత ఈవీఎం లలోని ఓట్లను లెక్కిస్తున్నారు మహబూబ్ నగర్ పార్లమెంట్లో మొదలైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకరీంనగర్ జిల్లా:ప్రారంభమైన సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపుపోస్టల్ బ్యాలెట్ ఓట్లు లెక్కిస్తున్న సిబ్బందిపోస్టల్ బ్యాలెట్ తర్వాత ఈవీఎంల ఓట్ల లెక్కింపు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయంలో కేంద్రమంత్రి కిషన్రెడ్డి పూజలుఅమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలుకేంద్రంలో మూడోసారి ఎన్డీయే కూటమిదే విజయంతెలంగాణలో బీజేపీ అధిక సీట్లు గెలుచుకుంటుంది#WATCH | Union Minister & BJP's Telangana President G Kishan Reddy says, "PM Narendra Modi will take oath in the second week of this month with the blessings of the people..."He says, "People from all over the world are watching our Lok Sabha elections. I have full faith that… pic.twitter.com/2a3r4wxlW8— ANI (@ANI) June 4, 2024మహబూబ్ నగర్ పాలమూరు యూనివర్సిటీలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుస్ట్రాంగ్ రూం నుంచి ఈవీఎం లను లెక్కింపు కేంద్రాలకు తరలింపు సికింద్రాబాద్ పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులుకోట్ల విజయభాస్కర్ రెడ్డి స్టేడియం, ఉస్మానియా యూనివర్సిటీ, నిజాం గ్రౌండ్స్, ఏవి కాలేజ్ మాసబ్ ట్యాంక్ లలో కౌంటింగ్ ప్రారంభించిన అధికారులుహైదరాబాద్:సరూర్నగర్ ఇండోర్ స్టేడియంలో మల్కాజ్గిరి పార్లమెంట్ సెగ్మెంట్ ఈవీఎంల కౌంటింగ్ ప్రారంభించిన అధికారులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన పార్లమెంట్ కౌంటింగ్ముందుగా పోస్టల్ బ్యాలెట్ లెక్కలు వేయనున్న అధికారులుఎనిమిదిన్నరకు ఈవీఎంల లెక్కలను ప్రారంభించనున్న సిబ్బందికంటోన్మెంట్ లో మాత్రం ఎనిమిది గంటలకు పోస్టల్ బ్యాలెట్తో పాటు ఈవీఎంల లెక్కింపు ప్రారంభం నల్లగొండ జిల్లానల్లగొండ లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపుయాదాద్రి భువనగిరి జిల్లాభువనగిరి లోక్ సభ స్థానంలో ప్రారంభమైన పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపునిజామాబాద్: ఓట్ల లెక్కింపు ప్రారంభం8హాళ్లలో మొదలైన కౌంటింగ్తొలుత పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కిస్తున్న సిబ్బంది నిజామాబాద్: డిచ్పల్లి సిఎంసిలో కౌంటింగ్కు సర్వం సిద్ధంపార్లమెంట్ పరిధిలోనీ 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు ఒకే చోట కౌంటింగ్.8 హళ్ల లో ఓట్ల లెక్కింపు చేపట్టనున్న అధికారులునిజామాబాద్ రూరల్ & అర్బన్ నియోజకవర్గాల ఓట్ల లెక్కింపు కోసం 20 టేబుళ్ళుబోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కోరుట్ల సెగ్మెంట్ల కు 18 చొప్పున టేబుళ్ళ ఏర్పాటు.15 రౌండ్లు లో మొత్తం ఓట్ల లెక్కింపు పూర్తి.మధ్యాహ్నం 3 గంటల వరకు తుది ఫలితంఓట్ల లెక్కింపు కోసం 558 మంది కౌంటింగ్ సిబ్బంది,అభ్యర్థులు ఉదయం 6 గంటల వరకు కౌంటింగ్ కేంద్రానికి చేరుకోవాలనీ అధికారుల సూచనరిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఎంట్రీ పాస్ తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తప్పనిసరి.మొబైల్ ఫోన్, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు అనుమతి లేదు.కౌంటింగ్ కేంద్రం చుట్టూ ,5 కిలో మీటర్ల పరిధిలో 144 సెక్షన్ అమలుమూడు అంచెల్లో భద్రత ఏర్పాట్లు1000 మంది పోలీసులతో బందో బస్తుపోలైన పోస్టల్ ఓట్లు 7414మొత్తం సర్వీస్ ఓట్లు 724మొత్తం ఓట్లు 17,4867పోలైన ఓట్లు 12, 26 133పోలింగ్ శాతం. 71.9240 నిమిషాల్లో తొలి రౌండ్ పలితంఖమ్మంలోకసభ ఎన్నికల కౌంట్ డౌన్ స్టార్ట్ఖమ్మం రూరల్ మండలం, పొన్నెకల్లోని శ్రీ చైతన్య ఇంజనీరింగ్ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంఉదయం 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభంపోస్టల్ బ్యాలెట్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ఖమ్మం పార్లమెంటు పరిధిలో ని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలుఖమ్మం, పాలేరు, వైరా, మధిర, సత్తుపల్లి, అశ్వారావుపేట, కొత్తగూడెం అసెంబ్లీ సెగ్మెంట్లు7 అసెంబ్లీ సెగ్మెంట్ లలో తొలుత పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్ కౌంటింగ్ కోసం ప్రత్యేక కౌంటింగ్ హాల్ ఏర్పాటుప్రతి కౌంటింగ్ హాల్ లో 14 కౌంటింగ్ టేబుల్స్, ఏర్పాటుఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ కు సంబంధించి 18 టేబుళ్లు ఏర్పాటుకౌంటింగ్ విధుల నిర్వహణకు ప్రతి కౌంటింగ్ హాల్ వద్దఒక్కో టేబుల్ కు కౌంటింగ్ సూపర్వైజర్, కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో పరిశీలకులు ఉంటారుఖమ్మం అసెంబ్లీ సెగ్మెంట్ లో 20 రౌండ్లుపాలేరు, సత్తుపల్లి అసెంబ్లీ సెగ్మెంట్లలో 21 రౌండ్లుమధిర లో 19, వైరాలో 18, కొత్తగూడెం లో 18, అశ్వారావుపేట సెగ్మెంట్ లో 13 రౌండ్లు లెక్కింపు చేపడుతారుపోస్టల్ బ్యాలెట్ ఓట్లు తో కౌంటింగ్ మొదలు అవుతుంది.వీ వీ ప్యాట్ల స్లిప్ లు ప్రామాణికంగా తీసుకుంటారు.పోస్టల్ బ్యాలెట్ ఇటిపిబిఎస్ లతో కలిపి 2 రౌండ్లలో కౌంటింగ్ పూర్తి చేస్తారుకంట్రోల్ యూనిట్ల లోని ఓట్లు లెక్కించిన తరువాతగెలుపొందిన పార్టీ అభ్యర్థి ని కౌంటింగ్ సూపర్ వైజర్ నిర్ధారించాల్సి ఉంటుందిఅనంతరం సదరు అభ్యర్థి కి అర్ ఓ ద్రువపత్రం అందజేస్తారు..దీంతో ఎన్నికల ప్రక్రియ పూర్తి అవుతుంది కాసేపట్లో కౌంటింగ్ ప్రారంభంఫలితాలపై కాంగ్రెస్, బీఆర్ఎస్, బీజేపీ లీడర్లలో టెన్షన్హైదరాబాద్, సికింద్రాబాద్ కేంద్రాల్లో 14-15 రౌండ్లలో ఓట్ల లెక్కింపుచొప్పదండి, దేవరకొండ అసెంబ్లీ స్థానాల్లో 21 రౌండ్లలో కౌంటింగ్మంచిర్యాల, మంథని, పెద్దపల్లిలో 21 రౌండ్ల ఓట్ల లెక్కింపు కరీంనగర్:ఎస్ఆర్ఆర్ డిగ్రీ అండ్ పీజీ కాలేజీలో ఓట్లు లెక్కింపునకు సర్వం సిద్ధంహైదరాబాద్మల్కాజీగిరి పార్లమెంట్ కౌంటింగ్కు సర్వం సిద్ధంమొత్తం 158 టేబుల్స్19 లక్షల ఓట్ల లెక్కింపుపోస్టల్ బ్యాలెట్ కోసం మరో 20 అదనంగా టేబుల్స్ఏడు నియోజకవర్గాలకు 9 కౌంటింగ్ హాల్స్బోగారం హోలీ మేరీ కళాశాలలో కౌంటింగ్ కేంద్రంమొత్తం 178 టేబుల్స్ ఏర్పాటువీటిలో 20 టేబుల్స్ పోస్టల్ బ్యాలెట్ ఓట్ల కోసం ఏర్పాటు చేసారుమొత్తం 37 లక్షల 79 వేల 596 ఓటర్లు ఉండగా వీరిలో 19 లక్షల 19 వేల 131 ఓట్లు పోలయ్యాయిమొత్తంగా 50.78 శాతం ఓట్లు నమోదయ్యాయిఈ ఓట్లను 575 మంది సిబ్బంది లెక్కించనున్నారు నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో ఓట్ల లెక్కింపునకు సర్వం సిద్ధంనల్లగొండ స్థానానికి దుప్పలపల్లిలోని రాష్ట్ర గిడ్డంగుల సంస్థ గోడౌన్స్లో కౌంటింగ్భువనగిరి స్థానానికి అరోరా కాలేజ్ లో కౌంటింగ్ఒక్కో నియోజకవర్గానికి 14 టేబుళ్ల ఏర్పాటునల్లగొండ నియోజకవర్గంలో మొత్తం ఓటర్లు 17, 25, 465పోలైన ఓట్లు 12,77, 137నల్లగొండ లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 22భువనగిరి లోక్ సభ నుంచి పోటీ చేసిన అభ్యర్థులు: 39నల్లగొండ వివరాలుఅసెంబ్లీ నియోజకవర్గాల వారీగా పోలింగ్ బూత్ లు, రౌండ్లుమిర్యాలగూడ 264(19)సూర్యాపేట 271(20)నల్లగొండ288(21)కోదాడ296(22)హుజూర్ నగర్ 308(22)నాగార్జునసాగర్ 306(22)దేవరకొండ 328(24) నల్లగొండ లోక్ సభ పరిధిలో తొలుత పూర్తి కానున్న మిర్యాలగూడ నియోజకవర్గం ఓట్ల లెక్కింపుచివరగా పూర్తి కానున్న దేవరకొండ నియోజకవర్గ ఓట్లుభువనగిరి లోక్ సభ స్థానంమొత్తం ఓటర్లు 18,08, 585పోలైన ఓట్లు 13,88,680అసెంబ్లీ నియోజకవర్గాల వారీగా బూతులు రౌండ్లుఇబ్రహీంపట్నం 348(18 రౌండ్లు, 20 టేబుల్స్)మునుగోడు 317(18 రౌండ్లు, 18 టేబుల్స్)తుంగతుర్తి 326 (19, 18 టేబుల్స్)భువనగిరి 257(19)నకిరేకల్ 311(23 రౌండ్లు)ఆలేరు 309(23)జనగామ 278(20)భువనగిరి స్థానంలో పోలింగ్ బూతులు ఎక్కువగా ఉన్నా తొలుత పూర్తికానున్న ఇబ్రహీంపట్నం, తుంగతుర్తి, మునుగోడుహైదరాబాద్బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవీ లతఫలితాలు కోసం ఎదురు చూస్తున్నాబీజేపీ 400 సీట్లు గెలుస్తాం#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf— ANI (@ANI) June 4, 2024 నాగర్ కర్నూల్ జిల్లా:నాగర్ కర్నూల్ పార్లమెంటు ఎన్నికల కౌంటింగ్ ఎర్పాట్లు పూర్తినాగర్ కర్నూల్ ఎన్నికల రిటర్నింగ్ అధికారి, కలెక్టర్ ఉదయ్ కుమార్ఎన్నికల బరిలో 19 మంది అభ్యర్థులు7 అసెంబ్లీలో సెగ్మెంట్ లలో - 17,38,254 ఓటర్లు7 సెంబ్లీలలో 2057 పోలింగ్ కేంద్రాలుఏడు అసెంబ్లీ నియోజకవర్గాలకు పోలైన ఓట్లు - 12,07,471 (69.46%)పోస్టల్ బ్యాలెట్ ఓట్లు - 14,491. (85.95%)ఉదయం. 8-00 గంటలనుండి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభంమొదట పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుకౌంటింగ్ కేంద్రాల వద్ద పటిష్టమైన మూడంచెల భద్రతా ఏర్పాట్లుప్రతీ కౌంటింగ్ టేబుల్ వద్ద ఒక కౌంటింగ్ సూపర్వైజర్కౌంటింగ్ అసిస్టెంట్, మైక్రో అబ్జర్వర్ల ఏర్పాటుపోస్టల్ బ్యాలెట్ కు సంబంధించిన 12455 ఓట్ల లెక్కింపుకు ప్రత్యేకంగా 14 టేబుల్స్ మహబూబ్ నగర్పాలమూరు యూనివర్సిటీలో మహబూబ్ నగర్ నియోజకవర్గ ఓట్ల లెక్కింపు.ఏడు సెగ్మెంట్లలోని 1937 ఈవీఎంల కౌంటింగ్బరిలో 31 మంది అభ్యర్థులు.నాగర్ కర్నూల్వ్యవసాయ మార్కెట్ కమిటీ లో నాగర్ కర్నూల్ ఓట్ల లెక్కింపుఏడు సెగ్మెంట్లలోని 2057 ఈవీఎంల కౌంటింగ్బరిలో 19 మంది అభ్యర్థులు ఖమ్మం పార్లమెంటు సెగ్మెంట్ సంబంధించి కౌంటింగ్ మరికొద్ది సేపట్లో ప్రారంభం కానుందిఖమ్మం పార్లమెంట్ సెగ్మెంట్ లోని మొత్తం ఏడు నియోజకవర్గాలు ఉన్నాయిఖమ్మం నియోజకవర్గం సంబంధించి మాత్రం 18 టేబుల్స్ ఏర్పాటు చేయగా మిగతా ఆరు నియోజకవర్గాలకు సంబంధించి 14 టేబుల్ చొప్పున ఏర్పాటు చేశారుప్రతి టేబుల్ దగ్గర ముగ్గురు అధికారుల సమక్షంలో కౌంటింగ్ ప్రక్రియ కొనసాగనుంది కరీంనగర్ పార్లమెంట్ స్థానంలో కౌంటింగ్ కోసం కరీంనగర్ ఎస్సారార్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి..ఉదయం 8 గంట నుంచి ప్రారంభం కానున్న కౌంటింగ్..బరిలో మొత్తం 28 మంది అభ్యర్థులు..మొత్తం 17 లక్షల 97 వేల 150 మంది ఓటర్లు..పోలైన ఓట్లు 13 లక్షల 3 వేల 691..పార్లమెంట్ సెగ్మెంట్ లోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్స్ కు వేర్వేరుగా హాల్స్ ఏర్పాటు..కరీంనగర్ నియోజకవర్గానికి 18 టేబుల్స్ ఏర్పాటు..మిగిలిన 6 నియోజకవర్గాలకు 14 టేబుల్స్ చొప్పున ఏర్పాటు..రౌండ్స్ వారీగా కొనసాగనున్న లెక్కింపు ప్రక్రియ..కరీంనగర్ 22, చొప్పదండి 24, వేములవాడ 19, సిరిసిల్ల 21, మానకొండూరు 23, హుజూరాబాద్ 22, హుస్నాబాద్ 22 రౌండ్లవారీగా కొనసాగనున్న లెక్కింపు..ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ లెక్కింపుతో ప్రారంభం కానున్న ప్రక్రియ..పోస్టల్ బ్యాలెట్ కోసం 14 టేబుల్స్ ఏర్పాటు..కరీంనగర్ పార్లమెంట్ సెగ్మెంట్ లో మొత్తం 9 వేల 287 పోస్టల్ బ్యాలెట్ ఓట్లు..కౌంటింగ్ కేంద్రం వద్ద మూడంచెల భద్రత ఏర్పాటు..నేటి నుంచి రేపు ఉదయం వరకు ట్రాఫిక్ ఆంక్షల కొనసాగింపు, 144 సెక్షన్ అమలు..ఒక్క రౌండ్ ఫలితం వెల్లడి కావడానికి అరగంట సమయం..మధ్యాహ్నం వరకు విజేత ఎవరనేది స్పష్టత వచ్చే అవకాశం..ఒక్కో నియోజకవర్గంలో ర్యాండమ్ గా 5 ఈవీఎంలకు సంబంధించిన 5 వీవీ ప్యాట్ల లెక్కింపు చేయనున్న అధికారులు..ఈవీఎంలు, వీవీప్యాట్లలో లెక్క సరిపోతేనే అధికారికంగా అభ్యర్థి ప్రకటన..ఒక్కో టేబుల్ కు ముగ్గురు సిబ్బంది చొప్పున 124 మంది కౌంటింగ్ సూపర్ వైజర్స్, 124 మంది కౌంటింగ్ అసిస్టెంట్స్, 124 మంది మైక్రో అబ్జర్వర్స్ ఏర్పాటు.పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం(SC)అభ్యర్థులు 42 మందిఅసెంబ్లీ నియోజకవర్గం టేబుల్స్ రౌండ్స్ చెన్నూర్ నియోజకవర్గం 14 16 బెల్లంపల్లి నియోజకవర్గం 14 16మంచిర్యాల నియోజకవర్గం 14 21 ధర్మపురి నియోజకవర్గం 14 19రామగుండం నియోజకవర్గం 14 19మంథని నియోజకవర్గం 14 21పెద్దపల్లి నియోజకవర్గం 14 21పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గం కౌంటింగ్ టేబుల్స్ 98, రౌండ్స్ 132#WATCH | BJP candidate from Hyderabad, Madhavi Latha says, "I am pretty excited and all of them who have voted for BJP in the entire country are looking forward for especially this particular seat that we win and bring justice to Hyderabad. We all know that PM Modi in the entire… pic.twitter.com/tqz0YMhjwf— ANI (@ANI) June 4, 2024 రాష్ట్రంలో ఏ పార్టీ ఎన్ని లోక్సభ సీట్లు సాధిస్తుందన్న ఉత్కంఠకు కొన్ని గంటల్లో తెరపడనుంది.మంగళవారం ఉదయమే ఓట్ల లెక్కింపు మొదలుకానుంది.ఈ మేరకు ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈఓ) వికాస్రాజ్ ప్రకటించారు.గత నెల 13న రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాలకు సాధారణ ఎన్నికలతోపాటు కంటోన్మెంట్ అసెంబ్లీ స్థానానికి ఉప ఎన్నిక జరిగిన విషయంతెలిసిందే.కంటోన్మెంట్ సీటు ఓట్లను సైతం మంగళవారం లెక్కించి ఫలితాలను ప్రకటిస్తారు.మొత్తంగా 525 మంది అభ్యర్థులు పోటీపడగా.. 2,18,14,025 మంది ఓటుహక్కు వినియోగించుకున్నారు.65.67శాతం పోలింగ్ నమోదైంది.లోక్సభ ఓట్ల లెక్కింపు కోసం రాష్ట్రవ్యాప్తంగా 34 ప్రాంతాల్లో.. మొత్తం 139 కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశారు.ఇందులో 120 హాళ్లలో ఈవీఎం ఓట్లు, 19 హాళ్లలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లను లెక్కించనున్నారు.ఒక్కో అసెంబ్లీ స్థానానికి ఒక కౌంటింగ్ హాల్ ఉంటుంది. ఒక్కో హాల్లో 24 టేబుల్స్ ఉంటాయి.మహేశ్వరం స్థానం పరిధిలో 28 టేబుల్స్ ఏర్పాటు చేయాల్సి రావడంతో రెండు హాళ్లలో ఓట్లను లెక్కించనున్నారు.దీంతో ఈవీఎం ఓట్ల కౌంటింగ్ హాళ్ల సంఖ్య 120కి పెరిగింది. మొత్తం 10వేల మంది సిబ్బంది ఈ ప్రక్రియలో పాల్గొననున్నారు.చొప్పదండి, యాకూత్పుర, దేవరకొండ అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన లోక్సభ ఓట్లను అత్యధికంగా 24 రౌండ్లలో లెక్కించనున్నారు.ఆర్మూరు, భద్రాచలం, అశ్వారావుపేట అసెంబ్లీ స్థానాల పరిధిలో పోలైన ఓట్లను అత్యల్పంగా 13 రౌండ్లలో లెక్కిస్తారు.చాలా స్థానాల పరిధిలో 18 నుంచి 21 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది.ఒక్కో టేబుల్ వద్ద ఒక మైక్రో అబ్జర్వర్, ఒక ఏఆర్ఓ, ఇద్దరు సహాయకులు, అభ్యర్థుల కౌంటింగ్ ఏజెంట్లు ఉంటారు.ప్రతి రౌండ్ ఓట్ల లెక్కింపును మైక్రో అబ్జర్వర్ పర్యవేక్షిస్తారు. ఏకకాలంలో అన్ని టేబుళ్లలో నిర్వహించే లెక్కింపును ఒక రౌండ్గా పరిగణిస్తారు.అలా రౌండ్ల వారీగా లెక్కింపు ప్రక్రియ కొనసాగుతుంది. ప్రతి రౌండ్ వివరాలను కేంద్రం నుంచి వచి్చన పరిశీలకుడి పరిశీలనకు పంపిస్తారు.పరిశీలకుల ఆమోదం తర్వాత తదుపరి రౌండ్ లెక్కింపును ప్రారంభిస్తారు.అదే సమయంలో ఒక్కో రౌండ్ లెక్కింపు పూర్తయిన కొద్దీ.. స్థానిక ఆర్వో/ఏఆర్వో మీడియా రూమ్ వద్దకు వచ్చి ఫలితాలను ప్రకటిస్తారు.రౌండ్ల వారీగా ఫలితాలపై ఫారం–17సీ మీద కౌంటింగ్ ఏజెంట్ల సంతకాలు తీసుకుంటారు.ప్రతి శాసనసభ స్థానం పరిధిలో ర్యాండమ్గా ఐదు పోలింగ్ కేంద్రాలను ఎంపిక చేసి.. ఈవీఎంలలోని ఓట్లను, వీవీ ప్యాట్ స్లిప్పులను సరిపోల్చి చూస్తారు.ఎన్నికల ఫలితాలను ప్రదర్శించడానికి 78 ప్రాంతాల్లో స్క్రీన్లను ఏర్పాటు చేశారు. కౌంటింగ్ కేంద్రాల వద్ద మూడంచెల భద్రత ఏర్పాట్లు చేశారు.కౌంటింగ్ కేంద్రంలోకి ఎన్నికల సంఘం అనుమతి ఉన్న వ్యక్తులను మాత్రమే రానిస్తారు.నేడు మద్యం షాపులు బంద్లోక్సభ ఓట్ల లెక్కింపు నేపథ్యంలో మంగళవారం రోజున తెలంగాణలో మద్యం దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశించారు.ఇక ఫలితాలు వచి్చన తర్వాత విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడానికి అనుమతి లేదు.స్థానిక పరిస్థితులకు అనుగుణంగా పోలీసులు ముందుగా అనుమతిస్తే ర్యాలీలు చేసుకోవచ్చు.ఉదయం 10.30 కల్లా ఆధిక్యతపై స్పష్టత!మంగళవారం ఉదయం 8 గంటలకు పోస్టల్ బ్యాలెట్ ఓట్ల లెక్కింపు మొదలవుతుంది.2.18లక్షల పోస్టల్ బ్యాలెట్లు పోలైన నేపథ్యంలో లెక్కింపునకు ఎక్కువే సమయం పట్టే అవకాశం ఉంది.ఇక 8.30 గంటలకు ఈవీఎం ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుంది. ఉదయం 10.30 గంటల కల్లా చాలా లోక్సభ స్థానాల్లో ఎవరు ఆధిక్యతలో ఉన్నారనేది తేలే అవకాశం ఉంది.మధ్యాహ్నం 12.30 గంటలకల్లా విజయావకాశాలపై స్పష్టత వచ్చే చాన్స్ ఉంది. -
ఓట్ల లెక్కింపులో అప్రమత్తంగా ఉండాలి
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఓట్ల లెక్కింపు మంగళవారం జరగనున్న నేపథ్యంలో అభ్యర్థులు, పార్టీ నేతల సన్నద్ధతపై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరా తీశారు. సోమవారం పలువురు పార్టీ నేతలకు కేసీఆర్ ఫోన్ చేశారు. ఓట్ల లెక్కింపు సందర్భంగా వ్యవహరించాల్సిన తీరుపై దిశానిర్దేశం చేశారు. లోక్సభ సెగ్మెంట్ల వారీగా పార్టీ తరఫున పోలింగ్ ఏజెంట్ల నియామకంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై పలు సూచనలు చేశారు.ఓట్ల లెక్కింపు చివరిరౌండ్ పూర్తయ్యే వరకు ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రంలోనే ఉండేలా చూసుకోవాలన్నారు. చాలా నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ప్రధాన ప్రత్యరి్థగా గట్టి పోటీనిస్తున్నందున ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. లెక్కింపు ప్రారంభానికి ముందే పార్టీ తరఫున నియమితులైన పోలింగ్ ఏజెంట్లు కౌంటింగ్ కేంద్రానికి చేరుకునేలా ఎంపీ అభ్యర్థులు సమన్వయం చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. ముగిసిన దశాబ్ది ఉత్సవాలు మూడు రోజులపాటు బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జరి గిన తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలు సోమవారం ముగిశాయి. సిరిసిల్లలో కేటీఆర్ జాతీ య జెండాతోపాటు పార్టీ జెండా ఎగురవేశారు. రాష్ట్రవ్యాప్తంగా పార్టీ నేతలు, శ్రేణులు ఆస్పత్రుల్లో పండ్ల పంపిణీ, అన్నదానం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. హరీశ్రావు జన్మదినం సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలిపారు. -
కౌంటింగ్ వేళ నిర్లక్ష్యం వద్దు: సీఎం
సాక్షి, హైదరాబాద్: కౌంటింగ్ రోజున ఎన్నికల్లో పోటీ చేసిన కాంగ్రెస్ అభ్యర్థులు, కౌంటింగ్ కేంద్రాలకు వెళ్లే ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలని టీపీసీసీ అధ్యక్షుడు, సీఎం ఎ.రేవంత్రెడ్డి సూచించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యంగా ఉండవద్దని, పోటాపోటీగా ఉంటాయని భావిస్తున్న చోట్ల మరింత అప్రమత్తంగా ఉండి కౌంటింగ్ పూర్తయ్యేంతవరకు కేంద్రాల్లోనే ఉండాలని స్పష్టం చేశారు.నేడు లోక్సభ ఎన్నికల ఫలితాల నేపథ్యంలో సోమవారం సీఎం రేవంత్ ఎంపీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు, ఇంచార్జి మంత్రులు, ఏఐసీసీ కార్యదర్శులతో జూమ్ ద్వారా సమావేశమయ్యారు. సమావేశంలో రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి దీపాదాస్మున్షీ, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్కుమార్గౌడ్ కూడా పాల్గొన్నారు. నిబద్ధత ఉన్న కార్యకర్తలనే ఏజెంట్లుగా జూమ్ సమావేశంలో భాగంగా రేవంత్ మాట్లాడు తూ ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో నిబద్ధత కల కార్యకర్తలను మాత్రమే ఏజెంట్లుగా పంపాలని, సీ నియర్ నేతలను కూడా కౌంటింగ్ కేంద్రాల వద్దకు తీసుకెళ్లాలని సూచించారు. పోలైన ఓట్లతో 17సీ లిస్ట్ సరిపోలాలని, ఈవీఎంలో లెక్కించిన ఓట్లతో 17సీ లిస్టులోని ఓట్లు సరిపోలకపోతే వెంటనే ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేయాలని సూచించారు. అన్ని విషయాలపై అవగాహన ఉన్న వారిని ఏజెంట్లు పంపేలా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, ఏజెంట్లంతా కౌంటింగ్ ప్రక్రియ పూర్తయ్యేంతవరకు అక్కడే ఉండేలా చూడాలని ఎంపీ అభ్యర్థులకు సీఎం రేవంత్ దిశానిర్దేశం చేశారు. -
లోక్సభ ఓట్ల లెక్కింపుపై ‘డబుల్’ ఉత్కంఠ
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల ఫలితాల వేళ తెలంగాణలో ఉత్కంఠ నెలకొంది. పోలింగ్ జరిగిన 22 రోజుల తర్వాత జరుగుతున్న ఓట్ల లెక్కింపు కో సం రాష్ట్రంలోని ప్రధాన రాజకీయ పక్షాలు ఎదురుచూస్తున్నాయి. పోలింగ్ సరళి, ఎగ్జిట్ పోల్స్ను బ ట్టి.. రాష్ట్రంలో పోటీ రెండు జాతీయ పార్టీల మధ్యే జరిగిందన్న అంచనాలు వెలువడ్డాయి. దీంతో కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు కూడా మెజార్టీ సీట్లు త మకంటే తమకేనని.. డబుల్ డిజిట్ స్థానాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. కచ్చితంగా పది స్థానాలు గెలుస్తామని కాంగ్రెస్.. పది కంటే ఎక్కువే గెలుస్తామని బీజేపీ నేతలు చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ ఎన్ని స్థానాల్లో గెలుస్తామన్న దానిపై క చ్చితమైన లెక్కలు చెప్పకపోయినా.. కనీస స్థానా ల్లో విజయం దక్కుతుందని ఆశిస్తోంది. మరోవైపు జాతీయ స్థాయిలో ఏ పార్టీ పరిస్థితి ఎలా ఉండబోతోందన్న దానిపైనా రాష్ట్రంలో చర్చ జరుగుతోంది. 12 సీట్లు కూడా రావొచ్చంటున్న కాంగ్రెస్ అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపుతో ఊపు మీదున్న కాంగ్రెస్ పార్టీ.. లోక్సభ ఎన్నికల్లోనూ సానుకూల ఫలితాలు వస్తాయనే అంచనాలో ఉంది. కనీసం తొమ్మిది, పది స్థానాల్లో గెలుస్తామన్న ధీమా ఆ పార్టీ నేతల్లో కనిపిస్తోంది. పోలింగ్ సరళిని బట్టి చూస్తే మరో రెండు, మూడు సీట్లు కూడా గెలుస్తామని కాంగ్రెస్ నేతలు చెబుతున్నారు. దక్షిణ తెలంగాణలోని నల్లగొండ, భువనగిరి, మహబూబ్నగర్, నాగర్కర్నూల్తోపాటు అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ పూర్తి పట్టు సాధించిన వరంగల్, మహబూబాబాద్, పెద్దపల్లి లోక్సభ స్థానాల్లో కాంగ్రెస్ గెలుపు నల్లేరు మీద నడకేనని అంటున్నారు. సికింద్రాబాద్, ఆదిలాబాద్ స్థానాల్లోనూ విజయం సాధిస్తామని లెక్కలు వేస్తున్నారు. చేవెళ్ల, మల్కాజ్గిరి, జహీరాబాద్ లోక్సభ స్థానాల్లో బీజేపీ నుంచి గట్టిపోటీ ఎదురైనా.. విజయ తీరం చేరుతామనే అంచనాలో ఉన్నారు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ బలహీనపడటం, బీజేపీకి సంస్థాగత బలం లేకపోవడం, అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే ఎన్నికలు రావడంతో పెద్దగా ప్రజా వ్యతిరేకత లేకపోవడం, గ్రామీణ స్థాయిలో పార్టీకి ఉన్న పట్టు వంటివి అనుకూలిస్తాయని ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోదీ మేజిక్తో బీజేపీదే హవా అంటున్న కమలనాథులు మోదీ మేజిక్తో తెలంగాణలోనూ బీజేపీ హవా కొనసాగుతుందని ఆ పార్టీ ముఖ్య నేతలు విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణలో డబుల్ డిజిట్ సీట్లు గెలిచి సత్తా చాటుతామని అంటున్నారు. ఎగ్జిట్ పోల్స్లో వెలువడిన అంచనాలను మించి సీట్లు సాధిస్తామని చెబుతున్నారు. గత ఎన్నికల్లో గెలిచిన నాలుగు ఎంపీ సీట్లకు అదనంగా మరో ఆరేడు సీట్లు గెలుస్తామని అంటున్నారు. రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల్లో జాతీయ పార్టీలే ప్రభావం చూపాయని కమలనాథులు చెబుతున్నారు. కేంద్రంలో మళ్లీ మోదీ ప్రభుత్వం ఏర్పడుతుందనే అంచనాలు తమకు ఉపకరించాయని.. ఈ ఎఫెక్ట్తో పలు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీ అయ్యాయని అంచనా వేస్తున్నారు. ఎగ్జాక్ట్ పోల్స్ తమకే అనుకూలమంటూ బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల ఫలితాల్లో ఎగ్జిట్ పోల్స్తో సంబంధం లేకుండా ఎగ్జాక్ట్ పోల్స్ ఫలితాలు తమకు అనుకూలంగా ఉంటాయని బీఆర్ఎస్ అంటోంది. బీఆర్ఎస్ ఒకట్రెండు స్థానాలకు మించి గెలిచే అవకాశం లేదని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొన్నా.. బీఆర్ఎస్ మాత్రం అంతకంటే మెరుగైన ఫలితాలు సాధిస్తామని ధీమా వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో ఎనిమిది లోక్సభ సెగ్మెంట్ల పరిధిలో బీఆర్ఎస్ ఆధిక్యత కనబర్చిందని.. అదే తరహాలో ఇప్పుడు ఫలితాలు ఉంటాయని అంచనా వేసుకుంటోంది. అసెంబ్లీ ఎన్నికల తరహాలో ఇప్పుడు కాంగ్రెస్ అనుకూల ఓటింగ్ జరగలేదని.. అదే సమయంలో బీజేపీ భారీగా ఏమీ పుంజుకోలేదని బీఆర్ఎస్ నేతలు చెబుతున్నారు. బీఆర్ఎస్తో పోలిస్తే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకే ఎక్కువగా గండి పడిందని పేర్కొంటున్నారు. అంతేగాకుండా పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ 17 రోజుల పాటు చేసిన బస్సుయాత్ర కూడా ప్రభావం చూపిందని.. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్కు వ్యతిరేకంగా ఓటేసినవారిలో కొంత మేర తిరిగి అనుకూలంగా మారారని చెబుతున్నారు. కాంగ్రెస్, బీజేపీతో జరిగిన ముక్కోణపు పోటీ బీఆర్ఎస్కు అక్కడక్కడా అనుకూలిస్తుందనే అంచనా వేస్తున్నారు.ఢిల్లీ పీఠం ఎవరిదో..?లోక్సభ ఎన్నికల్లో జాతీయ స్థాయి ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపై తెలంగాణ రాజకీయ వర్గాల్లో విస్తృత చర్చ జరుగుతోంది. ఈసారి కూడా మోదీ నేతృత్వంలో బీజేపీ అధికారంలోకి వస్తుందని మెజారిటీ ఎగ్జిట్ పోల్స్ పేర్కొనడం ఓవైపు.. ఎగ్జిట్ పోల్స్ ఫెయిలవుతాయని, ఇండియా కూటమి గెలుస్తుందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ చేసిన కామెంట్స్ మరోవైపు ఉత్కంఠ రేపుతున్నాయి. దేశవ్యాప్తంగా మోదీ ప్రభావం ఎలా ఉంటుంది?ఇండియా కూటమికి ఉన్న సానుకూలతలేంటి? ఏ రాష్ట్రంలో ఎవరికి ఎన్ని సీట్లు వస్తాయనే అంశాలపై చర్చ జరుగుతోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఫలితాలు ఎలా ఉంటాయన్నదానిపైనా తెలంగాణ రాజకీయ వర్గాల్లో ఎడతెగని చర్చ నడుస్తోంది.ఆ స్థానాలపై మరింత ఆసక్తితెలంగాణలోని నాలుగైదు నియోజకవర్గాల్లో ఫలితం ఎలా ఉంటుందన్నది ఆసక్తికరంగా మారింది. బీజేపీ నేత, కేంద్ర మంత్రి జి.కిషన్రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా గెలిచి కాంగ్రెస్ తరఫున ఎంపీ అభ్యరి్థగా బరిలోకి దిగిన దానం నాగేందర్ తలపడుతున్న సికింద్రాబాద్ ఫలితంపై అందరి ఫోకస్ ఉంది. పీసీసీ చీఫ్, సీఎం రేవంత్రెడ్డి గతంలో ప్రాతినిధ్యం వహించిన మల్కాజ్గిరి.. ఎన్డీయే ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే కేంద్ర మంత్రి అయ్యే చాన్స్ ఉందంటున్న బండి సంజయ్ బరిలో ఉన్న కరీంనగర్.. బీఆర్ఎస్ నుంచి బీజేపీలో చేరిన నేతలు పోటీ చేస్తున్న జహీరాబాద్, నాగర్కర్నూల్, వరంగల్ తదితర స్థానాల్లో ఫలితాలపైనా ఆసక్తి ఉంది. -
జై తెలంగాణ ఎక్కడ?.. సీఎం రేవంత్పై హరీష్రావు ఫైర్
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రానికి అత్యంత అవసరమని ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. బీఆర్ఎస్ పార్టీ ప్రశ్నించే గొంతుక అని తెలిపారు. సోమవారం హరీశ్రావు మీడియాతో మట్లాడారు. ‘రాష్ట్ర ప్రయోజనాల కాపాడాలంటే మాజీ సీఎం కేసీఆర్ శ్రీరామ రక్ష. ప్రభుత్వం ఇచ్చిన యాడ్లో జై తెలంగాణ పదం లేదు. తెలంగాణ హక్కులు కాపాడే పార్టీ బీఆర్ఎస్. రేవంత్ రెడ్డి ఏనాడూ జై తెలంగాణ అనలేదు. సీఎం రేవంత్ రెడ్డి ఎప్పటికీ తెలంగాణ ఉద్యమ కారుడు కాలేడు. రేవంత్ రెడ్డి ఉద్యమ ద్రోహి అవుతాడు తప్ప ఉద్యమ కారుడు కాదు. ఉద్యమం కోసం ఎన్నిసార్లు అయినా మేం జైలుకి వెళ్ళాం’ అని అన్నారు. -
పైకి ధీమా.. లోన టెన్షన్!
సాక్షి, కామారెడ్డి: ఓట్ల లెక్కింపునకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ నేతల్లో టెన్షన్ పెరుగుతోంది. పైకి గెలుపు ధీమాతో ఉన్నట్లు కనిపిస్తున్నప్పటికీ ఫలితం ఎలా ఉంటుందోనని లోలోన టెన్షన్ పడుతున్నా రు. ఎగ్జిట్ పోల్స్ వెలువడిన నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా జోరుగా చర్చలు నడుస్తున్నాయి.జహీరాబాద్ లోక్సభ నియోజక వర్గం భిన్న సంస్కృతులకు నిలయం. ఇక్కడ ఒక పర్యాయం కాంగ్రెస్ విజయం సాధించగా, రెండుసార్లు బీఆర్ఎస్ గెలుపొందింది. నాలుగోసారి జరిగిన ఎన్నికలలో ఎవరు గెలుస్తారన్న దానిపై ఉత్కంఠ నెలకొంది. పార్లమెంటు నియోజకవర్గం పరిధిలో గత అసెంబ్లీ ఎన్నికల్లో నాలుగు చోట్ల కాంగ్రెస్ పార్టీ గెలవగా, రెండుచోట్ల బీఆర్ఎస్, ఒక్క స్థానంలో బీజేపీ విజయం సాధించాయి. రాష్ట్రంలో అధికారంలో ఉండడం, గ్యాంరటీ పథకాల అమలు తమకు కలిసి వస్తాయని కాంగ్రెస్ భావిస్తోంది. ఆ పార్టీ అభ్యర్థి, మాజీ ఎంపీ సురేశ్ షెట్కార్ గెలుపు కోసం జోరుగా ప్రచారం చేశారు. అన్ని ప్రాంతాల్లో పార్టీ శ్రేణులు శ్రమించాయి. దీంతో గెలుపుపై కాంగ్రెస్ పార్టీ నమ్మకంతో ఉంది.జహీరాబాద్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ వరుసగా రెండుసార్లు విజయం సాధించింది. అ సెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ బలమైన క్యా డర్ ఉండడంతో పార్లమెంట్ ఎన్నికలలో గెలుస్తామ ని ఆ పార్టీ నేతలు భావిస్తున్నారు. పదేళ్లు అధికారంలో ఉన్న సమయంలో అమలు చేసిన ఆసరా పింఛన్లు, రైతుబంధు వంటి పథకాల ద్వారా లబి్ధపొందినవారు తమ అభ్యర్థి గాలి అనిల్కుమార్కే ఓటేశారని, దీంతో జహీరాబాద్లో హ్యాట్రిక్ ఖాయమన్న ధీమాతో గులాబీ లీడర్లు ఉన్నారు.అయోధ్యలో రామాలయ నిర్మాణం అంశంతోపాటు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చరిష్మాను నమ్ముకున్న బీజేపీ సైతం జహీరాబాద్ స్థానంపై ఆశలు పెట్టుకుంది. అసెంబ్లీ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఒక్క కామారెడ్డిలోనే ఆ పార్టీ విజయం సాధించింది. అయితే ఓటర్లు మూడోసారి మోదీ రావాలని బలంగా కోరుకున్నారని, దీంతో మారుమూల గ్రామాల్లో సైతం తమకు అనుకూల వాతావరణం ఏర్పడిందని బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. ఈసారి జహీరాబాద్లో ఎగిరేది కాషాయ జెండానే అని ధీమా వ్యక్తం చేస్తున్నారు. హ్యాట్రిక్ విజయంపై ఆ పార్టీ అభ్యర్థి బీబీ పాటిల్ నమ్మకంతో ఉన్నారు. విభిన్నంగా ఎగ్జిట్ పోల్స్..జహీరాబాద్ ఎంపీ స్థానంలో ఏ పార్టీ గెలుస్తుందన్న దానిపై స్పష్టత కొరవడింది. ఎగ్జిట్ పోల్స్ సంస్థలు ప్రకటించిన ఫలితాలు సైతం విభిన్నంగా ఉన్నాయి. కొన్ని సంస్థలు బీజేపీ గెలుస్తుందని చెప్పగా.. మరికొన్ని కాంగ్రెస్ వైపు మొగ్గు చూపాయి. ఒకటిరెండు సంస్థలు బీఆర్ఎస్కూ విజయావకాశాలు ఉన్నాయని పేర్కొన్నాయి. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీల నేతల్లో ఉత్కంఠ నెలకొంది. నియోజకవర్గ వ్యాప్తంగా ఎగ్జిట్పోల్స్పై జోరుగా చర్చ జరుగుతోంది. ఎగ్జిట్ పో ల్స్ ఒక్కోటి ఒక్కో తీరుగా ఫలితాలు వెలువరించిన నేపథ్యంలో ఏది నమ్మాలో తెలియని పరిస్థితుల్లో ఆయా పారీ్టల నేతలు తమ క్యాడర్ ఇచ్చి న సమాచారం ప్రకారం తమదే గెలుపంటూ ధీమాతో ఉన్నారు. మంగళవారం ఓట్ల లెక్కింపుతో అభ్యర్థుల భవితవ్యం తేలిపోనుంది.ఇవి చదవండి: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు -
బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డిపై కేసు
జనగామ జిల్లా: బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి పై ఎన్నికల నిబంధన ఉల్లంఘించారంటూ పోలీసులు కేసు నమోదైంది . గత ఏడాది నవంబరు 30న జరిగిన అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ కేంద్రంలోకి పార్టీ కండువాతో చొరబడి ఓటర్లను మభ్యపెట్టారంటూ కాంగ్రెస్ నాయకులు కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు.దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ అదే రోజు అప్పటి రిటర్నింగ్ ఆఫీసర్ పాటు పోలీసులకు కాంగ్రెస్ స్టేట్ యూత్ లీడర్, కాంగ్రెస్అభ్యర్థి పోలింగ్ ఏజెంట్ కొమ్మూరి ప్రశాంత్రెడ్డి ఫిర్యాదు చేశారు. కండువాతో పోలింగ్ బూత్ కి వెళ్లవద్దని ఎంత చెప్పినా వినలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. 'బలవంతంగా పోలింగ్ బూత్ లోకి చొచ్చుకు వెళ్లి ఎన్నికల కోడ్ ఉల్లంఘించాడని సదరు ఫొటో ఆధారాలను జత చేస్తూ ఫిర్యాదు చేశారు. దీనిపై పోలీసులు తాజాగా శనివారం కేసు నమోదు చేశారు. 188 ఐపీసీ, 130 ఆర్పీ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన విషయం ఆదివారం బయటకు వచ్చింది. ఈ విషయమై పోలీసులను వివరణ కోరగా కేసు నమోదైంది వాస్తవమేనని చెప్పారు. -
సీఎం రేవంత్రెడ్డి.. దీనికి ఏం సమాధానం చెప్తారు?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: కరెంట్ కోతల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి విమ ర్శలు గుప్పించారు. సీఎం రేవంత్ రెడ్డి కరెంట్ కోతలు లేవుని, 24 గంటలు నాణ్యమైన కరెంట్ను తమ ప్రభుత్వం సరాఫరా చేస్తుందని చెప్పారు. అలా చెప్పి 24 గంటలు కూడా కాకముందే ప్రజలు కరెంట్ కోసం రోడ్డు మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారని ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు.CM Revanth says NO power cuts & 24 Hour uninterrupted, quality power is being supplied Why are these people protesting at Substation ? https://t.co/xlAK3PDFcA— KTR (@KTRBRS) June 3, 2024 హైదరాబాద్లోని ఉప్పల్లో రాత్రి కరెంట్ లేక సబ్ స్టేషన్ ముందు ప్రజలు ధర్నాలు చేశారని తెలిపారు. దీనికి సీఎం రేవంత్ రెడ్డి ఏం సమాధానం చెబుతారు? అని కేటీఆర్ సూటిగా ప్రశ్నించారు. ప్రస్తుతం ఈ వీడియో షోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. -
Telangana: కౌంటింగ్కు ఏర్పాట్లు పూర్తి.. ఫస్ట్ రిజల్ట్ అక్కడే..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో లోక్సభ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్ ప్రక్రియకు ఏర్పాట్లు పూర్తి అయ్యాయి. ఉదయం ఎనిమిది గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుంది. రాష్ట్రంలోని 17 లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపును పగడ్బంధీగా నిర్వహించేందుకు ఎన్నికల సంఘం అన్ని ఏర్పాట్లు చేసింది.కాగా, తెలంగాణ వ్యాప్తంగా 34 ప్రాంతాల్లో కౌంటింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 49 మంది అబ్జర్వర్లు ఉంటారు. తెలంగాణ వ్యాప్తంగా కౌంటింగ్కు 10వేల మంది సిబ్బంది పనిచేస్తున్నారు. అలాగే, మరో 50 శాతం మంది అడిషనల్గా అందుబాటులో ఉండనున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 2440 మంది మైక్రో అబ్జర్వర్లను నియమించామని.. ప్రతీ టేబుల్ వద్ద అధికారులు పరిశీలిస్తారని ఈసీ తెలిపింది.కౌంటింగ్లో భాగంగా మధ్యాహ్నం మూడు గంటల వరకు పోలింగ్ ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కౌంటింగ్లో అత్యధికంగా చొప్పదండి, యాకూత్పుర, దేవరకొండలో 24 రౌండ్లు ఉండగా.. అత్యల్పంగా ఆర్మూర్, భద్రాచలం, అశ్వరావుపేటలో 13 రౌండ్లు ఉన్నాయి. ఇక, చేవెళ్ల, మల్కాజ్గిరిలో పోస్టల్ బ్యాలెట్ ఈ- కేంద్రాలు ఉన్నాయి. రాష్ట్రంలో 2లక్షల 80వేల వరకు పోస్టల్ బ్యాలెట్ ఓట్లు వచ్చాయని ఈసీ పేర్కొంది.అలాగే, కౌంటింగ్ కేంద్రాల వద్ద 12 కేంద్ర బలగాలతో బందోబస్తు ఏర్పాటు చేశారు. కౌంటింగ్ హాల్ మొత్తం సీసీటీవీ మానిటరింగ్ ఉంటుంది. స్ట్రాంగ్ రూమ్ నుంచి కౌంటింగ్ హాల్ వరకు సీసీటీవీలో మానిటరింగ్ చేయనున్నారు. కౌంటింగ్ పూర్తి అయ్యాక ఈవీఎంలను స్టోరేజ్ రూమ్లలో పెడతామని.. భారీ బందోబస్తు ఉంటుందని ఈసీ వెల్లడించింది. -
వార్డు సభ్యుడి నుంచి ఎమ్మెల్సీగా..
షాద్నగర్: వార్డు సభ్యుడిగా ప్రస్థానం ప్రారంభించాడు.. రాజకీయ ప్రావీణ్యతకు పదును పెట్టాడు.. యువనేతగా మొదలై జన నేతగా ఎదిగి అనతి కాలంలోనే ఎమ్మెల్సీ పీఠాన్ని అధిరోహించాడు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఘన విజయం అందుకున్నాడు నాగర్కుంట నవీన్రెడ్డి. షాద్నగర్ నియోజకవర్గం నందిగామ మండలం మొదళ్లగూడ గ్రామానికి చెందిన నాగర్కుంట శోభారెడ్డి, వెంకట్రాంరెడ్డి దంపతుల రెండో కుమారుడైన నవీన్రెడ్డి చిన్ననాటి నుంచి రాజకీయాలపై ఆసక్తి పెంచుకున్నాడు. 2006లో రాజకీయ అరంగ్రేటం చేసి అప్పట్లో జరిగిన పంచాయతీ ఎన్నికల్లో వార్డు సభ్యుడిగా పోటీ చేసి గెలుపుతోపాటు ఉప సర్పంచ్గా ఎన్నికయ్యారు.ఆ తర్వాత 2014లో కాంగ్రెస్ పార్టీ తరఫున కొత్తూరు జెడ్పీటీసీగా విజయం సాధించి ఉమ్మడి మహబూబ్నగర్ జెడ్పీ వైస్ చైర్మన్గా బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరారు. మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణరెడ్డి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ నుంచి కల్వకుర్తి ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. దీంతో ఎమ్మెల్సీ స్థానానికి ఎన్నికల సంఘం అధికారులు ఎన్నికలు నిర్వహించారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పార్టీ తరపున ఎమ్మెల్సీగా పోటీ చేసేందుకు నవీన్రెడ్డి పేరును ప్రకటించడంతో ఆయన బరిలోకి దిగారు. ఎమ్మెల్సీ స్థానానికి మార్చి 28న ఉప ఎన్నిక జరిగింది.111 ఓట్ల మెజార్టీతో ఘన విజయంఎమ్మెల్సీ బరిలో బీఆర్ఎస్ నుంచి నవీన్రెడ్డి, కాంగ్రెస్ నుంచి మన్నె జీవన్రెడ్డి, స్వతంత్ర అభ్యర్థిగా సుదర్శన్గౌడ్ బరిలో దిగారు. ఆదివారం మహబూబ్నగర్లోని బాలుర జూనియర్ కళాశాలో లెక్కింపు జరిగింది. మొత్తం 1,437 ఓట్లు పోలవగా అందులో 21 చెల్లనవిగా అఽధికారులు గుర్తించారు. మిగిలిన 1,416 ఓట్లలో బీఆర్ఎస్ అభ్యర్థి నవీన్రెడ్డికి 762 ఓట్లు, కాంగ్రెస్ అభ్యర్థి మన్నె జీవన్రెడ్డికి 653 ఓట్లు పోలయ్యాయి. స్వతంత్ర అభ్యర్థి సుదర్శన్గౌడ్కు ఒక ఓటు మాత్రమే పోలైంది. మొదటి ప్రాధాన్యత ఓట్లలో విజయం సాధించేందుకు 709 ఓట్లు రావాల్సి ఉండగా నవీన్రెడ్డికి కోటా కన్న 53 ఓట్లు అధికంగా వచ్చాయి. దీంతో ఎన్నికల అధికారులు నవీన్రెడ్డి విజయం సాధించినట్లు ప్రకటించారు. సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లాలో నవీన్రెడ్డి విజయం సాధించి కాంగ్రెస్ పార్టీకి ఝలక్ ఇచ్చారు.నవీన్రెడ్డిని అభినందించిన కేసీఆర్ఎమ్మెల్సీగా విజయం సాధించిన నాగర్కుంట నవీన్రెడ్డి ఆదివారం సాయంత్రం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నివాసానికి వెళ్లారు. ఈ సందర్భంగా నవీన్రెడ్డికి కేసీఆర్ శాలువా కప్పి సన్మానించారు. అనంతరం మాజీ మంత్రులు కేటీఆర్, శ్రీనివాస్గౌడ్, షాద్నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ తదితరులు అభినందనలు తెలిపారు. ఎమ్మెల్సీగా నవీన్రెడ్డి విజయం సాధించడంతో బీఆర్ఎస్ నేతల్లో కొత్త ఉత్సహం నెలకొంది.