‘ఆ జమానా కాదు.. మోదీ, షాల రాజ్యం’

No Conspiracy About Indian Muslims: Haryana BJP MLA - Sakshi

చండీగఢ్‌ : పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దేశంలో పలు చోట్ల నిరసనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో హర్యానా బీజేపీ ఎమ్మెల్యే కీలక వ్యాఖ్యలు చేశారు. కైతాల్‌ ఎమ్మెల్యే లీలా రామ్‌ గుర్జార్‌ తన నియోజకవర్గంలో జరిగిన ఓ కార్యక్రమంలో మాట్లాడుతూ.. సీఏఏపై కొంతమంది ఆందోళన చేస్తూ మనల్ని హెచ్చరిస్తున్నారు. ఇది గాంధీ, నెహ్రూ, మన్మోహన్‌సింగ్‌ల జమానా కాదు. ఇప్పుడు నడుస్తున్నది మోదీ, అమిత్‌షాల రాజ్యం. మాకు ఒక్క సిగ్నల్‌ వస్తే ఒక్క గంటలోనే వాళ్ల పనిపడతామని వ్యాఖ్యానించారు. సీఏఏపై మాట్లాడుతూ.. ఈ చట్టంతో ముస్లింలను దేశం నుంచి వెళ్లగొడతారనేది వాస్తవం కాదు. భారతీయ ముస్లింలకు ఈ చట్టంతో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అక్రమంగా వచ్చిన విదేశీ చొరబాటుదారులు మాత్రం ఖచ్చితంగా దేశం నుంచి వెళ్లిపోవాల్సిందేనన్నారు. చదవండివారు వెళ్లేందుకు 150 దేశాలున్నాయ్‌..

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top