హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్లో అప్రజాస్వామిక పాలన కొనసాగుతోందని వైఎస్సార్ సీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హెచ్.ఎ. రెహమాన్ ఆరోపించారు. గుంటూరులో ‘నారా హమారా.. టీడీపీ హమారా’ సభలో ప్లకార్డులతో శాంతియుతంగా నిరసన తెలిపిన అమాయకపు ముస్లిం మైనార్టీ యువకులను టీడీపీ ప్రభుత్వం చిత్రహింసలకు గురిచేసిందని ధ్వజమెత్తారు. ఏపీలో పోలీసు జులం కొనసాగుతోందన్నారు. న్యాయపరమైన హక్కుల కోసం నినదించిన వారిపై అక్రమ కేసులు బనాయించారని దుయ్యబట్టారు. ప్రజాస్వామ్య దేశంలో ఇచ్చిన హామీలను నెరవేర్చాలని కోరడం నేరమా? అని ప్రశ్నించారు. అమాయకులను అరెస్టు చేయడం దారుణమని అన్నారు. ఇలా చేయడం ఆర్టికల్ 14 ప్రకారం హక్కులను ఉల్లంఘించడమే అవుతుందని చెప్పారు.
ఈ హక్కులను ఉల్లంఘించిన ఏపీ పోలీసులను వెంటనే సస్పెండ్ చేయాలని, ముస్లిం యువకులను అరెస్టు చేయడానికి ప్రోత్సహం అందించిన ఏపీ సీఎం చంద్రబాబు నాయుడిని వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రెహమాన్ శుక్రవారం హైదరాబాద్లోని రాష్ట్ర మానవ హక్కుల కమీషన్లో వైఎస్సార్సీపీ లీగల్ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాజేశ్వరరెడ్డి, వైఎస్సార్సీపీ ఏపీ మైనార్టీ విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఖాదర్ బాషాతో కలిసి ఫిర్యాదు చేశారు.
నాలుగున్నరేళ్లలో చంద్రబాబుకు ముస్లిం మైనార్టీలు ఏనాడూ గుర్తుకు రాలేదని మండిపడ్డారు. చంద్రబాబు కేబినెట్లో ఒక్క మైనార్టీ మంత్రి లేకపోవడం సిగ్గు చేటన్నారు. చంద్రబాబు ముస్లిం మైనార్టీలను కరివేపాకులా వాడుకుని తీసిపారేస్తున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మైనార్టీ విభాగం ఏపీ అధ్యక్షులు ఖాదర్ బాషా మాట్లాడుతూ... నారా బట్టేబాజ్... టీడీపీ దోఖేబాజ్ అని నిప్పులు చెరిగారు. సదస్సులో చెప్పులు విసిరితే అరెస్టులు చేయాలి గానీ శాంతియుతంగా నిరసన తెలిపితే అరెస్టు చేయడం నీచ రాజకీయాలకు నిదర్శనమని ధ్వజమెత్తారు.
హక్కులు అడిగితే అరెస్టు చేస్తారా?
Published Sat, Sep 1 2018 2:35 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
వైఎస్సార్సీపీ అభ్యర్థులకే మా మద్దతు
బోల్తా కొట్టిన బాబు బుల్బుల్ పిట్ట
‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
Lok Sabha Election 2024: ఎన్డీఏకు 150 సీట్లూ కష్టమే
మంత్రి పీఎస్ పనిమనిషి ఇంట్లో కోట్లు
ధైర్యంగా చెబుతున్నా.. సర్వేపల్లిని అభివృద్ధి చేశా
దళితులపై దాడి.. టీడీపీ నేతలపై కేసు
మహిళపై దాడి కేసులో నిందితుడికి శిక్ష
‘దురాయి’ని అడ్డం పెట్టుకుని..
నోటాకు చోటు
తప్పక చదవండి
- ఓటమి భయంతో బరితెగిస్తున్న పచ్చమూకలు
- పారిస్ ఒలింపిక్స్కు భారత రిలే జట్లు అర్హత
- వింటున్నావా ఈసీ.. బాబు కారుకూతలు
- సెన్సెక్స్ ప్లస్, నిఫ్టీ మైనస్
- భారత్ సేవల రంగం నెమ్మది
- Lok Sabha Election 2024: మల్లికార్జున ఖర్గే ‘ఇంట’ గెలిచేనా..?’
- నీకే దిక్కు లేదు.. నా కూతురికి సీటు ఇస్తావా?
- అందరివాడు జగన్ను ఆశీర్వదించండి
- పేదల అక్షరంపై కక్ష
- సూర్య విధ్వంసకర సెంచరీ.. ఎస్ఆర్హెచ్పై ముంబై విజయం
Advertisement