ప్రారంభ మ్యాచ్‌కు హైకోర్టు అనుమతి | High Court allowed the opening match | Sakshi
Sakshi News home page

ప్రారంభ మ్యాచ్‌కు హైకోర్టు అనుమతి

Apr 8 2016 1:19 AM | Updated on Aug 31 2018 8:24 PM

ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిదో సీజన్ ప్రారంభ మ్యాచ్‌పై అస్పష్టత తొలిగింది.

ముంబై: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) తొమ్మిదో సీజన్ ప్రారంభ మ్యాచ్‌పై అస్పష్టత తొలిగింది. ఈ మ్యాచ్‌ను షెడ్యూల్ ప్రకారం ఈనెల 9న జరుపుకోవచ్చని బాంబే హైకోర్టు అనుమతిచ్చింది. అయితే ముంబై, నాగ్‌పూర్, పుణేలలో జరిగే మిగతా 19 మ్యాచ్‌లపై నిర్ణయాన్ని పెండింగ్‌లో ఉంచింది. ఈనెల 12న జరిగే విచారణలో ఈ విషయంలో ఓ స్పష్టత రానుంది.

మహారాష్ట్రలో కరవు పరిస్థితి నేపథ్యంలో లక్షల లీటర్ల నీరు అవసరమయ్యే ఈ మ్యాచ్‌లను నిర్వహించడం ఎంతవరకు సమంజసమని కోర్టులో ప్రజాప్రయోజనాల వ్యాజ్యం (పిల్) దాఖలైన విషయం తెలిసిందే. అయితే ఇప్పటికిప్పుడు తొలి మ్యాచ్ తరలింపు సాధ్యం కాదనే కారణంతో కోర్టు అనుమతించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement