విశాఖలోనేనా కోహ్లి ‘పది’నిసలు?
సాక్షి, విశాఖపట్నం: విశాఖ మైదానంతో పాటు, వెస్టిండీస్తో రెండో వన్డే భారత సారథి విరాట్ కోహ్లికి మరుపురానివిగా మిగిలే అవకాశం ఉంది. ఇక్కడ ఇప్పటికే ఆడిన నాలుగు వన్డే మ్యాచ్ల్లో 118, 117, 99, 65 పరుగులు చేసిన అతడు... మరో 81 పరుగులు చేస్తే చాలు వన్డేల్లో 10 వేల పరుగులు సాధించిన ఐదో భారత క్రికెటర్గా రికార్డు పుటల్లోకి ఎక్కుతాడు.
అంతేకాకుండా అత్యంత వేగంగా (205 ఇన్నింగ్స్ల్లో) ఈ ఘనత సాధించిన బ్యాట్స్మన్గా గుర్తింపు పొందుతాడు. వన్డేల్లో తొలిసారి 10 వేల పరుగుల మైలురాయి అందుకున్న దిగ్గజ ఆటగాడు సచిన్ టెండూల్కర్కు ఇందుకు 259 ఇన్నింగ్స్ పట్టాయి. ప్రస్తుతం కోహ్లి ఫామ్ చూస్తే అరుదైన ఘనతకు విశాఖ వేదిక కావడం ఖాయంగా కనిపిస్తోంది.
సంబంధిత వార్తలు
మరిన్ని వార్తలు