రైతుల వలసలపై చంద్రబాబు వింత వ్యాఖ్యలు.. | Sakshi
Sakshi News home page

Published Wed, Dec 26 2018 1:32 PM

Chandrababu Surprising Comments On Migrant farmers - Sakshi

సాక్షి, అమరావతి: రైతుల వలసలపై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వింత వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. రాయలసీమ వాళ్లకి వలస వెళ్లడం అలవాటని వ్యాఖ్యానించారు. వాళ్లు ఎక్కువ ఆదాయం కోసం వలస వెళ్తారు.. ఇక్కడ ఏమీ లేక కాదని అన్నారు. అంతేకాకుండా శ్రీకాకుళం నుంచి వలస వెళ్లేవారి గురించి కూడా చంద్రబాబు ఇదే రకంగా మాట్లాడారు. శ్రీకాకుళం వాళ్లు ఎప్పుడు వలస వెళ్తుంటారు.. అక్కడ నీళ్లు లేక కాదు వాళ్లు వలస వెళ్తుందని వ్యంగ్యంగా స్పందించారు. ఎక్కడికి వెళ్లినా శ్రీకాకుళం వాళ్లే ఉంటారని అన్నారు.  

రాయలసీమ, శ్రీకాకుళం నుంచి పొట్టకూటి కోసం ఇతర ప్రాంతాలకు వలస వేళ్లే రైతుల గురించి సీఎం పదవిలో ఉన్న చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు వారిని కించపరిచాలే ఉన్నాయని పలువురు విమర్శిస్తున్నారు. చంద్రబాబుకు రైతుల పట్ల ఎంత చులకన భావం ఉందో మరోసారి స్పష్టమయిందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

Advertisement
Advertisement