breaking news
-
20న కిషన్రెడ్డి, బండి సంజయ్కి సన్మానం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రానికి చెందిన ఇద్దరు కేంద్రమంత్రులు, మరో ఆరుగురు బీజేపీ ఎంపీల సన్మాన కార్యక్రమంలో స్వల్పమార్పులు చోటుచేసుకున్నాయి. తొలుత ఈ నెల 19న వారికి సన్మాన కార్యక్రమం జరపాలని రాష్ట్ర పార్టీ నిర్ణయించిది. అయితే ఈ కార్యక్రమాన్ని 20 వతేదీ సాయంత్రానికి వాయిదా వేసినట్టుగా పార్టీ ముఖ్య నేతల సమాచారం. ఈ నెల 19న ప్రధాని నరేంద్రమోదీ అధ్యక్షతన నూతన కేబినెట్ తొలిసమావేశం జరగనుండడంతో ఈ మార్పు జరిగినట్టు తెలుస్తోంది.ఈ భేటీకి కేబినెట్ మంత్రి హోదాలో బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్రెడ్డి తప్పనిసరిగా పాల్గొనాల్సి ఉంది. ఈ నేపథ్యంలో సన్మాన కార్యక్రమం 19వ తేదీకి బదులు 20వ తేదీకి వాయిదా వేసినట్టు పార్టీవర్గాల సమాచారం. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండిసంజయ్కుమార్ 19న నగరానికి చేరుకుని కరీంనగర్కు వెళ్తారు. 20వ తేదీ సాయంత్రం తిరిగి ఆయన బేగంపేట ఎయిర్పోర్టుకు చేరుకుని, కేంద్రమంత్రి కిషన్రెడ్డి, మిగతా ఎంపీలతో కలిసి ఓపెన్టాప్ జీప్లో ర్యాలీగా పార్టీ ఆఫీసుకు చేరుకుంటారని తెలుస్తోంది. సన్మాన కార్యక్రమం ఇలా... గురువారం (20న) సాయంత్రం 4గంటలకు బేగంపేట ఎయిర్పోర్టు నుంచి నాంపల్లిలోని పార్టీ కార్యాలయం వరకు కేంద్రమంత్రులు, ఎంపీలను ర్యాలీగా తీసుకు రానున్నారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ‘సెల్యూట్ తెలంగాణ’పేరిట సన్మాన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా రాష్ట్రం నుంచి గెలిచిన 8 మంది ఎంపీలు, అసెంబ్లీకి గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీ ఏవీఎన్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు డా.కె.లక్ష్మణ్ (యూపీ నుంచి ప్రాతినిధ్యం)ను ఘనంగా సన్మానించనున్నారు. బేగంపేట నుంచి ఓపెన్టాప్ జీప్లలో వారిని కార్యాలయం వరకు వాహనాల కాన్వాయ్లో మేళతాళాలు, సాంస్కృతిక కార్యక్రమాలతో ఊరేగింపుగా తీసుకురానున్నారు. మోదీకి ధన్యవాద సభ ఇక రాష్ఠ్రం నుంచి ఎనిమది మంది ఎంపీలను గెలుచుకోవడం పట్ల.. ప్రధాని మోదీకి కృతజ్ఞతలు తెలుపుతూ ధన్యవాద సభ నిర్వహించనున్నారు. అనంతరం చార్మినార్ శ్రీభాగ్యలక్ష్మి అమ్మవారి ఆలయంలో ఎంపీలు, ఎమ్మెల్యేలు ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. కాగా, కొద్దిరోజుల తర్వాత పార్టీ జాతీయనేతల ఆధ్వర్యంలో, రాష్ట్రంలో పెద్దఎత్తున మోదీ ధన్యవాద సభ’నిర్వహించాలని నిర్ణయించారు. సోమవారం బీజేపీ కార్యాలయంలో జరిగిన రాష్ట్ర పదాధికారు ల, రాష్ట్ర కార్యదర్శుల, జిల్లా అధ్యక్షుల సమావేశంలో ఎంపీలకు స్వాగత ఏర్పాట్లపై చర్చించారు. సమావేశంలో పార్టీ రాష్ట్ర ప్రధా న కార్యదర్శులు (సంస్థాగత) చంద్రశేఖర్ తివారీ, డా.కాసం వెంకటేశ్వర్లు యాదవ్, ఉపాధ్యక్షుడు చింతల రామచంద్రారెడ్డి, వివిధ మోర్చాల అధ్యక్షులు పాల్గొన్నారు. 21న అన్ని మండలాల్లో యోగా డే కాసం వెంకటేశ్వర్లు మీడియాతో మాట్లాడు తూ, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని ‘సెల్యూట్ తెలంగాణ’ర్యాలీని విజయవంతం చేయాలని కోరారు. ఈ నెల 21న ఇంటర్నేషనల్ యోగా డేను పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో యోగా దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించామన్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో (2028) రాష్ట్రంలో 88 సీట్లలో గెలుపే లక్ష్యంగా ఇప్పటి నుంచే ముందుకు సాగాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నట్టు కాసం తెలియజేశారు. -
12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది మేమే
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రజలకు ఇచ్చిన ప్రతి హామీకి కట్టుబడి ఉన్నామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్బాబు స్పష్టం చేశారు. బీఆర్ఎస్ హయాంలో ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎదురుచూసే పరిస్థితి ఉండేదన్నారు. 12 ఏళ్ల తర్వాత గ్రూప్–1 పరీక్ష నిర్వహించింది కాంగ్రెస్ పార్టీ హయాంలోనేనని బీఆర్ఎస్ నేతలు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. ఈ మేరకు బీఆర్ఎస్ నేతలు హరీశ్, కేటీఆర్ల ఆరోపణలను కౌంటర్ చేస్తూ సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.‘ఆశ వర్కర్ల గురించి మాట్లాడే అర్హత హరీశ్రావుకు లేదు. బీఆర్ఎస్ హయాంలో ఆశవర్కర్లను గుర్రాలతో తొక్కించారు. మేం అధికారంలోకి వచ్చిన తర్వాత అస్తవ్యస్త ఆర్థిక వ్యవస్థను సరిదిద్దుతున్నాం. మూడునెలల మా పాలన పూర్తయ్యేలోపే ఎన్నికల కోడ్ వచి్చంది. ఇప్పుడే కోడ్ అయిపోయింది. అన్ని హామీలు అమలు చేస్తాం. త్వరలోనే జాబ్ కేలండర్ విడుదల చేస్తాం.’అని తెలిపారు. శాంతిభద్రతల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం చాలా సీరియస్గా ఉందని, మతఘర్షణల వెనుక ఎవరున్నా కఠిన చర్యలు తీసుకుంటామని ఆ ప్రకటనలో మంత్రి శ్రీధర్బాబు వెల్లడించారు. -
కాళ్ల మీద పడినా కనికరించడం లేదు: హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: తమ సమస్యలు పరిష్కరించడంతో పాటు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటూ గ్రూప్ 1, గ్రూప్ 2 పోటీ పరీక్షల అభ్యర్థులు, నిరుద్యోగులు ప్రజా దర్బార్లో కాంగ్రెస్ నేతల కాళ్ల మీద పడుతున్నా కనికరించడం లేదని మాజీ మంత్రి హరీశ్రావు విమర్శించారు. నిరుద్యోగులను రెచ్చగొట్టి, అనేక హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్.. ఇప్పుడు మాట తప్పుతోందన్నారు. గ్రూప్ 1, గ్రూప్ 2 పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు తమ సమస్యల పరిష్కారం కోసం బీఆర్ఎస్ కార్యాలయం తెలంగాణ భవన్ వద్దకు వచ్చి విన్నవించుకుంటున్నారని పేర్కొన్నారు. మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్రెడ్డి, ఎమ్మెల్సీ మధుసూధనాచారి, మాజీ ఎమ్మెల్యేలు చిరుమర్తి లింగయ్య, పైళ్ల శేఖర్రెడ్డితో కలిసి తెలంగాణ భవన్లో సోమవారం హరీశ్రావు మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు కొత్త హామీలు కోరుకోవడం లేదని, గతంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. నిరుద్యోగుల తరపున ప్రభుత్వం ముందు తాము పెడుతున్న ఐదు డిమాండ్లను నెరవేర్చాలన్నారు. గ్రూప్ 1 మెయిన్స్కు 1:100 చొప్పున అవకాశం ఇవ్వాలని, గ్రూప్ 2, గ్రూప్ 3 కలిపి మరో ఐదు వేల ఉద్యోగాలు కలుపుతామన్న మాట నిలబెట్టుకోవాలన్నారు. టీజీపీఎస్సీతో పాటు డీఎస్సీ పరీక్షలకు నడుమ కనీసం రెండు నెలల వ్యవధి ఉండేలా చూడాలన్నారు. ఏటా 2 లక్షల ఉద్యోగాలతో జాబ్ కేలండర్ ఇస్తామనే హామీ నిలబెట్టుకోవాలని, 25 వేల పోస్టులతో మెగా డీఎస్సీ ప్రకటించాలని హరీశ్రావు డిమాండ్ చేశారు. ‘నీట్’పై కేంద్ర మంత్రులు స్పందించాలి నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో 24 లక్షల మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారని, నీట్ పరీక్ష విధానం, గ్రేస్ మార్కులు ఇవ్వడంపై ఎన్నో అనుమానాలు ఉన్నాయని హరీశ్ అన్నారు. నీట్ పేపర్ లీకేజీకి సంబంధించి తెలుగు విద్యార్థులకు అన్యాయం జరగకుండా కేంద్ర మంత్రులు కిషన్రెడ్డి, బండి సంజయ్తో పాటు రాష్ట్రానికి చెందిన బీజేపీ ఎంపీ స్పందించాలని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ కార్యకర్తను.. పార్టీ మారను తాను పార్టీ మారుతున్నట్లు ప్రధాన మీడియా, సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని నిలిపివేయాలని మాజీ మంత్రి హరీశ్రావు కోరారు. వ్యూస్ పెంచుకునేందుకు ఒక నాయకుడి నిబద్ధత, నిజాయతీ దెబ్బతీయొద్దు. నేను బీఆర్ఎస్ కార్యకర్తను, పార్టీలోనే కొనసాగుతాను. ఇలాంటి వార్తలు మానుకోకపోతే లీగల్ నోటీసులు పంపిస్తా అని హరీశ్రావు హెచ్చరించారు. -
నీట్ పరీక్షలో అక్రమాలు.. ఎన్డీయే సర్కార్ను ప్రశ్నించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నీట్ పరీక్ష విషయంలో కేంద్రంలోని బీజేపీ సర్కార్ తీరుపై తీవ్ర విమర్శలు చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కేటీఆర్. ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నలు సంధించారు.కాగా, కేటీఆర్ ట్విట్టర్ వేదికగా..‘లక్షలాది మంది విద్యార్థులు, వారి కుటుంబాలను ప్రభావితం చేసే సున్నితమైన, అతి ముఖ్యమైన విషయం నీట్ పరీక్ష. ఈ విషయంలో ఎన్డీయే ప్రభుత్వం ఎందుకు ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది?. స్పష్టంగా పరిష్కరించాల్సిన పెద్ద సమస్య ఉన్నప్పుడు విద్యాశాఖ మంత్రి ఎందుకు కఠినంగా తిరస్కరించారు’ అంటూ కొన్ని పేపర్ క్లిప్పింగ్స్ జత చేసి ప్రశ్నలు సంధించారు.అలాగే, నీట్పై ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులను శిక్షించాలన్నారు. 67 మందికి ఫస్ట్ ర్యాంక్ రావడం అనుమానాలకు తావిస్తోంది. నీట్లో అవకతవకలపై ప్రధాని మోదీ మౌనం వీడాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. Why is the NDA Govt so callous on a such a sensitive & important matter that affects lakhs of students and their families who have taken the NEET examination Why the stringent denial by the Education Minister when clearly there is a huge problem which needs to be addressed?… https://t.co/LYWjOUkkmz pic.twitter.com/7mRojL3uxG— KTR (@KTRBRS) June 17, 2024 -
ఉద్యోగాలు, పెన్షన్ల సంగతేంటి.. భట్టి మాటలు ఏమయ్యాయి?: హరీష్రావు
సాక్షి, తెలంగాణభవన్: తెలంగాణలో ఉద్యోగ నియామకాలపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు మాజీ మంత్రి హరీశ్ రావు. నిరుద్యోగుల డిమాండ్లు నెరవేర్చకపోతే త్వరలో పెద్ద ఎత్తున పోరాటం చేస్తామన్నారు. ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఏమయ్యాయని ప్రశ్నించారు.కాగా, తెలంగాణభవన్లో హరీశ్రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కాంగ్రెస్ గ్రూప్స్ ఉద్యోగాలు పెంచాలని అడిగింది. మరి ఇప్పుడు ఎందుకు పోస్టులు పెంచడం లేదు. అసెంబ్లీలో భట్టి విక్రమార్క చెప్పిన మాటలు ఏమయ్యాయి. ఉద్యోగాల విషయంలో నిరుద్యోగులకు ప్రభుత్వం సమాధానం చెప్పాలి. నిరుద్యోగులకు అన్యాయం చేయకండి. ప్రభుత్వం భేషజాలకు పోకుండా వారికి న్యాయం చేయాలి.గ్రూప్1, గ్రూప్-2 నిరుద్యోగ యువత మమ్మల్ని కలిశారు. ఎన్నికల ముందు కాంగ్రెస్ నేతలు వారిని రెచ్చగొట్టి తీసుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు ప్రజాభవన్ వద్దకు వెళ్ళి చిన్నారెడ్డి కాళ్ళు పట్టుకున్నా కనికరించటం లేదని ఆవేదన చెందుతున్నారు. నిరుద్యోగులకు అన్యాయం చేయకండి, ప్రభుత్వం భేషజాలకు పోకుండా వారికి న్యాయం చేయాలి.గ్రూప్స్ పరీక్షల్లో 1:50 ఇస్తామంటే 1:100 ఉద్యోగాలు బడుగు బలహీనవర్గాలకు ఇవ్వాలని అడిగారు. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తాము ఇస్తామని భట్టి చెప్పారు. కానీ, ఇప్పుడు ఇవ్వటం లేదు. జాబ్ క్యాలెండర్ ఇస్తామని అన్నారు. ఆరు నెలలు అయిన జాబ్ క్యాలెండర్ ఎందుకు ఇవ్వటం లేదు. మీ మాటలు గడప దాటడం లేదు. రాష్ట్రంలో మెగా డీఎస్సీతో 25వేల టీచర్ పోస్టులు భర్తీ చేస్తామని అన్నారు. కానీ, 11వేలకే పరిమితం ఎందుకు చేస్తున్నారు.నో పెన్షన్లు..కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు అయ్యింది. ఇప్పటికీ ఇంకా పెన్షన్లు ఇవ్వలేదు. కేసీఆర్ సీఎంగా ఉన్నప్పుడు నెల నెలా పెన్షన్ వచ్చింది. కానీ, ఇప్పుడు ఆ పాత పెన్షన్లు కూడా ఇప్పటికీ ఇవ్వలేదు. ఇందిరమ్మ రాజ్యం రాగానే నాలుగు వేలు ఇస్తామని అన్నారు. నాలుగు వేలు కాదు కదా, ఉన్న రెండు వేల పెన్షన్లు కూడా ఇవ్వటం లేదు. అభాగ్యులకు ఇచ్చే పెన్షన్ కూడా ప్రభుత్వానికి భారం అవుతుందా?. ఓట్ల కోసం జనవరి నుంచి రావాల్సిన పెన్షన్లు ఆపారు. ఏప్రిల్, మే నెల పెన్షన్లు కచ్చితంగా ఇవ్వాలి. ఇంటికి రెండు పెన్షన్లు ఎక్కడ?. అవ్వాతాతలకు ఇద్దరికీ ఇస్తామన్నారు ఏమైంది?.ఒకటో తేదీన జీతాల్లేవ్..ఆశా వర్కర్లు వైద్య విధాన పరిషత్ను ముట్టడించారు. వారికి ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని అడుగుతున్నారు. కానీ, ప్రభుత్వం అందరికీ ఒకటో తారీఖు జీతాలు ఇస్తున్నామని చెప్తున్నారు. ఒకటో తారీఖు ఇస్తే వాళ్ళు ఎందుకు ధర్నా చేస్తారు. వారి జీతాలు వెంటనే చెల్లించాలి. గ్రామ పంచాయతీ వర్కర్లకు కూడా జీతాలు ఇవ్వటం లేదు. నిన్న మొన్న కొన్ని వార్తలు చూసాను, ఐదు నెలలుగా జీతాలు ఇవ్వటం లేదని చెప్తున్నారు.గ్రామ పంచాయతీలు నడపటం ఇబ్బందిగా ఉన్నది. ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం తప్ప పని చేత కాదా?. సఫాయి కార్మికులు, ట్రాక్టర్లు నడవక డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రభుత్వానికి మానవత్వం లోపించింది. 65 లక్షల చెక్కులు ప్రింట్ అయిన సీఎంఆర్ఎఫ్ చెక్కులు ఆపారు. కేసీఆర్ ఫోటో చెక్కుల మీద ఉందని ఇవ్వటం లేదు అంటూ ఘాటు విమర్శలు చేశారు. నీట్పై కీలక వ్యాఖ్యలు..అలాగే, నీట్ పరీక్షపై నీలి నీడలు కమ్ముకున్నాయి. కేంద్రంలో బీజేపీ తీరుతో విద్యా విధానం కుంటుపడుతుంది. 24 లక్షల మంది వైద్య విద్యార్థులు ఆగమయ్యే పరిస్థితి ఉంది. పేపర్ లీకేజీ, గ్రేస్ మార్కలు కలపటం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయి. 67 మందికి మొదటి ర్యాంక్ వచ్చింది. పరీక్ష రాసిన ఆరు మంది విద్యార్థులకు 720 మార్కులు వచ్చాయి. కేంద్ర మంత్రులు, ప్రధాన మంత్రి దీనిపై అస్సలు మాట్లాడటం లేదు. 1563 మంది విద్యార్థులకు ఏ విధంగా గ్రేస్ మార్కులు కలిపారు. వారి పేర్లు, నంబర్లు ఎందుకు తెలపడం లేదు. పేపర్ లీకేజీ జరిగింది అనడానికి ఇంతకన్నా నిదర్శనం ఏం కావాలి. ఎన్నికల ఫలితాల కంటే ముందే ఈ ఫలితాలు రావటం అంటే ఏంటో అర్థం చేసుకోవచ్చు. పేపర్ లీకేజీపైన ఈడీ, సీబీఐ విచారణ ఎందుకు జరపటం లేదు’ అని ప్రశ్నించారు. -
తెలంగాణ కాంగ్రెస్కు కొత్త చీఫ్.. భారీ పోటీ!
సాక్షి,హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం కొలువుదీరి ఆరు నెలలు అవుతోంది. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో సైతం 8 సీట్లను గెలుచుకొని కాంగ్రెస్ పార్టీ మెరుగైన ప్రదర్శన ఇచ్చిది. అయితే ఇప్పుడు తెలంగాణ కాంగ్రెస్కు కొత్త చీఫ్ను నియమించాల్సిన సమయం వచ్చింది. కొత్త చీఫ్తో పాటు వర్కింగ్ ప్రెసిడెంట్స్, ఫ్రంటల్ ఆర్గనైజేషన్ ఛైర్మన్ల మార్పుపై కాంగ్రెస్ పార్టీ దృష్టి పెట్టింది. ఈ నెలాఖరులోగా కొత్త చీఫ్పై ఏఐసీసీ ప్రకటన చేయనున్నట్లు తెలుస్తోంది. ఈ నెల 27న తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా సీఎం రేవంత్ రెడ్డి పదవీకాలం ముగియనుంది. ఈ నేపథ్యంలో కొత్త చీఫ్ ఎంపికపై కాంగెస్ పార్టీ ఫోకస్ పెట్టినట్లు సమాచారం. తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ.. పీసీసీ చీఫ్తో పాటు, వర్కింగ్ ప్రెసిండెంట్స్కు సీనియర్, కీలక నేతల మధ్య తీవ్రమైన పోటీ నెలకొంది. పీసీసీ చీఫ్ పోటీలో మంత్రి పొన్నం ప్రభాకర్, మహేష్కుమార్ గౌడ్, మధుయాష్కిలు ఉన్నారు. అదే విధంగా మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి, రాజగోపాల్రెడ్డి, సంపత్ కుమార్ తదితరులు పీసీసీ చీఫ్ ఆశావహుల్లో ఉన్నారు. మరోవైపు.. పార్టీ ఫ్రంటల్ ఆర్గనైజేషన్ పదవులను కోసం సైతం పలువురి మధ్య పోటీ నెలకొంది. వాటిని కాంగ్రెస్ నేతలు రవళి రెడ్డి, కమల్ ఆశిస్తున్నట్లు సమాచారం. -
విచారణ పూర్తికాక ముందే తీర్పు ఎలా చెబుతారు?
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని, ఆ విషయంలో ఏ విచారణకైనా సిద్ధమని రాష్ట్ర మాజీ మంత్రి జగదీశ్రెడ్డి చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ ఒప్పందాలపై విచారణకు ప్రభుత్వం జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్ వేసిందని, కమిషన్ సందేహాలకు కేసీఆర్ బహిరంగంగా సమాధానం ఇచ్చారన్నారు. కమిషన్ ఉద్దేశం వేరేలా ఉందని, వాదన వినకుండా, విచారణ చేయకుండా తీర్పు ఇచ్చేలా కనిపిస్తోందని విమర్శించారు.నరసింహారెడ్డికి విచారణ అర్హత లేదని, కమిషన్ బాధ్యతల నుంచి తప్పుకోవాలని మాజీ సీఎం కేసీఆర్ సూచించారని చెప్పారు. వివరణ ఇచ్చేందుకు ఈ నెల 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే ఇవ్వలేదని, 15 లోపే వివరణ ఇవ్వాలని చెప్పారన్నారు. కానీ 11వ తేదీన నరసింహారెడ్డి మీడియా సమావేశం ఏర్పాటు చేశారన్నారు. తెలంగాణవాదిగా నరసింహారెడ్డికి పేరు ఉందని, చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసీఆర్పై ఆయనకు సానుభూతి ఉంటుందనుకున్నామని, కానీ ఆయన తీరు అలా లేదని చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే విద్యుత్ కొనుగోళ్ల అంశంపై కాంగ్రెస్, బీజేపీ నేతలకు అసెంబ్లీలో సమాధానం ఇచ్చామని, ఈఆర్సీ ముందు కాంగ్రెస్, బీజేపీ నేతలు తమ వాదనలు వినిపించారన్నారు.కాంగ్రెస్, బీజేపీ నేతల అభిప్రాయాలను నరసింహారెడ్డి మీడియా సమావేశంలో చెప్పారని, విచారణ పూర్తి కాకముందే తీర్పు ఎట్లా చెబుతారని ప్రశ్నించారు. ఉమ్మడి రాష్ట్రంలో అనేక కమిషన్లు రద్దు అయ్యాయని, ఈఆర్సీ స్వతంత్ర కమిషన్ అని, అది ఇచి్చన తీర్పు ఫైనల్ అన్నారు. ఈఆర్సీ తీర్పు ఇచ్చాక కమిషన్ ఎట్లా వేస్తారని నరసింహారెడ్డికి తెలియదా అని ప్రశ్నించారు. కమిషన్ బాధ్యతల నుంచి నరసింహారెడ్డి తప్పుకుంటారని భావిస్తున్నట్లు తెలిపారు. ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వంతో బహిరంగంగా విద్యుత్ ఒప్పందం చేసుకున్నామని తెలిపారు. విద్యుత్ కొనుగోలులో కేసీఆర్ మాజీ సీఎం రమణ్సింగ్కు ఏమైనా లంచం ఇచ్చారా.బీజేపీ నేతలు సమాధానం చెప్పాలన్నారు. కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలు ఎక్కువ రేటుకు విద్యుత్ కొన్నాయని, తెలంగాణ మాత్రం యూనిట్కు రూ.3.90 పెట్టి విద్యుత్ తీసుకున్నట్టు వివరించారు. దేశంలో ఏ కమిషన్ మధ్యలో లీకులు ఇవ్వలేదని తెలిపారు. 800 మెగావాట్ల సామర్థ్యం కలిగిన సూపర్ క్రిటికల్ టెక్నాలజీతో భద్రాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ ఏర్పాటు చేశామని, రామగుండం, భూపాలపల్లి, కొత్తగూడెం, విజయవాడ, ఆరీ్టపీసీ నుంచి సబ్ క్రిటికల్ టెక్నాలజీ ద్వారానే విద్యుత్ ఉత్పత్తి అవుతుందని వివరించారు.పారదర్శకతతోనే ప్రభుత్వ రంగ సంస్థ అయిన బీహెచ్ఈఎల్కు భద్రాద్రి, యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ల నిర్మాణాలను అప్పగించినట్టు తెలిపారు. కేసీఆర్పై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని, తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా పనిచేసిన దొంగలంతా ఏకమయ్యారని విమర్శించారు. కాంగ్రెస్, బీజేపీ కలిసి కేసీఆర్పై కుట్రలు చేస్తున్నాయని, రేవంత్రెడ్డి మోదీ లైన్లో పని చేస్తున్నారని ఆరోపించారు. కోమటిరెడ్డి మాటలను పట్టించుకోమని, పీసీసీ పదవి డబ్బులతో రేవంత్ తెచ్చుకున్నాడని కోమటిరెడ్డి అనలేదా అని జగదీశ్రెడ్డి గుర్తు చేశారు. -
నీట్పై ప్రధాని స్పందించాలి: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఎంబీబీఎస్, ఇతర వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన నీట్–యూజీ ఎంట్రన్స్లో అవకతవకలు జరిగాయన్న ఆరోపణలకు సంబంధించి దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో నెలకొన్న అనుమానాలను ప్రధాని మోదీ నివృత్తి చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె. తారక రామారావు డిమాండ్ చేశా రు. తమ పిల్లలు డాక్టర్లు కావాలని కలలుగన్న తల్లి దండ్రుల ఆశలపై గందరగోళంగా మారిన వ్యవహారంతో నీళ్లు చల్లినట్టయిందని ధ్వజమెత్తారు.బిహార్లో రూ.30 లక్షలకు నీట్ ప్రశ్నపత్రాలు విక్ర యించారని, ఈ వ్యవహారంలో అరెస్టులు జరుగుతున్నాయని వార్తలు వస్తున్నప్పటికీ కేంద్రం నిమ్మ కు నీరెత్తినట్లు వ్యవహరించడం దారుణమన్నారు. ఈ మేరకు కేటీఆర్ ఎన్డీఏ ప్రభుత్వానికి ఆదివారం రాసిన బహిరంగ లేఖలో నీట్ పరీక్షపై పలు సందేహాలను వెలిబుచ్చారు. ప్రతిసారీ విద్యార్థులతో ‘పరీక్షా పే చర్చా’కార్యక్రమాన్ని నిర్వహించే ప్రధాని...నీట్ పరీక్షపై మాత్రం మాట్లాడకపోవడం విచారకరమన్నారు. సమగ్ర విచారణ చేపట్టి బాధ్యులైన వారిపై కఠిన చర్య లు తీసుకొని, విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు భరోసా ఇవ్వాలని కోరారు. 67 మందికి మొదటి ర్యాంకు ఎలా? నీట్ పరీక్షలో గతంలో ఎప్పుడూ లేని విధంగా ఏకంగా 67 మందికి మొదటి ర్యాంకులు రావడం ఎన్నో అనుమానాలకు తావిస్తోందని కేటీఆర్ అన్నారు. ఒకే సెంటర్ నుంచి పరీక్ష రాసిన 8 మంది విద్యార్థు లు 720 మార్కులు సాధించడం చూస్తే ..పేపర్ లీకేజీ వ్యవహారం ఏ స్థాయిలో జరిగిందో అర్థమవుతోందన్నారు. ఫలితాలను 10 రోజులు ముందుకు జరిపి సరిగ్గా ఎన్నికల ఫలితాల రోజే ప్రకటించడం కూడా అనేక సందేహాలకు తావిచ్చిందన్నారు.సుప్రీంకోర్టు జోక్యం చేసుకొనేంత వరకు కూడా కేంద్రం ఈ అంశాన్ని పట్టించుకోకపోవడం ఆశ్చ ర్యం కలిగిస్తోందన్నారు. సుప్రీంకోర్టు ప్రశ్నించిన తర్వాత కూడా నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎనీ్టఏ) 1,563 మందికి గ్రేస్ మార్కులు కలిపినట్లు చెబుతోందని.. అంతమందికి ఏ ప్రాతిపదికన గ్రేస్ మార్కులు కలిపారో స్పష్టం చేయడం లేదని ధ్వజమెత్తారు. ఒక్క గ్రేస్ మార్కుల అంశమే కాకుండా పేపరే లీకేజీ ఆరోపణలపైనా విచారణ జరిపించాల్సిన అవసరం ఉందన్నారు. గుజరాత్, బిహార్ లో అవకతవకలకు పాల్పడిన కొంత మందిని పోలీసులు అరెస్ట్ చేశారని.. వరుసగా బయటపడుతున్న వివాదస్పద వ్యవహారాల కారణంగా పరీక్ష తీరుపై అనుమానాలు బలపడుతున్నాయని చెప్పారు.తెలుగు రాష్ట్రాల విద్యార్థులకు నష్టం తెలుగు రాష్ట్రాల నుంచి పెద్ద మొత్తంలో విద్యార్థులు నీట్ పరీక్ష రాశారని, గ్రేస్ మార్కులు, పేపర్ లీకేజీ వల్ల వారు కూడా నష్టపోయే ప్రమాదం ఉందని కేటీఆర్ అన్నారు. వారికి ఎలాంటి అన్యాయం జరగకుండా ఉండేందుకు మన రాష్ట్ర ఎంపీలు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ మొత్తం వ్యవహారంపై పూర్తి స్థాయి విచారణ జరిపి బాధ్యులను కఠినంగా శిక్షించేలా రాష్ట్రానికి చెందిన కేంద్రమంత్రులు, ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలని కోరారు. -
పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా ఉంది: జగదీష్రెడ్డి
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ కొనుగోళ్లలో తెలంగాణ ప్రభుత్వానికి ఎక్కడా నష్టం జరగలేదని.. ఏ విచారణకైనా సిద్ధమని శాసనసభలోనే చెప్పామని మాజీ మంత్రి జగదీష్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన తెలంగాణ భవన్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ ‘‘విద్యుత్ కొనుగోళ్లలో అవకతవకలు జరిగాయని ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ వేసింది. గత ప్రభుత్వం చేసిన ఒప్పందాలపై విచారణ చేస్తుంది. ప్రభుత్వ పెద్దలు, బీజేపీ పెద్దలు కొన్ని సందేహాలు లేవనెత్తారు. అసెంబ్లీలో అన్నిటికీ సమాధానం ఇచ్చామని, శ్వేత పత్రాలు కూడా విడుదల చేశాం’’ అని చెప్పారు.‘‘జస్టిస్ ఎల్ నరసింహారెడ్డి కమిషన్ను వేసింది. నిన్న కేసిఆర్ వివరణ కోరారు. కమిషన్ సందేహాలకు కేసీఆర్ సమాధానం ఇచ్చారు. పవర్ కమిషన్ ఉద్దేశం వేరేలా కనిపిస్తోంది. కమిషన్ పాత్ర పైన కూడా మాట్లాడారు. వాదన వినకుండా విచారణ కాకముందే తీర్పు ఇచ్చేలా ఉన్నాయని, మీకు ఆ అర్హత లేదని మీరు కమిషన్ బాధ్యత నుంచి తప్పుకోవాలని కేసిఆర్ సూచించారు. అన్ని ఆధారాలు చూపించారు.’’ అని జగదీష్రెడ్డి పేర్కొన్నారు.‘‘కేసిఆర్కు ఆ హక్కు ఉంది. 30 వరకు అవకాశం ఇవ్వాలని అడిగితే లేదు 15నే కావాలని అడిగితే ఇచ్చారు. జస్టిస్ ఎల్ నర్సింహారెడ్డి మారిపోయారు. తెలంగాణ వ్యక్తిగా ఉన్న వ్యక్తి ఇప్పుడు మారిపోయారు. చీకట్లో ఉన్న తెలంగాణను వెలుగుల తెలంగాణగా మార్చిన కేసిఆర్ పట్ల నర్సింహారెడ్డికి సానుభూతి ఉంటుందనుకున్నాం. కానీ ఆయన తీరు అలా లేదు. తన అభిప్రాయం ముందే మీడియా ముందు చెప్తున్నాడు. ఇది తప్పు’’ అని జగదీష్రెడ్డి అన్నారు. -
కమిషన్ నుంచి తప్పుకోండి: కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: విద్యుత్ అంశాలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిషన్ విచారణలో నిష్పాక్షికత కనిపించడం లేదని బీఆర్ఎస్ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్రావు ఆరోపించారు. విచారణ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాలని కమిషన్ చైర్మన్ జస్టిస్ నరసింహారెడ్డికి విజ్ఞప్తి చేశారు. రాజకీయ కక్షతో గత ప్రభుత్వాన్ని, తనను అప్రతిష్ట పాలు చేసేందుకే కాంగ్రెస్ ప్రభుత్వం ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేసిందని విమర్శించారు. ఈ మేరకు కమిషన్ ఆఫ్ ఎంక్వైరీ జస్టిస్ నరసింహారెడ్డికి శనివారం సుదీర్ఘ లేఖ రాశారు. ఛత్తీస్గఢ్ నుంచి విద్యుత్ కొనుగోలు, యాదాద్రి, భద్రాద్రి విద్యుత్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన అంశాలపై వివరణ ఇవ్వాలని కేసీఆర్ను గతంలో ఎంక్వైరీ కమిషన్ కోరింది. దీనికి కమిషన్ ఇచ్చిన గడువు శనివారంతో ముగుస్తున్న నేపథ్యంలో కేసీఆర్ ఈ లేఖ రాశారు. అందులో పేర్కొన్న వివరాలు ఆయన మాటల్లోనే.. ‘‘విద్యుత్ రంగంలో గణనీయ మార్పు చూపించిన మా ప్రయత్నాన్ని తక్కువ చేసి చూపించేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. విచారణ కమిషన్ చైర్మన్గా మీడియా సమావేశంలో మీరు (జస్టిస్ నరసింహారెడ్డి) ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. మీ పిలుపు మేరకు లోక్సభ ఎన్నికల తర్వాత 2024 జూన్ 15లోగా నా అభిప్రాయాలను మీకు సమర్పించాలని అనుకున్నాను. కానీ ఒక ఎంక్వైరీ కమిషన్ సంప్రదాయాలకు విరుద్ధంగా, విచారణ పూర్తికాక ముందే మీరు మీడియా సమావేశం పెట్టి నా పేరును ప్రస్తావించారు. లోక్సభ ఎన్నికల నేపథ్యంలో నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలచి ఇచ్చినట్టు మాట్లాడటం నాకెంతో బాధ కలిగించింది. హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేసి రిటైరైనప్పటికీ మీ తీరు సహజ న్యాయసూత్రాలకు విరుద్ధంగా ఉంది. విచారణ పూర్తికాక ముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టమవుతున్నది. చట్టవిరుద్ధంగా ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు.. విచారణ ఒక పవిత్రమైన బాధ్యత, మధ్యవర్తిగా నిలిచి నిజాన్ని నిగ్గుతేల్చాల్సిన విధి. అన్ని విషయాలను సమగ్రంగా పరిశీలించి పూర్తి నిర్ధారణకు వచ్చిన తర్వాత, డాక్యుమెంటరీ సాక్ష్యాలతో బాధ్యులకు మాత్రమే నివేదిక ఇవ్వాల్సిన గురుతరమైన పని. కానీ మీ వ్యవహారశైలి అలా లేదని చెప్పేందుకు చింతిస్తున్నాను. ఎంక్వైరీ కమిషన్ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా రిపోర్టు ఇవ్వాలనే అభిప్రాయంతోనే మీరు మాట్లాడుతున్నట్టు స్పష్టమవుతోంది. ఇప్పటికే తప్పు జరిగిందని, తద్వారా జరిగిన ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టుగా మీ మాటలు ఉంటున్నాయి. రాష్ట్రంలో జరిగిన రాజకీయ మార్పులతో సీఎంగా బాధ్యతలు చేపట్టిన రేవంత్రెడ్డి.. గత ప్రభుత్వానికి దురుద్దేశాలు ఆపాదిస్తూ అసెంబ్లీలో విడుదల చేసిన శ్వేతపత్రాలపై చర్చలు కూడా జరిగాయి. అంతటితో ఆగకుండా ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సంస్థలు వెలువరించిన తీర్పులపై విచారణ జరపకూడదనే ఇంగితం లేకుండా రేవంత్రెడ్డి ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చేశారు. హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తిగా వ్యవహరించిన మీరు ఎంక్వైరీ కమిషన్ ఏర్పాటు చట్టవిరుద్ధమని సూచించకుండా బాధ్యతలు స్వీకరించడం విచారకరం. అయినా చట్టవిరుద్ధంగా విచారణ ప్రారంభించి జూన్ 11న మీడియా సమావేశంలో మీరు అసంబద్ధ వ్యాఖ్యలు చేశారు. విచారణ అర్హత కోల్పోయారు.. విరమించుకోండి భద్రాద్రి పవర్ ప్లాంటును రెండేళ్లలో పూర్తి చేస్తామనే బీహెచ్ఈఎల్ లిఖిత పూర్వక హామీ మేరకు పనులు అప్పగించాం. ఎన్జీటీ స్టే, కరోనాతో కలిగిన అంతరాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా ఆలస్యానికి ప్రభుత్వానిదే బాధ్యత అన్నట్టుగా మీరు మాట్లాడారు. ఉభయ రాష్ట్రాల మధ్య ఒప్పందాలను ఎస్ఈఆర్సీ పరిశీలించకూడదని, అందులో ఏదో తప్పు జరిగిందనే భావన కలిగేలా మాట్లాడారు. న్యాయ నిపుణులైన మీరు చట్టాల్లో పొందుపరచబడిన అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోకుండా న్యాయ ప్రాధికార సంస్థలపై వ్యాఖ్యానాలు చేశారు. దీంతో ఈ వ్యవహారంపై మీరు విచారణార్హత కోల్పోయినందున ఈ బాధ్యతల నుంచి విరమించుకోవాలి. తమిళనాడు, కర్నాటక టెండర్ పద్ధతిలో విద్యుత్ కొనుగోలు ఒప్పందాలు చేసుకున్న మొత్తంతో పోలిస్తే ఛత్తీస్గఢ్ నుంచి నామినేషన్ పద్ధతిలో తెలంగాణ కొనుగోలు చేసిన యూనిట్ విద్యుత్ ధర తక్కువ. కానీ ఎక్కువ ధర చెల్లించారని మీరు చెప్పినందున విచారణ అర్హత కోల్పోయారు. విద్యుత్ కొనుగోలు ఒప్పందాలన్నీ (పీపీఏ) ప్లాంట్ల నిర్మాణం ప్రారంభించడానికి ముందే జరుగుతాయన్న వాస్తవాన్ని విస్మరించారు. భద్రాద్రి సబ్ క్రిటికల్ థర్మల్ స్టేషన్ నిర్మాణం విజయవంతంగా పూర్తి చేసినా అప్పటి ప్రభుత్వం ఏదో తప్పు చేసిందనే దురుద్దేశాలు ఆపాదించారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంటు నిర్మాణానికి ప్రాంతీయ మౌలిక సదుపాయాల సమతుల్యత, ఆర్థికాభివృద్ధి, లోడ్ డి్రస్టిబ్యూషన్, విద్యుత్ సరఫరా నష్టాలు తగ్గించడం, విపత్తుల నివారణ (డీ రిస్కింగ్) అనేవి కూడా ప్రధాన ప్రాతిపదికలుగా ఉంటాయనే వాస్తవాన్ని విస్మరించారు. ప్రాజెక్టు సకాలంలో పూర్తికాలేదని చెప్పడం అసమంజసం.గత ప్రభుత్వాన్ని బదనాం చేయాలనే ధోరణిజస్టిస్ నరసింహారెడ్డిగారూ.. మీరు కూడా తెలంగాణ బిడ్డ. 2014కు ముందు తెలంగాణలో కరెంటు పరిస్థితి ఎట్లుండేదో, తర్వాత ఎట్లున్నదో అందరితోపాటు మీకూ తెలుసు. చీకటి రోజుల గతాన్ని వెలుగు జిలుగుల భవిష్యత్తుగా మార్చడానికి అప్పటి ప్రభుత్వం ఏం చేసిందో మీరు కూడా చూశారు. అయినా మీ పరిధి దాటి వ్యవహరించి మాట్లాడటం గత ప్రభుత్వాన్ని బద్నాం చేయాలనే మీ ధోరణికి నిదర్శనంగా కనిపిస్తోంది. తెలంగాణ నిర్ణయాన్ని ఎలాగైనా తప్పుబట్టాలనే తీరులో మీరు కనిపిస్తున్నారు. అందువల్ల విచారణ కమిషన్ చైర్మన్ బాధ్యతల్లో మీరు ఉండటం ఎంత మాత్రం సమంజసం కాదు. స్వచ్ఛందంగా విరమించుకోండి’’ అని కేసీఆర్ లేఖలో పేర్కొన్నారు. -
బీఆర్ఎస్పై ఇంత విద్వేషమా?
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్ రెడ్డి హయాంలో రాష్ట్రంలో పాలన గాడి తప్పిందని, బీఆర్ఎస్ పార్టీపై విద్వేషంతో వ్యవహరిస్తోందని బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ విమర్శించారు. స్వయంగా సీఎం నిర్వహిస్తున్న విద్యా శాఖలోనే గందరగోళ పరిస్థితి ఉంటే ఎలా అని నిలదీశారు. కేసీఆర్ ఫొటోలు, పేర్లు ఉన్నాయని స్కూలు పిల్లల పాఠ్య పుస్తకాలను ప్రభుత్వం వెనక్కి తెప్పించడం దారుణమని వ్యాఖ్యానించారు.మాజీ ఎమ్మెల్యే కోరుకుంటి చందర్, టీఎస్టీఎస్ మాజీ చైర్మన్ రాకేశ్ కుమార్తో కలిసి బాల్క సుమన్ శనివారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడారు. వానాకాలం సీజన్కు సంబంధించి రైతు బంధు పంపిణీని ఎప్పుడు ప్రారంభిస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా విఫలమయ్యాయని ఆరోపించిన బీఆర్ఎస్ నేతలు.. హోం శాఖ స్వయంగా సీఎం అధీనంలో ఉన్నా ఆయన సొంత జిల్లాలో పట్ట పగలు వ్యక్తిని కొట్టి చంపారని గుర్తు చేశారు. రాష్ట్రంలో గంజాయి మూకలు స్వైర విహారం చేస్తున్నాయని, హైదరాబాద్ నగరంలో ట్రాఫిక్ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందన్నారు. మద్యం, ఇసుక, ఫ్లై యాష్ రవాణాలో కమీషన్లు తీసుకోవడంలో సీఎం బిజీగా వున్నారని బాల్క సుమన్ విమర్శించారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం తప్పదు: మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి
నూతనకల్ (సూర్యాపేట)/శాలిగౌరారం(నల్లగొండ): బీజేపీలో బీఆర్ఎస్ పార్టీ విలీన ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయని, ఎప్పుడైనా విలీనంకాక తప్పదని మంత్రి కోమటి రెడ్డి వెంకట్రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల కేంద్రంలో శనివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నేతృత్వంలో పదవులు అనుభవించిన వారంతా అవినీతి ఆరోపణల్లో కూరుకుపోయారన్నారు.చత్తీస్గఢ్ నుంచి విద్యు త్ కొనుగోలులో, యాదాద్రి పవర్ ప్లాంట్ నిర్మాణంలో అవినీతి జరిగిందని, అప్పటి విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి సారథ్యంలో రూ.10వేల కోట్లు చేతులు మారాయని ఆరోపించారు. బీఆర్ఎస్ నాయకులు తమ అవినీతి, తప్పిదాలను కప్పిపుచ్చుకునేందుకు ఢిల్లీలో బీజేపీ నాయకులతో అంటకాగుతూ చర్చలు జరుపుతున్నారని చెప్పారు. బీఆర్ఎస్ మెడకు ఫోన్ ట్యాపింగ్ కేసు బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్.. నేడు ఆ పార్టీ మెడకే చుట్టుకుందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అన్నారు. అంతకుముందు నల్లగొండ జిల్లా శాలిగౌరారం మండలంలోని వల్లాల గ్రామంలో ప్రభుత్వ మోడల్ స్కూల్లో శనివారం విద్యార్థులకు యూనిఫాం, పుస్తకాలు, నోటుబుక్స్ పంపిణీ చేశారు. -
జస్టిస్ నర్సింహారెడ్డిని వైదొలగాలనడం ముమ్మాటికీ ధిక్కరణే
సాక్షి, హైదరాబాద్/ ఢిల్లీ: చట్టబద్ధ విచారణ కమిషన్నే తప్పుపట్టేలా, కమిషన్ చైర్మన్ జస్టిస్ నర్సింహారెడ్డి వైదొలగాలని మాజీ సీఎం కేసీఆర్ ఇచి్చన రాతపూర్వక వివరణ, బెదిరింపులతో కూడిన లేఖ ముమ్మాటికీ ధిక్కరణకు నిదర్శనమ ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ మండిపడ్డారు. కమిషన్ నోటీసులకు వివరణ ఇస్తే సరిపోయేదని, అందుకు భిన్నంగా కమిషన్ నియామకాన్ని తప్పుబట్టి చైర్మన్ బాధ్యతల నుంచి వైదొలగాలంటూ సూచించడం దారుణమన్నారు.‘ఇది ముమ్మాటికీ ధిక్కరణ కిందకే వస్తుంది. తక్షణమే కేసీఆర్ని అరెస్ట్ చేసి విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతి, అక్రమాలపై విచారణ జరిపి వాస్తవాలను నిగ్గు తేల్చాల్సిన అవస రం ఉంది’ అని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి ఉంటే తక్షణమే కేసీఆర్తో సహా విద్యుత్ కొనుగోళ్లు, కాళేశ్వరం, గొర్రెల పంపిణీ స్కాంలలో అవినీతికి పాల్పడ్డ వారిని అరెస్ట్ చేయడంతోపాటు వాస్తవాలను ప్రజల ముందుంచాలన్నారు.సీఎంగా పనిచేసిన కేసీఆర్కు రాష్ట్ర ప్రభు త్వం నియమించిన కమిషన్కు కనీస గౌర వం ఇవ్వాలనే ఇంగిత జ్ఞానం లేకపోవడం శోచనీయమన్నారు. ఈ మేరకు శనివారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ కమిషన్ ఏర్పాటే తప్పు అని అనుకుంటే...దీనిపై ముందే కేసీఆర్ కోర్టుకు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. అత్యున్నత న్యాయస్థానం చీవాట్లు మరిచారా? తెలంగాణ ఉద్యమ సమయంలో జస్టిస్ నర్సింహారెడ్డి నిజాయితీ, ధైర్యసాహసాలను కేసీఆర్ ప్రశంసించిన సంగతి మర్చిపోయారా అని ప్రశ్నించారు. విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన తప్పిదాలను ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (ఈఆర్సీ)పై నెట్టేసి కేసీఆర్ తప్పించుకోవాలని చూస్తున్నారా అని నిలదీశారు. ‘ఈఆర్సీ నిర్ణయాలను నర్సింహారెడ్డి కమిషన్ ఇంతవరకు ఎక్కడా ప్రశ్నించలేదు. నాటి కేసీఆర్ సర్కార్ విధానపరమైన నిర్ణయాలు, వాటి ఆధారంగా జరిగిన అవి నీతి, అక్రమాలపైనే విచారణ జరుపుతున్నారు తప్ప ఈఆర్సీపై కాదు. ఈ విషయం తెలిసి కూడా కేసీఆర్ తన తప్పిదాలను కప్పిపుచ్చుకోవడానికి ఈఆర్సీ ని వివాదంలోకి లాగి బదనాం చేయడం సిగ్గు చేటు’అని బండి సంజయ్ మండిపడ్డారు.తెలంగాణ బిడ్డ జస్టిస్ నర్సింహారెడ్డి అని సంబోధిస్తూనే ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేలా కేసీఆర్ పేర్కొనడం దుర్మార్గమన్నారు. తెలంగాణ ఉద్య మంలో అగ్రభాగాన ఉంటూ ఉస్మానియా వర్సిటీ లో వేసిన ముళ్ల కంచెను తీసివేయాలంటూ పోలీ సులకు ఆదేశాలు జారీ చేసిన తెలంగాణ ముద్దు బిడ్డ నర్సింహారెడ్డి అని తెలిపారు. తన తప్పులు, అవినీతి, అక్రమాలను కప్పిపుచ్చుకునేందుకు కేసీఆర్ ఎందాకైనా వెళతారనే దానికి ఈ ఉదంతం ఒక నిదర్శనమన్నారు.నాడు ఎమ్మెల్యేల కొనుగోళ్ల డ్రామా వ్యవహారం కోర్టు పరిధిలో ఉండగా... ప్రెస్మీట్ నిర్వహించి న్యాయస్థానాలను ప్రభావితం చేసేలా ఇదే తరహాలో ఎదురుదాడి చేసి బీజేపీపై అభాండాలు మోపి రాజకీయ లబ్ధిపొందాలనుకుని భావిస్తే... కోర్టు పరిధిలో ఉన్న అంశంపై ఇంగిత జ్ఞానం లేకుండా మాట్లాడతారా ? అంటూ అత్యున్నత న్యాయస్థానం చివాట్లు పెట్టిన సంగతి కేసీఆర్ మర్చిపోయినట్లున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల అవినీతి, అక్రమాలపై ఆధారాలున్నప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యులను అరెస్ట్ చేయకపోవడం వెనుక ఉద్దేశం ఏమిటి? అని సంజయ్ ప్రశ్నించారు. -
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
బీజేపీలో బీఆర్ఎస్ విలీనం అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సూర్యాపేట జిల్లా నూతనకల్లో మంత్రి కొమటిరెట్టి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మాజీ సీఎం కేసీఆర్పై విమర్శలు గుప్పించారు. బీజేపీలో బీఆర్ఎస్ను కలిపేందుకు కేటీఆర్, సంతోష్ రావులు ఢిల్లీ వేదికగా చర్చలు జరుపుతున్నారని వ్యాఖ్యానించారు. యాదాద్రి, చత్తీస్గఢ్ కరెంట్ విషయంలో అవకతవకలు జరిగాయి. విద్యుత్ అంశంలో 15 వేల కోట్ల అవినీతి జరిగింది. నిజాయితీ గల వ్యక్తితో కమిషన్ వేస్తే కేసీఆర్ విమర్శలు చేస్తున్నారు. కమిషన్పై నమ్మకం లేదని కేసీఆర్ అనడం దుర్మార్గమని అన్నారు. మీరు ఎన్ని అవకతవకలు చేసినా వదిలేయాలా? అని ప్రశ్నించిన కోమటి రెడ్డి.. గొర్రెల పంపిణీలో జరిగిన ఏడు వందల కోట్లు అవినీతిపై ఈడీ విచారణ జరుగుతోందన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేసి బెదిరించి డబ్బులు గుంజారు. ఫోన్ ట్యాపింగ్ నిందితుడు ప్రభాకర్ రావును అమెరికాలో హరీష్ రావు కలిశారు. ఇండియాకు రావద్దని ఆయనకు హరీష్ రావు చెప్పారని తెలిపారు. కేసీఆర్ పదేళ్లలో లక్షల కోట్లు సంపాదించారు. బీఆర్ఎస్ అనేది లేకుండా పోయింది. కేసీఆర్ కుటుంబ సభ్యుల పేరుతో దోచుకున్న ఆస్తిని పంచాడు. కేసీఆర్ గురించి మాట్లాడితే నోరు పాడవుతుందని మంత్రి కోమటిరెడ్డి వెంకట రెడ్డి ధ్వజమెత్తారు. -
తెలంగాణ BJP కొత్త సారథి ఎవరు.. అధ్యక్ష పదవి రేసులో ఉన్నదెవరు?
సాక్షి, తెలంగాణ : తెలంగాణ బీజేపీకి కొత్త అధ్యక్షుడిని ఎప్పుడు నియమిస్తారు? కేంద్ర మంత్రివర్గం ఏర్పాటు పూర్తయింది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కిషన్రెడ్డి మరోసారి కేంద్ర క్యాబినెట్లో చోటు దక్కించుకున్నారు. ఎన్నికలన్నీ పూర్తయినందున ఇక పార్టీకి కొత్త అధ్యక్షుడిని నియమించాల్సి ఉంది. జాతీయ అధ్యక్షుడిని కూడా మోదీ క్యాబినెట్లోకి తీసుకున్నారు. అందువల్ల ముందుగా ఆలిండియా పార్టీ అధ్యక్షుడిని నియమించి..ఆ తర్వాత రాష్ట్ర అధ్యక్షుడిని నియమిస్తారని అంటున్నారు. ఇంతకీ తెలంగాణ బీజేపీ అధ్యక్ష పదవికి పోటీపడుతున్నదెవరో చూద్దాం.ఎన్నికలన్నీ పూర్తయ్యాయి. మంత్రి పదవుల పంపకమూ అయిపోయింది. ఇక పార్టీ పదవుల్లో నియామకాలే మిగిలాయి. కిషన్రెడ్డి ఇప్పటివరకు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవితో పాటుగా..కేంద్ర మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహించారు. మోదీ మూడో మంత్రివర్గంలో కూడా కిషన్రెడ్డికి బెర్త్ ఇచ్చారు. ఇక ఆయన పూర్తిగా మంత్రి బాధ్యతలు నిర్వహించాల్సి ఉన్నందున.. ఇప్పుడు రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా కొత్తనేతను నియమించాల్సి ఉంది. మరి తెలంగాణ కమల దళపతిగా ఎవరిని నియమిస్తారనేదానిపై బీజేపీ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈ పదవి కోసం చాలా మంది నేతలు పోటీ పడుతున్నారు.మల్కాజ్గిరి ఎంపీ ఈటల రాజేందర్కు తెలంగాణ బీజేపీ పగ్గాలు దక్కడం ఖాయమని ప్రచారం జరుగుతోంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఈటల రాజేందర్ను పార్టీ ఫోకస్ చేసింది. గజ్వేల్, హుజూరాబాద్ అసెంబ్లీ నియోజక వర్గాల్లో ఈటల పరాజయం పాలైనా... మల్కాజ్గిరి ఎంపీగా ఈటలకు పార్టీ మరో అవకాశం ఇచ్చింది. అక్కడ భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు ఈటలకు అప్పగించి స్థానిక ఎన్నికల్లో సత్తా చాటాలని బీజేపీ అధిష్ఠానం భావిస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్ర పార్టీ నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్తే ఈటలకే పార్టీ పగ్గాలు అప్పగించవచ్చు. ఇప్పటికే ఆ దిశగా పార్టీ అధిష్ఠానం సంకేతాలు ఇచ్చినట్లు ఈటల వర్గీయులు చెబుతున్నారు.అయితే తెరవెనక మరికొంత మంది నేతలు కూడా తమ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. మెదక్ ఎంపీగా గెలిచిన రఘునందన్ రావు రాష్ట్ర పార్టీ పగ్గాలు దక్కించుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఇందిరా గాంధీ గతంలో ప్రాతినిథ్యం వహించిన పార్లమెంట్ నియోజకవర్గంలో గెలవడం, మాజీ సిఎం కెసిఅర్ సొంత ఇలాకాలో విజయం సాధించడం రఘునందన్కు కలిసి వచ్చే అంశాలుగా చెబుతున్నారు. మంచి వాగ్ధాటి కల్గిన నేతగా..ప్రత్యర్థి పార్టీల నేతల విమర్శలను సమర్థవంతంగా తిప్పకొట్టగల నేతగా రఘునందన్ ముందు వరుసలో ఉంటారు. ఇటువంటి అంశాలు కమలనాథులు పరిగణనలోకి తీసుకుంటే రఘునందన్ పేరును పరిశీలించే అవకాశం ఉంది. కేంద్ర మంత్రి వర్గంలో స్థానం ఆశించిన పాలమూరు ఎంపీ డీకే అరుణకు రాష్ట్ర పార్టీ బాధ్యతలు అప్పగిస్తే ఎలా ఉంటుందనే దానిపై అధిష్ఠానం పెద్దలు సమాలోచనలు చేస్తున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఉత్తర తెలంగాణ నుంచి బండి సంజయ్ కు, రాజధాని నగరం నుంచి కిషన్ రెడ్డికి కేంద్ర మంత్రి వర్గంలో ఛాన్స్ ఇచ్చారు. దక్షిణ తెలంగాణా నుంచి డికె అరుణకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే... సిఎం రేవంత్ కు ధీటుగా రాష్ట్రంలో బీజేపీని ముందుకు తీసుకువెళ్లవచ్చని పలువురు రాష్ట్ర నేతలు అధిష్ఠానం ముందు పెట్టినట్లు సమాచారం. కేంద్ర మంత్రివర్గంలో మహిళల సంఖ్య తక్కువగా ఉన్న నేపథ్యంలో కేంద్ర మంత్రి వర్గంలో డికె అరుణకు ఛాన్స్ ఇస్తారని కూడా మరో ప్రచారం జరుగుతోంది.నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి భంగపడ్డారు. ఇప్పుడు రాష్ట్ర పార్టీ పగ్గాలు అందుకోవాలని ప్రయత్నాలు చేస్తున్నారు. కామారెడ్డి ఎమ్మెల్యేగా ఉన్న వెంకటరమణ రెడ్డి సైతం అధ్యక్ష పదవి రేసులో ఉన్నారు. అయితే ఇప్పటికే బీజేఎల్పీ బాధ్యతలు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన ఏలేటి మహేశ్వర్ రెడ్డికి ఇచ్చిన నేపథ్యంలో రాష్ట్ర పార్టీ పగ్గాలు బిసి నేతకు ఇచ్చే అవకాశాలు ఉన్నాయి. మున్నూరు కాపు సామాజిక వర్గానికి చెందిన బండి సంజయ్ కు మంత్రి వర్గంలో ఛాన్స్ దక్కిన నేపథ్యంలో అదే సామాజిక వర్గానికి చెందిన అరవింద్ కు కొత్త బాధ్యతలు ఇస్తారా ? లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.పార్టీలో చాలాకాలంగా పనిచేస్తున్న మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు, పేరాల చంద్ర శేఖర్ బీజేపీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. జాతీయ పార్టీ అధ్యక్ష బాధ్యతలు కొత్త వారికి కేటాయించిన తర్వాతే తెలంగాణ పగ్గాలు ఎవరికిస్తారో తేలుతుంది. ఇదిలాఉంటే.. ఆషాడ మాసం ముగిసే వరకు కిషన్ రెడ్డి అటు కేంద్ర మంత్రిగా.. ఇటు రాష్ట్ర అధ్యక్ష బాధ్యతల్ని కూడా నిర్వహించే అవకాశం ఉంది. ఆషాడం ముగిసాకే కొత్త నేతకు రాష్ట్ర బాధ్యతలు అప్పగిస్తారని తెలుస్తోంది. -
బీఆర్ఎస్ ప్రక్షాళన.. కేసీఆర్ బిగ్ ప్లాన్ ఇదేనా?
తెలంగాణలో అధికారమార్పిడి జరిగి ఆరు నెలలు పూర్తయింది. పదేళ్ల పాటు అధికారంలో ఉన్న భారత రాష్ట్ర సమితి ప్రతిపక్షంలోకి మారింది. ఎంపీ ఎన్నికల్లో ఒక్కటి కూడా దక్కకపోవడంతో గులాబీ శ్రేణుల్లో నిరాశ ఆవరించింది. దీంతో పార్టీని అట్టడుగు స్థాయినుంచి బలోపేతం చేయాలని కేసీఆర్ నిర్ణయించారనే వార్తలు వినిపిస్తున్నాయి. సంస్థాగతంగా జరిగే మార్పుల్లో ఎటువంటి నిర్ణయాలు ఉండబోతున్నాయి? అసలు కేసీఆర్ ఆలోచన ఏంటి?గులాబీ శ్రేణుల్లో తిరిగి ఉత్సాహం నింపాలని, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు పార్టీని బలోపేతం చేయాలని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నిర్ణయించారు. అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల ఫలితాల తర్వాత పార్టీ పరిస్థితిపై గులాబీ పార్టీ అధిష్టానం ఓ అంచనాకు వచ్చింది. పూర్తి స్థాయి కమిటీలు లేకపోవడంతో నష్టం జరుగుతోందని, పార్టీ కోసం మొదటి నుండి పని చేస్తున్నవారికి బాధ్యతలు అప్పగించాలనే చర్చ పార్టీ వర్గాల్లో జరుగుతోంది.పార్టీ అనుబంధ కమిటీలను సైతం పూర్తి స్థాయిలో నియమించి క్యాడర్ ను యాక్టీవేట్ చేయాలని చూస్తోంది. క్యాడర్కు శిక్షణ ఇవ్వడంతో పాటు కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ఎప్పటికప్పుడు ప్రజల్లోకి తీసుకెళ్లేలా ప్లాన్ చేయబోతోంది. జిల్లాల్లో బలమైన నేతల్ని గుర్తించి బాధ్యతలు అప్పగించేందుకు గులాబీ పార్టీ కసరత్తు చేస్తోంది.బీఆర్ఎస్ పార్టీ జిల్లా కమిటీలను 2022 జూన్ లో ప్రకటించారు. ఇందులో ఆసీఫాబాద్, నిర్మల్ జిల్లాల అధ్యక్షులు పార్టీ మారడంతో అక్కడ ఖాళీ ఏర్పడింది. జిల్లాల్లో పూర్తి స్థాయి కమిటీలను సైతం నియమంచలేదు. 19 జిల్లాల్లో అధ్యక్ష బాధ్యతలను ఎమ్మెల్యేలకు అప్పగించడంతో పార్టీలోని సీనియర్లు, ఉద్యమకారులు అసంతృప్తికి గురి అయ్యారు.కొంతమంది నేతలు పార్టీని వీడారు. ఈ పరిణామం పార్టీని డ్యామేజ్ చేసిందనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు పార్టీ అనుబంధ కమిటీలైన మహిళ, యువత, రైతు, కార్మిక, విద్యార్థి, సోషల్ మీడియా కమిటీలను కూడా పూర్తి స్థాయిలో ఏర్పాటు చేయలేదు. బాధ్యతలు లేకుండా పార్టీలో పనిచేస్తున్న నేతలు సైతం అసంతృప్తితోనే ఉన్నారు. అదే విధంగా నియోజకవర్గ, మండల, గ్రామస్థాయిలో సైతం అధ్యక్షుడిని మాత్రమే నియమించి కార్యవర్గాన్ని ఏర్పాటు చేయలేదు. దీంతో పార్టీ ఇచ్చే కార్యక్రమాలు నామమాత్రంగా జరుగుతున్నాయి.ఆరేళ్ల క్రితం బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర కమిటీని 69 మంది సభ్యులతో ప్రకటించింది. ఆ కమిటీలో వున్న వారిలో కొంతమంది పార్టీ మారారు. దీంతో అధిష్టానం రాష్ట్ర కమిటీ కూర్పుపై పూర్తి స్థాయిలో దృష్టి సారించలేదు. సీనియర్ నేతలకు అవకాశం కల్పించలేదు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత రాష్ట్ర కమిటీ సమావేశం ఇప్పటివరకు నిర్వహించలేదని చెబుతున్నారు. విస్తృతస్థాయి సమావేశం పేరుతో రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్లను పిలిచి సమావేశాలు నిర్వహిస్తున్నారు.లోపాలను సరిదిద్దే క్రమంలో త్వరలోనే రాష్ట్రంలోని పార్టీ కమిటీలన్నీ రద్దు చేయాలని కేసీఆర్ భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. యాక్టీవ్ గా పనిచేసే వారికే బాధ్యతలు అప్పగించేందుకు అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో యాక్టీవ్ గా పనిచేసిన నేతల వివరాలను కేసీఆర్ తెప్పించుకుంటున్నారు. మాజీ మంత్రులు, సీనియర్ నేతలకు రాష్ట్ర కమిటీలతో పాటు జిల్లాల బాధ్యతలను అప్పగిస్తారనే చర్చ జరుగుతోంది. ఇప్పటికే పలువురు నేతలకు కేసీఆర్ హింట్ కూడా ఇచ్చినట్లుగా టాక్ వినిపిస్తోంది.అనుబంధ కమిటీలను సైతం నియమించాలని కేసీఆర్ భావిస్తున్నారు. ఉద్యమకాలం నుంచి పార్టీలో పనిచేస్తున్నవారికి పెద్దపీట వేయాలని, పార్టీలో ఉన్న కోవర్టులకు చెక్ పెట్టాలని అధిష్టానం భావిస్తోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లోనూ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాల నిర్మాణం చేపట్టింది. వాటిలో పార్టీ శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని నాయకత్వం భావిస్తోంది. పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేస్తేనే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ స్థానాల్లో విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది.క్యాడర్ను కాపాడుకునేందుకు బీఆర్ఎస్ పార్టీ ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు గులాబీ దళపతి కేసీఆర్. అన్ని జిల్లాల్లోనూ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పర్యటించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. పార్టీ శిక్షణా కార్యక్రమాలతో పాటు జిల్లా కేంద్రాల్లో మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టబోయే నిరసన కార్యక్రమాల్లో కేటీఆర్ ప్రత్యక్షంగా పాల్గొనేలా ప్రణాళికలు రూపొందిస్తున్నారు. రాష్ట్ర పార్టీ ఆఫీస్ కు వచ్చినా అగ్రనేతలను కలిసే అవకాశం వుండటం లేదని ఇప్పటికే కార్యకర్తలు అసంతృప్తితో వున్నారు. దీంతో కార్యకర్తల సమస్యలను నియోజకవర్గ, జిల్లా స్థాయిలో పరిష్కరించే విధంగా చర్యలుంటాయనే చర్చ జరుగుతోంది.ప్రతిపక్షంలో వున్నప్పుడు సంస్థాగతంగా పార్టీ బలంగా వుంటేనే అధికార పార్టీని ధీటుగా ఎదుర్కోగలమని గులాబీ పార్టీ భావిస్తోంది. అందుకోసం సమర్ధవంతమైన నేతలకు పార్టీ పదవులు ఇవ్వాలని నాయకత్వం భావిస్తోంది. సంస్థాగత నిర్మాణం, కమిటీల పునర్నిర్మాణం బీఆర్ఎస్ పార్టీకి పూర్వ వైభవం తీసుకు వస్తుందా అనేది చూడాలి. -
రాజకీయ కక్షతోనే కమిషన్ ఏర్పాటు: కేసీఆర్ సీరియస్ లేఖ
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో రాజకీయ కక్షతోనే నరసింహారెడ్డి కమిషన్ను ఏర్పాటు చేశారని అన్నారు మాజీ సీఎం కేసీఆర్. కుట్రలతోనే నాటి బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం కమిషన్ను ఏర్పాటు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.కాగా, తాజాగా జస్టిస్ నరసింహారెడ్డి కమిషన్కు కేసీఆర్ 12 పేజీల లేఖ రాశారు. ఈ లేఖలో కేసీఆర్..‘రాష్ట్రం ఏర్పడ్డ తొలినాళ్లల్లో విద్యుత్ సంక్షోభం విపరీతంగా ఉంది ఇది జగమెరిగిన సత్యం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అత్యంత దారుణంగా ఉన్న విద్యుత్ రంగం వల్ల ఏ ఒక్క సెక్టార్ కూడా సక్రమంగా నడవలేకపోయింది. రాష్ట్రంలో పవర్ హాలిడేలు, కరెంటు కోతలతో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎన్నో ఇబ్బందులు ఎదురయ్యాయి.నాడు గ్రామాల్లో ఉదయం మూడు గంటలు, సాయంత్రం మూడు గంటలు కరెంటు కోతలు ఉండేవి. త్రీఫేస్ కరెంట్ కావాలంటే చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీన్ని అధిగమించేందుకు తెలంగాణకు చట్ట ప్రకారం 53.89% ఆంధ్రప్రదేశ్కు 46.1 శాతం కేటాయించి ఆ విధంగా పది సంవత్సరాల పాటు విద్యుత్ను వినియోగించుకోవాలని నిర్దేశించింది.విభజన చట్టాన్ని ఉల్లంఘించి ఆనాటి ప్రభుత్వం తెలంగాణకు కరెంటు సరఫరా ఇవ్వకుండా 1500 మెగావాట్లు గ్యాస్ ఆధారిత విద్యుత్ రాకపోవడం వల్ల 900 మెగావాట్లు కలిపి 2,400 మెగావాట్ల లోటు ఏర్పడింది. మొత్తంగా ఐదు వేల మెగావాట్ల కొరతతో తెలంగాణలోని విద్యుత్ రంగంలో తీవ్ర సంక్షోభం ఏర్పడింది. దీన్ని అధిగమించి కొత్త ప్రాజెక్టులు నిర్ణయించి కొత్త ప్లాంట్లు ఏర్పాటు చేయడం వల్ల రాష్ట్రం ఆవిర్భవించినప్పుడు 7778 మెగావాట్లు విద్యుత్తు 20000 మెగావాట్లకు పైచిలుకు చేరటం మా ప్రభుత్వానికి నిదర్శనంతెలంగాణలో ఒకప్పుడు కరెంటు ఉంటే వార్త ఇప్పుడు కరెంటు పోతే వార్త. రాజకీయ కక్షతో నన్ను అప్పటి మా ప్రభుత్వాన్ని అప్రతిష్టపాలు చేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం విచారణ కమిటీ ఏర్పాటు చేసింది. కరెంటు కోసం తెలంగాణలో అప్పటి మా ప్రభుత్వం గణనీయంగా మార్పు చూపించి అన్ని రంగాలకు 24 గంటల నాణ్యమైన విద్యుత్తును ఇచ్చిన సంగతి అందరికీ తెలిసిందే.కేసీఆర్ లేఖ కోసం ఇక్కడ క్లిక్ చేయండి..లోక్సభ ఎన్నికల నేపథ్యంలో విచారణ కోసం నేను వ్యవధి అడిగితే దాన్ని కూడా ఏదో దయతలచి ఇచ్చినట్టుగా మాట్లాడడం నాకు ఎంతో బాధ కలిగించింది. ఆర్థిక నష్టాన్ని లెక్కించడం మాత్రమే మిగిలి ఉందన్నట్టు మీ మాటలు స్పష్టం చేస్తున్నాయి. మీ తీరు సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధంగా ఉంది.విచారణ పూర్తికాకముందే తీర్పు ప్రకటించినట్టుగా మీ మాటలున్నాయి. మీ విచారణలో నిష్పాక్షికత ఎంత మాత్రం కనిపించడం లేదు. అందువల్ల ఇప్పుడు నేను మీ ముందు హాజరై ఏం చెప్పినా ప్రయోజనం ఉండదని స్పష్టం అవుతోంది. పైన పేర్కొన్న అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని మీరు ఈ ఎంక్వయిరీ కమిషన్ బాధ్యతల నుంచి స్వచ్ఛందంగా వైదొలగాల్సిందిగా నేను విజ్ఞప్తి చేస్తున్నా’ అంటూ రాసుకొచ్చారు. -
రాష్ట్రంలో బీజేపీనే ప్రత్యామ్నాయం
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ శుక్రవారం తెలంగాణ బీజేపీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జ్, జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్కు చుగ్ శుభాకాంక్షలు తెలిపారు. హోం శాఖకు మంచిపేరు తీసుకురావడంతోపాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేయాలని తరుణ్ చుగ్ ఆకాంక్షించారు. అరగంట పాటు జరిగిన వారిద్దరి భేటీలో రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందని చుగ్ పేర్కొన్నారు. బండికి శుభాకాంక్షల వెల్లువ కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన బండి సంజయ్కి బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి, మాజీ ఎంపీలు సీతారాం నాయక్, బీవీ పాటిల్, మాజీ ఎమ్మెల్యేలు సంకినేని వెంకటేశ్వరరావు, ఎనీ్వఎస్ఎస్ ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ ఎన్.రామచంద్రరావు, బీసీ కమిషన్ మాజీ సభ్యులు టి.ఆచారి, రాష్ట్ర అధికార ప్రతినిధులు ఎన్వీ సుభాష్, వీరేందర్ గౌడ్, జె.సంగప్పతోపాటు వివిధ మోర్చాలకు చెందిన నాయకులు కలిసి అభినందనలు తెలిపారు. అలాగే.. కరీంనగర్ తోపాటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల నుంచి వచి్చన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు బండి సంజయ్ని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. తరుణ్ చుగ్తో భేటీ అయిన కేంద్ర మంత్రి బండి సంజయ్ -
అధికారులతో కేంద్రమంత్రి కిషన్రెడ్డి సమీక్ష
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర గనుల శాఖ అధికారులతో కేంద్ర బొగ్గు, గనుల శాఖమంత్రి కిషన్రెడ్డి సమీక్షా సమావేశం నిర్వహించారు. శుక్రవారం ఢిల్లీలోని శాఖ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో గనుల శాఖ సాధించిన విజయాలు, దీర్ఘకాలిక ప్రణాళికలపై చర్చించారు. మైనింగ్ రంగంలో భారత్ను ఆత్మనిర్భర్గా మార్చేందుకు ఆటోమేషన్, ఇన్నొవేషన్, సుస్థిరత, అధునాతన సాంకేతికతలను అమలు చేయడం వంటి కీలకమైన అంశాలపై ప్రధానంగా సమీక్షించారు. అంతకుముందు అధికారులు శాఖకు సంబంధించిన పలు అంశాలను కిషన్రెడ్డికి వివరించారు. కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయ మంత్రి సతీశ్చంద్ర దూబే, సీపీఎస్ఈలు, అనుబంధ కార్యాలయాల ఉన్నతాధికారులు సమీక్ష సమావేశంలో పాల్గొన్నారు. రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతిని కలిసిన కిషన్రెడ్డి కేంద్రమంత్రి కిషన్రెడ్డి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్లను మర్యాదపూర్వకంగా కలిశారు. కిషన్రెడ్డి వెంట కేంద్ర బొగ్గు, గనుల శాఖ సహాయమంత్రి సతీశ్ చంద్ర దూబే ఉన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేబినెట్లో మంత్రులుగా బాధ్యతలు తీసుకున్న కిషన్రెడ్డి, సతీశ్చంద్ర దూబేలను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి అభినందించారు. -
ప్రక్షాళన.. సంక్షేమం..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో పాలన గాడినపడేలా కీలక అంశాలపై ముఖ్యమంత్రి ఎనుమల రేవంత్రెడ్డి దృష్టిపెట్టారు. అధికార యంత్రాంగం ప్రక్షాళన, సంక్షేమ పథకాలను సమర్థవంతంగా అమలు చేయడంతోపాటు అభివృద్ధి కార్యక్రమాలను వేగవంతం చేయడంపై ఫోకస్ చేశారు. వచ్చే నెలలో పూర్తిస్థాయి రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టే నేపథ్యంలో అన్ని శాఖలతో సమావేశాలు నిర్వహించాలని నిర్ణయించారు.ఈ మేరకు శుక్రవారం డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిలతో తన క్యాంపు కార్యాలయంలో విడివిడిగా సమావేశమయ్యారు. సాగునీటి ప్రాజెక్టుల నుంచి పాలన వరకు.. నామినేటెడ్ పోస్టుల నుంచి ఏఐసీసీ సమీక్ష వరకు కీలక అంశాలపై వారు సుదీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. ప్రతిష్టాత్మకంగా ప్రకటించిన రైతు రుణమాఫీని ఎన్నికల్లో హామీ ఇచ్చిన మేరకు యథాతథంగా అమలు చేయాలా? ఏవైనా పరిమితులు విధిస్తే ఎలా ఉంటుంది? రుణమాఫీ అమలుకు అవసరమైన ఆదాయ వనరుల సమీకరణ ఎలాగన్న అంశాలపై ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టు తెలిసింది.ఈ అంశంపై ఇంతకుముందే రిజర్వు బ్యాంకు మాజీ గవర్నర్ రఘురాం రాజన్తో చర్చించిన విషయం కూడా ప్రస్తావనకు వచ్చినట్టు సమాచారం. ఇక ఆదాయ వనరులు పెంచుకునే అంశంపై ఇదివరకే కీలక శాఖలకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినందున.. లక్ష్యం మేరకు ఆదాయం సమకూరేలా చూడాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ విషయంలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారులు అలసత్వం ప్రదర్శించకుండా చూడాలన్న భావన వ్యక్తమైనట్టు సమాచారం. ఉదయం ఉత్తమ్తో అభివృద్ధిపై.. సీఎం రేవంత్ శుక్రవారం ఉదయం మంత్రి ఉత్తమ్తో సమావేశమయ్యారు. సుమారు గంటపాటు ఇద్దరూ మాట్లాడుకున్నట్టు తెలిసింది. మేడిగడ్డ బరాజ్, సీతారామ ప్రాజెక్టులను సందర్శించిన సందర్భంగా పరిశీలనకు వచ్చిన అంశాలు, కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో ఎన్డీఎస్ఏ నివేదిక, జస్టిస్ పినాకి చంద్రఘోష్ నేతృత్వంలోని ఏకసభ్య కమిషన్ విచారణ, సాగునీటి శాఖ సిబ్బందికి పదోన్నతులు తదితర అంశాలపై వారు చర్చించినట్టు సమాచారం.ఇప్పటివరకు ఎన్నికల కోడ్ కారణంగా అభివృద్ధి పనులు చేపట్టలేకపోయామని రేవంత్, ఉత్తమ్ల భేటీలో అభిప్రాయపడినట్టు తెలిసింది. ఇక వీలైనంత త్వరగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయాలని, తక్కువ సమయంలో ఎక్కువ ఆయకట్టు స్థిరీకరణ జరిగే విధంగా చర్యలు తీసుకోవాలని నిర్ణయించినట్టు తెలిసింది. దీనికితోడు విద్యార్థులకు సన్నబియ్యంతో మధ్యాహ్న భోజనం అమలు, ఇందుకు అవసరమైన బియ్యం సేకరణపై వారు చర్చించినట్టు సమాచారం. మధ్యాహ్నం భట్టితో ఆర్థిక అంశాలపై.. మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో డిప్యూటీ సీఎం భట్టితో సీఎం రేవంత్ భేటీ అయ్యారు. దాదాపు రెండు గంటలకుపైగా జరిగిన ఈ సమావేశంలో పూర్తిస్థాయి బడ్జెట్ రూపకల్పనకు అనుసరించాల్సిన విధానం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, రైతుల రుణమాఫీ, దీని అమల్లో పరిమితులు, కార్పొరేషన్ చైర్మన్ల నియామకం, ఆదాయం పెంపు, వివిధ ప్రభుత్వ శాఖలతో సమీక్షలు, స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ, కులగణన విషయంలో వ్యవహరించాల్సిన తీరు, విద్యుత్ అంశంపై వేసిన జస్టిస్ నర్సింహారెడ్డి కమిషన్ పనితీరు, ఐఏఎస్ల బదిలీలు, లోక్సభ ఎన్నికలపై వచ్చే వారంలో ఏఐసీసీ నిర్వహించనున్న సమీక్షలు తదిరత అంశాలపై ఈ ఇద్దరూ సుదీర్ఘంగా చర్చించినట్టు తెలిసింది.పంద్రాగస్టులోపు కచ్చితంగా రైతు రుణమాఫీ చేయాల్సిందేనని.. ఇచ్చిన మాట నిలబెట్టుకునేందుకు అందుబాటులో ఉన్న అన్ని ఆర్థిక వెసులుబాట్లను పరిశీలించాలని ఆలోచనకు వచ్చినట్టు సమాచారం. ఈ మేరకు కేబినెట్ భేటీ కంటే ముందు ఆర్థిక శాఖ సూత్రప్రాయంగా ఓ నిర్ణయానికి రావాలనే చర్చ జరిగినట్టు తెలిసింది. ఇక నామినేటెడ్ పోస్టుల భర్తీ విషయంలో చర్యలు, చేయాలనుకుంటున్న మార్పులు, ఇప్పటికే ప్రకటించిన పోస్టుల ఉత్తర్వుల విడుదల, మిగతా పదవుల భర్తీ తదితర రాజకీయ అంశాలపైనా రేవంత్, భట్టి చర్చించారని సమాచారం. భౌతికదాడులను ఉపేక్షించేది లేదుఅరాచకాలు, హత్యలను సహించం : సీఎం రేవంత్ సాక్షి, హైదరాబాద్ : భౌతికదాడులకు దిగి అరాచకాలు, హత్యలకు పాల్పడేవారు ఎంతటివారైనా ఉపేక్షించేది లేదని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హెచ్చరించారు, నారాయణపేట జిల్లా ఉట్కూర్ మండలంలో శుక్రవారం పట్టపగలు గువ్వల సంజీవ్ను కొట్టి చంపిన ఘటనపై సీఎం సీరియస్గా స్పందించారు. ఈ ఘటనకు సంబంధించి నిర్లక్ష్యంగా వ్యవహరించినట్టు తేలితే, బాధ్యులైన పోలీసుపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కఠిన చర్యలు తీసుకోవాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. పోక్సో కేసు నమోదు చేయండి పెద్దపల్లి జిల్లాలో ఆరేళ్ల బాలికపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసిన అమానుష ఘటనపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి తీవ్రంగా స్పందించారు. వెంటనే ఫోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేయాలని పోలీసు అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం తగిన న్యాయం చేస్తుందని భరోసా ఇచ్చారు. విద్యార్థినుల ఉచిత బస్సు ప్రయాణం.. సీఎం హ్యాపీ ఆర్టీసీ బస్సులో ‘ఉచిత ప్రయాణ పథకం’వల్ల తాము ఉచితంగా బస్సెక్కి పాఠశాలలకు వెళ్లగలుగుతున్నామ ని సిద్దిపేట జిల్లా నంగనూరు మండలం మగ్దుంపూర్ కు చెందిన విద్యార్థినులు ఆధార్కార్డులు చూపిస్తూ సంతోషం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించి ఒక జర్న లిస్టు సీఎంకు ఫొటో పంపారు. ఆ ఫొటోను సీఎం తన ఎక్స్ ఖాతాలో పోస్టు పెట్టి కామెంట్ చేశారు. ఊరికి కిలోమీటర్ దూరాన ఉన్న పాఠశాలకు ఖర్చు లే కుండా వెళుతున్నామని ఆ బాలికలు చెబుతుంటే అంతకంటే ఆనందం ఏముంటుందని సీఎం వ్యాఖ్యానించారు. -
బీఆర్ఎస్పై బీజేపీ ఎంపీ రఘునందన్ రావు ఘాటు వ్యాఖ్యలు
నరకాసురుడు చనిపోతే దీపావళి జర్పుకున్నట్టు నేడు మెదక్లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారని మెదక్ బీజేపీ ఎంపీ రఘు నందన్ రావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ అన్నీ వర్గాల ప్రజల్ని ప్రజలను అణిచి వేయాలని చూసింది. ఫలితంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా గెలవలేకపోయిందన్నారు. తన గెలుపును మల్లన్న సాగర్లో తన చితి తానే పెర్చుకొని మరణించిన రైతు మల్లారెడ్డికి అంకితం చేస్తున్నట్లు తెలిపారు.దుబ్బాకలో రఘునందన్ రావుకి ప్రోటోకాల్ లేకుండా చేద్దామని అనుకున్నారు కానీ నేడు సిద్దిపేటలో కూడా ప్రోటోకాల్ వచ్చింది. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మొదటిసారి మెదక్ గడ్డపై కాషాయ జెండా ఎగిరిందన్న రఘనందన్ .. నా గెలుపు కోసం బీఆర్ఎస్ నాయకులు పరోక్షంగా ప్రచారం చేశారని అన్నారు. నరకాసురుడు చనిపోతే దీపావళి జరుపుకున్నట్లు నేడు మెదక్లో బీజేపీ గెలిస్తే అంత సంబరాలు జరుపుకున్నారుబీఆర్ఎస్ నేత వెంకట్ రాంరెడ్డి 30రోజులలో గజ్వేల్ ప్రాంత క్షిరా సాగర్ రైతులకు వారి భూములను తిరిగి ఇవ్వకపోతే ఎక్కడి వరకు అయినా పోరాటం చేస్తామని హెచ్చరించారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి, నిజాయితీ ఉంటే వెంకట్ రాంరెడ్డి స్వాధీనం చేసుకున్న గజ్వేల్ భూములపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కాళేశ్వరం ప్రాజెక్ట్పై అవినీతి జరిగిందన్న రేవంత్ రెడ్డి దానిపై చర్యలు ఏవి అని ప్రశ్నించారు. -
అలవికాని హామీలు.. కాంగ్రెస్పై తరుణ్చుగ్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్.. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి తరుణ్ చుగ్ను కలిశారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు తీసుకున్న అనంతరం బండి సంజయ్ తొలిసారిగా తరుణ్ చుగ్ను మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సంజయ్కు శుభాకాంక్షలు తెలిపిన తరుణ్ చుగ్.. ఆయనతో అరగంటకుపైగా ముచ్చటించారు. కేంద్ర మంత్రిగా బాధ్యతలు స్వీకరించిన బండి సంజయ్ ఆ శాఖకు మంచి పేరు తీసుకురావడంతో పాటు ప్రజలకు మరింత మేలు జరిగేలా పని చేస్తారనే ఆశాభావాన్ని తరుణ్ చుగ్ వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పార్లమెంట్ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి, పార్టీని మరింత బలోపేతం చేసేందుకు చేపట్టాల్సిన అంశాలపై అరగంటకుపైగా చర్చించారు. తెలంగాణలో 8 పార్లమెంట్ స్థానాలను గెలిచిన బీజేపీ 35 శాతానికిపైగా ఓట్లు సాధించడంపట్ల సంతోషం వ్యక్తం చేసిన తరుణ్ చుగ్.. నరేంద్రమోదీ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలవల్లే ఇది సాధ్యమైందని అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ ఎన్నికల్లో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ కేవలం ఐదు నెలల్లోనే విశ్వసనీయతను కోల్పోయిందని, పార్లమెంట్ ఎన్నికల ఫలితాలే ఇందుకు నిదర్శనమన్నారు. కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నిరాశను ఎన్నికల ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని, అసెంబ్లీ ఎన్నికల్లో అలవికాని హామీలిచ్చిన కాంగ్రెస్ పార్టీ వాటిని అమలు చేయకుండా తెలంగాణ ప్రజలకు ద్రోహం చేస్తోందన్నారు. ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్ పట్ల ప్రజల్లో ఉన్న ఆగ్రహానికి అద్దం పడుతున్నాయన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పనైపోయిందని, కాంగ్రెస్ పార్టీకి బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయమనే విషయం కూడా పార్లమెంట్ ఫలితాలతో రుజువైందన్నారు. -
ఒకప్పుడు ఆ జిల్లాలో ఏకచక్రాధిపత్యం.. నేడు జీరో!
ఒకనాడు ఆ జిల్లాలో గులాబీ పార్టీ జైత్రయాత్ర కొనసాగించింది. ఒకటీ అరా మినహా సర్పంచ్ నుంచి ఎంపీ సీట్ల వరకు బీఆర్ఎస్ హవా కొనసాగింది. ఎన్నికలు ఏవైనా విజయం తమదే అనే ధీమాతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకునేవి. కానీ గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అక్కడ హస్తం హవా మొదలైంది. పార్లమెంట్ ఎన్నికల్లో ఒక సీటు హస్తంకు, మరో సీటు కమలానికి దక్కాయి. గులాబీ పార్టీ మొత్తంగా జీరో అయిపోయింది. ఇన్ని పరాజయాల మధ్య ఓ విజయం బీఆర్ఎస్ను పలకరించింది. ఆ విజయం ఏంటి? ఇంతకీ ఆ జిల్లా ఏది?తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యాక ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లాలో కారు పార్టీ జైత్రయాత్రకు అడ్డే లేకుండా పోయింది. పదేళ్ళ పాటు జిల్లాలో ఏకచక్రాధిపత్యం చెలాయించారు గులాబీ పార్టీ నాయకులు, కార్యకర్తలు. అట్టడుగు నుంచి ఉన్నత స్థాయి వరకు ఏ ఎన్నికలు జరిగినా విజయం గులాబీ పార్టీదే అన్న రేంజ్ కొనసాగింది. కాని ఇటీవలి అసెంబ్లీ ఎన్నికలు, పార్లమెంట్ ఎన్నికల్లో కారు స్పీడ్కు బ్రేకులు పడ్డాయి.అగ్రతాంబూలం అందుకున్న జిల్లాలో అథః పాతాళానికి పడిపోయింది. ఉమ్మడి జిల్లాలో 14 అసెంబ్లీ సీట్లకు కేవలం ఇద్దరు ఎమ్మెల్యేలనే గెలిపించుకోగలిగింది. ఇక లోక్సభ ఎన్నికల్లో దారుణ పరాభవం ఎదురు కావడంతో గులాబీ శ్రేణలు డీలా పడ్డాయి. కాని ఇదే సమయంలో స్దానిక సంస్దల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్ది నవీన్కుమార్ రెడ్డి విజయం సాధించటంతో కొంత ఊరట చెందారు. పార్టీ ఇంతగా పరాజయం పొందటానికి నేతల మద్య సమన్వయ లోపం..తమకేంటిలే అనే నిర్లక్ష్యమే కారణమనే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.అసెంబ్లీ ఎన్నికల తర్వాత కొద్దికాలానికే వచ్చి లోక్సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా పార్టీ అధినేత కేసీఆర్ మహబూబ్నగర్, నాగర్కర్నూల్ జిల్లా కేంద్రాల్లో నిర్వహించిన బస్సుయాత్రలు సక్సెస్ కావటంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు ఊరట చెందారు. ఎమ్మెల్సీగా తమ పార్టీ అభ్యర్ది నవీన్రెడ్డి గెలువటం కూడా వారిలో కొత్త ఆశలు చిగురించాయి. కాని లోక్సభ ఎన్నికల్లో రెండుస్దానాల్లో పార్టీ అభ్యర్దులు ఘోరంగా ఓడిపోవటం..అదీ మూడవ స్దానానికే పరిమితం కావటం మాత్రం జీర్ణించుకోలేక పోతున్నారు. లోక్సభ ఎన్నికల్లో పోటీ ప్రధానంగా కాంగ్రేస్, బీజేపీ మధ్యనే సాగింది. నాగర్కర్నూల్ స్దానంలో కొంత ప్రభావం చూపగలిగినా..మహబూబ్నగర్ స్దానంలో మాత్రం బీఆర్ఎస్ అభ్యర్ది అసలు ప్రభావం చూపలేకపోయారు. ఈ స్దానంలో 2009 నుంచి 2019 వరకు వరుసగా బీఆర్ఎస్ విజయం సాధించి హ్యాట్రిక్ కొట్టింది. లోక్సభ ఎన్నికల్లో పెద్దఎత్తున బీఆర్ఎస్ ఓట్లు బీజేపీకి బదిలీకావటం కూడ నష్టం కలిగించిందనే వాదనలు వినిపిస్తున్నాయి. బీజేపీని గెలిపించేందుకు బీఆర్ఎస్ కావాలనే తమ పార్టీ ఓట్లను కమలం గుర్తుకు బదిలీ చేసిందని కాంగ్రెస్ నాయకులు ఆరోపిస్తున్నారు. భవిష్యత్లో ఇక ఇక్కడ బీఆర్ఎస్కు స్దానం ఉండదని కాంగ్రెస్ అంటోంది. కాని బీఆర్ఎస్ నేతలు మాత్రం మళ్లీ పాలమూరు జిల్లాలో పూర్వవైభవం సాధిస్తామని చెబుతున్నారు.ఇప్పటికే ఇచ్చిన గ్యారెంటీలను అమలు చేయటంలో కాంగ్రేస్ ప్రభుత్వం విఫలయ్యిందని మండిపడుతున్నారు. రానున్న స్దానిక సంస్ధల ఎన్నికల్లో సత్తా చాటుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు. పాలమూరు సీఎం రేవంత్రెడ్డి సొంత జిల్లా కావటం అత్యధికంగా ఎమ్మెల్యేలు, ఓ ఎంపీ కాంగ్రెస్ పార్టీకి ఉండటం..మరోవైపు మహబూబ్నగర్ ఎంపీ స్దానంలో బీజేపీ గెలవటంతో ఆ రెండు పార్టీలు బలంగా తయారయ్యాయి. కేంద్రలో, రాష్ట్రంలో అధికారంలో ఉన్న హస్తం, కమలం పార్టీల మధ్య కారు పార్టీ మనుగడ ఎలా సాగుతుందో చూడాలి. -
స్కాం జరిగితే ఈడీ దర్యాప్తు చేయడం కామనే: మహేశ్వర్ రెడ్డి
సాక్షి, ఢిల్లీ: తెలంగాణ వచ్చేది బీజేపీ ప్రభుత్వమేనని అన్నారు బీజేపీ ఫ్లోర్ లీడర్ మహేశ్వర్ రెడ్డి. తెలంగాణ ప్రజల్లో బీజేపీ పార్టీ పట్ల విశ్వాసం పెరిగిందని చెప్పుకొచ్చారు. అలాగే, ఇచ్చిన హామీలను తీర్చడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమైందన్నారు.కాగా, మహేశ్వర్ రెడ్డి శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ..‘రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఆరు నెలలు గడిచినా వృద్దాప్య పింఛన్లను నాలుగు వేలకు పెంచలేదు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలుచేయడం లేదు. పెన్షన్ కోసం తీసుకున్న దరఖాస్తులను ఏం చేశారో తెలియదు.కేసీఆర్ పేరు ఉందనే నెపంతో పాఠ్య పుస్తకాలను వెనక్కి తీసుకోవడం వల్ల ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతుంది. పుస్తకాలను యథావిధిగా పంపిణీ చేయాలి. తెలంగాణలో బీజేపీ పార్టీపై విశ్వాసం పెరిగింది. రాష్ట్రంలో వచ్చేది బీజేపీ ప్రభుత్వమే. కుంభకోణాలు జరిగినప్పుడు ఈడీ దర్యాప్తు చేయడం సహజమే’ అంటూ కామెంట్స్ చేశారు. -
అవును..‘ ఉగాది పచ్చడే’
సాక్షి, హైదరాబాద్ : ‘పార్లమెంట్ ఎన్నికల్లో ఫలితాలు కొంచెం తియ్యగా..కొంచెం పుల్లగా, కొంచెం వగరుగా వచ్చాయి. ఈ ఫలితాలు ఉగాది పచ్చడిలా ఉన్నాయి.’... లోక్సభ ఎన్నికల ఫలితాలపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్య ఇది. నిజంగా ముఖ్యమంత్రి చెప్పినట్టే అధికార కాంగ్రెస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు వచ్చాయని గణాంకాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఆరునెలలే అవుతున్న నేపథ్యంలో లోక్సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలు రావడం దేనికి సంకేతమన్నది ఆసక్తికరంగా మారింది. అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే ఏకంగా 42 చోట్ల అధికంగా ఓట్లు సాధించడం ద్వారా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తన పట్టు నిరూపించుకోగా, సిట్టింగ్ ఎమ్మెల్యేలున్న చాలా స్థానాల్లో ఓట్లు తగ్గడం గమనార్హం. మొత్తం 17 లోక్సభ స్థానాలకుగాను ఎనిమిది చోట్ల అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు రాగా, తొమ్మిది చోట్ల తగ్గాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు వచ్చినా కేవలం రెండు చోట్ల మాత్రమే కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. మిగిలిన ఆరు చోట్ల ఓడిపోయారు. ఇక, అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచ్చినా, ఆరుస్థానాల్లో త్రిముఖ పోటీ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించగలిగారు. ఇక, రాష్ట్ర మంత్రివర్గం విషయానికి వస్తే ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తోన్న అసెంబ్లీ, లోక్సభ నియోజకవర్గాల్లో తక్కువ ఓట్లు వచ్చాయి. ఆయన సొంత పార్లమెంట్ నియోజకవర్గంలోనూ కాంగ్రెస్ అభ్యర్థి ఓటమి పాలయ్యారు. ఇతర మంత్రుల్లో కేవలం ఉత్తమ్కుమార్రెడ్డి, భట్టి విక్రమార్కలు ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్, మధిర స్థానాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు రాగా, మిగిలిన అందరు మంత్రులు తమ తమ నియోజకవర్గాల్లో అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లతో సరిపెట్టుకున్నారు. మొత్తంమీద అసెంబ్లీ ఎన్నికల్లో సీపీఐ పోటీ చేసిన స్థానం మినహా 92,35,792 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి రాగా, లోక్సభ ఎన్నికల్లో 86,53,707 ఓట్లు వచ్చాయి. ఓట్ల శాతం 39 నుంచి 40.5 శాతానికి పెరిగినా, అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే అధికార కాంగ్రెస్ పార్టీ 5.82లక్షల ఓట్లు కోల్పోవడం గమనార్హం. పోస్టుమార్టం హైలైట్స్ ఇవే : » గత అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఆదిలాబాద్ స్థానం పరిధిలో ఓట్లు భారీగా పెరిగాయి. ఈ లోక్సభ స్థానం పరిధిలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఓట్ల సంఖ్య భారీగా పెరిగింది. సిర్పూర్, ముథోల్ నియోజకవర్గాల్లో అయితే అసెంబ్లీ ఎన్నికల కంటే 50వేల కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి. » పెద్దపల్లి లోక్సభ ఎంపీ స్థానం గెలిచినా, ఆ సెగ్మెంట్ పరిధిలోని అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఓట్ల సంఖ్య గణనీయంగా తగ్గింది. » కరీంనగర్లోనూ అన్ని అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు తగ్గాయి. అత్యధికంగా మానకొండూరు నియోజకవర్గంలో 44వేల ఓట్లు తక్కువ వచ్చాయి. » అసెంబ్లీ ఎన్నికల కంటే నిజామాబాద్ లోక్సభ నియోజకవర్గంలో 72వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. ఈ పార్లమెంటు పరిధిలోనికి వచ్చే ఆర్మూరు, బోధన్, నిజామాబాద్ అర్బన్, కోరుట్ల, జగిత్యాల స్థానాల్లో ఓట్లు పెరగ్గా, నిజామాబాద్ రూరల్, బాల్కొండ నియోజకవర్గాల్లో తగ్గాయి. » జహీరాబాద్లో అసెంబ్లీ ఎన్నికల కంటే స్వల్పంగా ఓట్లు తగ్గినా, ఆ స్థానాన్ని కాంగ్రెస్ పార్టీ గెలుచుకుంది. ఇక్కడ బాన్సువాడ, కామారెడ్డి, జహీరాబాద్ అసెంబ్లీ స్థానాల్లో ఓట్లు పెరగ్గా, మిగిలిన చోట్ల తగ్గాయి. » మెదక్ పార్లమెంట్ పరిధిలో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే అతి స్వల్పంగా 7వేల ఓట్లు ఎక్కువ వచ్చాయి. అయితే, సిద్దిపేటలో 9,968 ఓట్లు, గజ్వేల్లో 32,971 ఓట్లు అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ వచ్చాయి. సంగారెడ్డిలో స్వల్పంగా ఓట్లు పెరిగాయి. » మల్కాజ్గిరి లోక్సభ స్థానం పరిధిలో అసెంబ్లీ ఎన్నికల్లో వచి్చన ఓట్ల కంటే లోక్సభ ఎన్నికల్లో వచి్చన ఓట్లు ఎక్కువ. » సికింద్రాబాద్లో కూడా అసెంబ్లీ ఎన్నికల కంటే 1.4 లక్షల ఓట్లు ఎక్కువ పార్లమెంట్ ఎన్నికల్లో వచ్చాయి. » ఎంఐఎం అడ్డా హైదరాబాద్ లోక్సభ పరిధిలో అసెంబ్లీ కంటే తక్కువ ఓట్లు వచ్చాయి. తెలంగాణ మొత్తంగా చూస్తే.. అత్యల్పంగా కేవలం 62,497 ఓట్లు మాత్రమే కాంగ్రెస్ పార్టీకి పడ్డాయి. » చేవెళ్లలోనూ అసెంబ్లీ కంటే లోక్సభ ఎన్నికల్లో స్వల్ప ఆధిక్యత కనిపించింది. » మహబూబ్నగర్లో అసెంబ్లీ ఎన్నికల కంటే 1.10లక్షల ఓట్లు తగ్గాయి. సీఎం రేవంత్రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న కొడంగల్లో అసెంబ్లీ ఎన్నికల్లో వచి్చన ఓట్ల కంటే 23వేల ఓట్లు తగ్గాయి. » నాగర్కర్నూల్లో ఓట్లు తగ్గినా త్రిముఖ పోటీలో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించగలిగింది. ఇక్కడ కూడా అన్ని అసెంబ్లీ స్థానాల పరిధిలో లోక్సభ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు కాంగ్రెస్ పార్టీకి లభించడం గమనార్హం. » తెలంగాణలోనే రికార్డు మెజారిటీతో గెలిచిన నల్లగొండ పార్లమెంట్ స్థానం పరిధిలోనికి వచ్చే హుజూర్నగర్, సూర్యాపేట అసెంబ్లీ స్థానాల్లో లోక్సభకు ఓట్లు పెరిగాయి. మిగిలిన చోట్ల స్వల్పంగా తగ్గాయి. సూర్యాపేటలో ఏకంగా 32వేల ఓట్లు అధికంగా లభించాయి. » భువనగిరి లోక్సభ పరిధిలోకి వచ్చే అన్ని అసెంబ్లీ స్థానాల్లోనూ పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్కు తక్కువ ఓట్లు వచ్చాయి. » వరంగల్లో కూడా అసెంబ్లీ ఎన్నికలతో పోలిస్తే లోక్సభ ఎన్నికల్లో ఓట్లు తగ్గాయి. » మహబూబాబాద్ లోక్సభ పరిధిలోనూ అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లే వచ్చాయి. కేవలం భద్రాచలం అసెంబ్లీ పరిధిలో (ఇక్కడ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలిచింది.) మాత్రమే ఓట్లు పెరగ్గా, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్థులు గెలిచిన ప్రతి చోటా ఓట్లు తగ్గాయి. » ఖమ్మం లోక్సభ పరిధిలో ఇద్దరు మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్న ఖమ్మం, పాలేరులో ఓట్లు తగ్గాయి. ఖమ్మం అసెంబ్లీ పరిధిలో అత్యధికంగా 10వేల ఓట్లు తగ్గడం గమనార్హం. » మొత్తం మీద ఆదిలాబాద్, నిజామాబాద్, మెదక్, మల్కాజ్గిరి, చేవెళ్ల, సికింద్రాబాద్, నల్లగొండ, ఖమ్మంలలో అసెంబ్లీ ఎన్నికల కంటే ఎక్కువ ఓట్లు రాగా, మిగిలిన చోట్ల తక్కువ వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల కంటే తక్కువ ఓట్లు వచి్చనా, భువనగిరి, మహబూబాబాద్, పెద్దపల్లి, నాగర్కర్నూల్, వరంగల్, జహీరాబాద్లలో త్రిముఖ పోటీ కారణంగా కాంగ్రెస్ అభ్యర్థులు విజయం సాధించారు. సానుకూలతలున్నా...! అసెంబ్లీ ఎన్నికల కంటే లోక్సభ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీకి అనేక సానుకూలతలున్నా, ఉగాది పచ్చడి లాంటి ఫలితాలు రావడం రాజకీయవర్గాల్లో చర్చనీయాంశమవుతోంది. లోక్సభ ఎన్నికల సమయంలో సీపీఎం కాంగ్రెస్ పార్టీకి అధికార మిత్రపక్షంగా తోడయింది. ఎంఐఎం పోటీ చేయని స్థానాల్లో ఆ పార్టీ బహిరంగంగానే కాంగ్రెస్ పార్టీకి మద్దతిచ్చింది.జాతీయస్థాయి రాజకీయాల నేపథ్యంలో ముస్లిం మైనారిటీలు కాంగ్రెస్ వైపు నిలిచారనే అంచనాలున్నాయి. అన్నింటికంటే ముఖ్యంగా అధికారంలో ఉన్న కారణంగా ఉండే సానుకూలత, వనరులు ఆ పార్టీకి అదనపు బలాన్నిచ్చాయి. ఇన్ని సానుకూలతల నేపథ్యంలోనూ అధికార కాంగ్రెస్ పార్టీ లోక్సభ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలతో సరిపెట్టుకోవడం గమనార్హం.