‘ఢిల్లీ’లో ఆప్‌తో పొత్తు ఉండదు: కాంగ్రెస్‌

Congress Party To Fight Delhi Polls Alone - Sakshi

న్యూఢిల్లీ: రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్‌ ఆద్మీ పార్టీ(ఆప్‌)తో తమ పార్టీ ఎలాంటి పొత్తు పెట్టుకోబోదని కాంగ్రెస్‌ ఢిల్లీ అధ్యక్షుడు సుభాశ్‌ చోప్రా శుక్రవారం స్పష్టం చేశారు. కాంగ్రెస్‌ సొంతంగానే మెజారిటీ స్థానాలు సాధించి, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందన్నారు. కాగా, కాంగ్రెస్‌తో పొత్తు ఉండబోదంటూ ఆప్‌ ఇప్పటికే స్పష్టం చేసింది.  మరి కొన్ని రోజుల్లో ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ప్రకటన వెలువడనుంది. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top