తొలి పోరులో అవధ్, ముంబై ఢీ | Sakshi
Sakshi News home page

తొలి పోరులో అవధ్, ముంబై ఢీ

Published Sat, Dec 19 2015 1:04 AM

తొలి పోరులో అవధ్, ముంబై ఢీ

ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్
న్యూఢిల్లీ: ప్రీమియర్ బ్యాడ్మింటన్ లీగ్ (పీబీఎల్) ప్రారం భ మ్యాచ్‌లో భారత స్టార్ షట్లర్ సైనా నెహ్వాల్ ప్రాతినిధ్యం వహిస్తున్న అవధ్ వారియర్స్, ముంబై రాకెట్స్‌ను ఎదుర్కోనుంది. జనవరి 2 నుంచి 17 వరకు పీబీఎల్ జరుగుతుంది. మరోవైపు కొత్తగా ప్రవేశపెట్టిన ‘ట్రంప్ మ్యాచ్’ను ఈ రెండు జట్లు ఎలా ఉపయోగించుకుంటాయనేది ఇతర జట్లు ఆసక్తిగా పరిశీలించనున్నాయి.

ఇటీవల సంభవించిన వరదల కారణంగా ఏర్పాట్లకు సరైన సమయం లేకపోవడంతో చెన్నై స్మాషర్స్ తమ సొంత మ్యాచ్‌లను లక్నో, హైదరాబాద్‌లలో ఆడుతుంది. జనవరి 9, 10, 11 తేదీలలో హైదరాబాద్‌లో మ్యాచ్‌లు జరుగుతాయి. 15 లీగ్ మ్యాచ్‌లు జరిగే ఈ టోర్నమెంట్‌లో ఫైనల్‌కు ఢిల్లీ ఆతిథ్యమివ్వనుంది.

Advertisement
Advertisement