‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలి’ | Proceeding as in fast track court | Sakshi
Sakshi News home page

‘ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారించాలి’

Nov 10 2014 11:19 PM | Updated on Sep 2 2017 4:12 PM

అహ్మద్‌నగర్ జిల్లాలో ఇటీవల జరిగిన దళిత హత్యకాండ కేసు పై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు.

 సాక్షి, ముంబై : అహ్మద్‌నగర్ జిల్లాలో ఇటీవల జరిగిన దళిత హత్యకాండ కేసుపై ఫాస్ట్‌ట్రాక్ కోర్టులో విచారణ జరపాలని పలువురు వక్తలు డిమాండ్ చేశారు. ఈ ఘటన జరిగి 19 రోజులు గడిచిపోయినప్పటికీ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి పురోగతి లేకపోవడంపై విచారం వ్యక్తం చేశారు.

 తూర్పు అంధేరీలోని సాకినాకా ప్రాంతంలో కష్టకారి యువ సంఘటన (కెవైఎస్), తెలంగాణ విద్యావంతుల వేదిక మహారాష్ర్ట సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం సాయంత్రం ‘జాదవ్ కుటుంబ హత్యాకాండ ఘటన’పై ఓ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నిందితుల ఆస్తులను జప్తు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో కేవైఎస్ అధ్యక్షుడు బి.మురళి, మూల్ నివాసిమాల, కళాకారులు డి.ప్రకాష్, టి.లచ్చన్న గౌడ్, బద్రి పూర్ణచందర్, చాంద్ అహ్మద్, తె.వి.వి. కన్వీనర్లు జి.గంగాధర్ గంగపుత్ర, ఎ.శ్రీనివాస్ రజక్ పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement