-
ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే: కేటీఆర్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ పాలనపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరోసారి ధ్వజమెత్తారు. హస్తం పార్టీ పాలనతో మహా నగరమైన హైదరాబాద్లో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి వత్తాసు పలికే ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?" అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే హైదరాబాద్ పరిస్ధితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చని అన్నారు. పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాద్ నుంచి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైదరాబాద్ అంటే.. కేవలం రాజధాని కాదని.. తెలంగాణ ఎకనమిక్ ఇంజన్ అని తెలిపారు. ఇకనైనా కాంగ్రెస్ సర్కారు మేల్కొనకపోతే.. మన హైదరాబాద్ దెబ్బతినే పరిస్థితి ఉందన్నారు. దీని వల్ల రాష్ట్రానికి కష్టమే కాదు.. యావత్ దేశానికి కూడా నష్టం.. అంటూ కేటీఆర్ ట్విట్ చేశారు."ఈ మహా నగరానికి ఏమైంది..?"ఈనాడు, ఆంధ్రజ్యోతి లాంటి ప్రముఖ పత్రికలు కూడా “ఈ నగరానికి ఏమైంది?" అని ఫ్రంట్ పేజిలో వార్తలు రాస్తోంది అంటే నగరంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని అర్థం!పరిపాలనా అనుభవం లేని నాయకత్వం ఎలా ఉంటుందో హైదరాబాదు నుండి తెలంగాణ పల్లెటూరు వరకూ అంతటా… pic.twitter.com/RF7aVlR7x6— KTR (@KTRBRS) July 11, 2024 -
ఫలితాలపై పోస్ట్మార్టమ్.. గాంధీభవన్లో కురియన్ కమిటీ
సాక్షి, హైదరాబాద్: లోక్సభ ఎన్నికల్లో ఓడిపోయిన కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థులతో ఏఐసీసీ ఏర్పాటు చేసిన త్రీ మెన్ కమిటీ ప్రత్యేకంగా భేటీ అయ్యింది. అభ్యర్థులతో విడివిడిగా మాట్లాడుతున్న కురియన్ కమిటీ.. ఒక్కో అభ్యర్థికి 30 నిమిషాలు సమయం కేటాయించింది. తమ వాదన సైతం కురియన్ కమిటీకి వినిపిస్తామంటున్నారు టికెట్ రాని నేతలు.. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ వైఫల్యాలపై అధ్యయనానికి పలు రాష్ట్రాల్లో ఏఐసీసీ నిజనిర్ధారణ కమిటీలు వేసింది.మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా, ఢిల్లీ, ఉత్తరాఖండ్, హిమాచల్ ప్రదేశ్, కర్ణాటక, తెలంగాణలలో నిజనిర్ధారణ కమిటీలు వేసింది. కురియన్తో పాటు రక్హిబుల్ హుసేన్, పర్గత్ సింగ్లతో తెలంగాణ కమిటీ ఏర్పాటు చేశారు. రెండు మూడు రోజుల పాటు తెలంగాణలోనే ఉండి పలు నియోజకవర్గాల్లో కురియన్ కమిటీ తిరగనుంది.పార్లమెంటు ఎన్నికల్లో ఎందుకు ఓటమి చెందారు? పార్లమెంటు నియోజకవర్గాల పరిధిలో అసెంబ్లీ, లోక్సభ ఫలితాల్లో వచ్చిన ఓటింగ్ శాతం ఎంత? లోపాలు ఏంటి? వంటి అంశాలపై కురియన్ కమిటీ ఆరా తీస్తోంది. ఓటమికి కారణాలపై వివరాలను కురియన్ కమిటీ అభ్యర్థుల నుంచి సేకరిస్తోంది. -
కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్: మరో ఆరుగురు ఎమ్మెల్యేలు ‘కారు’ దిగడానికి రెడీ!
సాక్షి, హైదరాబాద్: ‘గ్రేటర్’ పాలిటిక్స్ రసవత్తరంగా మారింది. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కాంగ్రెస్ ఆపరేషన్ ఆకర్ష్ కొనసాగుతోంది. కారు దిగడానికి ఆరుగురు ఎమ్మెల్యేలు రెడీ అయ్యారు. శుక్రవారం రాజేంద్రనగర్ ఎమ్మెల్యేతో చేరికలు షూరూ అయ్యింది. గ్రేటర్లో రోజుకో బీఆర్ఎస్ ఎమ్మెల్యే జంపింగ్కు స్కెచ్ సిద్ధమయ్యింది. ఇప్పటికే కార్యకర్తలతో పలువురు ఎమ్మెల్యేలు భేటీ అయ్యారు.హైదరాబాద్ శివారులో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో కాంగ్రెస్ చర్చలు పూర్తయ్యాయి. గ్రేటర్ హైదరాబాద్లో రాజకీయ సమీకరణాలు మారుతున్నాయి. రోజుకో ఎమ్మెల్యే, 20 మంది ముఖ్యనేతలు చేరికకు కాంగ్రెస్ ప్లాన్ చేస్తోంది. సీఎం రేవంత్ సమక్షంలో కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరనున్నారు. -
కాంగ్రెస్ ప్రభుత్వంపై బీజేపీ పోరుబాట
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కమలదళం పోరుబాట పట్టనుంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడునెలలు దాటడంతో హామీల అమలుపై పట్టుబట్టేలా ఉద్యమకార్యాచరణకు సిద్ధమవుతోంది. అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలు, 421 హామీలపై ప్రత్యక్ష ఆందోళనలతో వివిధవర్గాల సమస్యలపై ప్రజల్లోకి వెళ్లేలా ఆందోళన కార్యక్రమాలను చేపట్టనుంది. ఇందుకోసం పార్టీపరంగా ఉన్న యువజన, మహిళా, కిసాన్, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ మోర్చాల ద్వారా ఆందోళనలను ఇప్పటికే ప్రారంభించింది. రైతాంగానికి ఇచ్చిన హామీల అమల్లో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తిచూపుతూ కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో బుధవారం జిల్లా కలెక్టరేట్ల ఎదుట ‘రైతు సత్యాగ్రహం’ నిర్వహించింది. రైతులకిచ్చిన హామీల అమలుకు ప్రభుత్వపరంగా చర్యలు చేపట్టకపోతే... ఎన్నికలకు ముందు కాంగ్రెస్ రైతు డిక్లరేషన్ ప్రకటించిన వరంగల్లోనే పెద్దఎత్తున నిరసనలు నిర్వహించాలని నిర్ణయించింది. కాంగ్రెస్ పార్టీ రైతాంగానికి ఇచ్చిన ప్రధాన హామీలైన రుణమాఫీ రూ.2 లక్షలు, రైతు భరోసా కింద రైతుకూలీల అకౌంట్లలో రూ.12వేలు, కౌలు రైతులకు రూ.15వేలు, ఫసల్ బీమా అమలు, రైతులకు క్వింటాల్ వరికి రూ.500 బోనస్ వంటివాటి అమలుకు ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేలా భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేయనుంది. మహిళలు, నిరుద్యోగుల సమస్యలపై.. ఎన్నికలకు ముందు మహిళా లోకానికి ఇచ్చిన హామీల అమలును డిమాండ్ చేస్తూ మంగళవారం మహిళా మోర్చా నేతృత్వంలో ఇందిరాపార్కు వద్ద ధర్నా నిర్వహించింది. ఏడు నెలలు గడిచినా మహిళలకు ప్రతి నెలా రూ. 2 వేల సాయం అమలు కాకపోవడం, కొత్త రేషన్ కార్డులు పంపిణీ లేకపోవడం, ప్రతి మహిళకు నెలకు రూ.2,500 ఆర్థిక సాయం అందకపోవడంతో పాటు మహిళలకు రూ. 500కే వంట గ్యాస్, 18 ఏళ్లు నిండిన అమ్మాయిలకు ఉచితంగా స్కూటీలు ఇస్తామన్న కాంగ్రెస్ వాగ్దానాలు ఏమయ్యాయని ఈ ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని నిలదీసింది. ఇక నిరుద్యోగులకు నెలకు రూ.3 వేల చొప్పున భృతి చెల్లింపు డిమాండ్తో పాటు ఉద్యోగాల భర్తీకి సంబంధించి నోటిఫికేషన్ల జారీ కాకపోవడం వంటి సమస్యలపై యువమోర్చా ఉద్యమబాట ఉధృతం చేయనుంది. అవినీతి, అక్రమాలపై ఆధారాల సేకరణ... రాష్ట్రంలో సివిల్ సప్లయిస్, ఇతర శాఖల్లో చోటుచేసుకున్న అవినీతి, అక్రమాలను బీజేఎల్పీనేత ఏలేటి మహేశ్వర్రెడ్డి వెలికి తీసిన నేపథ్యంలో...ఈ శాఖలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదల చేస్తున్నందున ఆయా అంశాలపై సమగ్ర దర్యాప్తు జరపాలని కేంద్రం దృష్టికే తీసుకెళ్లాలని పార్టీనాయకులు భావిస్తున్నారు. అదేవిధంగా రాష్ట్రంలోని వివిధ శాఖలకు కేంద్రం నుంచి నిధులు, గ్రాంట్లు వస్తున్నందున, వాటిపై కేంద్రం విచారణ కోరేలా, ఆయా శాఖల్లో చోటుచేసుకున్న అక్రమాలకు సంబంధించి పూరిస్థాయిలోఆధారాలు సేకరించి అందజేయాలని నిర్ణయించినట్లు పార్టీ ముఖ్య నేతలు వెల్లడించారు. స్థానిక ఎన్నికల నాటికి పట్టు సాధించాలని.. రాష్ట్రంలో ఈ ఏడాది చివర్లోగా తొలుత గ్రామీణ (గ్రామపంచాయతీ, జిల్లా/మండల పరిషత్), వచ్చే ఏడాది ప్రథమార్థంలో పట్టణ (మున్సిపల్, కార్పొరేషన్) స్థానికసంస్థల ఎన్నికలు జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల్లో పార్టీ ప్రాతినిధ్యాన్ని గణనీయంగా పెంచుకుని క్షేత్రస్థాయి నుంచి పార్టీ బలాన్ని పెంచుకోవాలని పార్టీ నిర్ణయించింది. ఇందులో భాగంగా గ్రామాల్లో పోలింగ్బూత్ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు యావత్ పార్టీ యంత్రాంగం నిరసనలు, ఆందోళనల్లో పాల్గొనేలా కార్యాచరణను రూపొందిస్తోంది. -
ఫిరాయింపులపై బీఆర్ఎస్ జాతీయస్థాయి పోరు
సాక్షి, హైదరాబాద్: పార్టీ బీ–ఫామ్పై గెలిచిన ఎమ్మెల్యేలను కాంగ్రెస్లో చేర్చుకోవడాన్ని తీవ్రంగా పరిగణిస్తున్న బీఆర్ఎస్ జాతీయస్థాయిలో ఈ అంశాన్ని లేవనెత్తాలని భావిస్తోంది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా స్పీకర్ను ఆదేశించాలని సుప్రీంకోర్టును ఆశ్రయించే యోచనలో ఉంది. మరోవైపు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము దృష్టికి కూడా ఈ అంశాన్ని తీసుకెళ్లనుంది. ఐదు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకొని హైదరాబాద్కు చేరుకున్న పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీమంత్రి హరీశ్రావు బుధవారం ఎర్రవల్లి వ్యవసాయక్షేత్రంలో బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్తో భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ కవిత బెయిల్ ప్రయత్నాల్లో పురోగతితోపాటు, పార్టీ ఎమ్మెల్యేల ఫిరాయింపులపై న్యాయపోరాటానికి సంబంధించిన అంశాలను ఇద్దరు నేతలు కేసీఆర్తో చర్చించినట్టు సమాచారం. ఆ ఏడుగురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని.. ఇప్పటివరకు ఏడుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరగా, వారిపై అనర్హత వేటు వేయా లని అసెంబ్లీ స్పీకర్కు బీఆర్ఎస్ నేతలు విజ్ఞప్తి చేస్తూ వచ్చారు. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కాంగ్రెస్లో చేరి ఎంపీ అభ్యర్ధిగా పోటీ చేసినా అనర్హత వేటు వేయకపోవడాన్ని బీఆర్ఎస్ ప్రశ్నిస్తోంది. ఈ అంశంపై సుప్రీంకోర్టును ఆశ్రయించడం ద్వారా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం ప్రయత్నించాలని నిర్ణయించింది. గతంలో సుప్రీంకోర్టులో వివిధ పార్టీల తరపున ఎమ్మెల్యేల అనర్హత వేటు కోసం వాదించిన న్యాయవాదులతో ఢిల్లీలో సంప్రదింపులు జరిగినట్టు తెలిసింది. రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగాలని.. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటువేసేలా చట్టం తెస్తామని ప్రకటించిన రాహుల్గాంధీ మరోవైపు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటున్నారని బీఆర్ఎస్ విమర్శలు చేస్తోంది. తమ పార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకుంటూ కాంగ్రెస్ రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడుతోందని విమర్శిస్తున్న బీఆర్ఎస్ ఈ అంశాన్ని రాష్ట్రపతి ముర్ము దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రపతి అపాయింట్మెంట్ అడగాలని బుధవారం కేసీఆర్తో జరిగిన భేటీలో నిర్ణయించినట్టు తెలిసింది. -
ఫోన్ ట్యాపింగ్ కేసుపై నేడు హైకోర్టులో విచారణ
సాక్షి,హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తోన్న ఫోన్ ట్యాపింగ్పై ఇవాళ హైకోర్టులో విచారణ జరగనుంది. హైకోర్టు న్యాయమూర్తులు, రాజకీయ నేతల ఫోన్లు ట్యాప్ చేసినట్లు తెలంగాణ పోలీసులు ఇప్పటికే పలు కీలకమైన అంశాలతో కౌంటర్ దాఖలు చేశారు.దీంతో పాటు తెలంగాణ పలు రాజకీయ నాయకులు, హైకోర్టు జడ్జీల ఫోన్లు సైతం ట్యాపింగ్ చేసినట్లు పత్రికల్లో వచ్చిన కథనాలు వచ్చాయి. వాటిని సుమోటోగా స్వీకరించిన హైకోర్టు ఇవాళ మధ్యాహ్నం 2:30 గంటలకు విచారణ చేపట్టనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితుల్ని విచారించిన అధికారులు నిందితుల నుంచి కీలక విషయాలను రాబట్టారు. అందులో భాగంగా హైకోర్టు న్యాయమూర్తుల ఫోన్లను కూడా ట్యాప్ చేశామని ఫోన్ ట్యాపింగ్ నిందితులు విచారణలో తెలిపారు.అయితే ఈ ఫోన్ల ట్యాపింగ్ వ్యవహారం జాతీయ భద్రతకు సంబంధించిన అంశం కాబట్టి.. ఇదే అంశంపై నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు నోటీసులను జారీ చేసింది. ఈ నోటీసులకు గత నెల 29న హైదరాబాద్ సీపీ బదులిస్తూ.. అఫిడవిట్ దాఖలు చేశారు. -
ఇది మతిలేని చర్య.. రేవంత్ సర్కార్పై కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం రేవంత్ సర్కార్కు చేతకాదంటూ ఎక్స్(ట్విటర్) వేదికగా మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.‘‘నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన రూ.20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని భావిస్తున్నట్టు సమాచారం. దీనికి మధ్యవర్తిగా ఒక మర్చంట్ బ్యాంకర్ను పెట్టి వారికి రు.100 కోట్ల కమీషన్ ఇచ్చేందుకు సిద్ధమైంది అని మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ మతిలేని చర్య వల్ల తెలంగాణ ప్రగతి శాశ్వతంగా కుంటుపడి, కొత్తగా పెట్టుబడులు, పరిశ్రమలు రాక, ఉద్యోగాలు రాక, మన బిడ్డలకు కొలువులు రాకుండా పోయే ప్రమాదం ఉన్నది!’’అంటూ కేటీఆర్ ఆందోళన వ్యక్తం చేశారు. ‘‘కోకాపేట, రాయదుర్గం వంటి ప్రాంతాల్లోనే ఎక్కువగా ఐటీ పరిశ్రమలు వస్తున్నాయి. అలాంటి చోట 400 ఎకరాలు ప్రైవేట్ సంస్థలకు తనఖా పెట్టడం అనాలోచిత చర్య. అసలే గత ఏడు నెలలుగా రాష్ట్ర పారిశ్రామికరంగం స్తబ్దుగా ఉంది. కొత్తగా పెట్టుబడులు రావడం లేదు. ఉన్న కంపెనీలు కూడా సరైన ప్రోత్సాహం లేక పక్కచూపులు చూస్తున్నాయి. ఇప్పుడు రాజకీయ ప్రయోజనాల కొరకు పరిశ్రమలకు ఇచ్చే భూములు తాకట్టు పెడితే.. కంపెనీలకు ఏమిస్తారు? కొత్తగా మన యువతకు ఉద్యోగాలు ఎట్లా వస్తాయి?’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.రాష్ట్ర ఆర్థిక రంగాన్ని సరిగ్గా నడపడం చేతకాని రేవంత్ సర్కార్ ఇప్పుడు నిధుల సమీకరణకు ఒక ప్రమాదకరమైన మార్గం ఎంచుకున్నది. తెలంగాణ పరిశ్రమల శాఖకు చెందిన 20 వేల కోట్ల విలువైన 400 ఎకరాల ప్రభుత్వభూములను ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీలకు తనఖాపెట్టి రూ.10 వేల కోట్లు సమీకరించాలని… pic.twitter.com/E2EWqT0hve— KTR (@KTRBRS) July 10, 2024 -
ఆంబోతు రంకెలు ఆగేంతవరకు వలసలు: మంత్రి పొంగులేటి
సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీలో 100 మంది ఎమ్మెల్యేలు కావాలని కాంగ్రెస్ పార్టీ కోరుకోవడం లేదని, కానీ ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ అచ్చోసిన ఆంబోతు రంకెలు ఆగేంతవరకు వలసలు కొనసాగుతూనే ఉంటాయని, ఆ రంకెలు ఆగిపోగానే వలసలు ముగించేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వ్యాఖ్యానించారు. ‘తాతకు పెట్టిన బొచ్చె తలాపునే ఉంటుందనే విషయాన్ని ఎవరూ మరిచిపోవద్దు. 2018 ఎన్నికల్లో కేసీఆర్కు 88 సీట్లు ఇస్తే తృప్తి పడలేదు. కాంగ్రెస్ నుంచి 19 మంది గెలిస్తే ఐదుగురిని ఉంచాడు. అప్పుడు అక్కడ ఉండి అదంతా చూసిన ఎమ్మెల్యేలే ఇప్పుడు మా పార్టీలోకి వస్తున్నారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎప్పుడూ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలుస్తామని అనలేదు. కానీ మేం గెలిచి ప్రమాణ స్వీకారం చేయకముందు నుంచే ప్రభుత్వాన్ని కూల్చేస్తామంటూ కేసీఆర్ ప్రారంభించాడు. కేంద్రంలో అధికారంలో ఉన్న పారీ్టతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకొని ఈయన ముందుండి నడిపించాలని చూశాడు. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలను చుట్టూ కూర్చోబెట్టుకుని కేబినెట్లో నువ్వు మంత్రి, నువ్వు మంత్రి అని చెప్పాడు. అలా మంత్రుల లిస్టు రాసుకున్న వారిని ఏమనాలి?’ అని పొంగులేటి ప్రశ్నించారు. అసలు ప్రభుత్వాన్ని కూల్చడం అన్న పదమే అప్రజాస్వామికమని, ఇప్పుడు వారు పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందన్నారు. మంగళవారం సచివాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే... – రైతు రుణమాఫీ చేసి తీరుతాం. రెండుమూడు రోజుల్లోనే మార్గదర్శకాలు విడుదల చేస్తాం. ఇప్పటికే రూ.9వేల కోట్లు వ్యవసాయశాఖకు బదిలీ చేశాం. మిగిలిన నిధులు కూడా సమీకరించి రుణమాఫీ చేసి తీరుతాం. – రైతు భరోసాపై ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగానే వెళతాం.కౌలు రైతులను కాపాడుకోవాలన్న ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉంది. – సామాన్యుడికి అందుబాటులో ఉండే విధంగా ధరణి పోర్టల్ను సంస్కరిస్తాం ఒకే మాడ్యూల్లో దరఖాస్తు చేసుకుంటే అది ఎలా పరిష్కరించాలో అధికారులు నిర్ణయించాలి. వీలున్నంత త్వరలోనే ధరణి పెండింగ్ దరఖాస్తులను జీరో చేస్తాం. అలాగని అడ్డగోలుగా ధరణి దరఖాస్తులను తిరస్కరిస్తే చర్యలు తీసుకుంటాం. – ఈ ఏడునెలల్లో కాంగ్రెస్ ప్రభుత్వం చాలా చేసింది. అయినా అన్ని విషయాలను ప్రజల ముందు పెట్టలేకపోయాం. మేం అధికారంలోకి వచ్చాకే హెదరాబాద్లో కమర్షియల్ లీజ్ బాగా పెరిగింది. ఎలాంటి సమస్యా రాకుండా టీచర్ల బదిలీలు, పదోన్నతులు పూర్తి చేశాం. గత ప్రభుత్వం చేసిన రూ. 6.82లక్షల కోట్ల అప్పుకుగాను షెడ్యూల్కు మించి అప్పులు కడుతున్నాం. ఇలాంటివన్నీ చెప్పుకోవాలి. – రాష్ట్రంలో చాలామంది అర్హులకు పింఛన్లు, రేషన్కార్డులు రావాల్సి ఉంది. కొన్ని బోగస్ కార్డులు కూడా ఉన్నాయి. ఎక్కువ మంది ఆరోగ్యశ్రీ కోసం కార్డులు రాయించుకుంటున్నారు. అందుకే రేషన్కార్డుకు, ఆరోగ్యానికి లింకు తీసేయాలని, రేషన్కార్డును, హెల్త్కార్డును వేర్వేరుగా ఇవ్వాలని ఆలోచిస్తున్నాం. – 2021–22 ఆర్థిక సంవత్సరంలో భూముల విలువలు రెండుసార్లు సవరించారు. అప్పుడు శాస్త్రీయంగా జరగలేదు. ఇప్పుడు మేం శాస్త్రీయంగా చేయాలనుకుంటున్నాం. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. భూముల విలువల సవరణ ఆగస్టు1 నుంచా ఆగస్టు 15 నుంచా అన్నది ఇప్పుడే చెప్పలేం. – జీఓ 59 దరఖాస్తులు, ఎల్ఆర్ఎస్లను మేం కావాలని ఆపడం లేదు. పేదలను ఇబ్బంది పెట్టాలన్న ఆలోచన మాకు లేదు. కానీ ఆ రెండు అంశాల్లో జరిగిన అక్రమాలను వెలికి తీస్తున్నాం. అవి మళ్లీ జరగకుండా నిషేధిత జాబితాలో పెట్టేస్తాం. ధరణి అంశం పూర్తికాగానే జీఓ 59, ఎల్ఆర్ఎస్ దరఖాస్తులు క్లియర్ చేస్తాం. ఇప్పటికే జీఓ 59 కింద చిన్న చిన్న స్థలాలు రెగ్యులరైజ్ చేయాలని ఆదేశాలిచ్చాం. – కేంద్ర ప్రభుత్వం ఈనెల 23న బడ్జెట్ పెడుతుంది. అందులో రాష్ట్ర కేటాయింపులు చూసుకొని ఆ తర్వాత 1,2 రోజుల్లో రాష్ట్ర బడ్జెట్ కూడా పెడతాం. జూలై 31లోపే రెగ్యులర్ బడ్జెట్కు ఆమోదం లభిస్తుంది. – కేసీఆర్ అంటే నాకేం కోపం లేదు. ఆయన అంటే నాకు లవ్వు ఎక్కువ. ఆయన ఎప్పుడు అసెంబ్లీకి వస్తారా? తన అనుభవాన్ని రంగరించి పాలన గురించి ఎప్పుడు సూచనలిస్తారా అని ఎదురుచూస్తున్నా. కానీ ఆయన రావడం లేదు. – తుదిదశలో నిర్మాణాలు ఆగిపోయిన డబుల్ బెడ్రూమ్ ఇళ్లను పూర్తి చేసి నిరుపేద లబ్ధిదారులను గుర్తించి కేటాయిస్తాం. అతి తక్కువ మొత్తం ఖర్చు చేస్తే గృహప్రవేశాలకు సిద్ధమయ్యే స్థాయిలో ఉన్న ఇళ్లను తొలుత ఎంపిక చేస్తాం. – అమ్ముడు కాకుండా మిగిలిపోయిన రాజీవ్ స్వగృహ ఇళ్లకు కొత్తగా ధరలు నిర్ణయించి ప్రజలకు విక్రయించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని వెల్లడించారు. – స్లాట్ బుక్ చేసుకొని రిజి్రస్టేషన్లు చేయించుకోలేని వారి డబ్బులు నాలుగేళ్లుగా ఇవ్వడం లేదు. ఇలా రూ.32 కోట్లు ప్రభుత్వం దగ్గరే ఉన్నాయి. వాటిని 2,3 రోజుల్లో విడుదల చేస్తాం. సీఎస్ఆర్ నిధులతో అత్యాధునిక హంగులతో సబ్రిజి్రస్టార్ కార్యాలయాలు నిర్మిస్తాం. ప్రతి గ్రామంలో సమగ్ర రెవెన్యూ వ్యవస్థ ఉండేలా చర్యలు తీసుకుంటాం. జర్నలిస్టులకు ఇంటి స్థలాలు కచి్చతంగా ఇస్తాం. జేఎన్జే సొసైటీ అంశాన్ని 2,3 రోజుల్లోనే పరిష్కరిస్తాం. రాష్ట్ర, జిల్లా స్థాయిలో విలేకరులకు ఇళ్లస్థలాలు ఇవ్వాలన్నదే ప్రభుత్వ ఆలోచన.’అని మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వెల్లడించారు. -
ఫిరాయింపు ఎమ్మెల్యేలను ఏ రాయితో కొట్టాలి?: కేటీఆర్
సాక్షి, న్యూఢిల్లీ: రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపుల అంశాన్ని వదిలిపెట్టేది లేదని దీనిపై ప్రతిస్థాయిలో పోరాడతామని బీఆఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు చెప్పారు. రాజ్యాంగ రక్షకుడిని అని చెప్తున్న లోక్సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్గాంధీ మాటలకు, చేతలకు పొంతన లేదని దుయ్యబట్టారు. ఫిరాయింపులపై కాంగ్రెస్ అవలంభిస్తున్న ద్వంద్వ విధానాన్ని ఇటు పార్లమెంటులో అటు ప్రజాక్షేత్రంలో ఎండగడతామన్నారు. ‘పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలను రాళ్లతో కొట్టి చంపాలి.. పార్టీ మారే వారు పిచ్చికుక్కల్లాంటి వారు..’అని గతంలో రేవంత్రెడ్డి అన్నారంటూ.. ప్రస్తుతం పార్టీ మారిన ఎమ్మెల్యేలను ఏ రాయితో కొట్టాలని కేటీఆర్ నిలదీశారు. పార్టీ ఫిరాయింపులకు, ఆయారాం గయారాం సంస్కృతికి శ్రీకారం చుట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ధ్వజమెత్తారు. మంగళవారం ఢిల్లీలో మాజీ మంత్రి హరీశ్రావు, పార్లమెంటరీ పార్టీ నేత కేఆర్ సురేశ్రెడ్డి, రాజ్యసభ ఎంపీలు వద్దిరాజు రవిచంద్ర, దీపకొండ దామోదర్రావులతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. తెలంగాణలో రూ.50 కోట్లా, రూ.100 కోట్లా? ‘రాజ్యాంగ ప్రతిని పట్టుకుని, రక్షకుడిని నేనే అంటూ ఆస్కార్ తరహాలో నటించిన రాహుల్ గాంధీ..కాంగ్రెస్లోకి మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్రెడ్డి చేరికను స్వాగతించారు. తమ పార్టీ మేనిఫెస్టోలో పొందుపర్చిన పార్టీ ఫిరాయింపుల నిరోధక అంశాన్ని పక్కన పెట్టి రాష్ట్రంలో ఫిరాయింపులను ప్రోత్సహించారు. ఇదే కాంగ్రెస్ పార్టీ హిమాచల్ప్రదేశ్, మణిపూర్, గోవాల్లో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ అటు కోర్టుల్లో, ఇటు చట్టసభల్లో పోరాడుతోంది. మరోపక్క తెలంగాణలో మాత్రం ఫిరాయింపులు ప్రోత్సహిస్తూ ఎమ్మెల్యేలను చేర్చుకుంటోంది. ఇది కాంగ్రెస్ ద్వంద్వ వైఖరికి నిదర్శనం. రాహుల్ దీనిపై నోరు విప్పాలి. ద్వంద్వ వైఖరిని వీడాలి. ఆయన రాజ్యాంగాన్ని చదవడంతో పాటు రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడాలి. కర్ణాటకలో ఒక్కో ఎమ్మెల్యే కొనుగోలుకు రూ.50 కోట్లు ఖర్చు చేశారని సీఎం సిద్ధరామయ్య ఆరోపిస్తున్నారు. మరి తెలంగాణలో రూ.50 కోట్లా, రూ.100 కోట్లా? ఎంత వెచ్చిస్తున్నారు..’అని కేటీఆర్ ప్రశ్నించారు. పాత్రధారి హైదరాబాద్లో, సూత్రధారులు ఢిల్లీలో.. ‘అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లో ఆరు గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పిన కాంగ్రెస్.. దానిని మర్చిపోయి ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల చేరికలు మొదలుపెట్టింది. అధిష్టానం అనుమతితోనే రేవంత్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు. సీఎం స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారు. పాత్రధారి హైదరాబాద్లో సూత్రధారులు ఢిల్లీలో ఉన్నారు. పార్టీ ఫిరాయించిన ఆరు, ఏడుగురు ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు తప్పవు. ప్రజలు వీళ్ల పదవులు ఊడగొట్టడం ఖాయం. వీరంతా ప్రజా క్షేత్రంలో పరాభవం ఎదుర్కోక తప్పదు. ఫిరాయింపుదారులను అనర్హులుగా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం..’అని బీఆర్ఎస్ నేత అన్నారు. ఫిరాయింపులపై న్యాయ నిపుణులతో సంప్రదింపులు ‘కాంగ్రెస్ వైఖరిపై రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, లోక్సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్, కేంద్ర ఎన్నికల సంఘం, సుప్రీంకోర్టుల గడపతొక్కుతాం. పార్టీ ఫిరాయించిన దానం నాగేందర్ విషయంలో ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించాం. అక్కడ న్యాయం జరగకపోతే సుప్రీంకోర్టును ఆశ్రయిస్తాం. పార్టీ ఫిరాయింపులపై ఢిల్లీలో గత నాలుగు రోజులుగా న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరిపాం. కాంగ్రెస్ దుర్మార్గాన్ని ఎండగట్టేందుకు అవసరమైన అన్ని వేదికలను ఉపయోగించుకుని, భావసారూప్యత కలిగిన పార్టీలతో కలిసి పోరాడతాం..’అని కేటీఆర్ స్పష్టం చేశారు. పార్టీ విలీనాన్ని రాజ్యాంగం అనుమతిస్తుంది ‘పార్టీ విలీనానికి, ఫిరాయింపునకు వ్యత్యాసం ఉంది. పార్టీ విలీనాన్ని రాజ్యాంగం అనుమతిస్తుంది. కానీ పార్టీ ఫిరాయింపు మాత్రం రాజ్యాంగ విరుద్ధం. గతంలో కాంగ్రెస్ పార్టీకి చెందిన 18 మంది ఎమ్మెల్యేల్లో 12 మంది బీఆర్ఎస్లో చేరారు. ఇప్పుడు 38 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేల్లో ఏడుగురిని కాంగ్రెస్ తమ పారీ్టలో చేర్చుకుంది. అది మూడింట ఒక వంతు కాదు.. మూడింట రెండో వంతూ కాదు. మూడింట రెండో వంతు విలీనం అయితే రాజ్యాంగబద్ధం. దీనిని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించలేదు..’అని కేటీఆర్ వివరించారు. -
మళ్లీ ‘టీఆర్ఎస్’! బీఆర్ఎస్ పేరు మార్పుపై సాగుతున్న అధ్యయనం
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పేరు తెలంగాణ రాష్ట్ర సమితి(టీఆర్ఎస్)గా మార్చాల్సిందేనంటూ పార్టీ నేతలు, కార్యకర్తల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఈ నేపథ్యంలో పార్టీ పేరు మార్పునకు సంబంధించిన ప్రక్రియ కోసం త్వరలో కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలవాలని బీఆర్ఎస్ యోచిస్తోంది. పార్టీ పేరును తిరిగి ‘టీఆర్ ఎస్’గా మార్చేందుకు అనురించాల్సిన ప్రక్రియపై ఇప్పటికే పార్టీపరంగా అధ్యయనం జరుగుతోంది. పార్టీ పేరు మార్పునకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం నిబంధనలను కూడా క్షుణ్ణంగా పరిశీలిస్తోంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడం సాంకేతికంగా సాధ్యమేనని ఎన్నికల సంఘం నిబంధనలు వెల్లడిస్తున్నట్టు పార్టీవర్గాలు తెలిపాయి. అయితే తిరిగి టీఆర్ఎస్గా పేరును మార్చేందుకు కేంద్ర ఎన్నికల సంఘం బీఆర్ఎస్ నుంచి పలు వివరణలు కోరే అవకాశమున్నందున, అవసరమైన సమాచారాన్ని కూడా సిద్ధం చేసుకోవడంపై దృష్టి సారించింది. ‘టీఆర్ఎస్’పై ఆరేళ్లు ఫ్రీజ్ ‘తెలంగాణ రాష్ట్ర సమితి’పేరు ఇతరులకు కేటాయించకుండా ఎన్నికల సంఘం ఆరేళ్ల పాటు ఫ్రీజ్ చేసింది. పేరు మార్పుకు బీఆర్ఎస్ నుంచి అందిన దరఖాస్తును ఆమోదిస్తే ఓటర్లలో ఏదైనా గందరగోళం ఏర్పడుతుందా అనే విషయాన్ని ఎన్నికల సంఘం ప్రధానంగా పరిశీలిస్తుందని పార్టీవర్గాలు చెబుతున్నాయి. తిరిగి టీఆర్ఎస్గా పేరు మార్పునకు ఎన్నికల సంఘం అంగీకరిస్తే పార్టీ ఎన్నికల చిహ్నం ‘కారు గుర్తు’తిరిగి దక్కుతుందా లేదా అంశాన్ని కూడా బీఆర్ఎస్ అధ్యయనం చేస్తోంది. పేరు మార్పుకు అవసరమైతే పార్టీ నియమావళిని సవరించాల్సి ఉంటుంది. ఈ మేరకు పార్టీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి నియమావళిలో సవరణలను ఆమోదించాల్సి ఉంటుంది. బీఆర్ఎస్ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడంపై పార్టీ చేసే విన్నపాన్ని ఆమోదించే విచక్షణాధికారం కేంద్ర ఎన్నికల సంఘానికే ఉంటుంది. ఈ నేపథ్యంలో ఈసీ నియమావళిని లోతుగా అధ్యయనం చేసి పార్టీ పేరు మార్పుపై సాధ్యాసాధ్యాలపై ఇప్పటికే ప్రాథమికంగా ఒక నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం. త్వరలో జరిగే పార్టీ ఆవిర్భావ వేడుకల్లో పార్టీ పేరు మార్పు అంశంపై తీర్మానం చేసే అవకాశముందని బీఆర్ఎస్ నేతలు వెల్లడించారు. జాతీయ రాజకీయాల కోసం ‘బీఆర్ఎస్’.. తెలంగాణ రాష్ట్ర సాధన లక్ష్యంగా 2001 ఏప్రిల్ 27న ఆవిర్భవించిన తెలంగాణ రాష్ట్ర సమితి రెండు దశాబ్దాల అనంతరం పార్టీ పేరును మార్చుకుంది. జాతీయ రాజకీయాల్లో పార్టీ కార్యకలాపాల విస్తరణకు 2022 అక్టోబర్ 5న భారత రాష్ట్ర సమితిగా పేరు మార్చారు. పార్టీ పేరు మార్పిడికి కేంద్ర ఎన్నికల సంఘం ఆమోదం తెలపడంతో పార్లమెంటు, అసెంబ్లీలోనూ బీఆర్ఎస్ పేరు మార్పునకు ఆమోదముద్ర పడింది. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పేరిట పోటీ చేసి రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపై ఈ ఏడాది జనవరిలో లోక్సభ నియోజకవర్గాల వారీగా జరిగిన పోస్ట్మార్టమ్లో పార్టీ పేరు మార్చడం కూడా ఓటమికి ప్రధాన కారణంగా పార్టీ శ్రేణులు నొక్కి చెప్పాయి. ఇటీవలి లోక్సభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని చోట్లా ఓటమి పాలవడంతో పార్టీ పేరును తెలంగాణ రాష్ట్ర సమితిగా మార్చాలని అధినేత కేసీఆర్పై ఒత్తిడి చేస్తున్నారు. ఎర్రవల్లి నివాసంలో జరిగిన భేటీల్లోనూ పార్టీ నేతలు ఇదే అంశాన్ని కేసీఆర్ దృష్టికి తీసుకొచ్చారు. పార్టీ పేరు మార్పుతో ‘తెలంగాణతో పేగుబంధం తెగిపోయిందనే భావన’ప్రజల్లో నెలకొందని కొందరు అధినేతకు వివరించారు. ఈ నేపథ్యంలో పార్టీ పేరును తిరిగి టీఆర్ఎస్గా మార్చడానికి ఉన్న సాధ్యాసాధ్యాలపై అధ్యయనం జరుగుతోంది. -
పరీక్షల వాయిదాకు గూడుపుఠాణి
సాక్షి ప్రతినిధి, మహబూబ్నగర్: ఉద్యోగాలు ఇవ్వాలని తమ ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంటే.. గ్రూప్స్, డీఎస్సీ పరీక్షల వాయిదాకు దొంగలు గూడు పుఠాణి చేస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి ఆరోపించారు. కోచింగ్ సెంటర్ల మాఫియా పరీక్షలు వాయిదా వేయించాలని చూస్తోందని, వారి ధనదాహంతో నిరుద్యోగుల జీవితాలతో చెలాగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా ప్రగతిపై ప్రజాప్రతినిధులు, అధికారులతో ఆయన మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం భూత్పూర్ రోడ్డులోని ఏఎస్ఎం కన్వెన్షన్ హాల్లో కాంగ్రెస్కు చెందిన ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు, కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. పుట్టగతులుండవనే కుట్రలు ‘పార్టీ ఎప్పుడు బలహీనపడితే అప్పుడు కేసీఆర్ విద్యార్థులను ముందుకు తీసుకొస్తారు. విద్యార్థుల శవాలతో రాజకీయ లబ్ధి పొందాలని చూస్తున్నారు. హరీశ్, కేటీఆర్కు సవాల్ విసురుతున్నా.. పరీక్షల వాయిదా కోసం మీరు ఆమరణ దీక్షకు కూర్చోండి. మా ప్రభుత్వంలో నిరుద్యోగులకు నష్టం జరుగుతుందని నిజంగా మీరు అనుకుంటే బిల్లా, రంగాలు పరీక్షలు వాయిదా వేసేవరకు ఆర్ట్స్ కాలేజీ ముందు ఆమరణ నిరాహార దీక్షకు దిగాలి.పేదోళ్ల పిల్లల్ని రెచ్చగొట్టుడు కాదు.. మీ వాదన నిజమైతే వారి పక్షాన మీరు దీక్షకు దిగాలి. పరీక్షలు వాయిదా వేస్తే ప్రభుత్వానికి నష్టం లేదు. నిరుద్యోగులు నష్టపోకూడదనేదే ప్రభుత్వ ఆలోచన. కేసీఆర్కు, బీఆర్ఎస్కు పుట్టగతులు ఉండవనే వారు కుట్రలు చేస్తున్నారు..’అని సీఎం ఆరోపించారు. బీజేపీ, బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూల్చాలని చూశాయి ‘కేసీఆర్, కేటీఆర్ ఏదేదో మాట్లాడుతున్నారు.. మేం మీలా దొంగ దెబ్బ తీయడం లేదు. మీలా ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయలేదు. కేసీఆర్.. ముందుంది మొసళ్ల పండగ. మా ఎమ్మెల్యేలను నువ్వు గుంజుకున్నప్పుడు నీకు ప్రజాస్వామ్యం గుర్తుకు రాలే దా? బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటై ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూశాయి. కాంగ్రెస్ పారీ్టతో పెట్టుకుంటే నీకు పుట్టగతులు ఉండవని ఆనాడే చెప్పా. కేసీఆర్ ఇక నీకు రాజకీయ మనుగడ లేదు. చేతనైతే అభివృద్ధికి సహకరించు.. లేకపోతే ఫామ్హౌస్లోనే పడు కో. నాలుగు రోజులుగా హరీశ్, కేటీఆర్ ఢిల్లీ చుట్టూ తిరుగుతున్నారు. తనదాకా వస్తే గానీ వాళ్లకు నొప్పి తెలియలేదు..’అని రేవంత్ విమర్శించారు.ఆగస్టు 15లోపు రుణమాఫీ ‘నేను కార్యకర్తల్లో ఒక కార్యకర్తను. అందుకే ముఖ్య నాయకులను కలవాలని ఇక్కడికి వచ్చా. మిమ్మల్ని కలిస్తే నాకు వెయ్యి ఏనుగుల బలం వస్తుంది. కార్యకర్తల కష్టంతోనే టీపీసీసీ అధ్యక్షుడి నుంచి ఈ రోజు ముఖ్యమంత్రి వరకు ఎదిగా. ఈ ప్రభుత్వం మీది.. మీ సూచనలు, సలహాలను ప్రభుత్వం పాటిస్తుంది. నాయకుల ఎన్నికలు ముగిశాయి.. ఇక స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయి.ఇప్పటివరకు మీరు నాయకుల కోసం కష్టపడ్డారు.. త్వరలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో నాయకులు కష్టపడి మిమ్మల్ని గెలిపిస్తారు. ఆగస్టు 15 లోపు రుణమాఫీ చేస్తాం. ఆ తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్తాం..’అని ముఖ్యమంత్రి చెప్పారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి కృష్ణారావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు చిన్నారెడ్డి, ఎంపీ మల్లు రవి, ఉమ్మడి జిల్లాలోని ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. -
త్వరలో స్థానికసంస్ధల ఎన్నికలు నిర్వహిస్తాం: సీఎం రేవంత్
సాక్షి, మహబూబ్నగర్: మహబూబ్నగర్ జిల్లా నుంచి ఎంతో మంది గెలిచినా సీఎం అయ్యే అవకాశం రాలేదని, ఆ అవకాశం తనకు మాత్రమే వచ్చిందని సీఎం రేవంత్రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం మహబూబ్ నగర్లోని ఏఎస్ఎన్ కన్వెన్షన్ సెంటర్లో ఏర్పాటు చేసిన ప్రజాప్రతినిధుల మాట్లాడుతూ.. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్నాయని తెలిపారు.‘‘సాగునీటి ప్రాజెక్టులు, విద్యా, వైద్య, ఆరోగ్యలపై సమీక్ష చేశాం. కార్యకర్తల కష్టంతో కాంగ్రేస్ పార్టీ తిరిగి అధికారంలోకి వచ్చింది. 2009లో కేసీఆర్ను ఎంపీగా గెలిపిస్తే జిల్లా అభివృద్ధిని విస్మరించారు. జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు విడుదల ఆపకుండా చేయాలని అధికారులను ఆదేశించాను. నేను మీలో ఓ కార్యకర్తను. కేసీఆర్ను ఓడించడమే కాదు మోదీని ఢీకొట్టే వరకు పోరాడాలి. త్వరలో స్థానికసంస్ధల ఎన్నికలు నిర్వహిస్తాం. మిమ్మల్ని గెలిపించే భాద్యత మాది, మీ ఎమ్మెల్యేలది. దేవాలయ, మార్కెట్ కమిటీ, గ్రంధాలయం కమిటీలను కష్టపడిన వారికే ఇవ్వాలి. మూడేళ్లుగా పీసీసీ అధ్యక్షుడిగా నన్ను ఆదరించిన వారిని గుర్తుపెట్టుకుంటా. కార్యకర్తల కష్టం వల్ల నేను ఈ స్ధాయికి వచ్చాను. వారిని విస్మరించను. గతంలో మా పార్టీ వారిని ఇబ్బందులు పెట్టిన కేసీఆర్ సన్నాయి నొక్కులు నొక్కుతున్నాడు. రాష్ట్రంలో కేసీఆర్ కనుమరుగవుతారు. 4 రోజులుగా ఢిల్లీలో కాలుకాలిన పిల్లిలాగా కేటీఆర్, హరీష్ రావు ప్రధానిని కలిసేందుకు తిరుగుతున్నారు. డీఎస్సీ పరీక్షను వాయిదా వేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. డిసెంబర్ నాటికి రాష్ట్రంలో వెయ్యి మంది గ్రూపు- 1 అధికారులను నియమించాలని మేం ప్రయత్నిస్తుంటే కొందరు దుర్మార్గులు కోచింగ్ సెంటర్ల కోసం పరీక్షలు వాయిదా వేయాలని చూస్తున్నారు. కేటీఆర్, హరీష్ రావు ఇద్దరు పరీక్షలు వాయిదావేయాలని ఆర్ట్స్ కాలేజీ వద్ద దీక్ష చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం రుణమాఫి చేసి తీరుతా’’ అని సీఎం రేవంత్ అన్నారు. -
నేనేం అలగలేదు: మంత్రి పొన్నం
హైదరాబాద్, సాక్షి: బల్కంపేట ఎల్లమ్మ కల్యాణోత్సవంలో ఈ ఉదయం జరిగిన తోపులాట ఘటన వెనుక కుట్ర కోణం ఉందని మంత్రి కొండా సురేఖ అంటున్నారు. ఈ ఘటనపై పోలీస్ శాఖ దర్యాప్తు చేస్తోందని అన్నారామె. మంగళవారం సాయంత్రం బల్కంపేట ఘటనపై మంత్రుల సమీక్ష జరిగింది. అంతకు ముందు మీడియాతో ఆమె బల్కంపేట ఘటనపై స్పందించారు.బల్కంపేటలో ‘ప్రొటోకాల్’ ఘటనపై పొన్నం మాట్లాడారు. ఈ ఘటన విషయంలో నేను అలగలేదు. మహిళలు వెళ్లే సమయంలో తోపులాట జరిగింది. తోపులాట నివారించేందుకు ఆగి.. కాసేపు అధికారులతో మాట్లాడాం. తోపులాట జరుగుతుంటే ఏం చేస్తున్నారని అధికారుల్ని ప్రశ్నించా? అంతే అని అన్నారాయన. మూడు రోజులపాటు జరిగే ఎల్లమ్మ కల్యాణోత్సవాల్లో భాగంగా.. ఈ ఉదయం పట్టు వస్త్రాలు సమర్పించేందుకు సతీసమేతంగా మంత్రి పొన్నం ప్రభాకర్ గుడికి వెళ్లారు. ఆ సమయంలో వాళ్ల వెంట నగర మేయర్ గద్వాల విజయలక్ష్మి కూడా ఉన్నారు. అయితే ఒక్కసారిగా గుడిలో తోపులాట జరిగింది. ఈ ఘటనతో మంత్రి పొన్నం, మేయర్ అలిగి గుడి బయటే కూర్చున్నారు. తమ విషయంలో ప్రొటోకాల్ పాటించలేదని ఆయన అధికారులపై చిందులు తొక్కారని, ఎవరు నచ్చజెప్పినా వినలేదని కథనాలు వచ్చాయి. -
మెగా డీఎస్సీపై ఇచ్చిన మాట ఏమైంది?.. సీఎం రేవంత్పై కేటీఆర్ ఫైర్
సాక్షి, హైదరాబద్: తొలి కేబినెట్లోనే 25 వేలతో మెగా డీఎస్సీ అని సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చిన మాట ఏమైందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెండ్ కేటీఆర్ ప్రశ్నించారు. మేగా డీఎస్సీతో పాటు పలు హామీలు, పాలన తీరుపై కేటీఆర్ ‘ఎక్స్’ వేదికగా ఫైర్ అయ్యారు. ‘‘ ముఖ్యమంత్రి గారు... తొలి క్యాబినెట్ లోనే 25 వేలతోమెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ?తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?మీరు కొలువుదీరితే సరిపోతుందా ?యువతకు కొలువులు అక్కర్లేదా ??గతంలో మీరు.. ఉస్మానియా విద్యార్థులు అడ్డమీద కూలీల్లాంటి వారని ఎగతాళి చేశారు.తిన్నది అరిగేదాకా అరిచే బీరు బిర్యానీ బ్యాచ్ అని బద్నాం చేశారు. సిద్ధాంతం, ఆలోచన లేని ఆవారా టీమ్ అని అవహేళన చేశారు.అధికారంలోకి వచ్చాక... నేడు అదే ఉస్మానియా యూనివర్సిటీని రణరంగంగా మార్చారు.డీఎస్సీ అభ్యర్థులపై పోలీసులను ప్రయోగించి అణచివేస్తున్నారు.వందల మందిని అన్యాయంగా అరెస్టుచేసి అక్రమ కేసులు పెడుతున్నారు. కనీసం శాంతియుతంగా నిరసన తెలిపే హక్కును కూడా కాలరాస్తున్నారు.గుర్తుపెట్టుకోండి.. ఉస్మానియా విశ్వవిద్యాలయం దేశ సరిహద్దుల్లో లేదు మరెందుకు ఇన్ని బలగాలు, ఎందుకు ఇంతటి నిర్బంధంమళ్లీ ఉద్యమం నాటి పరిస్థితులను ఎందుకు కల్పిస్తున్నారు నిత్యం పోలీసుల బూట్లచప్పుళ్లతో ఎందుకు కలవరపెడుతున్నరుకాంగ్రెస్ చేతకానితనాన్ని ప్రశ్నించడమే వాళ్లు చేసిన నేరమా ?ప్రచారంలో ఇచ్చిన హామీలు నెరవేర్చమని అడగడమే పాపమా ?ముఖ్యమంత్రిగా మీకు మోకా వస్తే.. డీఎస్సీ అభ్యర్ధులకు ఇంత ధోకా చేస్తారా..??ఇప్పటికే మెగా డీఎస్సీ అని.. నిరుద్యోగ యువతను నిలువునా మోసం చేశారుఇప్పుడు ప్రిపరేషన్ కు కూడా టైమ్ ఇవ్వకుండా..వారి భవిష్యత్తుతో ఏమిటి ఈ చెలగాటం ?పరీక్షలు వాయిదా వేయాలని..డీఎస్సీ అభ్యర్థులు కోరుతున్నా ఎందుకీ మొండివైఖరి ??న్యాయమైన డిమాండ్లనుఆడబిడ్డలు అడినంత మాత్రానఅర్థరాత్రి వరకు అక్రమంగా నిర్బంధిస్తారా ?ఇదేనా మహిళలంటే..ముఖ్యమంత్రికి ఉన్న గౌరవం ??అధికారంలోకి రాగానే నోటిఫికేషన్లు..అపాయింట్మెంట్ ఆర్దర్లు ఇస్తామన్నారు..ఇప్పుడు కనీసం సీఎం అపాయింట్మెంట్ కూడా నిరుద్యోగులకు ఎందుకు ఇవ్వడంలేదు ??ప్రచారంలో యువతను మభ్యపెట్టారు.. పీఠమెక్కగానే వారి భవిష్యత్తును బలిపెడతారా ??నిరాహారదీక్షలు చేసినా స్పందన లేదుపేగులు తెగే దాకా కొట్లాడినా కనికరం లేదుపార్టీ ఫిరాయింపుల మీద ఉన్న దృష్టి..పోరుబాట పట్టిన నిరుద్యోగులపై లేకపోవడంకాంగ్రెస్ సర్కారుకు సిగ్గుచేటుఇన్నాళ్లూ అసమర్థ కాంగ్రెస్ ను భుజాలపై మోసిన సోకాల్డ్ మేధావులు ఇప్పుడు ఎక్కడున్నారు ? ప్రశ్నించే గొంతులు ఎందుకు మూగబోయాయి ?ఇప్పటికైనా.. డీఎస్సీ అభ్యర్థుల గోస తీర్చాలి..పరీక్షల వాయిదా, పోస్టుల పెంపు డిమాండ్లు నెరవేర్చాలిడీఎస్సీ అభ్యర్థులకు న్యాయం జరిగే వరకుBRS జెండా వారికి అండగా ఉంటుంది..లేకపోతేఈ గుడ్డి ప్రభుత్వానికి గుణపాఠం చెప్పేందుకు..నిరుద్యోగులతో కలిసి మరో ఉద్యమాన్ని నిర్మిస్తాం..జై తెలంగాణ’’ అని కేటీఆర్ ‘ఎక్స్’లో నిలదీశారు. ముఖ్యమంత్రి గారు... తొలి క్యాబినెట్ లోనే 25 వేలతోమెగా డీఎస్సీ అని మీరిచ్చిన మాట ఏమైంది ? తొమ్మిది నెలలు కావస్తున్నా.. లక్షలాది మంది డీఎస్సీ అభ్యర్ధుల ఆక్రందన మీ కాంగ్రెస్ సర్కారుకు వినపడటం లేదా ?మీరు కొలువుదీరితే సరిపోతుందా ?యువతకు కొలువులు అక్కర్లేదా ??గతంలో…— KTR (@KTRBRS) July 9, 2024 -
ఫిరాయింపులతో మేమేం లాభపడలేదు: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని తాము ఎప్పుడూ వ్యాఖ్యలు చేయలేదని మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆయన మంగళవారం ఫిరాయింపులపై మీడియాతో మాట్లాడారు. ‘మా పార్టీలో చేరిన వారిలో 10 మంది ఓడిపోయారు. ఫిరాయింపులతో మాకు లాభం జరగలేదు. మేమేం లాభపడలేదు. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొడతామని ఎప్పుడూ చెప్పలేదు. ఫిరాయింపులపై సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం అసెంబ్లీ స్పీకర్ మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలి. ప్రజల కోసం తాము ఎప్పుడూ పోరాడుతూనే ఉంటాము. .. కాంగ్రెస్ పార్టీ వలే ఇతర పార్టీ నేతలకు ఇంటింటికి వెళ్లి కండువాలు కప్పలేదు. తెలంగాణలో మళ్లీ అధికారంలోకి వస్తాం. కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చే ఉద్దేశం మాకు లేదు. తెలంగాణలో కాంగ్రెస్ ఐదేళ్ల పాటు అధికారంలో ఉంటేనే.. మేము ఏంటి? మా విలువ ఏంటి? అనేది ప్రజలకు తెలుస్తుంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పార్టీని వీడినంత మాత్రాన మాకు, పార్టీకి వచ్చిన నష్టమేమీ లేదు’’ అని అన్నారు. -
ఎమ్మెల్యేలను ఎంతకు కొంటున్నారు: కేటీఆర్ ఫైర్
సాక్షి,ఢిల్లీ: ఫిరాయింపుల నిరోధక చట్టం మరింత కఠినతరం చేస్తామన్న కాంగ్రెస్ దాన్ని గాలికి వదిలేసి ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. పార్టీ ఫిరాయింపులపై మాజీ మంత్రి హరీశ్రావు, ఎంపీ సురేష్రెడ్డితో కలిసి మంగళవారం(జులై 9) ఢిల్లీలో కేటీఆర్ మీడియాతో మాట్లాడారు. బీజేపీ, కాంగ్రెస్ రెండూ ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. ‘ఈ అంశాన్ని పార్లమెంట్లో ప్రస్తావిస్తాం. రాహుల్ గాంధీ ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు. తెలంగాణ బీఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ ఏకంగా కాంగ్రెస్ టికెట్పై పోటీ చేయడమంటే ప్రజాస్వామ్యాన్ని అపహస్యం చేయడమే. సీఎం రేవంత్ స్వయంగా ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి కండువాలు కప్పుతున్నారు. రాజ్యాంగ రక్షణ చేస్తున్నామని ఒక పక్క కాంగ్రెస్ గొప్పలు చెపుతోంది. ఆయారాం, గయారాం సంస్కృతికి బీజం వేసింది కాంగ్రెస్ పార్టీయే. ఇప్పుడు అది పోచారం దాకా వచ్చింది. ఆటోమేటిక్గా అనర్హత వేటు వేసేలా పదో షెడ్యూల్కు సవరణలు చేస్తామని కాంగ్రెస్ న్యాయ పత్రలో హామీ ఇచ్చి తెలంగాణలో ఫిరాయింపుల ప్రోత్సహిస్తోంది వంద రోజులలో ఆరు గ్యారెంటీలు పూర్తి చేస్తామని హామీని కాంగ్రెస్ అమలు చేయలేదు. రాహుల్ గాంధీ స్వయంగా ఇచ్చిన హామీలు కూడా గాలికి వదిలేశారు. ఆరు గ్యారెంటీలు వదిలేసి, మా పార్టీకి చెందిన ఆరుగురు ఎంఎల్ఏలు, ఆరుగురు ఎంఎల్సీలను కాంగ్రెస్ చేర్చుకుంది. పార్టీ ఫిరాయింపులపై అవసరమైతే రాష్ట్రపతిని కలుస్తాం. లోక్సభ స్పీకర్ను కలుస్తాం. సుప్రీంకోర్టులో కేసు వేస్తాం. రాజ్యాంగ రక్షకుడిగా రాహుల్ గాంధీ ఆస్కార్ అవార్డు స్థాయిలో నటిస్తున్నారు. ఆచరణలో రాజ్యాంగానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో బీఆర్ఎస్ ఎంఎల్ఏను కొనడానికి ఎంత ఖర్చు పెడుతున్నారు’అని కేటీఆర్ ఫైర్ అయ్యారు. వైఎస్ఆర్సీపీ ఓటమిపై కేటీఆర్ కీలక కామెంట్స్పేదలకు పెద్ద ఎత్తున పథకాలు ఇచ్చినా ఏపీలో వైఎస్ జగన్ ఓడిపోవడం ఆశ్చర్యం కలిగించిందిఅయినా వైఎస్ఆర్సీపీ 40 శాతం ఓట్లు సాధించడం మాములు విషయం కాదుపవన్ విడిగా పోటీ చేసి ఉంటే ఫలితాలు మరో విధంగా ఉండేవివైఎస్జగన్ను ఓడించేందుకు షర్మిల ను పావులా ఉపయోగించారుఅంతకు మించి షర్మిల ఏమీ లేదుప్రతి రోజు జనంలోకి వెళ్లే కేతిరెడ్డి ఓడిపోవడం కూడా ఆశ్చర్యమేప్రజలతో మాకు గ్యాప్ వచ్చిందిమా వైఖరి మార్చుకోవాలిప్రజలది తప్పు అనడమంటే.. మాదే తప్పుహైదారాబాద్లో అన్ని సీట్లు గెలిచాంఅభివృద్ధిని మేము చెప్పుకోలేదుతెలంగాణ పేరు మార్చడం వల్ల ఓడిపోయామనడానికి ఆధారం లేదుమాకు అహంకారం ఉందని కృత్రిమంగా సృష్టించారుఆత్మవిశ్వాసం, అహంకారానికి తేడా తెలియదుహరీశ్రావు చిట్చాట్..ఫిరాయింపుల వల్ల మాకు లాభం జరగలేదుమా పార్టీలో చేరిన వాళ్ళల్లో పది మంది ఓడిపోయారుసుప్రీంకోర్టు తీర్పు ప్రకారం పార్టీ మారిన వారిపై మూడు నెలల్లో నిర్ణయం తీసుకోవాలితెలంగాణలో మళ్ళీ అధికారంలోకి వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమేప్రజలు ప్రస్తు ప్రభుత్వానికి గత మా ప్రభుత్వానికి వ్యత్యాసం చూస్తున్నారురేవంత్ రెడ్డికి పాలన పై పట్టు రాలేదు..పాలన వదిలేసి రాజకీయం చేస్తున్నారు.అధికారులు మా చేతుల్లో లేదు అన్నారంటే అది వారి చేతగానితనం అన్నట్టేగ్రామాల్లో పారిశుద్ధ్యం కూడా లేదు..ప్రజలు డెంగ్యూ ,మలేరియాా బారిన పడుతున్నారు. -
కాంగ్రెస్ గేట్లు ఎందుకు ఎత్తింది?
తెలంగాణలో ఇప్పుడు రాజకీయ విశ్లేషణలు అన్నీ పార్టీ ఫిరాయింపుల చుట్టే తిరుగుతున్నాయి. ఒక పార్టీలో గెలిచి మరో పార్టీలో చేరుతున్న ప్రజా ప్రతినిధులపై బీఆర్ఎస్ నాయకులు గొంతు చించుకొని తప్పు పడుతున్నారు. అయితే వారంతా ఈ పరిణామాలపై 2014 నుంచి జరిగిన పార్టీ ఫిరాయింపుల గురించి కూడా మాట్లాడి ఉంటే బాగుండేది.అంతే కాదు తెలుగుదేశం ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్, కాంగ్రెస్ ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిలను పార్టీలోకి తీసుకొని మంత్రి పదవులు కట్టబెట్టినప్పుడు ఇప్పుడు మాట్లాడేవారు ఎందుకు మాట్లాడలేదో మరి! కారు దిగుతున్న ఎమ్మెల్యేల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుండటంతో ఎమ్మెల్యేల కోసం కేసీఆర్ గడీ తలుపులు తెరుచుకున్నాయి. ఎమ్మెల్యేలతో మాజీ సీఎం బంతి భోజనాలు చేస్తున్నారు. ఎవరూ పార్టీ మారొద్దని విజ్ఞప్తులు చేస్తున్నారు.ఇక అసలు విషయానికి వద్దాం. ‘గేట్లు ఎత్తేశాం’ అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన వెనుక ఏం జరిగింది అనేది రాష్ట్ర ప్రజలందరూ గమనిస్తూనే ఉన్నారు. ‘రాష్ట్రంలో నిరంకుశ పాలన పోవాలి, మార్పు కావాలి’ అంటూ ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నారు.అయితే రేవంత్ సర్కార్ కొలువుదీరిన కొద్ది రోజుల నుంచే... ‘ప్రభుత్వం ఆరు నెలల్లో కూలిపోతుంద’ంటూ ఒకవైపు బీఆర్ఎస్, మరోవైపు బీజేపీ నాయకులు పదేపదే మాట్లాడుతూ వచ్చారు. ఈ రెండు పార్టీలదీ ఒకే వాయిస్ కావడంతో దీని వెనుక ఏదన్నా కుట్రకోణం ఉందా అనే అనుమానాలు చర్చకు దారితీశాయి. ప్రజల ఆశలు, ఆశయాలను నెరవేరుస్తానని ప్రతిజ్ఞ పూనిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి... తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణ బాధ్యతల్ని భుజానికి ఎత్తుకున్నారు.రాష్ట్ర అభివృద్ధి, ప్రజా సంక్షేమం, అవినీతి రహిత పాలన చేయడం ఎంత ముఖ్యమో... ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కూడా అంతే ముఖ్యం. ఇవన్నీ జరగాలంటే ప్రత్యర్థి పార్టీల కుట్రల్ని ఛేదించడం కూడా ముఖ్యమే మరి. కారు, కమలం పార్టీల రాజకీయ కుట్రని ఛేదించేందుకే ‘కౌంటర్ పాలిటిక్స్’కు రేవంత్ రెడ్డి పదును పెట్టారనుకోవాలి. అందుకే గేట్లు ఎత్తే ఫార్ములాను అనుసరిస్తున్నారని చెప్పక తప్పదు. కానీ, ఇది జనం హర్షిస్తారా? – కోడూరు శ్రీనివాస రావు, సీనియర్ జర్నలిస్ట్ -
కాంగ్రెస్ వేధింపులకు వడ్డీతో సహా చెల్లిస్తాం: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ప్రజలు, బీఆర్ఎస్ నాయకులపై కాంగ్రెస్ ప్రభుత్వం పాల్ప డుతున్న వేధింపులకు మళ్ళీ వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు హెచ్చరించారు. కక్ష సాధింపుతో మేడ్చ ల్ జిల్లా పీర్జాదిగూడలో ప్రజలు కట్టుకుంటున్న ఇళ్లను కూలగొట్టిన వ్యవహారంపై విచారణ జరపా లని సీఎం రేవంత్ రెడ్డిని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ నాయకులు రాందాస్గౌడ్, జగదీశ్వర్రెడ్డి, కార్పొరేటర్ అమర్సింగ్ కుటుంబం ఈ ప్లాట్లను విక్రయించగా, నాటి కాంగ్రెస్ ప్రభుత్వం క్రమబద్ధీకరించిందని గుర్తు చేశారు.దీనిని పట్టా భూమిగా పేర్కొంటూ రెవెన్యూ అధికారులు ఎన్ఓసీ ఇవ్వగా, మున్సిపల్ అధికారులు కూడా అనుమతులు ఇచ్చారని పేర్కొన్నారు. దీంతో అనేక మంది బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని ఇళ్ల నిర్మాణం చేస్తుండగా, మేడ్చల్ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఏం ఆశించి సోమవారం ఈ ఇళ్లను కూల్చివేయించారో విచారణ చేయించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. సీఎంకు సోదరుడిగా చెప్పుకుంటూ మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి మేడ్చల్ అసెంబ్లీ పరిధిలో చేస్తున్న చేస్తున్న అరాచకాలపై ఇంటెలిజెన్స్ నివేదిక తెప్పించుకోవాలని రేవంత్కు కేటీఆర్ సూచించారు. బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్లాట్ల యజమానులకు న్యాయం చేస్తామని హామీనిచ్చారు. -
తెలంగాణలో బాబు రాజకీయం
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో తెలుగుదేశం పార్టీని ముందుపెట్టి బీజేపీ రాజకీయం ప్రారంభించిందని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ టి.జగ్గారెడ్డి అన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆడిన విధంగానే ఇక్కడ బీజేపీతో కలిసి నాలుగు స్తంభాలాట ఆడాలనేది చంద్రబాబు వ్యూహమని, ఎవరు ఎన్ని ఎత్తులు వేసినా తెలంగాణలో కాంగ్రెస్ కార్యకర్తల శక్తిని నిర్వీర్యం చేయలేరని పేర్కొన్నారు. గాంధీభవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ అధికార ప్రతినిధులు బి.లింగం యాదవ్, గజ్జి భాస్కర్లతో కలసి ఆయన మాట్లాడుతూ.. గతంలో చంద్రబాబు హైదరాబాద్ ఎన్నోసార్లు వచ్చి వెళ్లారని, అయినా ఎవరికీ తెలిసేది కాదని, ఇప్పుడు విభజన సమస్యల పేరుతో మళ్లీ హైదరాబాద్లో బాబు ప్రవేశించారని అన్నారు.తెలంగాణలో కాంగ్రెస్ను దెబ్బతీయడానికి బీజేపీ వేస్తున్న ఎత్తుగడలో చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నారని, బీజేపీ డైరెక్షన్లోనే చంద్రబాబు, పవన్ కల్యాణ్ పనిచేస్తున్నారని విమర్శించారు. అందుకే చంద్రబాబు వ్యాఖ్యలను కేంద్రమంత్రి బండి సంజయ్ కూడా సమరి్థంచారని గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో ఐటీకి పునాది వేసింది కాంగ్రెస్ పార్టీ అని, హైటెక్సిటీకి నేదురుమల్లి జనార్దన్రెడ్డి హయాంలోనే పునాదులు పడ్డాయని, ఇప్పుడు చంద్రబాబు డబ్బా కొట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. చేసిన అభివద్ధినే బాబు, కేసీఆర్ కొనసాగించారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ కార్యకర్తలు, నేతలు ఇప్పుడు జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. తాను నామినేటెడ్ పదవులు ఆశించే వాడిని కాదని స్పష్టం చేశారు. రాజుయుద్ధం చేసి గెలిచినట్టు సంగారెడ్డి రాజ్యానికి మళ్లీ ప్రజలు గెలిపించి తనను రాజును చేస్తారని జగ్గారెడ్డి పేర్కొన్నారు. -
కాంగ్రెస్కు బీఆర్ఎస్ గతే.. మంత్రులకు కాల్ చేస్తే తీయలేదు: ఈటల ఫైర్
సాక్షి, హైదరాబాద్: కార్పొరేటర్ కాంగ్రెస్లో చేరడంలేదని అక్రమంగా పేదల ఇళ్లను కూల్చివేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు మాల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణం అంటూ కామెంట్స్ చేశారు.కాగా, ఈటల రాజేందర్ సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. అక్రమ కట్టడాల పేరుతో కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఇళ్లు కూల్చివేస్తోంది. ఫిరోజ్గూడలో సాయిప్రియ ఎన్క్లేవ్లో ఉద్యోగులు, నిరుపేదలు 30 ఏళ్ల కిందట భూములు కొనుగోలు చేశారు. స్థానిక కార్పొరేటర్ కాంగ్రెస్లో చేరడంలేదని ఇళ్లను కూల్చివేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే అక్కడున్న నిర్మాణాలను అకారణంగా కూల్చేశారు. భూముల ధరలు పెరిగాయని ఇప్పుడు కూల్చివేయటం దారుణం.అవి అక్రమ భూములు అయితే ఇన్ని రోజులు ఎందుకు కూల్చివేయలేదు. ప్రభుత్వ అధికారులు ఇళ్ల నిర్మాణానికి, గృహ రుణాలకు ఎలా అనుమతి ఇచ్చారో సమాధానం చెప్పాలి. సమస్య ఉత్పన్నమైతే పరిష్కరించాల్సిన ప్రభుత్వం హింసకు గురిచేయడం సరైన పద్దతి కాదు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి కారణంగా పేదలు రోడ్డున పడ్డారు. కేసీఆర్ ఇలాంటి చర్యలకు పాల్పడితేనే అధికారం కోల్పోయారు. ఈ సమస్యపై మాట్లాడటానికి అధికారులు, మంత్రులకు ఫోన్ చేస్తే వారు మాట్లాడటం లేదు. మంత్రులు శ్రీధర్ బాబు, పొంగులేటికి ఫోన్ చేసినా వారు లిఫ్ట్ చేయలేదు. ప్రభుత్వ చర్యలను కచ్చితంగా అడ్డుకుంటాం’ అని వ్యాఖ్యలు చేశారు. -
రైతుభరోసా ఇచ్చేది అప్పుడే.. మంత్రి తుమ్మల కీలక వ్యాఖ్యలు
సాక్షి, ఖమ్మం: తెలంగాణలో పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కోరిక అని చెప్పుకొచ్చారు వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. అలాగే, రాష్ట్రంలో పంట రుణ మాఫీ తర్వాతే రైతు భరోసా ప్రారంభిస్తామని క్లారిటీ ఇచ్చారు.కాగా, ఖమ్మంలోని వేంసూరులో తుమ్మల మీడియాతో మాట్లాడుతూ..‘సహకార స్ఫూర్తితో వచ్చిన సహకార సంఘాలు రైతులకు ఉపయోగపడటం లేదనే భావన ఉంది. సహకార బ్యాంక్లో రుణాలు తీసుకున్న వారికి మాత్రమే మెంబర్షిప్ ఉండాలి. ఓట్ల కోసం మెంబర్షిప్ ఇవ్వకూడదు. రైతులందరికీ రుణాలు ఇవ్వాలి. రైతులకు కావల్సిన అన్నింటినీ రివైజ్డ్ చేసి వడ్డీ లేని రుణాలు వచ్చేలా ప్రభుత్వం ప్రయత్నం చేస్తోంది. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రధాన బాధ్యత రైతులే. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగలేకపోయినా ఆగస్టు 15వ తేదీ లోపు ముప్పై వేల కోట్లు రైతులకు ఇవ్వబోతున్నాం.రైతు భరోసాకు సంబంధించి రైతులు, కౌలు రైతులు మాట్లాడుకోవాలి. కౌలు తీసుకునే ముందు చర్చించుకోవాలి. పంట వేసే రైతులకే రైతు భరోసా ఇవ్వాలనేది ముఖ్యమంత్రి కోరిక. గత ఐదేళ్లలో పంట వేయని భూములకు కూడా రైతు భరోసా వచ్చింది. దానివల్ల 25వేల కోట్లు దుర్వినియోగం అయ్యాయి. 10, 15 రోజుల్లో రైతుల అభిప్రాయాలను తీసుకుని సబ్ కమిటీ ముఖ్యమంత్రికి నివేదిక అందిస్తుంది.రుణమాఫీ పూర్తి అయిన తరువాత రైతు భరోసా ప్రారంభిస్తాం. రైతులందరికీ ప్రభుత్వమే ప్రీమియం కట్టేలా ముఖ్యమంత్రితో మాట్లాడాం. రైతు బీమా కూడా కొనసాగించాలి అని చెప్పాం. రైతులందరూ మంచి వ్యవసాయం చేయాలి. భవిష్యత్లో పామాయిల్ను ఎక్స్పోర్ట్ చేసే స్థితికి వెళ్లాలి. పామాయిల్కు రూ.17 వేలు మద్దతు ధర ఇవ్వాలని కేంద్రంతో కూడా మాట్లాడాం. పామాయిల్ రైతు నిలబడి వ్యవసాయం చేసేలా భరోసా కల్పిస్తాం అంటూ కామెంట్స్ చేశారు. -
చంద్రబాబు వచ్చింది అందుకే.. కాంగ్రెస్ కేడర్ అలర్ట్: జగ్గారెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఏపీ సీఎం చంద్రబాబు భేటీతో రాష్ట్రంలో రాజకీయం మరోసారి హీటెక్కింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోందని కామెంట్స్ చేశారు.కాగా, జగ్గారెడ్డి సోమవారం మీడియాతో మాట్లాడుతూ..‘తెలంగాణలో బీజేపీ గేమ్ స్టార్ట్ చేసింది. టీడీపీని ముందుపెట్టి బీజేపీ పొలిటికల్ గేమ్ ఆడుతోంది. తెలంగాణను కబ్జా చేసే ప్రయత్నం జరుగుతోంది. ఈ విషయంలో కాంగ్రెస్ కేడర్ అలర్ట్గా ఉండాలని సూచిస్తున్నాను. సీఎం హోదాలో చంద్రబాబు తెలంగాణలో అడుగుపెట్టాడు.చంద్రబాబు రెండు కళ్ల సిద్ధాంతంలో రాజకీయం మొదలు పెట్టాడు. కాంగ్రెస్ను దెబ్బ కొట్టేందుకు టీడీపీ, జనసేనను బీజేపీ రంగంలోకి దింపింది. చంద్రబాబు పావుగా వ్యవహరిస్తున్నాడు. ఏపీలో చేసిన పొలిటికల్ గేమ్ను తెలంగాణలో ఆడాలనుకుంటున్నారు. విభజన సమస్యల పేరుతో చంద్రబాబు తెలంగాణలో ఎంటరయ్యారు. రాష్ట్రంలో ఐటీని అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీనే. చంద్రబాబు కేవలం కొనసాగించారు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదే సమయంలో కేంద్రమంత్రి బండి సంజయ్కు కూడా జగ్గారెడ్డి కౌంటరిచ్చారు. దేశంలో బలమంతా ఈడీ, సీబీఐ, ఐటీ చేతిలోనే ఉంది. ఇప్పటి వరకు బీజేపీలో చేరిన వారంతా వివిధ కేసుల్లో ఉన్నవారే ఉన్నారు. ఇంత కన్నా సాక్ష్యం ఏం కావాలి అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో, జగ్గారెడ్డి వ్యాఖ్యలు తెలంగాణలో చర్చనీయాంశంగా మారాయి. ఇక, ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ సందర్భంగా పలుచోట్ల టీడీపీ కార్యకర్తలు అత్యుత్సాహం ప్రదర్శించిన విషయం తెలిసిందే. -
ఎమ్మెల్యేల అనర్హతపై పిటిషన్లు.. కోర్టులో విచారణ వాయిదా
సాక్షి,హైదరాబాద్ : బీఆర్ఎస్లో గెలిచి కాంగ్రెస్లోకి వెళ్లిన ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలని బీఆర్ఎస్ తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఆ పిటిషన్పై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా అనర్హత పిటిషన్లపై విచారణకు అర్హతలేదని డైరెక్టర్ జనరల్ వాదించారు. ఇరుపక్షాల వాదనలు విన్న కోర్టు విచారణను ఈ నెల 11కి వాయిదా వేసింది.కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి తెలంగాణ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి పిటిషన్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు. -
ఎమ్మెల్యేలపై అనర్హత వేటు.. నేడు హైకోర్టులో విచారణ
సాక్షి, హైదరాబాద్ : బీఆర్ఎస్ గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేలపై స్పీకర్ అనర్హత వేటు ప్రకటించాలని కోరుతూ తెలంగాణ హైకోర్టులో హుజురాబాద్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఆ పిటిషన్పై నేడు తెలంగాణ హైకోర్టు విచారించనుంది. ఎమ్మెల్యే పాడి కౌషిక్ రెడ్డి పిటిషన్లో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, స్టేషన్ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు పేర్లను ప్రధానంగా ప్రస్తావించారు. -
ఇద్దరు సీఎంల భేటీ.. పరువు పాయే.. అంతా తుస్సే..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ముఖ్యమంత్రులు నారా చంద్రబాబు నాయుడు, ఎనుముల రేవంత్ రెడ్డిలు విభజన సమస్యలపై చర్చించుకోవడానికి సమావేశం అవడం ముదావహమే. వారిద్దరి భేటీతో చిరకాలంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యలు ఒక కొలిక్కి వస్తాయని చాలామంది ఆశించారు. తెలుగుదేశం మీడియా ఇచ్చిన హైప్ చూసినవారికి ఏదో జరిగిపోతుందన్న భావన కలిగింది. తీరా ఇద్దరు సీఎంల సమావేశం అయిన తర్వాత ఇంతేనా.. ఏదో అయిపోతుందనుకుంటే ఇలా తుస్సుమనిపించారేమిటా అన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.పేరుకు రెండు కమిటీలు ఏర్పాటు చేస్తున్నట్ల ప్రకటించినా అవి ఎంతవరకు ఫలితాలు ఇస్తాయో చెప్పలేం. అధికారుల కమిటీ, మంత్రుల కమిటీలు స్వతంత్రంగా నిర్ణయాలు చేసే పరిస్థితి పెద్దగా ఉండదు. గత అనుభవం కూడా ఇదే చెబుతోంది. ఈ విభజన సమస్యలు రాజకీయాలతో కూడా ముడిపడి ఉంటాయన్న సంగతి అందరికి తెలిసిందే. ఇద్దరు సీఎంలు దిశానిర్దేశం చేయనిదే కమిటీలు కూడా ఏమీ చేయజాలవు. గతంలో అప్పటి ముఖ్యమంత్రులు కేసిఆర్, వైఎస్ జగన్మోహన్ రెడ్డిలు చర్చలు జరిపినప్పుడు కూడా ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు సంప్రదింపులు కొనసాగించాలని భావించినా, ఆ తర్వాత కాలంలో అవి పెద్దగా జరగకపోవడంతో సీరియస్ నెస్ పోయినట్లయింది.ఇప్పుడు అందుకు భిన్నంగా జరిగితే మంచిదే. విభజనలో కీలకమైన అంశాలపై ఇరు రాష్ట్రాల సీఎంలు దాటవేసే ధోరణినే అవలంబించినట్లు అనిపిస్తుంది. కాకపోతే ఒకరికొకరు వ్యక్తిగతంగా మద్దతు ఇచ్చుకుంటున్నట్లు కనిపించడానికి ఈ సమావేశం జరిగినట్లు అనిపిస్తుంది. ఏపీలో బీజేపీతో పొత్తులో ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు తెలంగాణలో కాంగ్రెస్ కు, రేవంత్ కు పరోక్షంగా మద్దతు ఇస్తుంటారు. అలాగే చంద్రబాబును రేవంత్ అప్పుడప్పుడు పొగుడుతుంటారు. చంద్రబాబుకు రేవంత్ అత్యంత సన్నిహితుడు అనే సంగతి బహిరంగ రహస్యమే. అయినా రేవంత్ రెడ్డి వ్యూహాత్మకంగా వ్యవహరించి కోస్తా తీరంలో వాటా, టీడీపీలో షేర్ అడుగుతామంటూ లీక్ లు ఇచ్చి ఏపీ ప్రభుత్వం తన డిమాండ్లపై గట్టిగా పట్టుబట్టకుండా చేశారన్న భావన కలుగుతుంది.ప్రత్యేకించి పదేళ్లపాటు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ లోని ఆస్తులలో తమకు వాటా రావాలన్నది ఏపీ ప్రభుత్వ వాదన. ఉమ్మడి రాష్ట్రంలో అన్నీ ప్రాంతాలవారు కలిసి హైదరాబాద్ అభివృద్ది చేసుకున్నారు. అలాగే తెలంగాణతో పాటు ఆంధ్ర, రాయలసీమ ప్రజలు కూడా చెల్లించిన పన్నులతో హైదరాబాద్ లో పలు ప్రభుత్వ కార్యాలయాలు నిర్మించడం జరిగిందని, వాటిలో షేర్ ఉంటుందన్నది ఏపీ వాదన. విభజన చట్టంలోని తొమ్మిది, పది షెడ్యూల్ ల లోని ఆస్తుల విభజన ద్వారా ఏపీకి న్యాయబద్దమైన వాటా వస్తుందని ఆశించినవారికి ఈ సమావేశం ఆశాభంగం కలిగించింది.తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ లో ఉన్న ఆస్తులన్నీ తమవేనని ఉద్ఘాటిస్తోంది. హైదరాబాద్ లో సుమారు లక్షన్నర కోట్ల రూపాయల విలువైన ప్రభుత్వ ఆస్తులు ఉంటే, అందులో జనాభా నిష్పత్తి ప్రకారం ఏభై ఎనిమిది శాతం వాటా ఏపీకి వస్తాయని అనుకున్నారు. గతంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ ఆధ్వర్యంలో జరిగిన మేధావుల సమావేశం ఏపీకి 75 వేల కోట్ల రూపాయలు రావల్సి ఉందని అంచనా వేసింది. కానీ ఇవేవి చర్చకు వచ్చినట్లు అనిపించదు.ప్రస్తుతం ఏపీ ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్ కల్యాణ్ ఇంత కీలకమైన రెండు రాష్ట్రాల సమావేశానికి రాకుండా తప్పించుకున్నారా? లేక చంద్రబాబు రమ్మనలేదో తెలియదు కానీ ఆయన ఆ ఊసే ఎత్తడం లేదు. తెలంగాణ ఉప ముఖ్యమంత్రి, ఆర్ధిక మంత్రి అయిన మల్లు భట్టి విక్రమార్క ఈ భేటీలో క్రియాశీలకంగా వ్యవహరిస్తే, పవన్ కల్యాణ్ అసలు పాల్గొనలేదు. ఈ మధ్యకాలంలో పవన్ కల్యాణ్ ప్రాధాన్యత తగ్గుతోందన్న వ్యాఖ్యలు వినవస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం రామోజీరావు సంస్మరణ సభలో కేవలం చంద్రబాబు పేరు మాత్రమే వేయడం, ఢిల్లీ టూర్ లో పవన్ కల్యాణ్ లేకుండానే ప్రధాని మోదీని, ఇతరకేంద్ర మంత్రులను చంద్రబాబు ఒక్కరే కలవడం, ఇప్పుడు హైదరాబాద్ లో రెండు రాష్ట్రాల కీలక చర్చలలో పవన్ కు అవకాశం ఇవ్వకపోవడం వంటివి కొన్ని సందేహాలకు అవకాశం ఇస్తున్నాయి.తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో పాటు మల్లు భట్టి విక్రమార్క కూడా ప్రధానిని కలవడం గమనార్హం. పవన్ కల్యాణ్ ఇలాంటి అవమానకర ఘటనల విషయంలో పెద్దగా ఫీల్ కాకపోతుండవచ్చు. ఏపీ ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ ఈ భేటీ ఎజెండాను ఖరారు చేయడానికి సమావేశం పెట్టారుకానీ ఆయన ఎందువల్లనో పాల్గొనలేదు. ఈ సంగతి పక్కనబెడితే ఇద్దరు సీఎంలు కలిసిన తర్వాత వారిద్దరూ మీడియాతో మాట్లాడతారని అంతా ఊహిస్తారు. ఎందుకంటే చంద్రబాబు, రేవంత్ ఇద్దరూ మీడియాకు ఎంత ప్రాధాన్యత ఇచ్చేది తెలిసిన సంగతే. కానీ వారు మంత్రులకు ఆ బాధ్యత అప్పగించి వెళ్లిపోయారంటేనే దాని అర్ధం ఈ సమావేశం ఫలప్రదం కాలేదని అనుకోవాలి.ఒకవేళ ఏ ఒక్కదానిపైన అయినా అవగాహన కుదిరితే దాని గురించి అయినా ఘనంగా చెప్పుకునేవారు. విభజన సమస్యల వల్ల తెలంగాణకు పెద్దగా నష్టం ఏమీ లేదు. ఎటుతిరిగి ఏపీకే ఈ సమస్యల సత్వర పరిష్కారం అవసరం. తద్వారా నిర్దిష్ట మొత్తంలో నిధులు ఏపీకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ ఆ విషయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏమీ సాధించలేకపోయిందని అనిపిస్తుంది. హైదరాబాద్ ఉమ్మడి ఆస్తుల గురించి తేల్చలేకపోతే చంద్రబాబు అంతటి సీనియర్ నేత వల్ల ఏపీకి ఏమి ఒరిగిందన్న ప్రశ్న వస్తుంది. హైదరాబాద్ లో భవనాలు ఇవ్వబోమని, కావాలంటే స్థలాలు ఇస్తాం.. బిల్డింగులు కట్టుకోండని రేవంత్ స్పష్టం చేశారంటే అది ఏపీకి నష్టం చేయడానికే ఆయన వెనుకాడడం లేదని అర్దం. దానిని చంద్రబాబు ఖండించలేకపోవడం, ఏపీ వాటా గురించి పట్టుబట్టలేకపోవడం ఆయన బలహీనత అనిపిస్తుంది. లేదా రేవంత్ తో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చంద్రబాబు గట్టిగా మాట్లాడలేకపోయారని అనుకోవాలి.అలాగే తెలంగాణ విద్యుత్ సంస్థలు ఏపీకి ఏడువేల కోట్ల రూపాయల మేర బకాయిలు ఉన్నాయని గత ఏడెనిమిది సంవత్సరాలుగా ఏపీ ఫిర్యాదు చేస్తోంది. ఈ విషయంలో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రధానికి, హోం మంత్రికి ఫిర్యాదు చేయడానికి ఎక్కడా వెనుకాడలేదు. ఆయా అంశాలపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం సుప్రింకోర్టుకు కూడా వెళ్లింది. చంద్రబాబు దానిని కొనసాగిస్తారో, లేదో తెలియదు. ఇప్పుడు తెలంగాణ తమకే 24వేల కోట్ల మేర ఏపీ నుంచి రావాలని ఎదురుదాడి చేసింది. అయినా చంద్రబాబు దీనిపై నోరెత్తినట్లు కనిపించలేదు.పోలవరం ప్రాజెక్టు కింద ముంపు మండలాలుగా ఉన్న ఏడింటిని ఏపీలో కలపడంపై తెలంగాణ అభ్యంతరం చెబుతోంది. వాటిలో కనీసం ఐదు గ్రామాలనైనా తమకు తిరిగి వెనక్కి ఇవ్వాలని కోరుతోంది. దీనికి ఈ చర్చలలో ఏపీ ప్రభుత్వం వ్యతిరేకించినట్లు లేదు. కేంద్ర ప్రభుత్వం దీనిపై నిర్ణయం తీసుకోవల్సి ఉంటుందని ఏపీ అధికారులు అన్నారని కథనం వచ్చింది. దానిని సానుకూలంగా తీసుకుని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి ఈ అంశంపై లేఖ రాయాలని నిర్ణయం తీసుకుంది. హైదరాబాదో లో ఉమ్మడి ఆస్తుల విషయంలో తెలంగాణ అంత గట్టిగా ఉన్నా, భద్రాచలం పక్కన ఉన్న గ్రామాల విషయంలో ఏపీ ప్రభుత్వం ఉదారంగా ఉండడం విమర్శలకు దారితీసే అవకాశం ఉంది.కృష్ణా జలాలలో తెలంగాణ ప్రభుత్వం అధిక వాటా కోరుతోంది. దానివల్ల ఏపీకి నష్టం జరుగుతుంది. రాయలసీమ ప్రాంతానికి బాగా ఇబ్బంది వస్తుంది. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తలపెట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమును గతంంల రేవంత్ తన మనుషుల ద్వారా అడ్డుకున్నారు. అలాంటి ముఖ్యమైన సమస్యలు అసలు చర్చకే వచ్చినట్లు లేదు. ఇద్దరు సీఎంల భేటీ ముందడుగు అంటూ టీడీపీ మీడియా ఊదరగొట్టింది కానీ అది ఏ రకంగానో చెప్పలేకపోయింది. పైగా డ్రగ్స్ అంశంలో ఏపీ మంత్రి అనగాని సత్యప్రసాద్ అనుచిత వ్యాఖ్యలు చేసి రాష్ట్రం పరువు తీశారన్న వాదన వినవస్తోంది. డ్రగ్స్ అంశంలో ఇద్దరు డీజీపీలు సహకరించుకుని కఠినచర్యలు తీసుకుంటే అరికట్టవచ్చు. అది దేశ వ్యాప్త సమస్యగా ఉంది.అయినా ఏపీ ముఖ్యమంత్రి, మంత్రులు అదేదో ఏపీలోనే ఎక్కువగా ఉన్నట్లు మాట్లాడడం దారుణంగా ఉంది. హైదరాబాద్, బెంగుళూరు, ఢిల్లీ తదితర నగరాలలో ఇది ఎంత పెద్ద సమస్యగా ఉందో చెప్పనక్కర్లేదు. కేవలం రాజకీయంగా వైఎస్సార్సీపీపై పిచ్చి ఆరోపణలు చేయడానికి ఇలా ప్రచారం చేసి ఏపీ మంత్రులే రాష్ట్ర బ్రాండ్ ఇమేజీని చెడగొట్టడం శోచనీయం అని చెప్పాలి. 2017లో టీడీపీ ప్రభుత్వంలోని మంత్రి గంటా శ్రీనివాసరావు అప్పట్లోనే ఏపీలో గంజాయి సమస్య ఎంత తీవ్రంగా ఉందో మీడియాకే చెప్పారు. అయినా టీడీపీ, జనసేన నేతలు వైఎస్సార్సీపీపై ఆరోపణలు గుప్పిస్తారు. ఎక్కడ ఏది మాట్లాడాలో తెలియకుండా టీడీపీ మంత్రులు మాట్లాడితే రాష్ట్రానికి ఏమి ప్రయోజనం వస్తుంది?ఏపీ డిమాండ్లకు ముకుతాడు వేయడానికి రేవంత్ ప్రభుత్వం వ్యూహాత్మకంగా కొత్త లీకులు ఇచ్చినట్లు అనిపిస్తుంది. కోస్తా తీర ప్రాంతం, ఓడరేవులలో వాటా ఇవ్వాలని, తిరుమల, తిరుపతి దేవస్థానంలో వాటా ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నట్లు మీడియాలో వార్తలు ప్రచారం చేయించింది. అది సంచలనంగా మారింది. ఆ రకంగా ముందరికాళ్లకు బంధం వేయడంతో చంద్రబాబు అసలు కీలకమైన ఆస్తుల విభజన, విద్యుత్ బకాయిలు మొదలైన అంశాల గురించి పూర్తి స్థాయిలో ప్రస్తావించలేకపోయారా? అనే సంశయం ఏర్పడుతోంది.ఇటీవల తెలంగాణ కూడా తన ముఖ్యమే అంటూ చంద్రబాబు కొత్త రాగం అందుకున్నారు. అందువల్లే ఏపీ డిమాండ్లపై చంద్రబాబు పట్టలేదనిపిస్తుంది. వీటిపై పట్టుబట్టి రేవంత్ ను ఒప్పించలేకపోతే ఏపీకి ఆయన చాలా నష్టం చేసినవారు అవుతారని వేరే చెప్పనవసరం లేదు. అయినా చంద్రబాబుకు ఎల్లో మీడియా అండగా ఉంది కనుక ముందడుగు అని, ఏదో సాధించేశారనో రాయవచ్చుకానీ, వాస్తవరూపంలో ఏపీకి ఒక్క అంశంలో కూడా మేలు జరిగినట్లు అనిపించదు. ఈ మొత్తం ప్రక్రియ చూస్తే రాష్ట్రాల సమస్యల పరిష్కారం కన్నా, వేర్వేరు కూటములకు చెందిన చంద్రబాబు, రేవంత్ లు తాము రాజకీయంగా కలిసే ఉన్నామన్న సంకేతాన్ని ఇచ్చినట్లు అనిపిస్తుంది.– కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ పాత్రికేయులు