ఏడాది కాలంలో డోపింగ్ టెస్టులకు హాజరుకాకపోవడంతో వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్పై సుదీర్ఘ కాలం వేటు పడే అవకాశం ఉంది.
జమైకా:ఏడాది కాలంలో డోపింగ్ టెస్టులకు హాజరుకాకపోవడంతో వెస్టిండీస్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్పై సుదీర్ఘ కాలం వేటు పడే అవకాశం ఉంది. డోపింగ్ వ్యతిరేక నిబంధనల ప్రకారం మ్యాచ్లు లేని సమయంలో ఓ ఆటగాడు తాను ఎక్కడుండేదీ స్థానిక డోపింగ్ ఏజెన్సీకి తెలపాల్సి ఉంటుంది.
అయితే ఈ నిబంధనను రస్సెల్ అతిక్రమించాడని, ఏడాది కాలంలో మూడు డోపింగ్ టెస్టులకు హాజరుకాలేదని జాడ్కో పేర్కొంది. రూల్ ప్రకారం ఇలా జరిగితే అతడు డోపింగ్ టెస్టులో పాజిటివ్గా తేలినట్టు భావించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో రస్సెల్ దోషిగా తేలితే మాత్రం దాదాపు రెండేళ్లపాటు నిషేధం పడే అవకాశం ఉంది.