పోలీస్ కస్టడీకి ఇద్దరు ‘లష్కరే ఉగ్రవాదులు’ | two 'Lashkar terrorists' police custody | Sakshi
Sakshi News home page

పోలీస్ కస్టడీకి ఇద్దరు ‘లష్కరే ఉగ్రవాదులు’

Jan 3 2014 11:38 PM | Updated on Aug 21 2018 7:17 PM

రాజధానిలో పేలుళ్లకు కుట్రపన్నారనే ఆరోపణలపై అరెస్టయిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ఇద్దరికి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది.

న్యూఢిల్లీ:  రాజధానిలో పేలుళ్లకు కుట్రపన్నారనే ఆరోపణలపై అరెస్టయిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థకు ఇద్దరికి కోర్టు పోలీస్ కస్టడీ విధించింది. నిందితుడు రషీద్‌కు ఏడురోజులపా టు పోలీస్ కస్టడీకి పంపగా మరో నిందితుడు షాహిద్‌కు నాలుగు రోజులపాటు పోలీస్ కస్టడీకి పంపుతూ అదనపు సెషన్స్ జడ్జి దయాప్రకాశ్ ఆదేశాలు జారీ చేశారు. రషీద్, షాహిద్‌లకు పాకిస్థాన్‌కు చెందిన లష్కరే తోయిబా ఉగ్రవాద సంస్థ తో సంబంధాలున్నాయని,  వారెదుర్కొంటున్న నేరారోపణలను రుజువు చేసేందుకు తమ విచారణకు పంపాలని ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు కోరడంతో కోర్టు అందుకు అనుమతిస్తూ నింది తులిద్దరికి పోలీస్ రిమాండ్‌కు పంపింది.
 

Advertisement
 
Advertisement
Advertisement