రంగారెడ్డి, హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌ | Hyderabad, Rangareddy Got Titles | Sakshi
Sakshi News home page

రంగారెడ్డి, హైదరాబాద్‌ జట్లకు టైటిల్స్‌

Dec 18 2018 10:13 AM | Updated on Dec 18 2018 10:14 AM

Hyderabad, Rangareddy Got Titles - Sakshi

యాకుత్‌పురా: తెలంగాణ సీనియర్‌ నెట్‌బాల్‌ చాంపియన్‌షిప్‌లో హైదరాబాద్‌ పురుషుల, రంగారెడ్డి మహిళల జట్లు విజేతలుగా నిలిచాయి. పాతబస్తీ గౌలిపురా మిత్రా క్లబ్‌ ఆలే నరేంద్ర స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లో జరిగిన పురుషుల ఫైనల్లో హైదరాబాద్‌ 23–20తో ఖమ్మంపై విజయం సాధించింది. హోరాహోరీగా సాగిన మహిళల టైటిల్‌పోరులో రంగారెడ్డి 18–17తో ఖమ్మంను ఓడించింది. మూడు రోజుల పాటు జరిగిన ఈ పోటీల ముగింపు కార్యక్రమంలో ఆలిండియా ఈఎస్‌ఐ అడ్వయిజరీ బోర్డు కమిటీ సలహాదారులు డాక్టర్‌ రాంచందర్‌ రావు, బీజేపీ నగర ఉపాధ్యక్షులు రూప్‌రాజ్, మాజీ కార్పొరేటర్‌ జితేంద్ర, టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు  సుందర్‌ రెడ్డి పాల్గొని విజేతలకు ట్రోఫీలను అందజేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement