ఆమిర్పై పీసీబీ ఆగ్రహం! | Pakistan Cricket Board Unhappy Over Mohammad Amir Appearing in TV Show | Sakshi
Sakshi News home page

ఆమిర్పై పీసీబీ ఆగ్రహం!

Jun 16 2016 4:02 PM | Updated on Sep 4 2017 2:38 AM

ఆమిర్పై పీసీబీ ఆగ్రహం!

ఆమిర్పై పీసీబీ ఆగ్రహం!

స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి ఐదేళ్ల నిషేధం అనంతరం ఇటీవలే జాతీయ క్రికెట్ జట్టులో పునరాగమనం చేసిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్పై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.

కరాచీ: స్పాట్ ఫిక్సింగ్కు పాల్పడి ఐదేళ్ల నిషేధం అనంతరం ఇటీవలే జాతీయ క్రికెట్ జట్టులో  పునరాగమనం చేసిన పాకిస్తాన్ పేసర్ మొహ్మద్ ఆమిర్పై ఆ దేశ క్రికెట్ బోర్డు(పీసీబీ) ఆగ్రహం వ్యక్తం చేసింది.  పాక్ క్రికెట్ బోర్డు పెద్దలకు ఎటువంటి ముందస్తు సమాచారం ఇవ్వకుండా ఓ టీవీ షోకు ఆమిర్ ఇంటర్య్వూ ఇవ్వడమే  వారి ఆగ్రహానికి కారణమైంది.  గత కొన్నిరోజుల క్రితం పాక్ లోని ఓ టీవీ ఛానెల్కు  ఆమిర్ ఇంటర్య్వూ ఇచ్చి ఇరకాటంలో పడ్డాడు.  ఆటగాళ్లు మీడియాకు దూరంగా ఉండాలనే నిబంధనలు ఉన్నా, ఆమిర్ ఏమి ఆశించి అలా చేశాడో? అనే దానిపై పాక్ బోర్డులో చర్చనీయాంశంగా మారింది.

 

ఈ మేరకు పీసీబీ చైర్మన్ షహర్యార్ ఖాన్తో పాటు నజీమ్ సేథీలు అతన్ని పిలిపించి వివరణ అడిగారు. ఇక నుంచి మీడియాకు దూరంగా ఉండాలని , ఒకవేళ మీడియా ఎదురుపడినప్పుడు ఊహించిన ప్రశ్నలు ఎదురైనా కాస్త సంయమనం పాటించి సమాధానం చెప్పాలని ఆమిర్ కు సూచించారు. మరోసారి అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా చూసుకోవాలని ఆమిర్ ను మందలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement