రెండో రౌండ్‌లో విఘ్నేశ్ | vignesh entered in second round | Sakshi
Sakshi News home page

రెండో రౌండ్‌లో విఘ్నేశ్

Mar 19 2014 12:18 AM | Updated on Sep 4 2018 5:07 PM

అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-4 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి.

 ఐటీఎఫ్ టోర్నమెంట్
 సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ టెన్నిస్ సమాఖ్య (ఐటీఎఫ్) ఇండియా ఫ్యూచర్స్-4 టోర్నమెంట్‌లో ఆంధ్రప్రదేశ్ క్రీడాకారులకు మిశ్రమ ఫలితాలు లభించాయి. విఘ్నేశ్, కాజా వినాయక్ శర్మ శుభారంభం చేయగా... క్వాలిఫయర్ హోదాలో మెయిన్ ‘డ్రా’లో ఆడిన అశ్విన్ విజయరాఘవన్ తొలి రౌండ్‌లో ఓడిపోయాడు.
 
  తిరుచ్చిలో మంగళవారం జరిగిన పురుషుల సింగిల్స్ తొలి రౌండ్‌లో విఘ్నేశ్ 4-6, 6-2, 7-6 (7/1)తో జానిస్ లినిగెర్ (స్విట్జర్లాండ్)పై; వినాయక్ శర్మ 6-2, 7-5తో నితిన్ కీర్తనే (భారత్)పై గెలిచారు. మరో మ్యాచ్‌లో టాప్ సీడ్ ఎన్రిక్ లోపెజ్ పెరెజ్ (స్పెయిన్) 6-0, 1-0తో ఆధిక్యంలో ఉన్న దశలో అతని ప్రత్యర్థి అశ్విన్ విజయరాఘవన్ గాయంతో వైదొలిగాడు. భారత్‌కే చెందిన రామ్‌కుమార్ రామనాథన్, శ్రీరామ్ బాలాజీ, జీవన్ నెదున్‌చెజియాన్ కూడా రెండో రౌండ్‌లోకి అడుగుపెట్టారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement