
ఆ సైనికులపై చర్యలు తీసుకున్నాం
విధులు నిర్వర్తించే సమయంలో కశ్మీరీ యువతపై మితిమీరి ప్రవర్తించిన సైనికులపై చర్యలు తీసుకున్నామని లెఫ్టినెంట్ జనరల్ జేఎస్ సంధూ శనివారం చెప్పారు.
ఆ వీడియోలను పరిశీలించామనీ, నిజంగానే సైనికులు దురుసుగా, మితిమీరి ప్రవర్తించారని తేలిన ఘటనల్లో వారిపై చర్యలు తీసుకున్నామని సంధూ చెప్పారు. అయితే కొన్ని వీడియోల్లో పూర్తి సంఘటన లేకుండా వాటిని ఎడిట్ చేసి తప్పుడు అభిప్రాయం కలిగించారనీ, మరికొన్న వీడియోలు పాతవని ఆయన వెల్లడించారు.