సచిన్ చివరి మ్యాచ్: విజృంభించిన ఓజా, వెస్టిండీస్ 182 ఆలౌట్ | Sachin Tendulkar farewell match: Indian bowlers shine in Mumbai test | Sakshi
Sakshi News home page

సచిన్ చివరి మ్యాచ్: విజృంభించిన ఓజా, వెస్టిండీస్ 182 ఆలౌట్

Nov 14 2013 2:09 PM | Updated on Oct 1 2018 5:14 PM

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ చివరి మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు.

క్రికెట్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూసిన బ్యాటింగ్ గ్రేట్ సచిన్ టెండూల్కర్ చివరి మ్యాచ్లో భారత బౌలర్లు విజృంభించారు. ముఖ్యంగా స్పిన్నర్లు వెస్టిండీస్ బ్యాట్స్మెన్ను ఓ ఆటాడుకున్నారు. ముంబై వాంఖడే స్టేడియంలో గురువారం ప్రారంభమైన రెండో టెస్టులో భారత బౌలర్లు కరీబియన్లును 182 పరుగులకే కుప్పకూల్చారు.

  • విండీస్ తొలి ఇన్నింగ్స్ రెండో సెషన్లోపే ముగిసింది. హైదరాబాదీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా ఐదు వికెట్లు తీశాడు. అశ్విన్ మూడు, షమీ, భువనేశ్వర్ ఒక్కో వికెట్ తీశారు.
  • లంచ్ సమయానికి విండీస్ రెండు వికెట్లకు 93 పరుగులు చేసింది. ఆ తర్వాత విండీస్ వికెట్ల పతనం పేకమేడను తలపించింది. వెంటవెంటనే ఎనిమిది వికెట్లు కోల్పోయింది.
  • రెండో  సెషన్ ఆరంభంలో ఓజా వెంటవెంటనే పావెల్ (48), శామ్యూల్స్ (19)ను అవుట్ చేశాడు.
  • ఐపీఎల్లో సిక్సర్లు అలవోకగా బాదేస్తూ.. అందరినీ హడలెత్తించిన క్రిస్ గేల్ మొదట్లోనే 11 పరుగులకు చాప చుట్టేశాడు.
  • తొలి మ్యాచ్లో 9 వికెట్లు తీసి దడదడలాడించిన భారత పేస్ బౌలర్ మహ్మద్ షమీ.. గేల్ ను బోల్తా కొట్టించాడు.
  • లంచ్కు కాస్త ముందుగా డారెన్ బ్రావోను అశ్విన్ పెవిలియన్ చేర్చాడు. బ్రావో ధోనికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు.
  • ఈ మ్యాచ్లో బారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. వెస్టిండీస్ జట్టుతో జరుగుతున్న ఈ మ్యాచ్ చూసేందుకు సచిన్ టెండూల్కర్ కుటుంబం మొత్తం వాంఖడే స్టేడియానికి చేరుకుంది.
  • మ్యాచ్ను చూసేందుకు ఇప్పటికే క్రికెట్ దిగ్గజాలు, రాజకీయ నాయకులు, సినీతారలు, సచిన్ అభిమానులతో స్టేడియం కిక్కిరిసింది.
  • సచిన్కు ఘనంగా వీడ్కోలు పలికేందుకు ముంబై క్రికెట్ అసోసియేషన్ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. క్రికెట్ ప్రపంచ చరిత్రలో 200వ టెస్టు ఆడుతున్న తొలి ఆటగాడిగా మాస్టర్ చరిత్ర సృష్టించాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement