అధికారులు వేధింపులు మానుకోవాలి | Private schools in the state to stop bullying Officers | Sakshi
Sakshi News home page

అధికారులు వేధింపులు మానుకోవాలి

Jan 6 2014 3:59 AM | Updated on Sep 2 2017 2:19 AM

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలపై అధికారులు వేధింపులు మానుకోవాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కనకరాజ్ అన్నారు.

గుమ్మిడిపూండి, న్యూస్‌లైన్: రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలలపై అధికారులు వేధింపులు మానుకోవాలని ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కనకరాజ్ అన్నారు. రెడ్‌హిల్స్‌లో ప్రైవేటు పాఠశాలల యజమానుల సంఘం మహానాడు జరిగింది. ఈ సభకు తిరువళ్లూరు జిల్లా సంఘ అధ్యక్షుడు రాజా, ముఖ్య అతిథిగా ఆ సంఘ రాష్ట్ర అధ్యక్షుడు కనకరాజ్ పాల్గొన్నారు. కనకరాజ్  మాట్లాడుతూ ఇటీవల కాలంలో ప్రైవేటు పాఠశాలలపై అధికారులు తనిఖీలు చేస్తూ వేధిస్తున్నారని చెప్పారు. ఇది మంచి సంప్రదాయం కాదన్నారు. ముఖ్యంగా ప్రభుత్వం ప్రైవేటు పాఠశాలలను చిన్నచూపు చూస్తోందన్నారు. ఎలాంటి చిన్న సమస్య వచ్చినా ముందుగానే అధికారులు పాఠశాలలపై దాడులు చేసి ఇబ్బంది పడుతున్నారని తెలిపారు.  పెట్టిన పెట్టుబడులు రాక ఇబ్బందిపడి అనేక పాఠశాలలు మూతపడుతున్నాయని చెప్పారు. అలాంటి పాఠశాలలను ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే 10 సంవత్సరాలైన పాఠశాలలకు శాశ్వత గుర్తింపు ఇవ్వాలని, ఉపాధ్యాయుల నియామకంలో షరతులు సడలించాలనే తీర్మానాలను సమావేశంలో ఆమోదించారు. ఈ సభ సంఘ కార్యదర్శి నందకుమార్, వల్లేనాయక్, జోర్నాల్డ్‌తో పాటు పలువురు జిల్లాలోని ప్రైవేటు పాఠశాలల నిర్వాహకులు పాల్గొన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement