పిడుగును ఫొటో తీయబోయి వ్యక్తి మృతి

Man Dies After Trying To Take Selfie with Thunderbolt - Sakshi

తమిళనాడు గుమ్మిడిపూండిలో ఘటన

గుమ్మిడిపూండి(తమిళనాడు): వర్షం కురుస్తుండగా పిడుగును సెల్‌ఫోన్‌తో ఫొటో తీయబోయి ఓ వ్యక్తి ప్రాణాలు పోగొట్టుకున్నాడు. చెన్నై తురైపాక్కానికి  చెందిన రమేష్‌(45) బుధవారం గుమ్మిడిపూండి సమీపంలోని సున్నంబుకుళం గ్రామంలో తన స్నేహితుని రొయ్యల చెరువు వద్దకు వెళ్లాడు. ఆ సమయంలో ఉరుములు, మెరుపులతో వర్షం కురుస్తోంది. దూరంగా పిడుగులు పడుతుండటాన్ని గమనించిన రమేష్‌ తన సెల్‌ఫోన్‌తో ఫొటోలు తీయబోయాడు. దీంతో రమేష్‌కు సమీపంలో పిడుగు పడటంతో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు.  

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top