: పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్. గురువారం ఉదయం ఉభయ సభలు విపక్షాల నిరసనలు, నినాదాలు, ఆందోళనలతోనే ప్రారంభం అయ్యాయి.
న్యూఢిల్లీ : పార్లమెంట్ సమావేశాల చివరి రోజు కూడా సేమ్ సీన్ రిపీట్. గురువారం ఉదయం ఉభయ సభలు విపక్షాల నిరసనలు, నినాదాలు, ఆందోళనలతోనే ప్రారంభం అయ్యాయి. ఉభయ సభల్లో విపక్షాల ఆందోళన కొనసాగుతోంది. లోక్సభలో ప్రతిపక్ష సభ్యుల నినాదాల మధ్య ప్రశ్నోత్తరాలు కొనసాగుతోంది. రాజ్యసభలోనూ ఇదే పరిస్థితి నెలకొంది.
మరోవైపు ప్రజాస్వామ్యాన్ని రక్షించాలంటూ ఎన్డీయే ఎంపీలు ర్యాలీ నిర్వహించనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విజయ్ చౌక్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ ఎన్డీఏ ఎంపీలు పాదయాత్ర చేయనున్నారు.