కాంగ్రెస్‌ నాశనం చేసింది | Narendra Modi Sharpens Attack On Congress Over Article 370 | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నాశనం చేసింది

Oct 20 2019 4:18 AM | Updated on Oct 20 2019 8:42 AM

Narendra Modi Sharpens Attack On Congress Over Article 370 - Sakshi

రెవారీ/ఎలెనాబాద్‌: శనివారం ప్రధాని హరియాణాలోని రెవారీ, ఎలెనాబాద్‌లలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. ‘కశ్మీర్‌కు స్వతంత్ర ప్రతిపత్తిని కల్పించే తాత్కాలిక ఆర్టికల్‌ 370ని రద్దు చేయకుండా కాంగ్రెస్‌ 70 ఏళ్లు కాలయాపన చేసింది. 370 రద్దు చేస్తామని పార్లమెంట్‌ సాక్షిగా ఇచ్చిన హామీని విస్మరించింది. ఆ రాష్ట్రంలో పరిస్థితులు విషమిస్తున్నా పట్టించుకోకుండా నిద్ర పోయింది. ఇదే అదనుగా పాకిస్తాన్‌ కశ్మీర్‌లో ఒక భాగాన్ని ఆక్రమించుకుంది. సోదర భావాన్ని బోధించే సూఫీ సంస్కృతి నశించింది. ఇలా కాంగ్రెస్‌ విధానాలతో దేశం, కశ్మీర్‌ నాశనమయ్యాయి. ఢిల్లీలోని అప్పటి పాలకులు ప్రధాని పదవిని కాపాడుకునేందుకు మాత్రమే ప్రయత్నించారు’ అని విమర్శించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement