పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రైవేట్ బిల్లులు | private bills introduced in parliament Both Houses | Sakshi
Sakshi News home page

పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రైవేట్ బిల్లులు

Dec 4 2015 4:04 PM | Updated on Mar 9 2019 3:59 PM

పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు.

న్యూఢిల్లీ: పార్లమెంట్ ఉభయ సభల్లో శుక్రవారం మధ్యాహ్నం తెలుగు రాష్ట్రాల ఎంపీలు ప్రైవేటు బిల్లులను ప్రవేశపెట్టారు. తెలంగాణకు ప్రత్యేకహోదా ఇవ్వాలని కోరుతూ లోక్సభలో టీఆర్ఎస్  ఎంపీ వినోద్ ప్రైవేట్ మెంబర్ బిల్లును ప్రవేశపెట్టారు.

ఇటు రాజ్యసభలో ఆంధ్రప్రదేశ్ ఎంపీ సుబ్బరామిరెడ్డి ఒక ప్రైవేట్ మెంబర్ బిల్లు ప్రవేశపెట్టారు. విశాఖలో సుప్రీంకోర్టు సర్క్యూట్ బెంచ్ ఏర్పాటు చేయాలని ఆయన కోరారు. దీనిపై ఉభయ సభల్లో చర్చ జరిగే అవకాశముంది. త్వరలో ఆంధ్రా ఎంపీలు పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక హోదా కోసం ప్రైవేట్ బిల్లులు ప్రవేశపెట్టే అవకాశముంది.  

Advertisement
 
Advertisement
Advertisement