నిలిచిన అమర్‌నాథ్‌ యాత్ర | Landslides stall Amarnath pilgrims progress | Sakshi
Sakshi News home page

నిలిచిన అమర్‌నాథ్‌ యాత్ర

Jun 30 2017 11:10 AM | Updated on Aug 17 2018 8:06 PM

కొండచరియలు విరిగిపడటంతో అమర్‌నాథ్‌ యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు

శ్రీనగర్‌‌: జమ్మూకశ్మీర్‌లో కొండచరియలు విరిగిపడటంతో అమర్‌నాథ్‌ యాత్రికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కశ్మీర్‌ లోయ వైపు యాత్రికులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు.

గురువారం రాత్రి కురిసిన భారీ వర్షానికి జమ్మూ- శ్రీనగర్‌ రహదారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. దీంతో శుక్రవారం భగవతి నగర్‌ నుంచి కశ్మీర్‌ లోయ వైపు యాత్రికులను అనుమతించడం లేదని అధికారులు వెల్లడించారు. రహదారి మార్గాన్ని పునరుద్ధరించేందుకు చర్యలు చేపడుతున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement