
కొట్టాయం: కేరళలో అర్జెంటీనా స్టార్ మెస్సీ వీరాభిమాని బినూ అలెక్స్ ఆత్మహత్య చేసుకున్నాడు. క్రొయేషియా చేతిలో అర్జెంటీనా ఘోరంగా ఓడిపోవడం జీర్ణించుకోలేకపోయిన 30 ఏళ్ల అలెక్స్ మీనాచిల్ నదిలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. తను నివాసం ఉండే అరుమన్నూర్ గ్రామం నుంచి 30 కి.మీ. దూరంలో అలెక్స్ శవం లభించింది. ‘ఇక ఈ ప్రపంచంలో జీవించలేనని, తన మృతికి ఎవరు కారణం కాదని’ అతడు సూసైడ్ నోట్లో రాశాడు.