‘లోకేశ్‌ అడిగితే నా సీటిచ్చేస్తా’ | Prathipati Pulla Rao Offer His Seat For Nara Lokesh | Sakshi
Sakshi News home page

‘లోకేశ్‌ అడిగితే నా సీటిచ్చేస్తా’

Jul 14 2018 9:25 AM | Updated on Aug 29 2018 3:37 PM

Prathipati Pulla Rao Offer His Seat For Nara Lokesh - Sakshi

నారా లోకేశ్‌

ఆయనకు సీటు సమర్పించుకోవటం నా అదృష్టంగా భావిస్తున్నా..

సాక్షి, చిలకలూరిపేట టౌన్‌: మంత్రి నారా లోకేశ్‌ అడగాలేగానీ తాను ప్రాతినిధ్యం వహిస్తున్న గుంటూరు జిల్లాలోని చిలకలూరిపేట సీటు ఇచ్చేస్తానని పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. ఆయన శుక్రవారం విలేకరులతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో లోకేశ్‌ ఎక్కడి నుంచి పోటీ చేసినా సీటు ఇవ్వటానికి 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లోని టీడీపీ అభ్యర్థులంతా సిద్ధంగా ఉన్నారని ప్రకటించారు. ఆయనకు సీటు సమర్పించుకోవటం తమ అదృష్టంగా భావిస్తామన్నారు.

ముందస్తు ఎన్నికలకు తమ పార్టీ సిద్ధంగా లేదని, ప్రజలు ఐదేళ్లు పాలించమని అధికారమిస్తే తామెందుకు ముందస్తు ఎన్నికలకు వెళ్తామని ఆయన ఎదురు ప్రశ్నించారు. బీజేపీ ఓటమి భయంతోనే జమిలి ఎన్నికలు నిర్వహించటానికి ప్రయత్నిస్తోందంటూ ధ్వజమెత్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement