నిలిచిన అమర్నాథ్ యాత్ర
శ్రీనగర్: జమ్మూకశ్మీర్లో కొండచరియలు విరిగిపడటంతో అమర్నాథ్ యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కశ్మీర్ లోయ వైపు యాత్రికులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు.
గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జమ్మూ- శ్రీనగర్ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శుక్రవారం భగవతి నగర్ నుంచి కశ్మీర్ లోయ వైపు యాత్రికులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. రహదారి మార్గాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
సంబంధిత వార్తలు