ప్రణబ్‌కు ఇఫ్తార్‌ ఆహ్వానం పంపాం | Pranab not invited for Congress' Iftar party | Sakshi
Sakshi News home page

ప్రణబ్‌కు ఇఫ్తార్‌ ఆహ్వానం పంపాం

Jun 12 2018 2:52 AM | Updated on Mar 18 2019 7:55 PM

Pranab not invited for Congress' Iftar party - Sakshi

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ బుధవారం ఢిల్లీలోని తాజ్‌ప్యాలెస్‌ హోటల్‌లో ఇవ్వనున్న ఇఫ్తార్‌ విందుకు మాజీ రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీకి ఆహ్వానం పంపామని కాంగ్రెస్‌ అధికార ప్రతినిధి రణ్‌దీప్‌ సూర్జేవాలా స్పష్టంచేశారు. ఈ ఆహ్వానాన్ని ప్రణబ్‌ అంగీకరించారన్నారు. ఇటీవల నాగపూర్‌లో ఆరెస్సెస్‌ సమావేశానికి వెళ్లిన ప్రణబ్‌పై కాంగ్రెస్‌ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కాంగ్రెస్‌ ఇస్తున్న ఇఫ్తార్‌ విందుకు ప్రణబ్‌కు ఆహ్వానం అందలేదని వార్తలొచ్చాయి.ఈ విందులో పాల్గొనేందుకు ఎస్పీ వ్యవస్థాపక అధ్యక్షుడు ములాయం, జేడీయూ తిరుగుబాటు నేత శరద్‌యాదవ్, ఎన్సీపీ అధినేత పవార్, సీపీఎం ప్రధాన కార్యదర్శి ఏచూరి, ఆర్జేడీ నేత తేజస్వీ యాదవ్, టీడీపీ అధినేత చంద్రబాబుకు ఆహ్వానాలు అందినట్లు విశ్వసనీయవర్గాలు తెలిపాయి. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement