
ముగిసిన ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల కాల్చివేత
జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన తీవ్రవాదుల జరిపిన దాడిలో ముగ్గురు ఉగ్రవాదులతో సహా తొమ్మిది మంది మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు.
జమ్ము : జమ్ము కాశ్మీర్ రాష్ట్రంలో జరిగిన తీవ్రవాదుల జరిపిన దాడిలో ముగ్గురు ఉగ్రవాదులతో సహా తొమ్మిది మంది మరణించినట్లు పోలీసు అధికారులు తెలిపారు. జమ్మూలోని పోలీస్ స్టేషన్ మీద, తర్వాత ఆర్మీ క్యాంపు మీద గురువారం తీవ్రవాదులు దాడి చేసి విధ్వంసం సృష్టించారు. అకస్మికంగా ఉగ్రవాదులు దాడి చేయడంతో పోలీసులు అప్రమత్తమై, వారిపై ఎదురుదాడికి దిగారు. ఉగ్రవాదుల మృతదేహాలను పోలీస్ కస్టడీలోకి తీసుకున్నారు. మృతదేహాల ఆధారంగా ఏమైనా ఆధారాలు లభిస్తాయనే కోణంలో పోలీసులు దర్యాప్తు ఆరంభించారు. చివరకు ముగ్గురు ఉగ్రవాదులను పోలీసులు మట్టుబెట్టడంతో వారి మధ్య జరిగిన సుదీర్ఘ పోరు ముగిసింది.
ఒకే బృందంగా బయల్దేరిన ఉగ్రవాదులు ముందుగా పోలీసు స్టేషన్ మీద, తర్వాత ఆర్మీ క్యాంపు మీద కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఒక ఆర్మీ అధికారి కూడా మరణించాడు. ఇటీవల పాకిస్థాన్ నుంచి మన దేశంలోకి చొరబడ్డ ఉగ్రవాదులే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు ఆర్మీ వర్గాలు చెబుతున్నాయి. ఈనెల 29 వ తేదీన ప్రధాని మన్మోహన్ సింగ్, పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ మధ్య న్యూయార్క్లో సమావేశం జరగనున్న నేపథ్యంలో కూడా.. ఉగ్రవాదులు ఇలాంటి దాడులకు తెగబడటం విమర్శలకు తావిస్తోంది. జమ్ము లోని సాంబ సెక్టార్లో రెండు గంటల వ్యవధిలో రెండు చోట్ల ఒకే ఉగ్రవాదుల బృందం దాడులు చేసింది.
ఆర్మీ యూనిఫాంలో ఆటోరిక్షాలో వచ్చిన తీవ్రవాదులు మొదట పాక్ సరిహద్దుకు కిలోమీటర్ దూరంలో ఉన్న హీరాలాల్ పోలీస్ స్టేషన్పై బాంబులు విసిరి, అనంతరం ఆటోమేటిక్ ఆయుధాలతో కాల్పులు జరిపారు. ఆ తర్వాత ట్రక్ డ్రైవర్ను హతమార్చి ట్రక్కులో అక్కడినుంచి పారిపోయారు.