అభిమాని చర్యతో అవాక్కైన కోహ్లి | Sakshi
Sakshi News home page

Published Fri, Oct 12 2018 1:26 PM

 Fan Breaches Security During 2nd Test And Tries To Kiss Virat Kohli - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : భారత్‌-వెస్టిండీస్‌ మధ్య ఉప్పల్‌ వేదికగా జరుగుతున్న రెండో టెస్ట్‌లో ఆసిక్తకర ఘటన చోటు చేసుకుంది. మ్యాచ్‌ జరుగుతుండగా ఓ అభిమాని సెక్యూరిటీ సిబ్బందిని దాటుకుంటూ మైదానంలో ఉన్న కెప్టెన్‌ విరాట్‌ కోహ్లి వద్దకు పరుగెత్తాడు. అతని కౌగిలించుకోని తన ఫోన్‌తో సెల్ఫీ తీసుకునే ప్రయత్నం చేశాడు. అంతటితో ఆగకుండా కోహ్లి చెంపలపై ముద్దుపెట్టే ప్రయత్నం చేశాడు. ఈ అభిమాని చర్యతో కోహ్లితో పాటు మైదానంలోని ఆటగాళ్లు అవాక్కయ్యారు. ఇక తేరుకున్న భద్రతా సిబ్బంది ఆ యువకున్ని అదుపులోకి తీసుకోని బయటకు పంపించారు.

ఈ ఘటన 15 ఓవర్‌లో చోటుచేసుకుంది. మిడ్‌వికెట్‌ దిశగా ఫీల్డింగ్‌ చేస్తున్న కోహ్లి వద్దకు ఆకస్మాత్తుగా ఆ అభిమాని పరుగెత్తుకొచ్చాడు. ఈ ఘటనతో ఆటకు అంతరాయం కలగడంతో అంపైర్లు డ్రింక్స్‌ విరామం ప్రకటించారు. ఇక కోహ్లికి ఇలాంటి అనుభవం ఎదురు కావడం ఇదే తొలిసారేం కాదు. రాజ్‌కోట్‌ వేదికగా జరిగిన తొలి టెస్ట్‌లో సైతం ఓ అభిమాని సెక్యూరిటీని దాటుకుని వచ్చి అతని కాళ్లు మొక్కాడు. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న వెస్టిండీస్‌ 113 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. పోలీసుల అదుపులో ఉన్న ఆ అభిమాని కడపకు చెందిన మహ్మద్‌ ఖాన్‌గా  గుర్తించారు.

Advertisement
Advertisement