-
వలపోతల కంటే వడపోతలపైనే దృష్టి : మాజీ మంత్రి హరీశ్రావు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలను పరిశీలిస్తే రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్లుగా స్పష్టమవుతోందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు విమర్శించారు. చెప్పేదొకటి చేసేదొకటి అన్నట్లుగా కాంగ్రెస్ పార్టీకి అలవాటు అయిందని ఎద్దేవా చేశారు.2018 డిసెంబర్ 12వ తేదీకి ముందు రుణాలు తీసుకున్న రైతులకు రుణమాఫీ వర్తించదనే నిబంధన అసమంజసం అని పేర్కొన్నారు. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతోందని నిందించారు. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం ద్వారా లక్షలాదిమంది రైతుల ఆశలపై సర్కారు నీళ్లు చల్లిందని హరీశ్రావు ఓ ప్రకటనలో ఆగ్రహం వ్యక్తం చేశారు. -
అవి మార్గదర్శకాలు కావు.. మభ్యపెట్టే ప్రయత్నాలు
సాక్షి, హైదరాబాద్: రుణమాఫీ మార్గదర్శకాల పేరిట కాంగ్రెస్ ప్రభుత్వం మభ్యపెట్టే ప్రయత్నాలు చేస్తోందని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి విమర్శించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతు రుణాలు మాఫీ చేస్తామని చెప్పిన కాంగ్రెస్ కొంతమందికే రుణమాఫీని పరిమితం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రూ.2లక్షల పంట రుణం తీసుకున్న రైతుల జాబితాను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. పీఎం కిసాన్ డేటాను మార్గదర్శకంగా తీసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పని కాంగ్రెస్ ఇప్పుడు లోపభూ యిష్ట షరతులు విధిస్తోందని నిందించారు. రైతు రుణమాఫీకి రేషన్కార్డు ప్రామాణికం కాదని నాలుగు రోజుల క్రితం చెప్పిన సీఎం రేవంత్ ఎందుకు యూ టర్న్ తీసుకున్నారో చెప్పాలని కోరారు. రేషన్ కార్డులు లేని రైతులు, పది ఎకరాల భూమి ఉండి కూడా పింక్ రేషన్ కార్డు కలిగిన రైతుల సంగతేంటో తేల్చాలని ఓ ప్రకటనలో ఆయన డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన రైతు రుణమాఫీ మార్గదర్శకాలు అధికారులు, రైతుల నడుమ చిచ్చు పెట్టేలా ఉన్నాయని నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. -
రుణమాఫీపై మార్గదర్శకాలు.. అది కాంగ్రెస్కు అలవాటే: హరీష్ రావు సెటైర్లు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు సెటైరికల్ కామెంట్స్ చేశారు. కాంగ్రెస్ వాళ్లు చెప్పేదొకటి.. చేసేదొకటి.. ఇది వారికి అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు.కాగా, తెలంగాణలో రైతుల రుణమాఫీ మార్గదర్శకాలపై హరీష్రావు కౌంటరిచ్చారు. కాగా, హరీష్ రావు ట్విట్టర్ వేదికగా.. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతలపైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం. సంబంధిత వార్త: రుణమాఫీపై బిగ్ ట్విస్ట్.. ప్రభుత్వం మార్గదర్శకాలు ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది. రుణమాఫీ పథకం అమలు విషయంలో ప్రభుత్వం విడుదల చేసిన మార్గదర్శకాలు చూస్తే, రైతుల వలపోతల కంటే వడపోతల పైనే ఎక్కువ దృష్టి పెట్టిందన్నది స్పష్టం.ఎన్నికల సమయంలో ఒక మాట, అధికారంలోకి వచ్చాక ఒక మాట. చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అనే పద్ధతి చెయ్యి గుర్తు పార్టీకి అలవాటుగా మారింది.…— Harish Rao Thanneeru (@BRSHarish) July 15, 2024 డిసెంబర్ 12, 2018 వరకు ముందున్న రైతులకు వర్తించదు అనే నిబంధన అసమంజసం. రైతుకు రుణభారం తగ్గించే ప్రయత్నం కన్నా ప్రభుత్వ భారం తగ్గించుకునే ప్రయత్నమే ఎక్కువ కనపడుతున్నది. ఆహార భద్రత కార్డు, పీఎం కిసాన్ పథకం ప్రామాణికం అని ప్రకటించడం అంటే లక్షలాది రైతుల ఆశలపై నీళ్లు చల్లడమే. ఎన్నికలప్పుడు మభ్య పెట్టారు, అధికారం వచ్చిన తర్వాత ఆంక్షలు పెట్టారు అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి, గాలి అనిల్
సాక్షి, పటాన్చెరు: తెలంగాణలో కాంగ్రెస్ చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ విజయవంతంగా కొనసాగుతోంది. ఈ క్రమంలో ఇప్పటికే పలువురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరిపోయారు. ఇక, తాజాగా ఉమ్మడి మెదక్ జిల్లా నుంచి కూడా వలసలు మొదలయ్యాయి.తాజాగా బీఆర్ఎస్ పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి, గత పార్లమెంట్ ఎన్నికల్లో జహీరాబాద్ పార్లమెంట్ నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిన గాలి అనిల్ కాంగ్రెస్లో పార్టీలో చేరారు. సీఎం రేవంత్ సమక్షంలో వీరు హస్తం గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి వీరిని పార్టీలోకి ఆహ్వానించారు సీఎం రేవంత్.ఈ సందర్భంగా మహిపాల్ రెడ్డి మాట్లాడుతూ.. ‘ప్రజా ప్రతినిధులు, ప్రజల ఆకాంక్ష మేరకు కాంగ్రెస్ పార్టీలో చేరాను. నియోజకవర్గ అభివృద్ధి కోసం కాంగ్రెస్ కండువా కప్పుకున్నాను. ఇన్ని రోజులు సహకరించిన అందరికీ ధన్యవాదాలు. పటాన్చెరు ప్రజల ఆశీస్సులతో ముచ్చటగా మూడోసారి నన్ను గెలిపించారు. కచ్చితంగా వారి నిర్ణయాన్ని గౌరవించాలి కాబట్టి పార్టీ కండువా కప్పుకున్నాను. గత పది ఏళ్లు నాకు సహకరించిన కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావుకు, ప్రతీ ఒక్కరికి ధన్యవాదాలు’ అంటూ కామెంట్స్ చేశారు. ఇదిలాఉండగా.. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. గూడెం మహిపాల్ రెడ్డితో ఈ సంఖ్య పదికి చేరుకుంది. ఇక, రానున్న రోజుల్లో మరికొంత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరే అవకాశం ఉన్నట్టు సమాచారం. -
‘కవిత కోసం బీఆర్ఎస్ మంతనాలు.. బండి సంజయ్ వ్యాఖ్యల మర్మమదే’
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంపై ఆ పార్టీ సీనియర్ నేత మధుయాష్కీ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ఏఐసీసీ డైరక్షన్ మేరకే రాష్ట్రంలో చేరికలు జరుగుతున్నాయన్నారు. అలాగే, లిక్కర్ స్కాంలో కవితను విడిపించేందుకు ఢిల్లీ పెద్దలతో బీఆర్ఎస్ నేతలు మంతనాలు జరుపుతున్నారని హాట్ కామెంట్స్ చేశారు.కాగా, మధుయాష్కీ తాజాగా మీడియాతో చిట్చాట్లో మాట్లాడుతూ..‘కాంగ్రెస్లో చేరికలు ఏఐసీసీ డైరెక్షన్ మేరకే జరుగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ గెలిచిన మూడు రోజులకే సర్కార్ పడిపోతుందన్నారు. దళిత నేత భట్టి విక్రమార్క సీఎల్పీగా ఉన్నప్పుడు ఆ హోదా పోయేలా బీఆర్ఎస్ పనిచేయలేదా?. దళితుల వ్యతిరేకంగా ప్రధాని మోదీ, మాజీ సీఎం కేసీఆర్ పనిచేశారు. బీజేపీ ఇతర రాష్ట్రాల్లో చేర్చుకున్న నేతలకు మంత్రి పదవులు ఇస్తుంది. ప్రజా గాయకుడు గద్దర్ను గేటు వద్దనే గంటల తరబడి నిలబెట్టింది కేసీఆర్ కాదా?. ప్రజా పాలనలో అందరికీ మాట్లాడే స్వేచ్చ ఉంది. సీఎం రేవంత్ ఎవరైనా కలవొచ్చు. తెలంగాణ ఉద్యమంలో కేసీఆర్ చొరబడి తానే ఉద్యమం చేసినట్లు కలరింగ్ ఇచ్చాడు. కేంద్రంలో అధికారంలోకి వస్తాం అనుకున్నాం. మంత్రి పదవులు ఇస్తాం అని ఎవరికీ చెప్పడం లేదు.రైతు కుటుంబం నుండి వచ్చిన రేవంత్ సీఎం అయితే కేసీఆర్ ఓర్వడం లేదు. పార్టీ అధికారంలోకి రావడానికి రేవంత్, నేను చాలా కష్టపడ్డాం. నేను నేరుగా అమెరికా నుండి వచ్చి ఎన్నికల్లో పోటీ చేయలేదు. కాంగ్రెస్ పార్టీలో 50 ఏళ్లకు పైగా ఉన్నాను. నేను ఏ పార్టీ మారలేదు, మొదటి నుండి కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నాను.లిక్కర్ స్కామ్లో కవిత అరెస్ట్పైనే ప్రస్తుతం బీఆర్ఎస్ ఫోకస్ పెట్టింది. కల్వకుంట్ల కవిత విడుదల కోసం బీఆర్ఎస్ను బీజేపీలో కలపాలని కేసీఆర్, కేటీఆర్ చూస్తున్నారు. ఈ అంశంపై ఢిల్లీలో మంతనాలు చేస్తున్నారు. హరీష్రావుపై బండి సంజయ్ ప్రేమ కురిపించడానికి కారణం అదే’ అంటూ ఆసక్తికర కామెంట్స్ చేశారు.ఇదిలా ఉండగా.. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్రావుపై నిన్న(ఆదివారం)బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్లో ఉన్న ఒకే ఒక మంచి నాయకుడు, వివాదరహితుడు హరీష్ రావు ఒక్కడే అని అన్నారు. అలాగే, హరీష్ ఒకవేళ బీజేపీలో చేరాలనుకుంటే రాజీనామా చేశాకే చేరాలని కామెంట్స్ చేశారు.కాగా, నిజంగా ఉద్యోగం కోసం రాసే వారు ఎవరు ఉద్యోగాలను వాయిదా వేయాలని అడగరు. ఉద్యోగాలు వాయిదా వేయడం వలన 100 కోట్ల వ్యాపారం జరుగుతుంది. శిక్షణ తరగతులు చెప్పే కోచింగ్ సెంటర్లలో కేసీఆర్ కుటుంబానికి వాటాలు ఉన్నాయి. అందుకే పరీక్షలు వాయిదా వేయాలని అంటున్నారు. నారాయణ, చైతన్య కాలేజీలలో హరీష్, కవితకు 17 శాతం వాటాలు ఉన్నాయి.ఇక, పీసీసీ చీఫ్ ఎంపికపై ఢిల్లీలో అసలు చర్చే లేదు. మంత్రివర్గ విస్తరణపై జరిగింది. ఎవరెవరికి మంత్రి పదవులివ్వాలి. ఏయే శాఖలు ఇవ్వాలి అనే దానిపై చర్చ జరిగింది. అదే రోజు పీసీసీపై ఐదు నిమిషాలు చర్చించి పక్కకు పెట్టారు. కొందరు మంత్రులు కూడా తమకు సరైన శాఖలు ఇవ్వలేదని ఫిర్యాదు చేశారు. మంత్రులపై సమన్వయం చేసే దానిపై చర్చ జరిగింది. కార్పొరేషన్ ఛైర్మన్ల నియామకంలో ఇంఛార్జి దీపాదాస్ మున్షి పాత్ర ఏమీ లేదు. సీఎం రేవంత్, మంత్రులు శ్రీధర్ బాబు, ఉత్తమ్ కుమార్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. -
స్పీకర్ గడ్డం ప్రసాద్కు కేటీఆర్ లేఖ.. విషయమేంటంటే?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపుల వేళ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్కు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బహిరంగ లేఖ రాశారు. ఈ లేఖలో రేవంత్ సర్కార్ శాసనసభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా కాలరాస్తోందని ఆరోపించారు.కాగా, కేటీఆర్ లేఖలో కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కేటీఆర్ లేఖ ప్రకారం.. రాష్ట్రంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేల హక్కులను కాలరాస్తూ ప్రోటోకాల్ ఉల్లంఘనలు జరుగుతున్నాయి. అహంకారపూరితంగా ప్రజాస్వామ్య స్ఫూర్తిని కాంగ్రెస్ ప్రభుత్వం దెబ్బతిస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాదని కాంగ్రెస్ నేతలకు సంక్షేమ పథకాల పంపిణీ బాధ్యతలు అప్పగిస్తున్నారు.శాసససభ్యుల హక్కులను ఉద్దేశపూర్వకంగా రేవంత్ సర్కార్ కాలరాస్తోంది. ఎమ్మెల్యేల హక్కులు, ప్రోటాకాల్ ఉల్లంఘనలు జరగకుండా అడ్డుకోవాలి. ఈ మేరకు సీఎస్, జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఇక, అవసరమైతే ఈ అంశాన్ని అసెంబ్లీ సమావేశాల్లో కూడా లేవనెత్తుతామని తెలిపారు.ఇదిలా ఉండగా.. రాష్ట్రంలో ప్రోటోకాల్ ఉల్లంఘనపై మాజీ మంత్రి హరీష్ రావు కూడా కాంగ్రెస్ ప్రభుత్వానికి చురకలు అంటించారు. తాజాగా హరీష్ రావు..‘మూడు సార్లు మంత్రి, ఐదు సార్లు ఎమ్మెల్యే అయిన మహిళా ప్రజాప్రతినిధికి ఇందిరమ్మ రాజ్యంలో గౌరవం లేదా? ప్రజలు గెలిపించిన నాయకులకు విలువ లేదా?. మహేశ్వరం ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డిని విస్మరించి, కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి, మూడో స్థానానికి పరిమితమైన కిచ్చెన్నగారి లక్ష్మారెడ్డికి అధికార యంత్రాంగం సలాం కొట్టడం ఏమిటి?.ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల్లో ప్రజాప్రతినిధులకు ప్రోటోకాల్ పాటించడం లేదని ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోవడం లేదు. కనీస చర్యలు తీసుకోవడం లేదు. ప్రభుత్వ తీరును తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రోటోకాల్ విషయంలో ప్రజాప్రతినిధులకు జరుగుతున్న అవమానం పట్ల స్పీకర్ గడ్డం ప్రసాద్ వెంటనే స్పందించాలి. తగిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘రేవంత్.. నిరుద్యోగులతో చర్చించే దమ్ము లేదా?’
సాక్షి, హైదరాబాద్: సీఎం రేవంత్కు పరిపాలన చేత కావడం లేదు. తెలంగాణలో నిరుద్యోగులతో చర్చించే దమ్ము లేదా? అని ప్రశ్నించారు బీజేపీ రాష్ట్ర ప్రధాని కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. అలాగే, రేవంత్కు జాబ్ క్యాలెండర్ దొరకలేదా అని కామెంట్స్ చేశారు.కాగా, కాసం వెంకటేశ్వర్లు తాజాగా మీడియాతో మాట్లాడుతూ.. అధికార దాహంతో చిక్కడపల్లి లైబ్రరీలో మోకాళ్ల మీద నిలబడి నిరుద్యోగుల ఓట్లు అడిగారు. రేవంత్కు జాబ్ క్యాలెండర్ దొరకలేదా?. నెల రోజులుగా నిరుద్యోగులను అరెస్ట్ చేస్తున్నారు. ఏటా 3 నుంచి 5 శాతం ఉద్యోగులు రిటైర్డ్ అవుతున్నారు. ఆ పోస్టులను భర్తీ చేయడం లేదు.1970 నుంచి అమలులో ఉన్న పోస్టులనే భర్తీ చేస్తున్నారు. అంతే తప్ప కొత్త పోస్టులు పెంచడం లేదు. రేవంత్.. నీకు నిర్యోగులతో చర్చించే దమ్ము లేదా?. ప్రతిపక్ష పార్టీలు, నిరుద్యోగులతో అఖిల పక్ష సమావేశం ఏర్పాటు చేయాలి. రేవంత్ ముందస్తు హౌస్ అరెస్టులు చేసి కేసీఆర్ కంటే డబుల్ తప్పులు చేస్తున్నారు. నీవు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఉద్యమం చేపించలేదా?. తమ గోడు వివరించేందుకు నిరుద్యోగులు సెక్రటేరియట్కు వెళ్తే వారిని అడ్డుకొని ముందస్తు అరెస్టులు చేయడమేంటి?గతంలో హౌస్ అరెస్టుల మీద మాట్లాడిన సెల్ఫ్ డిక్లరేషన్ మేధావులు కోదండరాం, ఆకునూరి మురళీ, హరగోపాల్ ఎందుకు మాట్లాడటం లేదు?. ప్రభుత్వ తాయిలలకు ఏమైనా లొంగిపోయారా?. యూనివర్సిటీలో చదువుకునే పరిస్థితి లేదు. అక్కడ కొత్త వారిని ఎవరిని రానివ్వడం లేదు. రేవంత్ ఎప్పుడైనా యూనివర్సిటీలో చదువుకుని ఉంటే ఆయనకు తెలిసేది. ఆయన ఎక్కడ చదివాడో ఏమీ చదివాడో ఎవరికి తెలియదు. సెక్రటేరియట్ చుట్టూ పోలీసులు ఉంటున్నారు. ఇదేమైనా పోలీస్ పాలనా?. కేసీఆర్ దొంగ అయితే రేవంత్ గజ దొంగ’ అంటూ ఘాటు విమర్శలు చేశారు. -
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరిక అందుకే: మంత్రి పొన్నం
సాక్షి,కరీంనగర్ జిల్లా: ప్రభుత్వ సుస్థిరత కోసమే కాంగ్రెస్లో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చేరుతున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. సోమవారం(జులై 15) కరీంనగర్ శాతవాహన యూనివర్సిటీలో జరిగిన వన మహోత్సవంలో మొక్కలు పొన్నం మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికపై మీడియాతో కీలక వ్యాఖ్యలు చేశారు. ‘దేశంలో బీజేపీ ఎన్ని ప్రభుత్వాలు కూల్చింది..? బండి సంజయ్ మాటలు దెయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టున్నాయి. బీజేపీ కూల్చిన ప్రభుత్వాల్లో ఎంత మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేశారు..? ప్రభుత్వాన్ని కూల్చుతామంటే.. చూస్తూ ఊరుకోవాలా..? మేం ధర్మం తప్పలేదు. కులగణనపై రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటాం. డిసెంబర్ 3 వరకు మాకు ఎమ్మెల్యేలను చేర్చుకోవాలన్న ఆలోచనే లేదు. తర్వాత పరిస్థితుల్లోనే చేర్చుకుంటున్నాం’అని పొన్నం తెలిపారు. -
నేడు కాంగ్రెస్లోకి మరో బీఆర్ఎస్ ఎమ్మెల్యే !
సాక్షి,సంగారెడ్డి: సంగారెడ్డి జిల్లాలో బీఆర్ఎస్ పార్టీకి గట్టి షాక్ తగలనుంది. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరికకు రంగం సిద్దమైంది. సోమవారం(జులై 15) సాయంత్రం సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పుకోనున్నట్లు తెలుస్తోంది. గూడెం కాంగ్రెస్లోకి వస్తుండటంతో స్థానిక కాంగ్రెస్ నేతలు కాట శ్రీనివాస్గౌడ్,నీలం మధును కాంగ్రెస్ అదిష్టానం బుజ్జగిస్తోంది. మహిపాల్రెడ్డి వెంట సంగారెడ్డి జిల్లా జెడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్ , అమీన్పూర్ మున్సిపల్ చైర్మన్ తుమ్మల పాండురంగా రెడ్డి, వైస్ చైర్మన్, ఎంపీపీ తదితరులు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నారు. ఇప్పటికే తొమ్మిది మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరిన విషయం తెలిసిందే. -
కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు తెచ్చుకుంది.. మీరు కాదా?: కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: నిరుద్యోగ యువతను, విద్యార్థులను కించపరిచేలా వ్యాఖ్యలు చేసిన ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు డిమాండ్ చేశారు. ముఖ్యమంత్రి తన స్థాయిని మరిచి అత్యంత దివాలాకోరుతనంతో నిరుద్యోగుల కోసం పోరాటం చేస్తున్న మోతీలాల్ను అవమానించేలా మాట్లాడారని ధ్వజమెత్తారు. ఆదివారం నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మీడియాతో మాట్లాడారు. అశోక్నగర్ కోచింగ్ సెంటర్లకు వెళ్లి ఉద్యోగాలు సంపాదించుకున్న రేవంత్రెడ్డి అదే కోచింగ్ సెంటర్లను, నిర్వాహకులను అవమానించేలా మాట్లాడుతున్నారని కేటీఆర్ విమర్శించారు. మమ్మల్ని దించి మిమ్మల్ని గద్దెనెక్కించిన యువత ఈరోజు ప్రశ్నిస్తున్నదని అన్నారు. 8 నెలల్లో ఇప్పటిదాకా ఒక్క నోటిఫికేషన్ ఇవ్వని పాలకులు, మిగిలిన నాలుగు నెలల్లో ఏవిధంగా రెండు లక్షల ఉద్యోగాలకు నోటిఫికేషన్లు ఇస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఇది రాజకీయ పార్టీల సమస్య కాదని, లక్షలాదిమంది యువతకు సంబంధించిన అంశం అని అన్నారు. ఈ అంశంలో రేవంత్రెడ్డి ఇగోకి, భేషజాలకు పోకుండా నిర్ణయం తీసుకోవాలని, కండకావరంతో మాట్లాడడం ఆపాలని హితవు పలికారు. గతంలో నిరుద్యోగుల్ని రెచ్చగొట్టింది మీరు కాదా?రాజకీయ నిరుద్యోగులుగా యువతను రెచ్చగొట్టిన రాజకీయ శక్తులు ముమ్మాటికీ రేవంత్రెడ్డి, రాహుల్గాంధీలేనని కేటీఆర్ ఆరోపించారు. గతంలో ఏ పరీక్ష రాశారని రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి నిరుద్యోగులతో కలిసి దీక్ష చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అశోశ్నగర్ లోని విద్యార్థులను రేవంత్రెడ్డి సన్నాసులు అంటున్నారని, అసలు సన్నాసులు రేవంత్రెడ్డా, రాహుల్గాంధీయా అనే విషయం చెప్పాలన్నారు. 2023 అక్టోబర్, నవంబర్లో అప్పటి ప్రభుత్వానికి వ్యతిరేకంగా విద్యార్థులను నిరుద్యోగులను రెచ్చగొట్టారని, అనేక అవాకులు చవాకులు పేలారని ధ్వజమెత్తారు. రాజకీయ నిరుద్యోగం నుంచి బయట పడటానికి రాహుల్గాంధీ, రేవంత్రెడ్డి యువతను వాడుకున్నారని విమర్శించారు. తాము అధికారంలోకి రాగానే వందల నోటిఫికేషన్లు, రెండు లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు ఒక్క సంవత్సరంలో ఇస్తామని నమ్మబలికారని అన్నారు. ఇప్పుడు ఒకాయన ముఖ్యమంత్రి అయ్యారని, ఇంకొకరు జాతీయస్థాయిలో నాయకుడు అయ్యారు తప్ప తెలంగాణ నిరుద్యోగులకు దక్కింది శూన్యం అని విమర్శించారు. నిరుద్యోగులతో కలిసి కొట్లాడతాం..ప్రస్తుతం అశోక్నగర్లో, యూనివర్సిటీలో పిల్లలను ఈడ్చుకుపోతుండడం వాస్తవం కాదా చెప్పాలని కేటీఆర్ నిలదీశారు. మిమ్మల్ని వదిలిపెట్టకుండా నిలదీస్తామని, విద్యార్థులు, నిరుద్యోగులతో కలిసి కొట్లాడుతామని అన్నారు. రేవంత్రెడ్డి ఇంకా ప్రతిపక్షంలో ఉన్నట్లుగానే మాట్లాడుతున్నారని, ఆయన ముఖ్యమంత్రిని అని గుర్తుంచుకొంటే మంచిదని ఎద్దేవా చేశారు. ముఖ్యమంత్రికి సత్తా, చిత్తశుద్ధి ఉంటే ఉద్యోగాలు, నోటిఫికేషన్లు, జాబ్ క్యాలెండర్పై శ్వేత పత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగుల డిమాండ్లపై స్పందించి, వెంటనే సానుకూల నిర్ణయం తీసుకోవాలన్నారు. -
35 మందిని ఒకేసారి విలీనం చేసుకోండి
గజ్వేల్రూరల్/ప్రశాంత్నగర్: ‘బావ, బామ్మర్ది, మామ (హరీశ్, కేటీఆర్, కేసీఆర్).. ముగ్గురిని వదిలేసి, 35 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాంగ్రెస్ ఒకేసారి విలీనం చేసుకోవాలి’అని మెదక్ ఎంపీ రఘునందన్రావు వ్యంగ్యంగా అన్నా రు. సిద్దిపేట జిల్లా గజ్వేల్లో మహంకాళీ బోనాల ఉత్సవాలకు హాజరైన ఆయన అమ్మవారిని దర్శించుకొని పూజలు చేశారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ, రాజ్యాంగంపై ప్రమాణం చేసిన సీఎం రేవంత్రెడ్డి.. సంతలో పశువులను కొన్నట్లు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొంటున్నారని ధ్వజమెత్తారు.కాంగ్రెస్ అగ్రనేత రాహుల్గాంధీ పార్లమెంట్లో రాజ్యాంగ విలువల గురించి మట్లాడుతూ, ఇక్కడ రేవంత్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనడాన్ని ఎందుకు చెక్ పెట్టలేకపోతున్నారని ప్రశ్నించారు. ఒక సీఎం వేరే పార్టీకి చెందిన ఎమ్మెల్యేకు కండువా కప్పిన మరుక్షణం ఆ ఎమ్మెల్యేను డిస్క్వాలిఫై చేయాలని కర్ణాటకలో హైకోర్టు తీర్పునిచ్చిందని గుర్తు చేశారు. ఈ విషయంలో తెలంగాణ న్యాయ మూర్తులు, సుప్రీంకోర్టు జడ్జీలు ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు. పాలనపై దృష్టిపెట్టాలి..:బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల పార్టీ ఫిరాయింపులపై కాకుండా పరిపాలనపై సీఎం దృష్టి సారించాలని ఎంపీ రఘునందన్రావు హితవు పలికారు. ఆదివారం ఆయన సిద్దిపేట జిల్లా బీజేపీ కార్యాలయంలో మాట్లాడుతూ.. ప్రభుత్వంలో నంబర్ టూగా చెలామణి అవుతున్న మంత్రి, బీఆర్ఎస్ బెదిరింపులు ఆపేదాక ఎమ్మెల్యేల ఫిరాయింపులు ఉంటాయనడం సరికాదన్నారు. -
హరీశ్రావు మంచి నేత
కరీంనగర్ టౌన్: ‘రాష్ట్ర మాజీ మంత్రి తన్నీరు హరీశ్రావు మంచి రాజకీయ నాయకుడు. కేసీఆర్, కేటీఆర్లపై వ్యతిరేకత ఉంది కానీ, హరీశ్ ఉద్యమ నాయకుడు.. జనంలో మంచి పేరు ఉంది. బీజేపీ లో చేరాలని చాలామంది బీఆర్ఎస్ నేతలకు ఉంది. కానీ మేం ఎవరినీ రమ్మని అడగట్లేదు. ఎవరొ చ్చినా పదవులకు రాజీనామా చేసి రావాల్సిందే. ఒకవేళ హరీశ్రావు వ చ్చినా ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాల్సిందే. ఇది మా విధానం. హరీశ్రావుకు ప్రజాభిమానం ఉంది. సులభంగా గెలుస్తారు..’ అని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్కుమార్ వ్యాఖ్యానించారు. ఆదివారం కరీంనగర్లో మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో సన్మా నం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. బీజేపీలో బీఆర్ఎస్ విలీనం, హరీశ్ బీజేపీలో చేర తారంటూ జరుగుతున్న ప్రచారంపై విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానమిచ్చారు. ఆ ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించే దమ్ముందా? ‘బీజేపీలో బీఆర్ఎస్ను విలీనం చేయబోతున్నారంటూ జరుగుతు న్న ప్రచారమంతా కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఆ డుతున్న కుట్రలో భాగం. బీఆర్ఎస్ను కాపాడుకోవడానికి కేసీఆర్, దొంగ హామీల నుండి ప్రజల దృష్టి మళ్లించడానికి కాంగ్రెస్ నేతలు ఆడుతున్న డ్రా మా. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కాపాడుకోలేక కేసీ ఆర్ ఆ పార్టీ లీడర్లను ఢిల్లీకి పంపి లీకులిస్తున్నారు.అభివృద్ధిని చూసి కాంగ్రెస్లో చేరుతున్నారని మా ట్లాడుతున్న అధికార పార్టీ నేతలారా.. నిజంగా మీ రు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నట్లు భావిస్తే మీ పార్టీ లో చేరిన ఎమ్మెల్యేలందరితో రాజీనామా చేయించి ఉప ఎన్నికల్లో ప్రజా తీర్పు కోరే దమ్ముందా? ప్రజలి చ్చిన తీర్పును అపహాస్యం చేస్తూ కొందరు ఎమ్మె ల్యేలు తమ అక్రమాస్తులను కాపాడుకోవడానికే అధికార పార్టీలో చేరుతున్నారు. పైకి మాత్రం సిగ్గు లేకుండా నియోజకవర్గ అభివృద్ధి కోసమే కాంగ్రెస్ లో చేరుతున్నామని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు చెప్పడం సిగ్గుచేటు. ప్రజలు పిచ్చోళ్లు కాదు. ఏ పార్టీ ని చూసి ప్రజలు మీకు ఓటేశారు. మీరు ఏ పార్టీలో కి వెళుతున్నారు?..’ అంటూ సంజయ్ మండిపడ్డారు. మాపై దాడులు ఎవరూ మర్చిపోలేదు ‘కేసీఆర్ హయాంలో నాతో పాటు బీజేపీ కార్యకర్తలపై జరిగిన దాడులు, పెట్టిన అక్రమ కేసులు, హింస, జైళ్లలో వేయడాన్ని ఎవరూ మర్చిపోలేదు. మేం ఆ పార్టీతో పొత్తు ఎందుకు పెట్టుకుంటాం? అధికార పార్టీ ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా జనం నమ్మలేదు. పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీని 8 ఎంపీ స్థానాల్లో గెలిపించారు. ఇప్పుడు మాకున్న ఏకైక లక్ష్యం తెలంగాణను అభివృద్ధి చేయడమే. కాంగ్రెస్ పార్టీ మోసాలను, దొంగ హామీలను ప్రజలు గుర్తించారు. అందుకే కాంగ్రెస్ను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. అశోక్నగర్లో నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనే ఇందుకు నిదర్శనం. యువతను రెచ్చగొడితే కాంగ్రెస్కే నష్టమని గుర్తుంచుకుని వ్యవహరించాలి..’ అని సంజయ్ అన్నారు. అదేమన్నా బ్యాంకు లోనా?! ‘ఫీజు రీయింబర్స్మెంట్పై వన్ టైం సెటిల్మెంట్ ఏంటి? ఇదేమైనా బ్యాంకు అనుకుంటున్నారా? లోన్లు తీసుకుని వడ్డీలు కట్టలేకపోతే వన్ టైం సెటిల్మెంట్ చేసుకోవడానికి? ఏళ్ల తరబడి ఫీజు కట్టకపోవడంతో కాలేజీల యాజమాన్యాలు అనేక ఇబ్బందుల్లో ఉన్నాయి. విద్యార్థులు కష్టాలు పడుతున్నారు. ఇప్పటికైనా పూర్తిస్థాయిలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించాలి..’ అని కేంద్రమంత్రి డిమాండ్ చేశారు. -
హరీష్ రావు బీజేపీలోకి రావచ్చు.. కానీ కండీషన్ ఇదే: బండి సంజయ్
సాక్షి, కరీంనగర్: తెలంగాణలో పార్టీ ఫిరాయింపులు జరుగుతున్న వేళ కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ప్రజల మనిషి. ఆయన బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలి అని కామెంట్స్ చేశారు. దీంతో, ఆయన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి.కాగా, బండి సంజయ్ ఆదివారం మీడియాతో మాట్లాడుతూ..‘బీఆర్ఎస్ పార్టీలో హరీష్ రావు ఒక్కడే వివాదరహితుడు. ఆయన ప్రజల మనిషి. ఒకవేళ హరీష్ రావు బీజేపీలో చేరాలనుకుంటే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి మా పార్టీ చేరాలి. బీజేపీలో ఎవరు చేరినా రాజీనామా చేసి రావాల్సిందే. తర్వాత జరిగే ఎన్నికల్లో వారిని గెలిపించుకుంటామన్నారు.ఇదే సమయంలో బీజేపీలో బీఆర్ఎల్పీ విలీనం అనేది కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా మాత్రమే. కాంగ్రెస్కు బీజేపీ మాత్రమే ప్రత్యామ్నాయం. తెలంగాణలో బీజేపీ కచ్చితంగా విజయం సాధిస్తుంది’ అని కామెంట్స్ చేశారు. ఇదిలా ఉండగా.. ఇటీవలి కాలంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఒక్కొక్కరుగా కాంగ్రెస్లో చేరుతున్న విషయం తెలిసిందే. -
కాంగ్రెస్లోకి ఎమ్మెల్యేల చేరికలు.. సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో మా ప్రభుత్వాన్ని పడగొడతామని కామెంట్స్ చేసిన వాళ్లు అడ్రస్ లేకుండా పోయారని సెటైరికల్ కామెంట్స్ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. ఇదే సమయంలో రాష్ట్రంలో కాంగ్రెస్లో ఎమ్మెల్యేల చేరికపై రేవంత్ తొలిసారిగా స్పందించారు.కాగా, సీఎం రేవంత్ ఆదివారం ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. బీజేపీ, బీఆర్ఎస్ నేతలు మా ప్రభుత్వాన్ని పడగొడతామన్నారు. మూడు నెలలు కూడా ఈ ప్రభుత్వం ఉండదన్నారు. మా పని అయిపోయిందన్న వాళ్లు ఇప్పుడు కనిపించకుండా పోయారు. వారంతా ఎక్కడున్నారు. వాళ్ల పార్టీలో ఎవరు ఉన్నారు.. ఎవరు లేరో అని లెక్కలు చూసుకుంటున్నారు అని ఎద్దేవా చేశారు.ఇదే సమయంలో మా పార్టీలో చేరిన ఎమ్మెల్యేలకు ఇచ్చేందుకు నా దగ్గర ఏమీ లేదు. ఒక్క అంగీ, లాగు తప్ప. మా ప్రభుత్వ ఆలోచనా విధానం, అభివృద్ధి చూసే వారంతా కాంగ్రెస్లో చేరుతున్నారు. బీఆర్ఎస్ నేతలు ప్రభుత్వాన్ని పడగొడతామని చెబుతుంటే.. మరోవైపు ప్రభుత్వాన్ని మేం నిలబెడతామని ఎమ్మెల్యేలు పార్టీలో చేరుతున్నారని అన్నారు.ఇక, రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీలనే ఓఆర్ఆర్, ఐటీ, ఫార్మా, అంతర్జాతీయ విమనాశ్రయాలను తీసుకువచ్చిందన్నారు. కానీ, బీఆర్ఎస్ మాత్రం రాష్ట్రంలోని గంజాయిని తెచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోవైపు.. తెలంగాణలో పదేళ్లు అధికారంలో ఉండి ఏమీ చేయలేని వాళ్లు.. ఆరు నెలల్లో మేము ఏదీ చేయలేదని మాట్లాడుతున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం చేసిన అప్పులకు ప్రతీ నెలా రూ.ఏడు వేల కోట్లు వడ్డీ చెల్లిస్తున్నాం’ అంటూ కామెంట్స్ చేశారు. -
హస్తం గూటికి గులాబీ ఎమ్మెల్యేలు
గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ కి కొత్త కష్టమొచి్చంది. వలసల పర్వం ఆ పార్టీలో అసంతృప్తిని రాజేస్తోంది. మొన్నటి వరకు ప్రత్యర్థులుగా ఉన్న నేతలను అక్కున చేర్చుకుంటున్న తీరును ద్వితీయ శ్రేణి నాయకత్వం తప్పుపడుతోంది. పార్టీ బలోపేతం పేరిట గులాబీ నాయకులకు స్వాగతం పలుకుతుండడం సీనియర్లకు మింగుడు పడడంలేదు. ఒకవైపు పార్టీ బలీయంగా తయారవుతుందనే సంతోషపడుతున్నా.. మరోవైపు తమ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతోందనే ఆందోళన వారిని వెంటాడుతోంది. ఇటీవల బీఆర్ఎస్కు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. మరికొందరు కండువా కప్పుకునేందుకు ముహూర్తం కూడా ఖరారు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో వీరి రాక తమ ఉనికికి భంగం కలిగిస్తుందనే ఆవేదన వ్యక్తమవుతోంది. ఈ క్రమంలోనే పార్టీ అసమ్మతులకు తెరలేపింది. ఇటీవల చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య పారీ్టలో చేరడంతో మొన్నటి ఎన్నికల్లో పోటీ చేసిన భీంభరత్ వర్గం అసంతృప్తికి గురైంది. పారీ్టలో చేర్చుకోవద్దని చివరి నిమిషం వరకు న్రయతి్నంచినా ఫలించకపోవడంతో సర్దుబాటుకు సరే అంది. అయితే.. మనుషులు కలిసినా మనసులను కలపలేమనే సంకేతాలు ఇరువర్గాలు ఇస్తున్నాయి. రాజేంద్రనగర్లోనూ.. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. అందరికంటే ముందే రేవంత్ భేటీ అయి కండువా కప్పుకున్న ప్రకాశ్.. మొన్నటివరకు ఆగినా చివరకు కారు దిగి చేయి పట్టుకున్నారు. దీంతో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరుఫున పోటీచేసిన నరేందర్, సీనియర్ నేతలు జ్ఞానేశ్వర్, ముంగి జైపాల్రెడ్డి వర్గీయులు అసంతృప్తికి లోనయ్యారు. ఈ పరిణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో వేరు కుంపట్లతో కాంగ్రెస్ ఎలా ముందుకు సాగుతుందో వేచిచూడాల్సిందే మరి! శేరిలింగంపల్లిలో మూడు గ్రూపులు శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ శనివారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో ఆ సెగ్మెంట్లో కాంగ్రెస్ మూడు గ్రూపులుగా విడిపోయింది. శాసనసభ ఎన్నికల వేళ టికెట్ ఆశించిన జైపాల్ సహా.. ఆఖరి నిమిషంలో బీఆర్ఎస్ను వీడి టికెట్ దక్కించుకున్న జగదీశ్వర్గౌడ్ ఇప్పటికే రెండు వర్గాలు వ్యవహరిస్తున్నారు. తాజాగా గాంధీ రాకతో కాంగ్రెస్లో మూడో వర్గానికి తెరలేపింది. ఖైరతాబాద్తో మొదలు.. పరువు పోయిన చోటే వెతుక్కోవాలన్న ఉబలాటంతో ఆపరేషన్ ఆకర్‡్షకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. లోక్సభ ఎన్నికల ముందే నగరంలో గులాబీ తొలి వికెట్గా ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ను పార్టీలో చేర్చుకొని సికింద్రాబాద్ లోక్సభ స్థానానికి ప్రయోగించింది. ఇటీవల దానం బాటలోనే జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, పలువురు కార్పొరేటర్లు పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దానం చేరికతో ఆయనపై పోటీ చేసిన ఓటమి పాలైన విజయారెడ్డి తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. డైలామాలో నేతలు ఇప్పటికే నలుగురు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, పలువురు కార్పొరేటర్లను చేర్చుకోవడం ద్వారా గ్రేటర్లో పార్టీని పటిష్టం చేసే దిశగా అడుగులు వేస్తున్న పీసీసీ నాయకత్వం ఆపరేషన్ ఆకర్‡్షకు మరింత పదును పెట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా మరింత మంది ఎమ్మెల్యేలకు గాలం విసిరింది. ఇప్పటికే వీరితో సంప్రదింపులు కూడా జరిపింది. అయితే.. వీరి రాకపై సంకేతాలు రావడంతో మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన నేతలకు తీవ్ర ఆగ్రహం తెప్పిస్తోంది. తాము ఓడినా.. అధికారంలోకి వచ్చామనే సంతోషంలో ఇన్నాళ్లూ ఉన్న తమను తాజా పరిణామాలు ఆవేదన కలిగిస్తున్నాయని వ్యాఖ్యానిస్తున్నారు. కొత్తగా చేరిన నాయకుల కింద తమ శ్రేణులు పనిచేయాల్సిన పరిస్థితి అనివార్యం కావడం.. దిగువ శ్రేణి నాయకుల పదవులను కొత్త నేతల అనుచరులు తన్నుకుపోయే ప్రమాదం ఉండడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది.పటాన్చెరులోనూ.. పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి కాంగ్రెస్లో చేరుతారనే వార్తలపై ఆ నియోజకవర్గ పార్టీలోనూ అసంతృప్తికి తెరలేపింది. శనివారం సాయంత్రం మహిపాల్ రెడ్డి సీఎం రేవంత్ను కలుస్తారనే సమాచారం ఒక్కసారిగా చర్చనీయాంశమైంది. ఆయన ఆదివారం చేరుతారని ప్రచారం జరుగుతోంది. కాగా.. ఇప్పటికే శ్రీనివాస్ గౌడ్, నీలం మధు ముదిరాజ్ గ్రూపులుగా విడిపోయిన ఆ పారీ్టలో తాజా ఈ పరిణామాలు పార్టీ శ్రేణులను కలవరపరుస్తున్నాయి. -
స్థానిక సమరానికి సై
సాక్షి, హైదరాబాద్: బీజేపీ ‘లోకల్ బాడీ’ఎలక్షన్స్ టార్గెట్గా పెట్టుకుంది, గ్రామస్థాయిలో సంస్థాగతంగా బలపడేందుకు కమలదళం సన్నద్ధమవుతోంది. త్వరలో జరగబోయే స్థానిక సంస్థల ఎన్ని కల నాటికి గ్రామస్థాయిలో నాయకులు, కార్యకర్తల వ్యవస్థ పటిష్టానికి అడుగులు వేస్తోంది. అసెంబ్లీ ఫలితాలు నిరాశ పరిచినా, లోక్సభ ఫలితాలు బీజేపీకి కొంతమేర ఊపునిచ్చాయి. గ్రామస్థాయిలో బీజేపీ అంత పటిష్టంగా లేదు. ఈసారి జరగబోయే స్థానిక సంస్థలు, మున్సిపల్ ఎన్నికల్లో ప్రజాప్రతినిధుల సంఖ్యను పెంచుకోవడంపై బీజేపీ దృష్టి సారించింది. శుక్రవారం జరిగిన రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలోనూ 2028లో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కచ్చితంగా గెలిచి తీరాలని.. అంతకుముందు స్థానిక సంస్థల ఎన్నికల్లో సత్తా చాటాలని పార్టీ తీర్మానించింది, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీకి 14% ఓటింగ్ రాగా, లోక్సభ ఎన్నికల నాటికి 35 శాతానికి ఓటింగ్ పెరిగింది. త్వరలో జరగబోయే లోకల్బాడీ ఎన్నికల్లో ఈ ఓటింగ్ను నిలుపుకునేలా కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని నిర్ణయించింది. రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో మాట్లాడిన కేంద్రమంత్రులు, ముఖ్యనేతలు, ఎంపీలు స్థానిక ఎన్నికల్లో అన్నిస్థాయిల్లోని పార్టీ కేడర్కు ప్రాధాన్యం ఇస్తామని చెప్పారు. ఇంతకాలం ఎంపీలు, ఎమ్మెల్యేల విజయానికి కృషి చేసిన కార్యకర్తలను గెలిపించుకునేందుకు శాయశక్తులా కృషి చేస్తామని ప్రకటించారు. స్థానికం.. సన్నద్ధం: పార్టీపరంగా స్థానిక సంస్థల ఎన్నికలకు అవసరమైన కార్యాచరణ, వ్యూహాలు సిద్ధం చేయాలని బీజేపీ రాష్ట్ర నాయకత్వం నిర్ణయించింది. వివిధ స్థాయిల్లో కమిటీలు ఏర్పాటు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ప్రత్యేకంగా 32 జిల్లాస్థాయి, మండలాల నుంచి, గ్రామ పంచాయతీల దాకా స్థానిక కమిటీలు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. జిల్లా నుంచి గ్రామస్థాయి వరకు సామాజిక సమతూకం పాటిస్తూ.. ఓ ఓసీ, ఓ ఎస్సీ, ఓ బీసీ, ఓ మహిళ ఉండేలా కమిటీల కూర్పు ఉండనుంది. ఈ కమిటీలన్ని జిల్లా కేంద్రం నుంచి గ్రామ పంచాయతీ వరకు పర్యటించి వార్డుసభ్యులు మొదలు సర్పంచ్లు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీ స్థానాలకు పోటీ చేసేందుకు అభ్యర్థులను గుర్తిస్తారు. పోటీచేసే అభ్యర్థుల ఎంపిక బాధ్యతలు కూడా ఈ కమిటీలకే అప్పగించనున్నట్టు పార్టీ వర్గాల సమాచారం. -
కాంగ్రెస్ తీరు దారుణం.. గోదారిని చూస్తే బాధేస్తోంది: హరీష్ రావు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం పాలన తీరుపై మాజీ మంత్రి హరీష్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరెంట్ కోతలు మళ్లీ మొదలయ్యాయి. కాంగ్రెస్ ప్రభుత్వం మళ్లీ పాత రోజులను గుర్తుకు తెస్తోంది అంటూ కామెంట్స్ చేశారు.కాగా, హరీష్ రావు శనివారం రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘ఏ ఉద్యమ స్ఫూర్తితో రాష్ట్రాన్ని సాధించామో అదే స్ఫూర్తితో తెలంగాణలో పని చేశాం. కష్టల్లో నుంచి పాటలు వచ్చాయి. రైతుల వ్యతల్లో నుంచి పాటలు వచ్చాయి. నీళ్ల కోసం కూడా పాటలు వచ్చాయి. సదాశివుడు రాసిన పాట కూడా అంతే స్థాయిలో గుర్తింపు పొందింది. తలాపున పారుతుంది గోదారి.. చేను చెలక ఏడారి పాట తెలంగాణ నీళ్ల గోసను చూపెట్టింది.తెలంగాణ వచ్చాక ఎర్రటి ఎండలో కూడా మత్తల్లు దూకిన చెరువులు కనిపించాయి. అనతి కాలంలోనే కాళేశ్వరం ప్రాజెక్ట్ నిర్మించాం. కొంచెం బాధ కలిగే అంశం ఏంటంటే ఇప్పుడు గోదావరి ఎండిపోయింది. పది పదిహేను రోజుల నుంచి గోదావరి నీళ్ళు వస్తున్నా ప్రభుత్వం మోటార్లు ఆన్ చేయటం లేదు. కనీసం ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదు. మళ్ళీ పాత రోజులు తీసుకొచ్చింది కాంగ్రెస్. ప్రభుత్వంపై నిందలు వేయటం కాదు, రైతుల కన్నీళ్ళు తుడవాలని ప్రభుత్వాన్ని కోరుతున్నా.మళ్లీ రాష్ట్రంలో కవులకు, కళాకారుల పెన్నులకు పదును పెట్టాల్సిన అవసరం వచ్చిందేమో. రోజు పేపర్లు చూడగానే రైతులు ఆత్మహత్యలు కనబడుతున్నాయి. కరెంట్ కోతలు మొదలయ్యాయి. అనేక సమస్యలు జనాన్ని వెంటాడుతున్నాయి. కళాకారులకు మూడు నెలల నుంచి జీతాలు రావటం లేదని నాకు చెప్తున్నారు. ప్రతిపక్షంగా ప్రజల తరఫున మేము పోరాడుతాం. సామాజిక బాధ్యతగా కళాకారులు పోరాడాలి. మళ్లీ మీ పెన్నులకు పదును పెట్టాలి’ అని చెప్పుకొచ్చారు. -
బీఆర్ఎస్కు మరో షాక్..
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో బీఆర్ఎస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ ఆకర్ష్ కార్యక్రమంలో భాగంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఒక్కొక్కరుగా హస్తం గూటికి చేరుతున్నారు. తాజాగా మరో ఎమ్మెల్యే కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు రెడీ అయ్యారు.కాగా, పటాన్చెరు బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారు. కాసేపట్లో సీఎం రేవంత్ సమక్షంలో మహిపాల్ రెడ్డి హస్తం గూటిలో చేరబోతున్నారు. ఇదిలా ఉండగా.. ఇప్పటికే బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యేలు తొమ్మిది మంది కాంగ్రెస్లో చేరారు. మహిపాల్ చేరికతో ఆ సంఖ్య పదికి చేరుకుంది. ఇదిలా ఉండగా.. ఈరోజు మధ్యాహ్నమే మహిపాల్ రెడ్డి కుమారుడు విక్రమ్ రెడ్డి కాంగ్రెస్ నాయకుల ఫొటోలను తన వాట్సాప్ స్టేటస్లో పెట్టాడు. రాహుల్ గాంధీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి, మంత్రి దామోదర రాజనర్సింహ, జగ్గారెడ్డి ఫొటోలను ఫోన్ స్టేటస్లో పెట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతున్నారనే సంకేతాలిచ్చాడు. మరోవైపు.. మహిపాల్ రెడ్డి కాంగ్రెస్లో చేరుతుండటంతో బీఆర్ఎస్ కేడార్ టెన్షన్ పడుతున్నారు. ఇక, పార్టీలో విలీనం అయ్యే వరకు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకుంటామని సీఎం రేవంత్ సంకేతాలు ఇచ్చారు. గ్రేటర్లో బీఆర్ఎస్ను ఖాళీ చేసే దిశగా కాంగ్రెస్ వ్యూహ రచన చేసింది. దీంతో, వారంతా కాంగ్రెస్ వైపు చూస్తున్నారు. ఇక రూరల్ నుంచి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరేందుకు సిద్ధపడుతున్న సమాచారం. మరో రెండు రోజుల్లో మరో నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరుతారనే చర్చ నడుస్తోంది. ఇదిలా ఉండగా.. కొందరు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బీజేపీలోకి వెళ్లేందుకు కూడా ప్రయత్నం చేస్తున్నట్టు తెలుస్తోంది. ఇక.. రాజీనామా చేస్తేనే బీజేపీలో చేరాలంటున్న కాషాయ పార్టీ నేతలు. దీంతో, మిగిలిన నేతలు హస్తంవైపు అడుగులు వేస్తున్నారు. -
బీఆర్ఎస్కు మరో షాక్.. కాంగ్రెస్లోకి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ
సాక్షి, హైదరాబాద్: బీఆర్ఎస్ పార్టీకి షాకుల మీద షాకులు తగులుతున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కాంగ్రెస్లోకి చేరారు. జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ గూటికి చేరారు. ఆయనతో పాటు ముగ్గురు జీహెచ్ఎంసీ కార్పోరేటర్లు కాంగ్రెస్లోకి చేరారు.బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. గులాబీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్లో చేరుతున్నారు. గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటమితో ఈ సంఖ్య 38కి చేరింది.ఇక గత ఆరు నెలల్లో బీఆర్ఎస్ నుంచి తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. నిన్న(శుక్రవారం) రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. తాజాగా.. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ కూడా కాంగ్రెస్లోకి చేరారు. అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చేరిక ఖరారు కాగా... హైదరాబాద్ నగరానికి చెందిన మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. -
సీఎం రేవంత్కు వార్నింగ్.. కేటీఆర్ షాకింగ్ ట్వీట్
సాక్షి, హైదరాబాద్: కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది!.. కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కాడు రేవంత్ రెడ్డి’’ అంటూ మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్వీట్ చేశారు.ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుంచి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టిందంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై కేటీఆర్ విరుచుకుపడ్డారు. ఏవో సాంకేతిక కారణాలు చూపిస్తూ వేలాది మంది ఆసరా పెన్షన్ లబ్దిదారుల నుండి డబ్బును ప్రభుత్వానికి వెనక్కు పంపమని నోటీసులు ఇస్తోంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దాసరి మల్లమ్మ అనే 80 ఏళ్ల ముసలమ్మకు ఆసరా పెన్షన్ కింద వచ్చిన ఒక లక్షా 72 వేల రూపాయలు వెనక్కు కట్టాలని నోటీసు ఇచ్చారు.’’ అంటూ కేటీఆర్ మండిపడ్డారు.ఒంటరి మహిళగా పక్షవాతంతో బాధపడుతూ ఉన్న దాసరి మల్లమ్మ వంటి వృద్ధుల నుండి కేసీఆర్ సర్కారు ఇచ్చిన ఆసరా పెన్షన్ సొమ్మును తిరిగి లాక్కోవడానికి ప్రయత్నించడం రేవంత్ సర్కార్ అమానవీయ వైఖరికి నిదర్శనం. వెంటనే పేదల మీద ఇటువంటి దుర్మార్గపు చర్యలు మానుకోవాలి!. లేకుంటే ప్రజలే కాంగ్రెస్ సర్కార్ మీద తిరగబడతారు!’’ అని కేటీఆర్ ఎక్స్(ట్విటర్) వేదికగా హెచ్చరించారు.కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలిక ఊడినట్టుంది!కొత్తగా అనేక పథకాలు ఇస్తామని, ఉన్న సంక్షేమ పథకాలకు వచ్చే డబ్బును పెంచుతామని దొంగ హామీలు ఇచ్చి గద్దెనెక్కిన రేవంత్ సర్కార్ ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న లబ్దిదారుల నుండి సొమ్ముని వెనక్కు రాబట్టే వింత చేష్టలు మొదలుపెట్టింది.ఏవో సాంకేతిక… pic.twitter.com/tQadMKcvuz— KTR (@KTRBRS) July 13, 2024 -
లోకల్ టు స్టేట్..!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం కావడంతో మొదలు పెట్టి.. వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు సిద్ధమయ్యేలా స్వల్ప, దీర్ఘకాలిక కార్యాచరణ ప్రణాళికలు (నెల నుంచి 1500 రోజులకు) సిద్ధం చేసుకోవాలని బీజేపీ నిర్ణయించింది. తెలంగాణలో ప్రజల నుంచి ఆదరణ పెరుగుతున్నందున ఈ సానుకూల వాతావరణాన్ని ఉపయోగించుకుని సంస్థాగతంగా బలపడాలని తీర్మానించింది.అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన 14% ఓటింగ్ నుంచి లోక్సభ ఎన్నికల్లో 35 శాతానికి పెంచుకున్నందున, 2028 శాసనసభ ఎన్నికల్లో పార్టీ అధికారానికి వచ్చేందుకు అనుకూల పరిస్థితులున్నాయని అంచనా వేసింది. ఏడునెలల కాంగ్రెస్ పాలనలో ప్రధాన హామీలేవీ అమలుకు నోచుకోకపోవడంతో.. రైతులు, మహిళలు, యువత, ఓబీసీలు, ఇలా అన్ని వర్గాల్లో కాంగ్రెస్పై వ్యతిరేకత పెరుగుతోందని అంచనా వేసింది. లోక్సభ ఎన్నికల్లో ఒక్కసీటు కూడా గెలవకపోవడం ద్వారా బీఆర్ఎస్ బలహీనపడినట్టుగా బీజేపీ భావిస్తోంది. ఈ పరిస్థితులను ఉపయోగించు కుని తెలంగాణలో నిర్ణయాత్మక శక్తిగా ఎదగాలని తీర్మానించింది. త్వరలో చింతన్బైఠక్లు అధికార కాంగ్రెస్కు బీజేపీ రాజకీయంగా ప్రత్యామ్నాయంగా ఎదిగేందుకు పార్టీ నుంచి పెద్దసంఖ్యలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, జడ్పీటీసీలను గెలిపించుకునేలా కృషి చేయాలని పిలుపునిచి్చంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలను ప్రజాప్రతినిధులుగా గెలిపించుకునేందుకు ఎంపీలు, ఎమ్మెల్యేలు, రాష్ట్రస్థాయి నాయకులు కృషి చేయాలని నిర్ణయించింది. గ్రామస్థాయి నుంచి పార్టీ బలోపేతమయ్యేందుకు వెంటనే గ్రామాలకు తరలి పని ప్రారంభించాలని నిర్ణయించింది.పారీ్టపరంగా వ్యూహాలను పటిష్టంగా అమలుచేసేందుకు తొందరలోనే 17 ఎంపీ నియోజకవర్గాల వారీగా లేదా 32 జిల్లాలను 4 ప్రాంతాలుగా విడదీసి ‘చింతన్ బైఠక్’(మేథోమథన శిబిరాలు) నిర్వహించాలని నిర్ణయించింది. శుక్రవారం శంషాబాద్లోని మల్లికా గార్డెన్స్లో జరిగిన బీజేపీ రాష్ట్ర విస్తృత కార్యవర్గ సమావేశంలో చేపట్టాల్సిన రూట్మ్యాప్పై చర్చ సాగింది. కేంద్రమంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి పార్టీ .జెండా ఆవిష్కరించగా, ముఖ్య అతిథిగా కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ హాజరయ్యారు.పీఎం మోదీని అభినందిస్తూ ఘన విజయం అందించిన తెలంగాణ ప్రజలకి ధన్యవాదాలు తెలుపుతూ కేంద్ర హోం శాఖ సహాయ బండి సంజయ్ తీర్మానం ప్రవేశ పెట్టగా, జాతీయ ఉపాధ్యక్షురాలు, ఎంపీ డీకే అరుణ దానిని బలపరిచారు. సమావేశంలో ఎంపీలు డా.కె.లక్ష్మణ్, ఈటల రాజేందర్, ఎం.రఘునందన్రావు, గోడెం నగేశ్, ఎమ్మెల్యే లు టి.రాజాసింగ్, కాటిపల్లి వెంకటరమణారెడ్డి, పాయల్ శంకర్, పైడి రాకే‹Ùరెడ్డి, డా.పాల్వాయి హరీ‹Ùబాబు, ధన్పాల్ సూర్యనారాయణగుప్తా, రామారావు పటేల్, ఎమ్మెల్సీ ఏవీఎన్ రెడ్డి, బంగారు శ్రుతి, ఎస్సీమోర్చా జాతీయకార్యదర్శి ఎస్.కుమార్ తదితరులు పాల్గొన్నారు. హామీలన్నింటినీ వెంటనే అమలుచేయాలికాంగ్రెస్ పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలన్నింటినీ అమలుచేయాలని డిమాండ్ చేస్తూ రాజకీయ తీర్మానం ఆమోదించారు. సమావేశంలో ఏలెటీ మహేశ్వర్ రెడ్డి రాజకీయ తీర్మానాన్ని ప్రవేశపెట్టారు. ఎంపీలు ఈటల, ధర్మపురి అర్వింద్, రఘునందన్ రావు దానిని బలపరుస్తూ మాట్లాడారు.రాజకీయ తీర్మానంలో ముఖ్యాంశాలు ⇒ వెంటనే రైతు రుణమాఫీని అమలు చేయాలి. ⇒ రైతు భరోసా కింద రైతులకు రూ.15 వేలు, రైతు కూలీలకు రూ.12వేలు వెంటనే విడుదల చేయాలి ⇒ గ్రామపంచాయతీల్లో పేరుకుపోయిన బకాయిలను వెంటనే చెల్లించాలి ⇒ గ్రామపంచాయతీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాలి ⇒ కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి వ్యవహారంపై సీబీఐకి అప్పజెప్పాలి ⇒ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని కూడా సీపీఐ కి అప్పజెప్పాలి⇒ ఫోన్ ట్యాపింగ్ వెనుక ఉన్న శక్తులను గుర్తించి, శిక్షపడేలా చర్యలు తీసుకోవాలి ⇒ విద్యుత్ కొనుగోళ్లలో జరిగిన అవినీతిపై జ్యుడీíÙయల్ కమిషన్ దర్యాప్తును వేగవంతం చేయాలి ⇒ గొర్రెల స్కాం మీద పూర్తిస్థాయిలో విచారణ చేపట్టాలి ⇒ ల్యాండ్, శాండ్, గ్రానైట్, లిక్కర్, డ్రగ్స్ మాఫియాలపై సమగ్ర దర్యాప్తు చేయాలి ⇒ ధాన్యం కుంభకోణంపై విచారణ చేయాలి ⇒ వెంటనే రేషన్ కార్డులు ఇవ్వాలి ⇒ రాష్ట్రంలో పూర్తిస్థాయిలో ఆయుష్మాన్ భారత్ అమలు చేయాలి ⇒ ఫీజు రీయింబర్స్ మెంట్ బకాయిలను వెంటనే చెల్లించాలి.. ధరణి ప్రక్షాళన చేపట్టాలి. -
రాష్ట్రం నుంచి ఢిల్లీకి సూట్కేసులు
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ఆరు నెలల కిందట అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ ఆర్జీ ట్యాక్స్, ఆర్ట్యాక్స్, యూకే ట్యాక్స్, బీవీ ట్యాక్స్ పేరుతో వసూళ్లకు తెగబడింది. ఢిల్లీకి మూటలు మోసే పనిలో పడింది. పదేళ్లు కేసీఆర్ కుటుంబం తెలంగాణను దోచుకుంటే, ఇప్పుడు తెలంగాణ ప్ర భుత్వాన్ని అడ్డం పెట్టుకుని కాంగ్రెస్ దోచుకుంటోంది. పరిపాలనను పక్కనబెట్టి భూకబ్జాలు, సెటిల్మెంట్లు, కమీషన్లు, పర్సంటేజీల పేరుతో ప్రజల ముక్కుపిండి వసూలు చేస్తున్న సొమ్మును పోటీపడి ముఖ్యమంత్రి నుంచి ఎమ్మెల్యేల వరకు ఢిల్లీకి కప్పం కట్టే పనిలో బిజీ అయిపోయారు’అని అని కేంద్ర మంత్రి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్రెడ్డి ధ్వజమెత్తారు.శంషాబాద్లో శుక్రవారం బీజేపీ రాష్ట్ర విస్త్తృత కార్యవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బీఆర్ఎస్. కాంగ్రెస్పై నిప్పులు చెరిగారు. పదేళ్ల బీఆర్ఎస్ కుటుంబ పాలనలో అభివృద్ధి కుంటుపడిందని ఆరోపించారు. ’’మంత్రులు, ఎమ్మెల్యేలు సహా బీఆర్ఎస్ నాయకులు అవినీతికి పాల్పడని రంగం లేదు.ల్యాండ్ మాఫియా, సాండ్ మాఫియా, గ్రానైట్ మాఫియా, లిక్కర్ మాఫియా, డ్రగ్స్ మాఫియాలో కూరుకుపోయి ప్రజాధనాన్ని, రాష్ట్ర ఖజానాను లూఠీ చేశారు. పర్యవసానంగా రాష్ట్రం ఆర్థిక సంక్షోభంలో కొట్టుమిట్టాడాల్సిన పరిస్థితులు దాపురించాయి. ఆఖరుకు ఇప్పుడే పుట్టిన బిడ్డకు సైతం నెత్తిన లక్షల రూపాయల అప్పు మూటను మోపారు. తామేమీ తక్కువ కాదన్నట్లుగా కొత్తగా అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ అక్రమ వసూళ్లకు తెగబడింది. ఢిల్లీకి మూటలు మోసే పనిలో పడింది. పేరు మారిందే కానీ పెద్దగా బీఆర్ఎస్ పాలనకు, కాంగ్రెస్ పాలనకు తేడాలేదు. తప్పుడు వాగ్దానాలతో ప్రజలను నయవంచన చేసి అధికారంలోకి వచి్చన కాంగ్రెస్ పార్టీ అతితక్కువ కాలంలోనే ప్రజల విశ్వాసాన్ని కోల్పోయింది.’’అని విమర్శించారు. ఫిరాయింపులే కార్యాచరణగా.. ’’ప్రజాపాలనపై సోయిలేని కాంగ్రెస్ ప్రభుత్వం ఫిరాయింపులను ప్రధాన కార్యాచరణగా ముందుకెళ్తోంది. గత బీఆర్ఎస్ పార్టీ మాదిరిగానే కాంగ్రెస్ పార్టీ కూడా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, ప్రజా తీర్పునకు, రాజ్యాంగ మౌలిక సూత్రాలకు తూట్లు పొడుస్తోంది. శాసనసభ్యులు, పార్లమెంటు సభ్యులు పార్టీ మారితే డిస్ క్వాలిఫై చేయాలన్న కాంగ్రెస్పారీ్ట, తమ ఎజెండాను తుంగలో తొక్కింది. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను నిస్సిగ్గుగా కాంగ్రెస్లో చేర్చుకుంటుంది. గాంధీ భవన్ గులాబీ భవన్లా మారింది.’’అని కిషన్రెడ్డి నిందించారు. సెక్యూరిటీ లేకుండా రాహుల్కు ఓయూలో తిరిగే దమ్ముందా?: బండి సంజయ్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా వ్యాపిస్తోందంటూ మాట్లాడుతున్న రాహుల్ గాం«దీకి సవాల్ విసురుతున్నా. తెలంగాణలో మీ కాంగ్రెస్ పార్టే అధికారంలో ఉంది కదా! సెక్యూరిటీ లేకుండా మీకు ఉస్మానియా యూనివర్శిటీలో తిరిగే దమ్ముందా? తెలంగాణలో నిరుద్యోగం అంటువ్యాధిలా ఏ స్థాయిలో విస్తరిస్తుందో వారిని కలిసి మాట్లాడితే తెలుస్తుంది.అధికారంలోకి వచ్చి ఏడు నెలలైనా ఒక్క ఉద్యోగం ఇవ్వకుండా మోసం చేసిన కాం గ్రెస్ పార్టీయే అంటువ్యాధి లాంటిది. మోదీరోజ్గార్ మేళాతో 10 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తోంది. అయినా బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నిరుద్యోగం అంటువ్యాధిలా విస్తరిస్తోందని రాహుల్ గాంధీ చెప్పడం సిగ్గు చేటు’’అని కేంద్రమంత్రి బండి సంజయ్ విమర్శించారు. రిటైర్డ్ పోలీసు అధికారిని చైర్మన్ చేయడం వల్లనే సమస్యలు: ఎంపీ రఘునందన్ ’’ప్రభుత్వం ఓ రిటైర్డ్ పోలీసు అధికారిని టీజీఎస్పీ చైర్మన్గా నియమించింది. ఆయన పదవీకాలం డిసెంబర్తో ముగియనుంది. తన హయాంలో ఉద్యోగాలు భర్తీ చేయాలన్న తప్పుడు ఆలోచనతోనే సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. డీఎస్సీ కోసం మరో 45 రోజుల సమయం కేటాయించాలని అభ్యర్థులు డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. గ్రూప్–1,2,3 ఉద్యోగ పోస్టులను పెంచకుండా నిరుద్యోగులను మోసం చేసింది.గ్రూప్–1 మెయిన్స్కు 1ః100 ఎంపిక చేయాలని ప్రతిపక్షంలో ఉండగా, ఇదే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నిండు సభలో గుర్తు చేశారు’’అని ఎంపీ రఘునందన్ పేర్కొన్నారు. నిరుద్యోగులు చేస్తున్న ఆందోళనకు బీజేపీ మద్దతుగా నిలుస్తుందని చెప్పారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఆధారాలున్నా కేసీఆర్ను ఎందుకు అరెస్ట్ చేయడం లేదనీ, కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతిపై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు సీబీఐ విచారణ జరిపించాలని మాట్లాడిన రేవంత్ ఇప్పుడెందుకు నోరుమెదపడం లేదని రఘునందన్ నిలదీశారు. కాలేజీల నుంచి ఆర్ఆర్ఆర్ ట్యాక్స్ వసూలు: ఈటల ఇంజనీరింగ్, మెడికల్ కాలేజీల యాజమాన్యాల నుంచి కూడా ఆర్ఆర్ఆర్ టాక్స్ వసూలు చేస్తున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. అందుకే విద్యార్థుల నుంచి యాజమాన్యాలు ఎక్కువ డబ్బులు తీసుకునే దుస్థితి నెలకొందన్నారు. కాంట్రాక్టర్లు, సర్పంచులు చేసిన పనులకు బిల్లులు ఇచ్చే అధికారం తమకు లేదంటూ ఆర్థిక శాఖ అధికారులు చేతులెత్తేస్తున్నారన్నారు. శుక్రవారం శంషాబాద్లో బీజేపీ విస్తృత సమావేశం సందర్భంగా ఈటల మీడియాతో మాట్లాడుతూ.. ప్రతి బిల్లుకి 8 శాతం డబ్బులు ముందు చెల్లిస్తేనే బిల్లులు విడుదల చేసే పరిస్థితులు ఉన్నాయన్నారు. ఉద్యోగుల రిటైర్మెంట్ డబ్బులు కూడా లంచం ఇస్తే తప్ప వచ్చేలా లేవన్నారు.ప్రతిబిల్లుకి డబ్బులు తీసుకునే నీచ సంస్కృతి రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో వచి్చందని మండిపడ్డారు. ఏడు నెలల కాలంలోనే అన్ని వర్గాల ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిన పార్టీ కాంగ్రెస్ అని ధ్వజమెత్తారు. ఇళ్ల స్థలాల క్రమబదీ్ధకరణకు సంబంధించి జీవో నంబర్ 58, 59ని అమలు చేస్తానని హామీ ఇచి్చన రేవంత్రెడ్డి దానిని మరచారన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ మళ్లీ పుంజుకునే అవకాశం లేదని, కాంగ్రెస్ పట్ల విశ్వాసం లేదని, ఈ నేపథ్యంలో ఎప్పుడు ఎన్నికలు వచి్చనా గెలుపొందేది బీజేపీయేనని ధీమా వ్యక్తంచేశారు. -
ముగిసిన కాంగ్రెస్ ‘పోస్టుమార్టమ్’
సాక్షి, హైదరాబాద్ : లోక్సభ ఎన్నికల్లో పార్టీ పనితీరు అంచనా వేసేందుకు కాంగ్రెస్ హైకమాండ్ నియమించిన త్రిసభ్యకమిటీ తొలిదఫా సమీక్షలు పూర్తయ్యాయి. వాస్తవానికి, గురు, శుక్ర, శనివారాల్లో ఈ పోస్టుమార్టమ్ జరగాల్సి ఉన్నా, అనివార్య కారణాల వల్ల రెండురోజులకే కుదించారు. కుటుంబసభ్యులు మరణించడంతో కమిటీకి నేతృత్వం వహించిన రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్ పీజే.కురియన్ గురువారం రాత్రే కేరళ వెళ్లిపోయారు. దీంతో గురువారం సమీక్షల్లో పాల్గొన్న అసోం ఎమ్మెల్యే రకీబుల్ హసన్తోపాటు పంజాబ్ ఎమ్మెల్యే పర్గత్సింగ్లు శుక్రవారం గాం«దీభవన్ వేదికగా కాంగ్రెస్నేతల అభిప్రాయాలు తీసుకున్నారు.తొలిరోజు గురు వారం మొత్తం 16 మంది అభిప్రాయాలు తీసుకున్న కురియన్ కమిటీ రెండో రోజు శుక్రవారం పలువురు ఎమ్మెల్యేలు, అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయిన అభ్యర్థులతో సమావేశమై వారి నుంచి లోక్సభ ఎన్నికల ఫీడ్బ్యాక్ తీసుకుంది. ఉమ్మడిజిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, ఇన్చార్జులతో సమావేశమైంది. పార్టీ ఎమ్మెల్యేలు రాజగోపాల్రెడ్డి, ఉత్తమ్పద్మావతిరెడ్డి, మల్రెడ్డి రంగారెడ్డి, శ్రీగణేశ్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు షబ్బీర్అలీ తదితరులు కమిటీ ఎదుట హాజరై తమ అభిప్రాయాలు వెల్లడించారు.అయితే, ఎవరైనా తమ అభిప్రాయాలను ఫోన్లో అయినా తెలియజేయవచ్చంటూ కమిటీ సభ్యులు ఫోన్నంబర్లు ఇచ్చి వెళ్లారని, లిఖితపూర్వకంగా అయినా తమకు పంపొచ్చని నేతలకు చెప్పారని సమాచారం. శుక్రవారం కూడా కురియన్ కమిటీకి గురువారం వచి్చన తరహాలోనే ఫీడ్బ్యాక్ వచి్చందని, పోస్టుమార్టమ్కు హాజరైన పలువురు ఎమ్మెల్యేలు తమ అభిప్రాయాలు, వ్యక్తిగత ఆలోచనలను రకీబుల్హసన్, పర్గత్సింగ్లకు వివరించారు.కోదాడ ఎమ్మెల్యేఉత్తమ్పద్మావతి రెడ్డి తన నియోజకవర్గంలో అసెంబ్లీ, లోక్సభ ఎన్నికల్లో పోలైన ఓట్ల వివరాలను పోలింగ్ బూత్ల వారీగా తెచ్చి కమిటీకి సమర్పించారు. కోదాడతోపాటు మంత్రి ఉత్తమ్ ప్రాతినిధ్యం వహిస్తున్న హుజూర్నగర్ నియోజకవర్గంలో భారీ మెజారిటీలు ఎలా సాధ్యమయ్యాయని కమిటీ సభ్యులు ప్రశ్నించగా, లోక్సభ ఎన్నికల్లో తాము శ్రమించిన తీరును పద్మావతి వివరించారు. ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ఆమెను అభినందించారు. ⇒ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి ఉమ్మడి రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు ఇప్పటివరకు ఒక్క మంత్రి పదవి కూడా ఇవ్వలేదని, దీనివల్ల రాష్ట్ర రాజధాని చుట్టూ అభివృద్ధి కార్యకలాపాలు వేగంగా సాగడం లేదని, జీహెచ్ఎంసీతో పాటు స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో ఉంచుకొని తమ జిల్లాలకు చెందిన ఎవరికైనా మంత్రిపదవి ఇవ్వాలని కోరారు. ఎవరికి ఇచ్చినా ఫర్వాలేదని, అయితే, తమ జిల్లాలకు మంత్రిపదవి ఇవ్వాలని కమిటీకి స్పష్టం చేశారు. ఈ విషయాన్ని మీడియాకు వెల్లడించారు కూడా. ⇒ మెదక్ జిల్లా నేతలతో జరిగిన సమావేశంలో ఓ ఎమ్మెల్యేపై ఫిర్యాదు చేసినట్టు తెలిసింది. మిగిలిన అన్నిచోట్ల మంచిఓట్లు వచి్చనా సదరు ఎమ్మెల్యే దూకుడు కారణంగా పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్లు తగ్గాయని చెప్పారు. ⇒ కరీంనగర్ జిల్లా నేతలతో సమావేశంలో పలువురు మాట్లాడుతూ ఎన్నికలకు 16 రోజుల ముందే అభ్యర్థిని ప్రకటించారని, అయినా తమ శక్తివంచన లేకుండా వెల్చాల విజయం కోసం కృషి చేశామని చెప్పుకొచ్చారు. బీజేపీ నాలుగు నెలల ముందే ఎన్నికల ప్రచారం ప్రారం భించిందని, మోదీ సభలతో పాటు అయోధ్యఅక్షింతలు ఆ పార్టీకి కలసి వచ్చా యని చెప్పినట్టు సమాచారం. ⇒ నల్లగొండజిల్లా నేతలతో జరిగిన సమావేశంలో నల్లగొండ కాంగ్రెస్ కంచుకోట అని, పార్టీకి అన్ని రకాలుగా కలసిరావడంతో మంచి మెజారిటీలు సాధ్యమయ్యాయని కమిటీకి తెలిపారు. భువనగిరిలో బీజేపీ అభ్యర్థి గెలుస్తాడనే టాక్ వచ్చినా తాను ఇన్చార్జ్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత దాన్ని మార్చివేశామని, మంచి మెజారిటీతో పార్టీ అభ్యరి్థని గెలిపించుకున్నామని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి కమిటీకి వెల్లడించారు. ⇒ బీజేపీకి బీఆర్ఎస్ మద్దతిచి్చంది కాబట్టే బీజేపీకి సీట్లు పెరిగాయని నిజామాబాద్ జిల్లా నేతలు కమిటీకి స్పష్టం చేశారు. కామారెడ్డిలో బీఆర్ఎస్కు అసెంబ్లీ ఎన్నికల్లో 60వేల ఓట్లు వస్తే, లోక్సభ ఎన్నికల్లో అది 20వేలకు తగ్గిపోయిందని చెప్పారు. కేసీఆర్ కుమార్తె, ఎమ్మెల్సీ కవితకు బెయిల్ కోసం బీఆర్ఎస్ నేతలు బహిరంగంగానే బీజేపీకి మద్దతు ప్రకటించారని ఈ సమావేశంలో షబ్బీర్అలీ కమిటీకి చెప్పినట్టు సమాచారం. అందరి అభిప్రాయాలను విన్న కమిటీ నాయకుల అభిప్రాయాలను క్రోడీకరించి ఈనెల 21న అధిష్టానానికి తమ నివేదిక ఇవ్వనుంది. ఈ విషయాన్ని కమిటీ సభ్యుడు రకీబుల్ హుస్సేన్ మీడియాకు వెల్లడించారు. -
‘అష్ట’కష్టాలు!
సాక్షి, హైదరాబాద్: భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నుంచి ఎమ్మెల్యేల ఫిరాయింపుల పర్వం కొనసాగుతోంది. గులాబీ ఎమ్మెల్యేలు వరుసగా అధికార కాంగ్రెస్లో చేరుతున్నారు. రాబోయే రోజుల్లో తమ పారీ్టలోకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేల చేరికలు మరింత వేగవంతం అవుతాయని కాంగ్రెస్ శిబిరం ప్రచారం చేస్తోంది. మరోవైపు పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగినా వలసలకు అడ్డుకట్ట పడటం లేదని బీఆర్ఎస్ వర్గాలు అంటున్నాయి.గతంలో చేసిన పనుల బిల్లుల కోసం, వ్యాపారాలపై దాడులు, కేసుల బెదిరింపులతోనే ఎమ్మెల్యేలు పార్టీ మారుతున్నారని ఆరోపిస్తున్నాయి. దీనికితోడు ఈ అసెంబ్లీ సమావేశాల్లోగా బీఆర్ఎస్ శాసనసభాపక్షం కాంగ్రెస్లో విలీనం అవుతుందంటూ ఫిరాయింపు ఎమ్మెల్యే దానం నాగేందర్ చేసిన వ్యాఖ్యలు కూడా కలకలం రేపుతున్నాయి. ఈ నెల 24 నుంచి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వలసల అంశం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. వరుసగా వలసల బాట! గత ఏడాది చివర్లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ తరఫున 39 మంది ఎమ్మెల్యేలు గెలుపొందారు. సికింద్రాబాద్ కంటోన్మెంట్ అసెంబ్లీ ఉప ఎన్నిక ఓటమితో ఈ సంఖ్య 38కి చేరింది. ఇక గత ఆరు నెలల్లో బీఆర్ఎస్ నుంచి ఎనిమిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ గూటికి చేరారు. తాజాగా రాజేంద్రనగర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ కూడా కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే అరికెపూడి గాం«దీ, అలంపూర్ ఎమ్మెల్యే విజయుడు చేరిక ఖరారు కాగా... హైదరాబాద్ నగరానికి చెందిన మరో ఆరుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్లో చేరుతారనే ప్రచారం జరుగుతోంది. శాసనసభాపక్షం విలీనంపై చర్చ నిబంధనల ప్రకారం.. బీఆర్ఎస్ సంఖ్యాబలంలో మూడింట రెండొంతుల మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే బీఆర్ఎస్ శాసనసభాపక్షం అందులో విలీనమైనట్టు పరిగణిస్తారు. 2014–18 మధ్యలో టీడీపీ శాసనసభాపక్షం, 2018–23 మధ్యలో కాంగ్రెస్ శాసనసభాపక్షం ఇదే తరహాలో బీఆర్ఎస్లో విలీనమయ్యాయి. ఈ నిబంధన ప్రకారం బీఆర్ఎస్ నుంచి కనీసం 26 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరితే.. శాసనసభాపక్షం విలీనమైనట్టుగా పరిగణిస్తారు.ఇప్పటికే 9 మంది కాంగ్రెస్లో చేరడం, మరొకరు చేరికకు సిద్ధమైన నేపథ్యంలో.. ఇంకో 16 మంది బీఆర్ఎస్ నుంచి ఫిరాయించాల్సి ఉంటుంది. అయితే బీఆర్ఎస్కు హైదరాబాద్, రంగారెడ్డి, మెదక్ జిల్లాల పరిధిలోనే ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఇప్పుడు ఈ ఉమ్మడి జిల్లాల నుంచే ఫిరాయింపులు ఎక్కువగా ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. కట్టడి కోసం బీఆర్ఎస్ ప్రయత్నాలు బీఆర్ఎస్ నుంచి ఇప్పటికే తొమ్మిది మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్లో చేరడంతో.. మిగతా వారిని కట్టడి చేసేందుకు గులాబీ పారీ్టలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. బీఆర్ఎస్ సర్కారులో అధికారం అనుభవించిన కడియం శ్రీహరి, పోచారం శ్రీనివాస్రెడ్డిలతోపాటు కేసీఆర్కు సన్నిహితుడైన ఎం.సంజయ్ వంటి నేతలు కూడా వీడటంపై చర్చ జరుగుతోంది. దీంతో పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా రంగంలోకి దిగి.. పక్షం రోజుల క్రితం ఎర్రవల్లి నివాసంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో భేటీ అయ్యారు.వారికి విందు ఇచ్చి.. పారీ్టలో కొనసాగితే కలిగే ప్రయోజనాలు, భవిష్యత్తుపై భరోసా కలి్పంచే ప్రయత్నాలు చేశారు. ఈ సందర్భంగా కొందరు ఎమ్మెల్యేలు తమను ఆర్థికంగా ఆదుకోవాలని కోరగా.. కేసీఆర్ సానుకూలంగా స్పందించినట్టు తెలిసింది. ఓ ఎమ్మెల్యే తన కారు మరమ్మతుకు అయ్యే ఖర్చులను తీసుకుని కూడా పార్టీ మారారని ప్రచారం జరుగుతోంది. మరింత మంది బీఆర్ఎస్ను వీడనున్నారన్న ప్రచారం నేపథ్యంలో.. పార్టీ ఎమ్మెల్యేలతో కేసీఆర్ మరోమారు వ్యక్తిగతంగా భేటీకానున్నారని పార్టీ వర్గాలు వెల్లడించాయి. ప్రలోభాలు, బెదిరింపులను ప్రస్తావిస్తూ..!! పార్టీ మారుతున్న ఎమ్మెల్యేలు తమకు అధికార పార్టీ నుంచి వస్తున్న ఒత్తిళ్లు, బెదిరింపులను కేసీఆర్కు ఏకరువు పెడుతున్నారని బీఆర్ఎస్ వర్గాలు చెప్తున్నాయి. గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన బిల్లులు రాకపోవడం, కుటుంబ సభ్యుల వ్యాపారాలపై దాడులు, కేసులు పెడతామనే బెదిరింపులు వంటి కారణాలతో పార్టీ మారక తప్పడం లేదని అంటున్నారని పేర్కొంటున్నాయి. నగర శివార్లలోని ఓ ఎమ్మెల్యే కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని జరుగుతున్న దాడులను వారు గుర్తు చేస్తున్నారని వివరిస్తున్నాయి. న్యాయ పోరాటం.. ప్రజల మధ్యకు.. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కోసం డిమాండ్ చేస్తున్న బీఆర్ఎస్.. అసెంబ్లీ వేదికగా కొట్లాడాలని నిర్ణయించింది. మరోవైపు రాష్ట్రపతి, గవర్నర్లను కలసి అసెంబ్లీ స్పీకర్, కాంగ్రెస్ వైఖరిని వివరించాలని.. అనర్హత వేటుపై స్పందించాల్సిందిగా కోరాలని భావిస్తోంది. రాష్ట్రపతి ఎదుట పార్టీ ఎమ్మెల్యేలతో పరేడ్ చేయించేందుకూ సన్నద్ధమవుతోంది. ఫిరాయింపు ఎమ్మెల్యేలపై అనర్హత వేటుకు సంబంధించి సుప్రీంకోర్టును ఆశ్రయించేందుకు బీఆర్ఎస్ ఏర్పాట్లు పూర్తి చేసింది. మరోవైపు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో కేసీఆర్ స్వయంగా పర్యటించి.. ఆ ఎమ్మెల్యేలు, అధికార పార్టీ తీరును ఎండగట్టాలనే వ్యూహాన్ని కూడా సిద్ధం చేస్తున్నట్టు బీఆర్ఎస్ కీలక నేత ఒకరు వెల్లడించారు.