చెత్త డంప్‌ కూలి ఇద్దరు మృతి | Mercenaries were killed in rubbish dump | Sakshi
Sakshi News home page

చెత్త డంప్‌ కూలి ఇద్దరు మృతి

Sep 2 2017 1:53 AM | Updated on Sep 17 2017 6:15 PM

చెత్త డంప్‌ కూలి ఇద్దరు మృతి

చెత్త డంప్‌ కూలి ఇద్దరు మృతి

తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్‌లో కొండలా పేరుకుపోయిన ఓ చెత్త డంప్‌ కుప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు.

న్యూఢిల్లీ: తూర్పు ఢిల్లీలోని ఘాజీపూర్‌లో కొండలా పేరుకుపోయిన ఓ చెత్త డంప్‌ కుప్పకూలడంతో ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. గత మూడేళ్లలో ఎన్నడూలేనంతగా ఢిల్లీలో ఈసారి వర్షాలు పడ్డాయి. దీంతో  శుక్రవారం ఈ డంప్‌లో కొంతభాగం కుంగిపోయి ఒక్కసారిగా పక్కనే ఉన్న రోడ్డుపై పడింది. పెద్దమొత్తంలో చెత్త గుట్ట మీదపడడంతో రోడ్డుపై వెళ్తున్న కారు, మూడు బైకులు అదుపుతప్పి పక్కనే ఉన్న కోండ్లీ కాలువలో పడిపోయాయి. ఈ దుర్ఘటనలో ఇద్దరు మరణించారు.

రంగంలోకి దిగిన సహాయకసిబ్బంది కాలువలో పడిన ఐదుగురిని రక్షించారు. ఈ సహాయక కార్యక్రమంలో 45 మంది ఎన్డీఆర్‌ఎఫ్‌ సిబ్బంది 15 అగ్నిమాపక యంత్రాలను వినియోగించారు. ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌ ఘటనాస్థలికి వచ్చి సహాయకచర్యలను పర్యవేక్షించారు. ఢిల్లీ–ఉత్తరప్రదేశ్‌లను కలిపే అత్యంత రద్దీగా ఉండే 24వ నంబర్‌ జాతీయ రహదారి పక్కనే ఈ భారీ డంప్‌ ఉంది. ఈ చెత్త డంప్‌ 70 ఎకరాల విస్తీర్ణంలో దాదాపు 15 అంతస్తుల భవంతి ఎత్తులో పేరుకుపోయింది. ఉత్తర భారతదేశంలో ఇదే అతిపెద్ద చెత్త డంప్‌. రోజుకు 2500 మెట్రిక్‌ టన్నుల చెత్తను మున్సిపాలిటీవారు ఇక్కడికి తరలించి పడేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement