‘అహ్మద్‌ పటేల్‌ను వేధిస్తున్నారు’

Manish Tewari says Instead of targeting China Centre attacking Congress - Sakshi

కేంద్రంపై కాంగ్రెస్‌ ఫైర్‌

సాక్షి, న్యూఢిల్లీ : చైనాతో సరిహద్దు వివాదాన్ని సరైన రీతిలో పరిష్కరించలేని కేంద్ర ప్రభుత్వం తమపై కక్షసాధింపు రాజకీయాలకు పాల్పడుతోందని కాంగ్రెస్‌ ఆరోపించింది. మనీల్యాండరింగ్‌ కేసులో తమ పార్టీ నేత అహ్మద్‌ పటేల్‌ను ప్రశ్నించిన ఘటన వేధింపు రాజకీయాలకు తాజా ఉదాహరణని ఆ పార్టీ పేర్కొంది. కేంద్రం చైనాను టార్గెట్‌ చేసేందుకు బదులు కాంగ్రెస్‌ను లక్ష్యంగా చేసుకుంటోందని, తమ పార్టీ నేత అహ్మద్‌ పటేల్‌ను వేధింపులకు గురిచేయడం ఇందుకు తాజా ఉదంతమని ఆ పార్టీ నేత మనీష్‌ తివారీ ఆదివారం ట్వీట్‌ చేశారు.  కాగా గుజరాత్‌కు చెందిన ఫార్మా కంపెనీ స్టెర్లింగ్‌ బయోటెక్‌పై మనీల్యాండరింగ్‌ కేసుకు సంబంధించి ఈడీ అహ్మద్‌ పటేల్‌ను ప్రశ్నిస్తున్న నేపథ్యంలో మనీష్‌ తివారీ మోదీ సర్కార్‌ను ఆక్షేపిస్తూ ట్వీట్‌ చేశారు.

ఈ కేసులో అహ్మద్‌ పటేల్‌తో పాటు ఆయన కుమారుడు ఫైజల్‌ పటేల్‌, అల్లుడు ఇర్ఫాన్‌ సిద్ధిఖిలను కూడా ఈడీ ప్రశ్నిస్తోంది. గల్వాన్‌ ఘటనపై ప్రజల దృష్టిని మరల్చేందుకే మోదీ ప్రభుత్వం కాంగ్రెస్‌ నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆ పార్టీ ఆరోపిస్తోంది. ఇక చైనా దళాల చేతిలో గల్వాన్‌ లోయలో 20 మంది భారత జవాన్లు మరణించిన ఘటన నేపథ్యంలో​ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారత భూభాగాన్ని చైనాకు దారాదత్తం చేశారని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఇప్పటికే విమర్శలు గుప్పించారు. చదవండి : ఇంధన ధరలతో కేంద్రం దగా

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top