చంద్రబాబు పథకాలపై సుప్రీం నోటీసులు | SC Notice To EC Center Over Cash Transfer Schemes Ahead Elections | Sakshi
Sakshi News home page

చంద్రబాబు పథకాలు; ఈసీ, కేంద్రానికి నోటీసులు

Jul 2 2019 11:36 AM | Updated on Jul 2 2019 12:00 PM

SC Notice To EC Center Over Cash Transfer Schemes Ahead Elections - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : ఎన్నికలకు ముందు నగదు బదిలీ చేసిన చం‍ద్రబాబు పథకాలపై దాఖలైన పిటిషన్‌ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల సంఘానికి, కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. కాగా సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నగదు బదిలీ పథకంపై నిషేధం విధించాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైన సంగతి తెలిసిందే. ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు ప్రభుత్వం పసుపు-కుంకుమ, అన్నదాత సుఖీభవ పేరుతో పెద్ద ఎత్తున నగదు పంపిణీ జరిగిందని పిటిషనర్‌ సర్వోన్నత న్యాయస్థానానికి వివరించారు. ఎన్నికల సమయంలో అమలు చేసిన ఈ పథకాలను చట్టవిరుద్ధంగా, రాజ్యాంగ విరుద్ధమైనవిగా ప్రకటించాలని విన్నవించారు. అదే విధంగా ఎన్నికలకు ఆర్నెళ్ల ముందు నుంచీ నగదు బదిలీ పథకాలు అమలు చేయకుండా మార్గదర్శకాలు రూపొందించాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement