సచివాలయం ముందు రాస్తారోకో యత్నం
బ్యారికేడ్లతో అడ్డుకున్న పోలీసులు
చెన్నై, సాక్షి ప్రతినిధి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల వైఖరిని నిరసిస్తూ విపక్ష ఎమ్మెల్యేలు విజృంభించారు. సాధారణ కార్యకర్తల వలే రాస్తారోకో యత్నం చేశారు. ఎమ్మెల్యేలు, పోలీసుల తోపులాటతో సచివాలయ ప్రాంగణం రణరంగాన్ని తలపించింది. ఈ సంఘటనల్లో ఇద్దరు ఎమ్మెల్యేలు తీవ్రంగా గాయపడ్డారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా బుధవారం తాగునీటి వసతులపై మంత్రి వేలుమణి ప్రసంగించి కూర్చున్నారు. వెంటనే వామపక్షాల ఎమ్మెల్యేలు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ముద్రించిన కరపత్రాలను వెదజల్లారు. అన్నదాతలకు అందజేస్తున్న సబ్సిడీలపై కేంద్రం కోత విధిస్తోందనే ఆరోపణలతో కూడిన కరపత్రాలు చిందరవందరగా పడటంతో గందరగోళం నెలకొంది. మాట్లేందుకు అవకాశం ఇవ్వడంలేదని స్పీకర్పై విపక్షాలు విరుచుకుపడ్డాయి.
సుమారు అరగంటపాటు అసెంబ్లీ సమావేశ హాలు కేకలు, అరుపులతో దద్దరిల్లింది. వామపక్షాలకు వాదనకు కాంగ్రెస్, మనిదనేయ మక్కల్ కట్చి, పుదయ తమిళగం, పీఎంకే తదితర పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు సమావేశం నుంచి వాకౌట్ చేసి బయటకు వచ్చాయి. ఆ తరువాత అకస్మాత్తుగా సచివాలయం వెలుపలకు పరుగెత్తుతూ రాస్తారోకో చేసేందుకు పూనుకున్నాయి. అయితే అసెంబ్లీ సమావేశాల బందోబస్తులో ఉన్న పోలీసులు ఎమ్మెల్యేలను అడ్డుకున్నారు. ట్రాఫిక్ కోసం వినియోగించే బ్యారికేడ్లు, తాళ్లు, కమ్ములతో కూడిన వైర్లను ప్రయోగించి ఎమ్మెల్యేలకు ఎదురునిలిచారు.
అయినా పోలీసులను తోసుకుని రోడ్డుపైకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో తీవ్రస్తాయిలో తోపులాట చోటుచేసుకుంది. ఎమ్మెల్యేలమని కూడా చూడకుండా పోలీసులు వ్యవహరించారంటే సచివాలయం ప్రధాన గేటు ముందు బైఠాయించారు. ఒక దశలో ఎమ్మెల్యేలు, పోలీసులకు మద్య తీవ్రస్థాయిలో వాగ్వివాదం చోటుచేసుకుంది. బ్యారికేడ్లేను దాటి రోడ్డుపై వెళుతున్న ఎమ్మెల్యేలను బంధించేలా ఘనమైన ఇనుప వైరును మరోవైపు పోలీసులు విసిరివేశారు. ఈ సమయంలో కాంగ్రెస్ ఎమ్మెల్యే విజయధరణి, సీపీఐ ఎమ్మెల్యే అన్నాదురై తలపై వైరు పడటంతో తీవ్రగాయలైనాయి. దీంతో విపక్ష ఎమ్మెల్యేలు మరింతగా రెచ్చిపోయి ఘర్షణకు దిగారు. బుధవారం నాటి అసెంబ్లీ సమావేశాలు ముగిసేవరకు విపక్షాల ఆందోళన సాగుతూనే ఉంది. గాయాలపై ఇద్దరు ఎమ్మెల్యేలు ఆసుపత్రిలో చేరారు.
ఇద్దరు ఎమ్మెల్యేలకు గాయాలు
Published Thu, Sep 3 2015 2:29 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
పోటాపోటీ హామీలు
దేశమంతా ‘మోదీ’ గాలి వీస్తోంది
హజ్ యాత్రికులకు టీకాలు
ఎన్నికల తర్వాత మరిన్ని పథకాలు
ఓసీపీల్లో పనివేళల మార్పు
● మూడు ఎంపీ నియోజకవర్గాల్లో కానరాని ఈఎస్ఐ ఆస్పత్రి ● బీడీ, గ్రానైట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు సేవలు దూరం ● ఆన్ డిమాండ్ అంగన్వాడీ సెంటర్లకు ప్రతిపాదనలేవి? ● ఊసే లేని మైనార్టీ స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు
ప్రజాస్వామ్యవాదులు గౌరవించేలా హైకోర్టు తీర్పు
ఓసీపీల్లో పని వేళలు మార్చాలి
కార్మికుల పనివేళలు మార్చాలి
మూడు పార్టీలకూ...‘కంటోన్మెంట్’ కీలకం
తప్పక చదవండి
- అవన్నీ అపోహలే
- నేడు నీట్ యూజీ
- ఐరాసలో జగన్ విజన్
- మండే ఎండలు X మధుమేహం!
- నెల ముందే గరిష్టానికి..!
- అనుపమా కెరీర్ ప్రస్తుతం నాన్స్టాప్గా... జెట్ స్పీడ్లో
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
Advertisement