ఫిరాయింపులు ప్రోత్సహించే పార్టీలను రద్దు చేయాలి | Sakshi
Sakshi News home page

ఫిరాయింపులు ప్రోత్సహించే పార్టీలను రద్దు చేయాలి

Published Wed, Jun 11 2014 2:23 PM

ఫిరాయింపులు ప్రోత్సహించే పార్టీలను రద్దు చేయాలి - Sakshi

న్యూఢిల్లీ: ఫిరాయింపులను ప్రోత్సహించే పార్టీల గుర్తింపును రద్దు చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ నాయకుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి లోక్సభలో డిమాండ్ చేశారు. బుధవారం లోక్సభలో మేకపాటి పలు సమస్యల గురించి ప్రస్తావించారు.

కొత్తగా ఏర్పడ్డ ఆంధ్రప్రదేశ్ కు రాజధాని లేదని, ఈ రాష్ట్రానికి 20 ఏళ్ల పాటు ప్రత్యేక హోదా ఇవ్వాలని మేకపాటి కోరారు. దేశం విద్యుత్ సంక్షోభం ఎదుర్కొంటోందని వ్యాఖ్యానించారు. బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్నందున సహజ వాయువులను ఉపయోగించి సమస్యను అధిగమించాలని మేకపాటి రాజమోహన్ రెడ్డి కోరారు.

Advertisement
Advertisement