ఫోరెన్సిక్ ల్యాబ్కు సునంద వస్తువులు | Sunanda's laptop, cellphones sent for forensic analysis | Sakshi
Sakshi News home page

ఫోరెన్సిక్ ల్యాబ్కు సునంద వస్తువులు

Jan 21 2015 7:23 PM | Updated on Sep 18 2019 3:04 PM

కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ హత్య కేసును ఢిల్లీ పోలీసులు వేగవంతంగా విచారణ చేస్తున్నారు.

అహ్మదాబాద్: కేంద్ర మాజీ మంత్రి శశి థరూర్ హత్య కేసును ఢిల్లీ పోలీసులు వేగవంతంగా విచారణ చేస్తున్నారు. సునంద వాడిన ల్యాప్టాప్, నాలుగు మొబైల్ ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.

వాటిని గుజరాత్లోని గాంధీనగర్ డైరెక్టరేట్ ఆఫ్ ఫోరెన్సిక్ సైన్స్కు పంపారు. ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లలోని డాటా కేసు విచారణకు ఉపయోగపడుతుందని పోలీసులు భావిస్తున్నారు. సునంద హత్య కేసులో ఢిల్లీ పోలీసులు థరూర్తో పాటు పలువురు వ్యక్తులను విచారించారు. గతేడాది జనవరిలో ఢిల్లీలోని ఓ హోటల్లో సునంద అనుమానాస్పద స్థితిలో మరణించిన సంగతి తెలిసిందే.

Advertisement
 
Advertisement
Advertisement