సుమీత్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌ | Manu-Sumeeth retain Lagos International title | Sakshi
Sakshi News home page

సుమీత్‌ జంటకు డబుల్స్‌ టైటిల్‌

Jul 23 2018 4:10 AM | Updated on Jul 23 2018 4:10 AM

Manu-Sumeeth retain Lagos International title - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: లాగోస్‌ ఓపెన్‌ అంతర్జాతీయ బ్యాడ్మింటన్‌ టోర్నమెంట్‌లో హైదరాబాద్‌కు చెందిన సుమీత్‌ రెడ్డి పురుషుల డబుల్స్‌ టైటిల్‌ను సాధించాడు. నైజీరియాలో జరిగిన ఈ టోర్నీలో పురుషుల డబుల్స్‌ ఫైనల్లో సుమీత్‌ రెడ్డి–మనూ అత్రి ద్వయం 21–12, 21–12తో భారత్‌కే చెందిన వైభవ్‌–ప్రకాశ్‌ రాజ్‌ జంటను ఓడించింది. మిక్స్‌డ్‌ డబుల్స్‌ టైటిల్‌ను హైదరాబాద్‌ అమ్మాయి కె.మనీషా, మనూ అత్రితో కలిసి దక్కించుకుంది. ఫైనల్లో మనీషా–మనూ జంట 21–17, 22–20 తో కుహూ గార్గ్‌–రోహన్‌ (భారత్‌) ద్వయంపై గెలిచింది. మహిళల సింగిల్స్‌ విభాగంలో హైదరాబాద్‌ అమ్మాయి శ్రీకృష్ణప్రియ రన్నరప్‌గా నిలిచింది. మూడో సీడ్‌ సెనియా పోలికర్పోవా (ఇజ్రాయెల్‌)తో జరిగిన ఫైనల్లో శ్రీకృష్ణప్రియ 22–20, 16–21, 25–27తో పోరాడి ఓడిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement