సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ | Revanth Reddy Writes Open Letter To KCR Over Constable Results | Sakshi
Sakshi News home page

సీఎం కేసీఆర్‌కు రేవంత్‌ బహిరంగ లేఖ

Sep 22 2019 7:50 PM | Updated on Sep 22 2019 7:52 PM

Revanth Reddy Writes Open Letter To KCR Over Constable Results - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ పోలీసు కానిస్టేబుల్స్ నియామక పరీక్షలకు సంబంధించిన మెరిట్‌ లిస్ట్‌, కటాఫ్‌ మార్కులు తక్షణమే విడుదల చేయాలని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. ఈ మేరకు ఆదివారం ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బహిరంగ లేఖ రాశారు. ఫలితాల విడుదలపై స్పష్టత లేక ఐదు నెలలుగా అభ్యర్థులు ఆందోళనలో ఉన్నారని, ప్రైవేట్‌ హాస్టళ్లలో ఉంటూ ఆర్థిక ఇబ్బందులు పడుతున్నారని లేఖలో పేర్కొన్నారు. ఈ విషయాన్ని మంత్రి కేటీఆర్‌ దృష్టికి తీసుకెళ్లినా స్పందన లేదని ఆరోపించారు. 90 వేల మంది నిరుద్యోగ యువతకు సంబంధించిన ఈ సమస్యను వెంటనే పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. సీఎం కేసీఆర్‌ తక్షణమే జోక్యం చేసుకొని కటాఫ్‌ మార్కులు, మెరిట్‌ లిస్ట్‌ విడుదల చేయమని డీజీపీ, బోర్డు చైర్మన్‌లను ఆదేశించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement