10 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి భారత్ 58 పరుగులు చేసింది
కటక్: బారాబతి స్టేడియంలో నేడు (సోమవారం) సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ20 మ్యాచ్ లో భారత్ కీలక వికెట్లను కోల్పోయి కష్టాల్లో పడింది.టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన భారత్ వెంట వెంటనే శిఖర్ ధావన్(11), కోహ్లి(1) వికెట్లను కోల్పోయింది. నిలకడగా ఆడుతున్న సమయంలోనే రోహిత్ శర్మ(22) రనౌట్ గా వెనుదిరిగాడు. ఆ తర్వాత వచ్చిన రాయుడు పరుగులేమీ చేయకుండానే రబాడా బౌలింగ్ లో అవుటయ్యాడు. 67 పరుగుల వద్ద 5వ రూపంలో ధోని(5) అవుటయ్యాడు. ఆతర్వాత రైనా(22), హర్భజన్(0) లు వెంటవెంటనే అవుటయ్యారు. ప్రస్తుతం పటేల్(3), అశ్విన్(6)లు క్రీజ్లో ఉన్నారు. 14 ఓవర్లలో భారత్ 77 పరుగులు చేసి ఏడు వికెట్లు కోల్పోయింది.
దెబ్బతీసిన రనౌట్ లు: విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలు అనవసర పరుగు కోసం యత్నించి రనౌట్ గా వెనుదిరిగారు.