
‘సెంట్రల్' సంచలనం
న్యూఢిల్లీ: సౌత్జోన్ లక్ష్యం 301 పరుగులు... గెలవడానికి ఆఖరి రోజు చేయాల్సింది 117 పరుగులు... చేతిలో 9 వికెట్లు...
న్యూఢిల్లీ: సౌత్జోన్ లక్ష్యం 301 పరుగులు... గెలవడానికి ఆఖరి రోజు చేయాల్సింది 117 పరుగులు... చేతిలో 9 వికెట్లు... ఇక సౌత్ గెలుపు ఖాయమనుకున్న దశలో సెంట్రల్ జోన్ స్పిన్నర్లు పీయూష్ చావ్లా (3/83), ముర్తజా (3/59) మాయాజాలం చేశారు. గింగరాలు తిరిగే బంతులతో సౌత్ బ్యాట్స్మెన్ను ముప్పుతిప్పలు పెట్టారు. ఫలితంగా ఆదివారం ముగిసిన దులీఫ్ ట్రోఫీ ఫైనల్లో సెంట్రల్ జోన్ సంచలనం సృష్టించి 9 పరుగుల తేడాతో సౌత్జోన్పై విజయం సాధించింది.
పదేళ్ల విరామం తర్వాత దులీప్ ట్రోఫీ చాంపియన్గా నిలిచింది. 1961లో మొదలైన దులీప్ ట్రోఫీని దక్కించుకోవడం సెంట్రల్ జోన్కిది ఆరోసారి. ఓవర్నైట్ స్కోరు 184/1తో ఐదో రోజు ఆట కొనసాగించిన సౌత్ రెండో ఇన్నింగ్స్లో 88.4 ఓవర్లలో 291 పరుగులకు ఆలౌటైంది.ఓ దశలో 252/3 స్కోరుతో పటిష్ట స్థితిలో ఉన్న సౌత్.... 39 పరుగుల తేడాతో చివరి 7 వికెట్లను చేజార్చుకుని ఓటమిపాలైంది.