ఇర్ఫాన్ పఠాన్ 5/13
* హైదరాబాద్, ఆంధ్ర పరాజయం
* పాండే, చావ్లా హ్యాట్రిక్...
* ముస్తాక్ అలీ టి20 టోర్నీ
కొచ్చి: జాతీయ జట్టులోకి తిరిగి ఎంపికైన తర్వాత ఆడిన తొలి టి20 మ్యాచ్లో స్టార్ క్రికెటర్ యువరాజ్ సింగ్ బ్యాటింగ్లో నిరాశపర్చాడు. ముస్తాక్ అలీ దేశవాళీ జాతీయ టి20 క్రికెట్ టోర్నీలో భాగంగా శనివారం రాజస్థాన్తో జరిగిన మ్యాచ్లో యువీ 5 బంతుల్లో 2 పరుగులే చేశాడు. బౌలింగ్లో 16 పరుగులిచ్చి 2 వికెట్లు తీసినా అప్పటికే పంజాబ్ జట్టు పరాజయం ఖరారైపోయింది.
ఈ మ్యాచ్లో రాజస్థాన్ 4 వికెట్ల తేడాతో పంజాబ్ను ఓడించింది. మన్దీప్ సింగ్ (52 బంతుల్లో 76 నాటౌట్; 7 ఫోర్లు, 3 సిక్సర్లు) చెలరేగడంతో పంజాబ్ 6 వికెట్లకు 130 పరుగులు చేసింది. అనంతరం రాజస్థాన్ 6 వికెట్లకు 133 పరుగులు చేసింది. రాజేశ్ బిష్ణోయ్ (32 బంతుల్లో 58; 4 ఫోర్లు, 4 సిక్సర్లు) గెలిపించాడు.
వడోదర: ఈశ్వర్ పాండే (4/20) హ్యాట్రిక్ సహాయంతో మధ్యప్రదేశ్ 5 వికెట్లతో ఆంధ్రపై విజయం సాధించింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆంధ్ర 20 ఓవర్లలో 9 వికెట్లకు 95 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఎస్. శ్రీనివాస్ (22)దే అత్యధిక స్కోరు. మ్యాచ్ నాలుగో ఓవర్లో పాండే వరుస బంతుల్లో భరత్, ప్రశాంత్, ప్రదీప్లను అవుట్ చేయడం విశేషం. అనంతరం ఎంపీ 5 వికెట్లకు 96 పరుగులు చేసింది.
కటక్: ఉత్తరప్రదేశ్ 7 వికెట్ల తేడాతో మహారాష్ట్రను చిత్తు చేసింది. కేదార్ జాదవ్ (29 బంతుల్లో 52 నాటౌట్; 5 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధ సెంచరీతో మహారాష్ట్ర 7 వికెట్లకు 109 పరుగులు చేసింది. యూపీ బౌలర్ పీయూష్ చావ్లా (4/28) హ్యాట్రిక్ సాధించడం విశేషం. అనంతరం యూపీ 3 వికెట్లకు 113 పరుగులు చేసింది.
షమీకి 3 వికెట్లు...
నాగపూర్: వృద్ధిమాన్ సాహా (47 బంతుల్లో 81; 7 ఫోర్లు, 5 సిక్సర్లు), సాయన్ మోండల్ (41 బంతుల్లో 50; 4 ఫోర్లు, 1 సిక్స్) చెలరేగడంతో బెంగాల్ 61 పరుగులతో హైదరాబాద్ను చిత్తు చేసింది. ముందుగా బెంగాల్ 4 వికెట్లకు 185 పరుగులు చేసింది. అనంతరం హైదరాబాద్ 16.2 ఓవర్లలో 124 పరుగులకే ఆలౌటైంది. అక్షత్ రెడ్డి (32) మినహా అంతా విఫలమయ్యారు. మొహమ్మద్ షమీ (3/18) రాణించాడు.
వడోదర: దీపక్ హుడా (48 నాటౌట్), కేదార్ దేవధర్ (48) రాణించడంతో బరోడా 49 పరుగులతో అస్సాంను ఓడించింది. బరోడా 8 వికెట్లకు 165 పరుగులు చేయగా...అస్సాం 116 పరుగులకే కుప్పకూలింది. ఇర్ఫాన్ పఠాన్ 13 పరుగులిచ్చి 5 వికెట్లు పడగొట్టడం విశేషం.
ఇక్కడే జరిగిన మరో మ్యాచ్లో ఢిల్లీ 4 వికెట్లతో రైల్వేస్ను ఓడించింది. ముందుగా రైల్వేస్ 2 వికెట్లకు 210 పరుగుల భారీ స్కోరు చేసింది. సౌరభ్ వకాస్కర్ (55 బంతుల్లో 118; 7 ఫోర్లు, 11 సిక్సర్లు) సంచలన బ్యాటింగ్తో సెంచరీ సాధించాడు. అనంతరం ఢిల్లీ ఈ భారీ లక్ష్యాన్ని 19.2 ఓవర్లలో ఛేదించింది. ఆ జట్టు 6 వికెట్లకు 214 పరుగులు చేసింది. ఆదిత్య కౌశిక్ (53), ఉన్ముక్త్ (38), నేగి (35 నాటౌట్), రాణా (34) కీలక ఇన్నింగ్స్లు ఆడారు.
2 పరుగులు.. 2 వికెట్లు
Published Sun, Jan 3 2016 1:32 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
Lok sabha elections 2024: బారామతి నుంచి మెయిన్పురి దాకా...హోరాహోరీ
బీజేపీ ఎజెండా రిజర్వేషన్ల రద్దే..: సీఎం రేవంత్రెడ్డి
సాక్షి కార్టూన్ 02-05-2024
Lok sabha elections 2024: ఓటేస్తే డైమండ్ రింగ్
Pallavi Dempo: సంపన్న పల్లవి..రాజకీయ వంట కుదిరేనా!
దీనికి జవాబు లేదా బాబూ?
ప్రభుత్వ ఉద్యోగులతో మరో మాట!
సత్యానికి సవాల్!
సీఎస్కేకు బిగ్ షాకిచ్చిన పంజాబ్.. 7 వికెట్ల తేడాతో ఘన విజయం
చరిత్ర సృష్టించిన రుతురాజ్.. ధోని ఆల్టైమ్ రికార్డు బద్దలు
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- కాస్మొటిక్ సర్జీలు : యాక్టర్స్ విషాద మరణాలు (ఫొటోలు)
- రిలీజైన ఏడాది తర్వాత తెలుగులో పీరియాడికల్ చిత్రం!
- కేసీఆర్పై ఈసీ చర్యలు, ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం
- తెలుగులో స్ట్రీమింగ్ అవుతోన్న భారీ బడ్జెట్ వెబ్ సిరీస్..!
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
Advertisement