బాసెల్: స్విస్ ఓపెన్ వరల్డ్ టూర్ సూపర్–300 బ్యాడ్మింటన్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో భారత కథ ముగిసింది. శుక్రవారం జరగాల్సిన క్వార్టర్ ఫైనల్లో టాప్ సీడ్ సాత్విక్ సాయిరాజ్– చిరాగ్ శెట్టి ద్వయం బరిలోకి దిగకుండానే ప్రత్యర్థి జంట క్రిస్టియన్ జార్–రస్ముస్ జార్కు వాకోవర్ ఇచ్చింది. సాత్విక్ సాయిరాజ్కు భుజం గాయం తిరగబెట్టడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. ‘సాత్విక్ది పాత గాయమే.
ఈ గాయం నుంచి కోలుకోవడానికి అతనికి కనీసం వారం రోజులు పడుతుంది’ అని భారత జోడీకి కోచ్గా ఉన్న టాన్ కిమ్ హెర్ (మలేసియా) తెలిపాడు. సాత్విక్–చిరాగ్ నిష్క్రమణతో ఈ టోర్నీలో భారత్ నుంచి తరుణ్ మన్నేపల్లి మాత్రమే బరిలో ఉన్నాడు. పురుషుల సింగిల్స్ క్వార్టర్ ఫైనల్లో ప్రపంచ 51వ ర్యాంకర్ ఆంథోనీ జిన్టింగ్ (ఇండోనేసియా)తో హైదరాబాద్ ప్లేయర్ తరుణ్ తలపడతాడు.


