సెమీస్‌లో భూపతి-యూకీ | Bhupathi-Yuki storms into Delhi Open semis | Sakshi
Sakshi News home page

సెమీస్‌లో భూపతి-యూకీ

Feb 19 2016 12:40 AM | Updated on Sep 3 2017 5:54 PM

తొలిసారి కలిసి ఆడుతున్న సీనియర్ ఆటగాడు మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ జోడి..

సాకేత్ ద్వయం కూడా..
ఢిల్లీ ఓపెన్ టెన్నిస్ టోర్నీ


న్యూఢిల్లీ: తొలిసారి కలిసి ఆడుతున్న సీనియర్ ఆటగాడు మహేశ్ భూపతి-యూకీ బాంబ్రీ జోడి... ఢిల్లీ ఓపెన్ టోర్నీలో సెమీస్‌లోకి ప్రవేశించింది. గురువారం జరిగిన పురుషుల డబుల్స్ క్వార్టర్‌ఫైనల్లో భూపతి-బాంబ్రీ 7-5, 6-1తో యానిక్ మెర్టెన్స్ (బెల్జియం)-స్టీఫెన్ రొబెర్ట్ (ఫ్రాన్స్)పై విజయం సాధించారు. మోచేతి గాయం నుంచి కోలుకున్న యూకీ బేస్‌లైన్ సర్వీస్‌లతో అదరగొట్టాడు. మోకాలి గాయం కారణంగా ఆటకు దూరంగా ఉన్న భూపతి కూడా మునుపటి షాట్లతో అలరించాడు. మరో మ్యాచ్‌లో డిఫెండింగ్ చాంపియన్ సాకేత్ మైనేని-సనమ్ సింగ్ 7-6 (4), 6-4తో విజయ్ సుందర్ ప్రశాంత్-జీవన్ నెదుచెలియాన్‌పై నెగ్గారు. పురుషుల సింగిల్స్‌లో ప్రజనీష్ జ్ఞానేశ్వరన్‌కు వాకోవర్ లభించింది. కడుపు నొప్పి కారణంగా ఏడోసీడ్ యాన్ బాయ్ (చైనా) మ్యాచ్ నుంచి వైదొలిగాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement