కేసీఆర్‌కూ శశికళ గతే: నాగం | Nagam Janardan Reddy comments on Cm kcr | Sakshi
Sakshi News home page

కేసీఆర్‌కూ శశికళ గతే: నాగం

Feb 19 2017 4:00 AM | Updated on Mar 29 2019 9:31 PM

కేసీఆర్‌కూ శశికళ గతే: నాగం - Sakshi

కేసీఆర్‌కూ శశికళ గతే: నాగం

అవినీతి విషయంలో తమిళనాడుకు చెందిన శశికళకు పట్టిన గతే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పడుతుందని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు.

నాగర్‌కర్నూల్‌: అవినీతి విషయంలో తమిళనాడుకు చెందిన శశికళకు పట్టిన గతే ముఖ్యమంత్రి కేసీఆర్‌కు పడుతుందని బీజేపీ  నేత నాగం జనార్దన్‌రెడ్డి అన్నారు. శనివారం నాగర్‌ కర్నూల్‌లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రజలను మభ్యపెట్టి  దోపిడీ చేయడంలో కేసీఆర్, వారి కుటుంబం దిట్ట అని ధ్వజమెత్తారు.

రాష్ట్రంలో అవినీతి పది శాతం ఉందని సీఎం అన్నారని, ఆయన చెప్పిన ప్రకారం ఈ మూడేళ్లలో రూ.30 వేల కోట్ల అవినీతి జరిగిందని తాను ఒప్పుకోవడమేనన్నారు.  గ్రామ జ్యోతి, మన ఊరు– మన ప్రణాళిక, దళితులకు మూడెకరాల భూమి అన్నారని, గ్రామ జ్యోతికి ఇప్పటి వరకు ఎన్ని నిధులు ఇచ్చారో చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement