నాగం కాంగ్రెస్‌కి చాలా ద్రోహం చేశాడు.. | MLC Damodar Reddy opposes Nagam entry into congress | Sakshi
Sakshi News home page

Mar 22 2018 8:26 PM | Updated on Mar 18 2019 9:02 PM

MLC Damodar Reddy opposes Nagam entry into congress - Sakshi

సాక్షి, నాగర్‌ కర్నూల్‌:  మాజీ మంత్రి నాగం జనార్దన్‌ రెడ్డి కాంగ్రెస్‌లోకి వస్తే తమకు అభ్యంతరం లేదని ఆ పార్టీ ఎమ్మెల్సీ కూచుకుళ్ల దామోదర్‌ రెడ్డి అన్నారు. అయితే టిక్కెట్‌ ఆశిస్తే ఊరుకునేది లేదన్న ఆయన.. నాగంపై మరోసారి తన వ్యతిరేకతను చాటారు. రాజకీయంగా బతుకునిచ్చిన పార్టీకి ద్రోహం చేసిన వ్యక్తి తమ పార్టీలోకి రావడానికి కొందరు పెద్దలు మద్దతునివ్వడంపై దామోదర్‌ రెడ్డి అసహనం వ్యక్తం చేశారు. గత 20 ఏళ్లుగా తాను నాగంకు  ప్రత్యర్థిగా ఉన్నానని, ఆయన కాంగ్రెస్‌ కార్యకర్తలెందరికో ద్రోహం చేశారని ఆరోపించారు.

నాగం కాంగ్రెస్‌లోకి వస్తే చాలామంది నాయకులు రాజీనామా చేస్తారని దామోదర్ రెడ్డి హెచ్చరించారు.  అయినా పార్టీలో 60 ఏళ్లు పైబడిన వారికి టికెట్‌లు ఇవ్వబోమని రాహుల్‌ గాంధీ చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కాగా బీజేపీ తీరుపై గత కొంతకాలంగా అసంతృప్తితో ఉన్న నాగం జనార్దన్‌ రెడ్డి ఎట్టకేలకు ఆ పార్టీకి గురువారం రాజీనామా చేశారు. మెయిల్‌ ద్వారా బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షాకు నాగం రాజీనామా లేఖను పంపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement